1, డిసెంబర్ 2025, సోమవారం

మహనీయులమాట

  🙏సర్వేజనాఃసుఖినోభవంతు: 🙏


        🌻*శుభోదయం*🌹


🌺 *మహనీయులమాట* 🌺


ఎవ్వరినీ ఏరకంగానూ బాధ పెట్ట కూడదు. మాటలతో కానీ చేతలతో కానీ యే కన్నీటి ఉసురు అయినా వెన్నంటి వెంటాడుతుంది. జన్మ జన్మలవరకు చిరునవ్వుతో అందరినీ దగ్గరకు తీసుకుందాం. మనం వెళ్లిపోయినా వారి హృదయం లో స్థానాన్ని సంపాదించు కుందాం.


🌹 *నేటిమంచిమాట* 🌹


ఎవరి మంచితనం వారికి శ్రీ రామరక్ష,ఎవరి చెడుతనం వారికి వారు సృష్టించుకుంటున్న శిక్ష.ఆ భగవత్ శిక్ష నుంచి తప్పించుకోవడం ఎవ్వరి తరం కాదు.ఎప్పుడో ఒకప్పుడు ఆ శిక్ష అనుభవించి తీరాల్సిందే.


🥀🥀🥀🥀🥀🥀🥀🥀



🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

        ☘️పంచాంగం☘️

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,


తేదీ ... 01 - 12 - 2025,

వారం ... ఇందువాసరే ( సోమవారం )

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,

దక్షిణాయనం,

హేమంత ఋతువు,

మార్గశిర మాసం,

శుక్ల పక్షం,


తిథి : *ఏకాదశి* మ2.18 వరకు,

నక్షత్రం : *రేవతి* రా7.49 వరకు

యోగం : *వ్యతీపాత్* రా10.29 వరకు,

కరణం : *భద్ర* మ2.18 వరకు

                 తదుపరి *బవ* రా1.17 వరకు,


వర్జ్యం : *ఉ8.24 - 9.56*

దుర్ముహూర్తము : *మ12.10 - 12.54*

                              మరల *మ2.23 - 3.07*

అమృతకాలం : *సా5.32 - 7.03*

రాహుకాలం : *ఉ7.30 - 9.00*

యమగండం : *ఉ10.30 - 12.00*

సూర్యరాశి : *వృశ్చికం* 

చంద్రరాశి : *మీనం*

సూర్యోదయం : 6.16,

సూర్యాస్తమయం : 5.20,


               *_నేటి విశేషం_*

*మార్గశుద్ధ ఏకాదశి / మోక్షద ఏకాదశి - గీతాజయంతి*

ఈ ఏకాదశిని ‘మోక్షద’ ఏకాదశి అని పిలుస్తారు,

ఈ ఏకాదశి నాడు ఉపవాసం చేయడం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు,

ఇదే రోజున కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీతను బోధించాడన్నది విశ్వాసం.

అందువల్ల ఇది గీతాజయంతి కూడా జరుపుకుంటారు.

 ‘మోక్షద’ ఏకాదశి గురించి కృష్ణుడు పాండవులకు వివరించిన కథ బ్రహ్మాండ పురాణంలో ఉంది...

 వైఖానసుడు అన్నరాజు తన తండ్రి ‘నరమం’లో బాధలను పొందుతున్నట్లు కల గంటాడు. రుషి మునుల సలహాలపై వైఖానసుడు మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు సంపూర్ణ ఉపవాసం చేశాడు. 

ఈ వ్రతఫలంగా వైఖానసుని తండ్రికి నరకబాధ తొలగిపోయి మోక్షప్రాప్తి కలిగిందట.


ఈరోజున ఉపవాసం, విష్ణు ఆరాధన – విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. 

విష్ణు ప్రీతికరమైన ఏకాదశులలో ఇది అత్యంత ప్రధానమైనది. 

దీనిని మహిమాన్వితమైన ఏకాదశిగా పురాణాలు వర్ణించాయి.


ఏకాదశి ముందు రోజు ఏకభుక్తం చేసి ఏకాదశి నాడు శక్తి కొలది ఉపవసించాలి. 

ఆ రోజు షోడశోపచారాలతో నారాయణుని అర్చించాలి, ద్వాదశినాడు తిరిగి పూజించి అన్నాదికాలు నివేదించి పారణచేయాలి.


ఏకాదశ్యాం నిరాహారో భూత్వాహమపరేహని!

భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత!! అని మంత్రము

ఉచ్చరించి పుష్పాంజలిని దేవునికి సమర్పించాలి.


            *_☘️శుభమస్తు☘️_*

🙏 సమస్త లోకాః సుఖినోభవంతు 🙏

కామెంట్‌లు లేవు: