12, అక్టోబర్ 2023, గురువారం

పార్థ సారథి దేవాలయం..

 మనగుడి 205

🌹🙏పార్థ సారథి దేవాలయం..




🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌸చెన్నైలోని పార్థ సారథి దేవాలయం ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయం చెన్నై నగరం ట్రిప్లికేనులో ఉంది. ఈ ఆలయాన్ని 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటిగా చెబుతారు. 


🌿ఈ దేవాలయం ఎనిమిదో శతాబ్దానికి చెందినది చరిత్రకారుల అంచనా. 

సంస్కృత భాషలో పార్థసారధి అంటే పార్థుడు = అర్జునుడు యొక్క సారథి = రథాన్ని నడిపినవాడు అని అర్థం అంటే శ్రీ కృష్ణుడు.


🌷స్థల పురాణం


🌸సుమతి అనే మహారాజుకి ఇచ్చిన మాట ప్రకారం వేంకటేశ్వర స్వామి పార్థసారధిగా ఇక్కడ వెలసినాడని అంటారు. ఈ పార్థసారధి విగ్రహాన్ని ఆత్రేయ మహర్షి ప్రతిష్టించాడని చెబుతారు. 


🌿ఇంకో కథ ప్రకారం శ్రీ రామానుజా చార్యుల తల్లిదండ్రులు ఇక్కడకు వచ్చి సంతానం కొరకు స్వామిని వేడుకొనగా రామానుజాచార్యుడు జన్మిస్తాడు. మరో కథ ప్రకారంపార్థసారథిస్వామిధర్మసంస్థా పనకువిశిష్టాద్వైతాన్నిఆవిష్కరించడానికి రామానుజాచార్యులగాజన్మించాడని చెబుతారు. 


🌸బ్రహ్మాండ పురాణం ప్రకారము ఈ క్షేత్రానికితిరుఅల్లికేనిఅనిపేరని, కాలక్రమంలో ఇది ట్రిప్లికేన్ గా మారిందని అంటారు.మూల విరాట్టు పార్థసారధి విగ్రహం విశిష్టత


🌿మహాభారత ఇతిహాసం ప్రకారం శ్రీకృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుని రథసారధిగా ఉంటాడు. కురుక్షేత్ర సంగ్రామప్రారంభంలో అర్జునుడు ఇరువైపుల ఉన్న బంధువు యుద్ధ సంగ్రామంలో మరణిస్తారని తలచి 


🌸అస్త్రాలను విడిచి పేడుతుంటె కృష్ణుడు భగవద్గీతను భోధించి అర్జునున్ని యుద్ధానికి సమాయత్తం చేస్తాడు. కురుక్షేత్రంలో పాల్గొన్న ఆనవాళ్ళను తెలియజేస్తూ ఇక్కడి మూల విరాట్టుకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. 


🌿భీష్ముడువిడిచినఅస్త్రాలు, బాణాలు శ్రీకృష్ణుడికి కూడ తగలడం వళ్ల స్వామి ముఖంపై కొన్ని మచ్చలు ఉంటాయి. సాధారణానికి భిన్నంగా స్వామికి మీసాలు ఉంటాయి. 


🌸కురుక్షేత్ర సంగ్రామంలో ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేయడం వల్ల ఈ విగ్రహానికి మహావిష్ణువు ఆయుధమైన సుదర్శన చక్రం ఉండదు. చేతిలో కేవలం శంఖం మాత్రమే ఉంటుంది. 


🌿పార్థసారధి యాదవుల వంశంలో జన్మించడం వల్ల ఉత్సవ మూర్తిగా ఒక దారుశిల్పం (చెక్క బొమ్మ) మాత్రమే ఉంటుంది. సాధారణంగా ఉత్సవ మూర్తుల విగ్రహాలను పంచలోహాలతో గాని రాతితో గాని తయారు చేస్తారు.


🌷ఆలయ విశేషాలు మరియు అనుబంధ ఆలయాలు


🌸చెన్నై నగరములోని అత్యంత పురాతనమైన దేవాలయాలలో పార్థసారథి దేవాలయం ఒకటి. ఈ దేవాలయానికి రెండు వేర్వేరు ధ్వజ స్థంభాలు ఉన్నాయి. 


🌿ఒకటిగర్భగుడికిఎదురుగా, మరొకటి నరసింహ స్వామి దేవాలయానికి ఎదురుగా ఉన్నాయి. ఆలయ గోపురము, మండపాలు ద్రవిడ ఆలయ నిర్మాణ శైలిలోనిర్మించబడ్డాయి.


🌷ఈ దేవాలయ ప్రాంగణములో ఉన్న అనుబంధ గుళ్ళు


• వేదవల్లి గుడి


 రంగనాథ స్వామి గుడి


• శ్రీరాముని గుడి


•వరదరాజస్వామి గుడి


•నరసింహ స్వామి దేవాలయం


•ఆండాళ్ళమ్మ గుడి


•అంజనేయ స్వామి దేవాలయం


•అళ్వార్ల సన్నిధి


•రామానుజాచార్యుల సన్నిధి


•భృగు మహర్షి గుడి


🌷పండుగలు


🌸చైత్రై (ఏప్రిల్-మే) అనే తమిళ మాసంలో స్వామి బ్రహ్మోత్సవాలు జరుతాయి.


🌿ఆణి(జూన్-జూలై) అనే తమిళ మాసంలో అయగియసింగార్ ఉత్సవాలు జరుగుతాయి.


🌸రామానుజాచార్యుల గురించి ప్రత్యేక ఉత్సవాలు ఏప్రిల్- మేలో జరుతాయి.


🌿మణవలమ్ముణిగళ్ (అక్టోబరు-నవంబరు) ఆళ్వార్లకు, ఆచార్యులకు ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి.


🌸వైకుంఠ ఏకాదశి మరియు చైత్ర మాసం ఇక్కడ ప్రత్యేక విశేషం. ఈ కాలములో భక్తులు అసంఖ్యాకంగా స్వామి దర్శనం చేసుకొంటారు.


🌿స్వామి ఉభయ నాంచారులతో ఉత్సవమూర్తిగా ఉరేగింపుగా వెళ్ళేటప్పుడు ఆయన దర్శనం నయనానందం చేస్తుంది.


🌸పవిత్ర దినాల్లో ఆలయ మండపాలలో అనేక పురాణ సంబంధిత కథా కాలక్షేపాలు జరుగుతూ ఉంటాయి.


🌷స్వామి పుష్కరిణి


🌿దేవాలయానికి ఎదురుగా ఉన్న తటాకం లేదా పుష్కరిణిని కైరవిణి (తెలుగులో తెల్లటి మల్లెపూవు) అని పిలుస్తారు. తెల్లని మల్లెపువ్వు భగవంతుడుని అర్చించడానికి అత్యంత పవిత్రమైన పుష్పము.


🌸 ఈ కైరవిణికి అనుసంధానంగా ఇంద్ర, సోమ, మీనా,  అగ్ని, విష్ణు అనే ఐదు తీర్థాలు ఉన్నాయి.


🌷మన నిజమైన  శత్రువు ఎవరో చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడు .


🌿ప్రతీ మనిషిలోను ఏదో ఒక లోపం ఉంటుంది. దానిని పరిస్థితులకు అనుగుణంగా అదుపులో పెట్టుకోవాలి. మన ప్రవర్తనను బట్టే మనకి శత్రువులైనా, మిత్రులైనా ఏర్పడతారు.


🌸అంటే… మన మిత్రుడు, శత్రువు ఇద్దరూ మనలోనే ఉన్నారు. 


🌿కోపం, లోభం, అసూయ, స్వార్ధం, కామం, అహంకారం ఇవన్నీ మన శత్రువులే. ఎందుకంటే… వీటివలనే ఎదుటివారు మనకి శత్రువులు అవుతారు.గీతలో… శ్రీకృష్ణ పరమాత్ముడు మన నిజమైన శత్రువు ఎవరో చెప్పారు. అదేమిటంటే…


🌷కామ ఏష క్రోధఏషరజో గుణసముద్భవఃమహాశనో మహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణమ్॥


🌸రజో గుణం వలన ఉత్పన్నం అయ్యే కామక్రోధాలని తృప్తి పరచడం అసాధ్యం. రజో గుణం వలన ఇంద్రియాల మీద నిగ్రహం ఉండదు.

కామెంట్‌లు లేవు: