నీలమోహనం!
బులుసు వారి నీలమోహనం
చమత్కారభాసురం!
(మరోమారు నెమరేసు కుందాం)
భావుకుడైన ఒకమహాకవివ్రాసిన పద్యకృతి నీలమోహనం.ఆపేరుచదవగానే నీలమేఘశ్యాముడై భువనమోహనుడై
వెలుగొందే ఆనల్లనయ్యే మనకన్నులముందు సాక్షత్కరిస్తాడు.అవును. ఈకృతిలో అణువణువునా ఉన్నదాకృష్ణయ్యే!
ఆ
యమునాతీరం,ఆసుందరబృందావనం,
ఆఆలమందలు,ఆసుందర,గో,గోపికాబృందాలు,ఆమధురమైనపిల్లనగ్రోవిగానం,
ఆగానానికి తన్మయమై (అచేతనప్రాయమై) చిత్తరువును దలపింపజేసే ప్రకృతి పరిసరాలు, నేపధ్యంగా
రచియింప బడిన యీపద్యాలు,అనవద్యహృద్యాలు,రసహృదయవేద్యాలు,భావుకతా నైవేద్యాలు,
ప్రతిపద్యం ఒకఅనర్ఘరత్నం.
ఆపదాలపోహళింపు,ఆభావాలమోహరింపు,ఆసమాసఘటన,ఆప్రకృతిచిత్రణలు,ఆరసపోషణావిధానము,
ఒకటేమిటి? సర్వం ,ఒకఅద్భుతం!
ఇలాంటి సర్వసంపన్నమైన
నీలమోహనం నేడు మనముందుకు రావడం మనసుకృతం.రసలోలుపులైన పండితప్రియంభావుకు లందరకు నేడు
పసందైన సాహిత్యపు విందు.
ఇకసమాహితహృదయంతో కృతినిపర్యాలోకనమొనరింతుముగాక!
ముందుగా నేనొకపద్యమును చవిచూపి
ముగింతును .
"అళినీలాలకమై,కృపామధురహాసాంకూరమై,ఆవియ
త్తల సంపూరిత కేకిపింఛ ఘనరుక్ తారళ్యమై,నవ్యమై,
లలితోదార లలాటికా మృగమదాహ్లాద ప్రియంబైన,ని
ర్మల వంశీమదనాభిరామ,ముఖబింబం బాత్మనిండారెడిన్;
కవి తనయాత్మలో నిండిన నీలమోహనమూర్తిని యీపద్యంలో ఆవిష్కరిస్తున్నాడు.ఇందులోభౌతికమైనరూపం,ఆంతరమైనరూపం రెండురూపాలు ఆవిష్కరింపబడుతున్నాయి.
భౌతికంగా:తుమ్మెదలనుబోలిని ముంగురులు,దయామృతమొలికించే మందహాసాంకురములు,శిరసునఇంద్రచాపంలామెఱసే కేకిపింఛ నవతారుణ్యఛ్ఛాయలు,నవ నవోయమైననుదుటికస్తూరీతిలకపుపరీమళాలు,
పెదవులపై నడయాడుతూ,అల్లన మ్రోగే
పిల్లగ్రోవి రాగాల సరాగాలతో కూడిన ఆచల్లనయ్యనీలమోహనరూపం నాయాత్మలో నిండిపోయినదిఅనిబాహ్యార్ధం,
ఇది బాహ్యరూపం!
ఇకఆంతరం!
నల్లనియాతనువు విశ్వాకారమై,గగనసదృశమైయొప్పారటం,అందుచేతనే చెంగట ఇంద్రచాపం(కేకిపింఛం)మందహాసాలమెరపులయొరపులు.వంశీరవసాదృశ్యంతో వేదనాదాలు,ఇత్యాదిగాఆయనవిశ్వాయతత్తత్వాన్ని స్ఫూర్తిమంతంచేయటం జరిగింది.
ఇలా మనలోచనాలకు,సులోచనాలకూగూడా అందనియర్ధాలెన్నో,కన్నయ్య అందాలెన్నో,మన ఆలోచనాలోచనాలకు
అగుపిస్తాయి.అదే కవిరచనలోని భావుకత!
అందుకే బులుసు వేంకటేశ్వరులుగారు "మహాకవు"లయ్యారు.కనుకనేమహాకవిత్వతత్వాన్నిలాఆవిష్కరింపగలిగారు.
ఇలాప్రతీపద్యాన్ని ఆస్వాదింపగలిగితే
రసోవైసః మనముందే!!
స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి