శ్రీమద్భగవద్గీత: ఏడవ అధ్యాయం
విజ్ఞానయోగం: శ్రీ భగవానువాచ
బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే
వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః (19)
కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతే௨న్యదేవతాః
తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా (20)
అనేక జన్మలలో ఆచరించిన పుణ్యకర్మల ఫలితంగా జ్ఞాని చివర జగత్తు సర్వమూ వాసుదేవమయం అనే జ్ఞానంతో నన్నాశ్రయిస్తాడు. ఈ లోకంలో అలాంటి మహానుభావులు చాలా అరుదు. తమ తమ పూర్వ జన్మ సంస్కారాలకు సంబంధించిన కోరికల మూలంగా వివేకం కోల్పోయిన కొందరు, ఇతర దేవతలను, వాళ్ళకు తగిన నియమాలతో ఉపాసిస్తున్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి