1, సెప్టెంబర్ 2020, మంగళవారం

కష్టాలు.. ఇంద్రుడు

*కష్టాలు! కష్టాలు!! అని మనం తెగ బాధపడతున్నామా?*

ఇంద్రుడు అంతటివాడు శాపం తట్టుకోలేక వెళ్లి
తామరతూడులో దాక్కున్నాడు.

ఉనహుషుడు శాపం వలన తొండగా మారిపోయాడు.

ఉహరిభక్తుడైన పరమ భాగవతోత్తముడు ప్రహ్లాదుడు తన
సంపదలు కోల్పోయి గాడిదగా మారి ఊక తిన్నాడు.

పాండవులు అడవుల పాలయ్యారు.
వేరేవాడి దగ్గర ఆవులు కాచారు, గుర్రాలను మేపారు. వంటలు వండారు. సేవ చేశారు.

నలుడు భార్యని కూడా కోల్పోయి తన శౌర్యం కోల్పోయి
అడవుల్లో తిరిగాడు.

దేవతలు తమ ప్రతిభ కోల్పోయి తలా ఓ దిక్కు పారిపోయి
వందల సంవత్సరాలు దాక్కున్నారు.

ఆ రాముడంతటి వాడె భార్యతో అడవుల్లో కాలం గడపవలసి వచ్చింది.

శ్రీకృష్ణుడు చిన్ననాటి నుండే తన మీద జరిగే దాడులు
ఎదుర్కుంటూ నే ఉన్నాడు.
అనేకమంది రాక్షసులు, సైంధవుడు, జరాసంధుడు, ఎందరో
కృష్ణుడి మీదికి, అతడి రాజ్యం మీదికి మాటిమాటికి దాడులు చేశారు..చివరికి తన కొడుకుని తన కళ్ళ ముందే చంపితే చూస్తూ ఉండిపోయాడు. అయన భార్యలని దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు. రుక్మిణికి అర్జునుడు చితి పేర్చితే యోగ విద్య ద్వారా ఆ మంటల్లోకి ఆహుతి అయింది. సత్యభామ ఒంటరిగా హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసి శరీరం వదిలింది.

పెళ్లింది మొదలు ఎన్నో కష్టాలు పడిన కుంతీదేవి దృతరాష్ట్రుడి తో సహా అగ్నికీలల్లో ఆహుతై పోయింది.

ఆ ఇంద్రుడి కొడుకు శాపం వలన కాకిగా మారిపోయాడు.

అంతటి దేవతలు, మహాత్ములే ఎన్నో కష్టాలు పడ్డారు. వీటిముందు..
మనకి వచ్చే చిన్ని చిన్ని కష్టాలు ఓ లేక్కంటారా?
నిజానికి మనవి కష్టాలు అంటారా?
కానే కాదు.

ప్రతీది కాలం నిర్ణయిస్తుంది..

నీకు ఎప్పుడు ఏది దక్కాలో అది

 *సమయం వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది. అది కష్టం అయినా సుఖం అయినా..

దైవంపై విశ్వాసం ఉంచాలి...
ధర్మాన్ని పాటించాలి..
ఓపికతో ఉండాలి..
ధైర్యంగా ఎదుర్కోవాలి..
లక్ష్యాన్ని సాధించాలి..

అప్పుడే మనం మన జీవన యానాన్ని ప్రశాంతంగా చేయగలుగుతాము కదా.

కామెంట్‌లు లేవు: