12, అక్టోబర్ 2023, గురువారం

రాముడి విషయంలో

 రాముడి విషయంలో లేదా రామాయణం విషయంలో పరమ ప్రమాణం వాల్మీకి విరచిత 24వేల శ్లోకములే. మిగతా రామాయణాలు వివిధ భాషల్లో వివిధ కవులు తమ భక్తిని రంగరించి రాసినవి. ఆ కవి ఎంతటి వారైనా సరే వారు రాసిన దాంట్లో వారిదైన కల్పన ఉంటుంది. అవి కేవలం ఆస్వాదించటానికే తప్ప ప్రమాణానికి నిలబడవు. బ్రహ్మ అనుగ్రహంతో బ్రహ్మ నిర్దేశానుసారం రాముడు నడయాడిన కాలాన్ని పూర్తిగా(భూత భవ్య భవిషత్తు)దర్శించి రామాయణాన్ని రాముడి చేతేనే ఆమోద ముద్ర వేయించి వాల్మీకి మనకందించారు. కాబట్టి వాల్మీకి రాముడే పరమ ప్రమాణం.🙏

కామెంట్‌లు లేవు: