*1815*
*కం*
వాదము ప్రబలగ చివరకు
ఖేదంబే మిగులు జనుల క్షేమము నెంచన్
వాదము తగ్గించగ నా
హ్లాదము జనియించి నెగడు రమ్యము సుజనా.
*భావం*:-- ఓ సుజనా! వాదన పెరిగి తే చివరకు దుఃఖము మిగులుతుంది. జనుల క్షేమం కోరుకునే వారు వాదన తగ్గించి తద్వారా మానసిక ఉల్లాసం పెంచుకొందురు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి