26, జూన్ 2023, సోమవారం

అధికవేడిని హరించుటకు

 శరీరంలో అధికవేడిని హరించుటకు యోగాలు -


      కొన్ని సందర్భాలలో శరీరం అత్యథిక వేడికి గురవుతుంది. దీనికి కారణం సరైన సమయానికి భోజనం చేయకపోవడం , నిద్ర తక్కువపోవడం , సరైన ఆహారపదార్థాలు తీసుకోకపోవడం , మద్యపానం , ధూమపానం వంటి వాటివల్ల శరీరం అత్యధిక వేడికి గురగును. మూత్రం మంటగా రావటం , పసుపుపచ్చని మూత్రం , మూత్రం వాసన రావటం వంటి లక్షణాలు కనిపిస్తాయి . శరీరంలో అధికవేడి పెరిగినప్పుడు మూత్రపిండాలు మరియు కాలేయ సమస్యలు కలుగును.


        ఇప్పుడు నేను చెప్పబోవు యోగాలు పాటించటం వలన శరీరం నందలి అధికవేడి తగ్గును.


  అతివేడి నివారణా యోగాలు  -


 *  ఒక గ్లాసు నీటిలో చెంచాడు రుద్రజడ గింజలు లేక సబ్జాగింజలు పావు గంటసేపు నానబెట్టి అందులో కొంచం బెల్లంగాని , పంచదారగాని కలుపుకుని తాగాలి . అలా రోజూ చేస్తుంటే శరీరంలో అధికవేడి తగ్గును.


 *  కర్బుజా పండ్లుగాని , పుచ్చకాయలు ప్రతిరోజు విరివిగా తినుచున్న శరీరంలోని అధికవేడి నివారణ అగును.


 *  నిమ్మపండ్ల రసాన్ని సేవించుచున్న వేడితగ్గును . ప్రతిరోజు మూడునిమ్మపండ్ల రసం తాగవలెను .


 *  మజ్జిగని ప్రతిపూట తాగుచుండవలెను .


 *  పచ్చి ఉల్లిపాయను ప్రతిరోజు తినవలెను .


 శరీరంలో అతివేడి తగ్గుటకు నేను ప్రయోగించిన సిద్దయోగం  -


         రాత్రి సమయంలో రెండు కప్పుల అన్నాన్ని ఒక గిన్నెలో వేసి అది మునిగేంత వరకు వేడివేడి పాలు పోయాలి . కొంచం గోరువెచ్చగా అయ్యిన తరువాత పెరుగు వేసి తోడుపెట్టవలెను . ఉదయానికి మంచిగా తోడుకొని ఉండును. దానికి కొంచం ఉప్పు కలిపి నీరుల్లిపాయను ముక్కలుగా కోసి కలుపుకుని తినవలెను ఇలా 20 నుంచి 30 రోజులపాటు చేయవలెను .


         పైన చెప్పిన విధముగా చేసినచో అతిత్వరగా శరీరం నందలి వేడి తగ్గును.


 శరీరం నందలి అతివేడి ఉన్నవారు తీసుకొకూడని ఆహారాలు  -


 కోడి మాంసం , పాతపచ్చళ్లు , మినుములు , ఉలవలు , మద్యము , చేప , కాకరకాయ , మసాలా పదార్థాలు  , అల్లం , వెల్లుల్లి , నూనె వేపుళ్లు , టీ , కాఫీ , గోధుమలు , కందులు , బెల్లం , శనగలు , వేరు శనగలు వంటి వాటికి దూరంగా ఉండవలెను .


     మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


    గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


 కాళహస్తి వేంకటేశ్వరరావు .


అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

కామెంట్‌లు లేవు: