19, అక్టోబర్ 2023, గురువారం

తిరుమలేశునికి పవళింపు సేవ.

 🎻🌹🙏తిరుమలేశునికి పవళింపు సేవ....


(Tirumala Pavalimpu Seva)


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌸తిరుమలలో శ్రీ వేంకటేశ్వరునికి జరిగే సేవల్లో చివరి సేవ పవళింపు సేవ. ప్రతిరోజూ అర్ధరాత్రి ఒకటిన్నర సమయంలో ఆలయాన్ని మూసే ముందు స్వామివారికి పవళింపు సేవ నిర్వహిస్తారు. 


🌿ఈ పవళింపు సేవనే ఏకాంత సేవ అంటారు. రాత్రి రెండు గంటల వేళ తిరుమల శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని మూస్తారు.



🌸ముఖ మంటపంలో వెండి గొలుసు లతోఏర్పాటుచేసినబంగారుఊయలలో భోగ శ్రీనివాస మూర్తిని శయనిం పచేసి పాలు, పళ్ళు, బాదంపప్పు లను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. 


🌿మూలవిరాట్టు పాదపద్మాలకు ఉన్న కవచాన్ని తొలగించి, చందనం రాస్తారు.



🌸తిరుమలలో ప్రతిరోజూ రాత్రివేళల్లో బ్రహ్మదేవుడు వచ్చి వేంకటేశ్వరుని అర్చిస్తాడని పూరాణ కథనాలు ఉన్నాయి. అందుకే, వేంకటేశ్వర స్వామి వారిని దర్శించేందుకు విచ్చేసే బ్రహ్మదేవుని 


🌿కోసం వెండి పాత్రల్లో నీటిని సిద్ధంగా ఉంచుతారు. పవళింపు సేవలో తాళ్ళపాక అన్నమయ్య సంకీర్తనలతో వేంకటేశ్వరుని నిద్రపుచ్చుతారు.



🌸సంవత్సరంలో పదకొండు నెలల పాటు ఏకాంతసేవ భోగశ్రీనివాసునికి జరుపుతారు. ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణునికి చేస్తారు.



🌿రాత్రి రెండు గంటల వేళ స్వామివారికి పవళింపు సేవ ముగిసిన తర్వాత ముందుగా మూడో ద్వారాన్ని మూస్తారు. ఆ తర్వాత బంగారు వాకిలి మూసి లోపలి గడియలు వేస్తారు. 


🌸ఆలయ అధికారులు బయటి వైపు తాళాలు వేసి వాటిమీద సీలు వేస్తారు. తిరుమల ఆలయం మూసి ఉంచే సమయం చాలా తక్కువ. మరి కొద్దిసేపటికే ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయి. 


🌿అయినప్పటికీ తాళం వేయడం, దానికి సీలు కూడా వేయడం అనే సంప్రదాయం సనాతన ఆచారంగా ఇప్పటికీ కొనసాగుతోంది..🚩🌞🙏🌹🎻


🌹🙏ఓం నమో వెంకటేశాయ🙏🌹


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

కామెంట్‌లు లేవు: