11, నవంబర్ 2025, మంగళవారం

రక్తం వృద్ది అవుటకు

 శరీరం నందు రక్తం వృద్ది అవుటకు సులభ యోగాలు - 

 

 * బూడిద గుమ్మడికాయ శరీర ఆరోగ్యానికి చాలా మంచిది . రోజుకు ఒక కప్పు బూడిద గుమ్మడి కాయ రసాన్ని తాగుతూ ఉంటే శరీరంలో మంచిరక్తం వృద్ది అగును. బూడిద గుమ్మడి కాయలోని గుజ్జుని గట్టి గుడ్డలో వేసి బాగా పిండితే రసం కారుతుంది. దానిని కప్పులో వేసుకొని తాగవచ్చు .

 

* కిసీమిస్ లేదా ద్రాక్షా పండ్లు బాగా తింటూ ఉంటే రక్తం వృద్ది అవుతుంది. పచ్చివి దొరకనప్పుడు ఎండువి తినవచ్చు.

 

* రాత్రులు గుప్పెడు ఎండు ద్రాక్ష కాయలు గ్లాసెడు నీటిలో నానవేసి ఉదయం వాటిని బాగా పిసికి పిండి ఆ పిప్పి పారవేసి ఆ గ్లాసు నీటిని తాగవలెను .అలా రోజూ తాగుతుంటే ఒక నెలలోనే మంచిరక్తం వృద్ది అవుతుంది.


 * ఎండు ఖర్జూరాలని కూడా పైన చెప్పిన విధముగా చేసి ఆ నీటిని తాగుచున్న రక్తం వృద్ది అగును. 


 * శనగలు గుప్పెడు రాత్రి సమయంలో నీటిలో నానవేసి ఉదయం తింటూ ఉంటే రక్తం వృద్ది అయ్యి శరీరం పుష్టి అగును. వ్యాయమం చేసేవారికి ఈ విధానం చాలా మంచిది . 

             

. పైవిధంగా నానబెట్టిన గింజలు మొలకెత్తిన తరువాత తింటూ ఉంటే ఇంకా అద్బుత ఫలితాలు వస్తాయి . 


 * కుంకుమపువ్వు ప్రతినిత్యం తీసుకుంటున్నా కూడా రక్తం వృద్ది అగును. 

 

* అంజీర్ పండ్లు అత్తి పండ్లతో కలిపి తింటున్నా రక్తం వృద్ది అగును. 


 * లేత కొబ్బరి నీరు మరియు లేత కొబ్బరి తింటూ ఉంటే శరీరంలో మంచి రక్తం వృద్ది అగును.

 

 రక్తవృద్ది కొరకు నేను ప్రయోగించిన అద్బుత యోగం - 

          

    ప్రతి రోజు రెండు పూటలా ఒక గ్లాసు దానిమ్మ రసం నందు ఒక స్పూన్ గోధుమగడ్డి చూర్ణం కలిపి లొపలికి తాగించాను . అదే విధంగా మధ్యాహ్నం ఒక యాపిల్ పండు భోజనానికి గంటన్నర ముందు తినిపించాను .

          

        కేవలం నెలరోజుల్లో రక్తం యొక్క శాతం పెరిగింది. 

 

గమనిక - 

        

    గోదుమగడ్డి చూర్ణం wheet gross powder ఆయుర్వేద మందుల దుకాణాల్లో లభ్యం అగును.  


గమనిక -

     

. నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

           

. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

    

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

        

. 9885030034

కామెంట్‌లు లేవు: