15, ఆగస్టు 2023, మంగళవారం

నాదేశ ఔన్నత్యం!



               *నాదేశ ఔన్నత్యం!

                  ➖➖➖✍️


ప్రపంచంలోని చిన్న దేశాలలో వియత్నాం ఒకటి. 


ప్రపంచంలో అత్యంత బలశాలి అయిన అమెరికా తలని వంచింది. 


*కనీసం 20 సంవత్సరాలు  సాగిన యుద్దంలో ఆఖరికి అమెరికాని ఓడించింది.


*అమెరికా మీద విజయం తరువాత వియత్నాం అద్యక్షుడికి ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగాడు….


*విలేకరి: 

ఇప్పటికీ అర్ధంకాని

విషయమేమిటంటే,

అమెరికాని ఓడించి యుద్దంలో

ఎలా గెలిచారు.


ఆ విలేకరి అడిగిన ప్రశ్నకి

సమాధానం విని మనం 

చాలా గర్వంగ ఫీల్ అవుతాం.

అన్నీ దేశాలలోకెల్ల 

శక్తిశాలి అయిన అమెరికాని

ఓడించడానికి 

నేను మహామహుడు ,

శ్రేష్టమైన దేశభక్తిగల 

భారతీయ రాజు చరిత్రను

చదివాను.

అతని జీవనంనుండి 

ప్రేరణపొంది యుద్దనీతి ,

ఇతరత్రా ప్రయోగాలతో 

మేము యుద్దంలో గెలిచాము.


విలేకరి అడిగాడు: 

ఎవరా భారతీయ మహారాజు?


వియత్నాం అద్యక్షుడు 

నిలబడి గర్వంతో 

ఇలా సమాధానం చెప్పాడు.


”అతడే రాజస్తాన్లోని 

మేవాడ్ మహారాజు 

రాణా ప్రతాప్ సింహ్”

మహారాణా ప్రతాప్ సింహ్ 

పేరు చెప్పెటప్పుడు అతని

కళ్ళలో వీరత్వం నిండి 

వెలుగు ఉన్నది.


అలాగే ఇలా అన్నాడు


“ఒకవేళ అలాంటి రాజు 

మా దేశంలో జన్మించి ఉంటే

మేము ఈ ప్రపంచాన్నే

జయించేవారం.” 


కొన్ని రోజుల తరువాత

వియత్నాం అధ్యక్షుడు

చనిపోయాడు అయితే 

అతని సమాధి మీద 

ఇలా రాశి ఉంది 

“ఇది మహారాణా ప్రతాప్ 

యొక్క శిష్యుడిది” 

అని రాసి పెట్టారు.


కాలాంతరంలో 

వియత్నాం విదేశాంగమంత్రి

భారత పర్యటనకి

వచ్చాడు.

మహామహుల శ్రద్ధాంజలి

ఘటించడానికి 

మొదట గాంధీ సమాధి 

అతనికి చూపించారు. 

ఆ తరువాత ఎర్రకోట,

ఇంకా,ఇంకా ఇలా చూపించారు.

ఇవన్నీ చూపించేటప్పుడు 

ఆ విదేశాంగమంత్రి ఇలా అన్నాడు. 

“ మహారాణా ప్రతాప్ 

సమాధి ఎక్కడ?”.

ఇవన్నీ చూపిస్తున్న 

భారత అధికారి 

అతని ప్రశ్నకి ఆశ్చర్యపోయి

ఉదయపూర్లో ఉన్నదని చెప్పాడు.

విదేశాంగమంత్రి అక్కడనుండి

ఉదయ్ పూర్ వెళ్ళి 

సమాధిని దర్శించి అక్కడనుండి

పిడికెడు మట్టిని తీసుకొని 

అతని బ్యాగ్ లో

పెట్టుకున్నాడు.

ఇది చూసిన భారత అధికారి

మట్టిని బ్యాగ్ లో పెట్టుకోవడానికి

కారణం అడిగాడు....

”ఇదే మట్టి దేశభక్తులైన

వీరపుత్రులను కన్నది, 

ఈ మట్టిని తీసుకెళ్లి 

మాదేశం మట్టిలో కలుపుతా. 

మా దేశంలో కూడా ఇలాంటి 

రాజు ప్రేరణతో దేశభక్తులు

జన్మిస్తారు. 

మహారాణా ఈ దేశమే కాదు

ప్రపంచమే గర్వించదగ్గ రాజు”

అని అన్నాడు. 


మహారాణా ప్రతాప్ సింహ్

గురించిన సమాచారం... 


పేరు-కుంవర్ ప్రతాప్ జి

(శ్రీ మహారాణా ప్రతాప్ సింహ్)

జన్మదినం-9 మే,1540

జన్మభూమి-రాజస్థాన్ 

కుంబల్ ఘడ్

పుణ్యతిది-29 జనవరి,1597

తండ్రి – మహారాణా 

ఉదయ్ సింహ్ జి

తల్లి-రాణి జీవత్ కాంవర్ జి

రాజ్య సీమ-మేవాడ్

శాసన కాలం -1568-1597

(29 సంవత్సరాలు)

వంశం –సూర్యవంశం

రాజవంశం-సిసోడియ

రాజపుత్రులు

ధార్మికం-హిందూధర్మం

ప్రసిద్ధ యుద్దం- హల్ది ఘాట్

యుద్దం

రాజధాని-ఉదయ్ పూర్


ఇంకా తెలుసుకోవాల్సినవి- 

శ్రీ మహారాణా ప్రతాప్ దగ్గర

అత్యంత ఇష్టమైన గుర్రం ఉండేది.

దాని పేరు “చేతక్”.


అబ్రహాం లింకన్ భారతపర్యటన

నిమిత్తం భారత్ కి వచ్చేటప్పుడు

తన తల్లిని భారత్ నుండి ఏమి

తీసుకొనిరావాలి అని అడిగాడట.

దానికి అతని తల్లి 

“రాజస్థాన్లోని మేవాడ్ నుండి

పిడికెడు మట్టి తీసుకొనిరా ,

అక్కడి రాజు ఎంత విశ్వసపాత్రుడగా ఉండేవాడు

అంటే సగం భారత్ ను ఇస్తా 

అని ప్రలోభపెట్టినా 

తన రాజ్య సుఖ శాంతి

ప్రయోజనాలనే కోరుకొని తన

మాతృభూమినే కోరుకున్నాడు”

అని చెప్పిందట.

కానీ కొన్ని కారణాల రీత్యా 

అతని పర్యటన రద్దు అయ్యింది.

ఈ విషయాలు 

“బుక్ ఆఫ్ ప్రెసిడెంట్ యు ఎస్ ఏ”లో చదువొచ్చు. 


*మహారాణా ప్రతాప సింహ్

యొక్క ఈటె 80 కిలోలు

ఉంటుంది.

చేతి కవచం,శరీర కవచం కలిసి

మరొక 80 కిలోలు ఉంటాయి.

అతని చేతిలోని కత్తితో కలిపి

మొత్తం 207 కిలోలు ఉంటాయి.

ఇప్పటికీ ఇవన్నీ ఉదయ్ పూర్

రాజవంశస్తుల

సంగ్రహణాలయంలో ఉన్నాయి.


డిల్లీ బాద్షాహ్ అయినటువంటి

అక్బర్ మహారాణా ప్రతాప్ ని

ఒకసారి తల దించి 

నా కాళ్ళ మీద పడితే సగం

హిందూస్థాన్కి రాజుని చేస్తా 

అని ప్రలోభపెట్టాడు 

కానీ మహారాణా ప్రతాప్ 

దాన్ని తుచ్ఛమైనదిగా

తిరస్కరించాడు.


*హల్దిఘాట్ యుద్దంలో

 మేవాడ్ సైన్యం 

20000 సైనికులతో ఉంటే 

అక్బర్ సైన్యం 85000 సైనికులతో

సమీకరించబడాయి. 


* మహారాణా ప్రతాప్ ఇష్టమైన

గుర్రంకి తన త్యాగానికి గుర్తుగా

ఒక గుడిని కూడా కట్టారు ,

ఆ గుడి ఇప్పటికీ సురక్షితంగా

ఉంది.


* మహారాణా యుద్దంలో 

తన అభేద్యమైన దుర్గం లను

వదులుకున్నప్పటినుండి 

కంసాలి వాళ్ళు 

వేల సంఖ్యలో 

వాళ్ళ ఇళ్లను వదిలి 

రాణా కోసం ఆయుధాలు

తయారు చేసేవారు.

వాళ్ల దేశ భక్తికి తల వంచి

ప్రణమిల్లుదాం.


* హల్ది ఘాట్ యుద్దం జరిగిన 

300 సంవత్సరాల తరువాత

కూడా అక్కడి నేలలో 

కత్తులు లభించాయి. 

చివరి సారిగా 1985 లో 

ఒక ఆయుధం దొరికింది.


* మహారాణా ప్రతాప్ సింహ్ దగ్గర

యుద్ద శిక్షణ శ్రీ జైమల్ 

మేడతీయ ఇచ్చేవాడు. 

8000 మంది రాజపుత్రుల

వీరులతో కలిసి 60000 మంది

మొఘలులతో యుద్దం చేశారు.

ఆ ఆయుద్దంలో 48000 మంది

చనిపోయారు.

ఇందులో 8000 మంది

రాజపుత్రులు 

40000 మంది మొఘలులు. 


* మహారాణా 

ప్రతాప్ సింహ్

చనిపోయాక అక్బర్ కూడా

కన్నీళ్లు పెట్టుకున్నాడట.


* హల్ది ఘాట్ యుద్దంలో 

మేవాడ్ భీల్ అనే ఆదివాసీలు

వారి యొక్క అభేద్యమైన

బాణాలతో మొఘలులతో

పోరాడారు .

వాళ్ళు మహారాణాను 

వారి పుత్రుడిగా

భావించేవారు.

మహారాణా కూడా వారిపట్ల

భేదభావం చూపించేవారు కాదు.

ఇప్పటికీ మేవాడ్ రాజచిహ్నం లో

ఒకపక్క రాజపూత్ 

మరొక పక్క భీల్ ఉంటారు.


* రాణా గుర్రం అయిన చేతక్

మహారాణాను 26 అడుగుల

కందకాన్ని దుమికి దాటించి 

అది దాటిన

తరువాత చనిపోయింది.

అంతకంటే ముందే దానికి

ముందరి ఒక కాలు విరిగి

ఉన్నప్పటికి ఆ కందకాన్ని

దుమికింది.

అది ఎక్కడైయతే చనిపోయిందో

అక్కడే ఒక చింత చెట్టు

పెరిగింది.

అదే ప్రదేశంలో దాని 

గౌరవార్దం చేతక్ మందిరం

కట్టారు.


*చేతక్ ఎంత బలమైనదంటే

ఎదుట ఏనుగుమీద ఉన్న

సైనికుణ్ణి అందుకోవటానికి 

అంత ఎత్తులో గాలిలో

ఎగిరేది. అది కూడా 

మహారాణాతో పాటుగా. 


*మహారాణా చనిపోవడానికి

ముందు తాను కోల్పోయిన

వాటిలో 85% 

తిరిగి గెల్చుకున్నాడు.


*శ్రీ మహారాణా ప్రతాప్ యొక్క

బరువు 110 కిలోలు 

మరియు 

అతని పొడవు 7’5’’. 

ఇరువైపుల దారు ఉన్నటువంటి

కత్తి, 80 కిలోల ఈటె 

తనతో ఉంచుకునే వాడు.


*మిత్రులారా మహారాణా

ప్రతాప్ ,అతని గుర్రం గురించి విన్నారు , 

అతనికి ఒక ఏనుగు కూడా

ఉండేది.

దాని పేరు రాంప్రసాద్.


*అల్ బదౌని అనే రచయిత

రాంప్రసాద్ ఏనుగు గురించి 

తన గ్రంధంలో రాసుకున్నాడు.


* అక్బర్ బాద్షాహ్ 

మేవాడ్ మీద

యుద్దం చేసేటప్పుడు 

తన సైన్యానికి ఏమని

ఆదేశించాడంటే.

మహారాణా ప్రతాప్ తోపాటుగా

రాంప్రసాద్ ఏనుగుని కూడా

బందీగా పట్టుకుంటే 

సరిపోద్ది అని చెప్పాడట.


* రాంప్రసాద్ ఎంత బలం

కలిగినదంటే ఒక్కత్తే 

మొఘలుల 13 ఏనుగులని

చంపిందట.

అలాగే దాన్ని పట్టుకోవడానికి 

7 పెద్ద ఏనుగులమీద 

14 మంది నైపుణ్యం కలిగిన

మావటిలు కూర్చుని 

ఒక చక్రవ్యూహం ప్రకారంగా 

దాన్ని బందీ చేశారట 

అని అల్ బదౌని 

తన రచనల్లో పేర్కొన్నాడు.


*బందీని చేసిన 

రాంప్రసాద్ ని

అక్బర్ ముందు నిలబెట్టగ 

దానికి పీర్ ప్రసాద్ అని

నామకరణం చేశాడు.

ఆ ఏనుగు ఎంత 

స్వామి భక్తి కలదంటే 

18 రోజులవరకు దాణా

తినకుండా,నీళ్ళు తాగకుండా 

తన ప్రాణాలు కోల్పోయింది.

తరువాత ఈ దృశ్యాన్ని చూసిన

అక్బర్ నేను ముందు 

ఈ ఏనుగునే వంచలేకపోయాను. మహారాణాను 

ఎలా వంచగలుగుతా 

అని అన్నాడట.


* మన దేశంలో 

మహారాణా ప్రతాప్ లాంటి

మహావీరులే కాదు

ఇలాంటి దేశభక్త

చేతక్,రాంప్రసాద్ లాంటి

జంతువులు కూడా

ఉన్నాయి.


నా భారతదేశం లో  పుడితే గుర్రం అయినా ఏనుగు అయినా చివరికి చీమైనా పవిత్రమైనదే......✍️

జై హింద్

జై భారత్

వందేమాతరం

🙏🙏🙏🙏🙏

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...

944065 2774.

లింక్ పంపుతాము.🙏

కామెంట్‌లు లేవు: