*శ్రీ పోతన భాగవత మధురిమలు*
(2-207-క.)
శశ్వత్ప్రశాంతు నభయుని
విశ్వాత్ముఁ బ్రబోధమాత్రు విభు సంశుద్ధున్
శాశ్వతు సము సదసత్పరు
నీశ్వరుఁ జిత్తమున నిలుపు మెపుడు మునీంద్రా!
*భావము:-* నారదమునీశ్వర! ఎల్లవేళల మిక్కిలి శాంతుడై వుండేవాడు, భయరహితుడు, విశ్వమయుడు, కేవల జ్ఞానస్వరూపుడు, సర్వేశ్వరుడు, శుద్ధాత్ముడు, శాశ్వతుడు, సముడు, సత్తు అసత్తులకు అతీతుడు అయినట్టి పరమేశ్వరుణ్ణి సదా నీ హృదయంలో ప్రతిష్ఠించుకో.
జగద్గురు శ్రీ శంకరాచార్య కృత *'మోహ ముద్గరం'* తో శుభోదయం.
*శ్రీ కృష్ణం వందే జగద్గురుం*
ధర్మో రక్షతి రక్షితః
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి