8, మే 2021, శనివారం

ఏదిసూనృతం

 **ఏదిసూనృతం,,ఏది అనృతం..మన తక్షణ కర్తవ్యమేమిటి*** 


************************************

Dr.C.  ప్రభాకర రెడ్డి MS MCh (CTVS)

గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు 

కర్నూలు. ఆంధ్రప్రదేశ్.

*********************************************

**ఫ్లాష్ బ్యాక్ - బ్లాక్ అండ్ వైటులో**** 


1918 సంవత్సరం 


స్పానిష్ ఫ్లూ...(అప్పట్లో ఇన్ఫ్లు యంజా వైరస్-ఇప్పటి కొరోనా వైరస్ అక్క) తో భారత దేశం అతలాకుతలం అవుతోంది 


మహాత్మా గాంధి గారు తన 48 వ ఏట ఆశ్రమంలో కేవలం ద్రవ రూప ఆహారాన్ని తీసుకుంటూ ఆ కొరోనా అక్కతో పోరాడు తున్నాడు.. శబర్మతీ ఆశ్రమంలో ఎందరికో జ్వరం, దగ్గు పోరాడుతున్నారు.. పత్రిక లలో *గాంధీ జీవితం గాంధీది కాదు.,అది భారతీయులది* అని రాసుకున్నాయి.,, 


గంగా నదిలో శవాల గుట్టలుగా తేలుతున్నాయి.. వాటిని కాల్చేకి కట్టెలు లేక గంగలో తోసేస్తున్నారు..దానికి తోడు వర్షాలు రాక కరువు వచ్చింది,, అందరూ పట్టణాలకు ఆకలితో వలస వెళ్తున్నారు..అది వైరస్ ను ఇంకా వ్యాప్తి చేస్తుంది అని సూర్యకంట త్రిపాఠీ తన పుస్తకం లో వ్రాసుకున్నాడు.. 


ఆకాలంలో ఇప్పటిలా వ్యాక్సిన్ లు లేవు వ్యాపారం లేదు.. ఆంటిబయాటిక్సు, వెంటిలేటర్లు లేవు.. అసలు పాశ్చాత్య విధానాన్ని నమ్మే వాళ్ళే లేరు.. అంతా సొంఠి, అల్లం, మిరియాలు, జిలకర, ఆవాలు, తులసి, తాయత్తులు బ్యాచు వైద్యమే.... 


మొదట ప్రపంచ యుద్ధం కంటే ఎక్కువగా మంది భారత దేశంలో ఈ మహమ్మారితోనే చనిపోయారు.. 17 - 18 మిలియన్లమంది చనిపోయారు... ప్రపంచంలో 100 మిలియన్లు చనిపోయారు,.6% జనాభా అంతరించి పోయింది... 


బొంబాయిలో ఒక షిప్ లో వచ్చిన సైనివల్ల సెకెండు వేవు వచ్చిందని వైద్యాధికారులు, లేదు మీ మురికి అలవాట్ల వల్లనే వచ్చిందని బ్రిటిష్ అధికారులు యధావిదిగా తిట్టిపోసుకున్నారు.. అందరినీ గాలికొదలేసి పర్వత ప్రాంతాల కు అధికారులు పారిపోయారు ప్రాణభయంతో.. భారతీయ అక్క చెల్లెల్లు తినడానికి తిండిలేక, తమ భర్తల ప్రాణాలను కాపాడలేక చిక్కి శల్యమై ఎముకల గూడులా మారి ప్రాణాలు వదిలారు... 


బయట తిరగకండి,,ఇళ్ళల్లోనే ఉండండి,,,,,.. ప్రశాంతంగా నిద్రపోండి., ఎక్కువగా చింతించకండి అని టైమ్సు ఆఫ్ ఇండియాలో కధనాలొచ్చాయి,.. 


**మరి మన భారతదేశం ఎలా ఎదుర్కొంది,,ఈ మహమ్మారిని...** 


ప్రజలు అంతా సంఘటితమయ్యారు.., 


ఆంటి ఇన్ఫ్లుయంజా కమిటీలు వేసుకున్నారు... 


పాతిక పరక సేకరించారు... 


చిన్న చిన్న షెల్టరు వైద్యాలయాలు స్ధాపించారు... 


అందరికీ మందులు, కూడు, గుడ్డ పెట్టారు... 


శవాలను తొలగించారు...తగలబెట్టారు..,, 


అందరినీ మోటివేటు చేసి హెల్తు గురించి పెద్దఎత్తున భారతదేశ చరిత్రలో లేని విధంగా అవగాహనా కార్యక్రమాలను నిర్వహించారు.,,వైద్యసిబ్బంది భయపడ్డారు.,వారి కొరత ఎక్కువగా ఉంది.... 


ప్రతి ఒక్క భారతీయుడు తన అక్కచెల్లెల్లను అన్నదమ్ములను కాపాడుకోవాడానికి భుజం భుజం కలిపి పోరాడారు.... మహమ్మారి అంతం చూసారు...ప్రజలను ఆ సెకండు వేవు కొరోనా అక్క ఇన్ఫ్లుయంజా నుంచి కాపాడుకున్నారు... ఇదే నిజమైన భారతీయుల యుద్ధం..మొదటి ప్రపంచ యుద్ధంకంటే పెద్ద వైద్యయుద్దంలో భారతీయులు గెలిచారు...

*************************************

ప్రస్తుతం...ఈస్ట్ మన్ కలర్,.DTS లో 


*********************----******************* 


2020 సంవత్సరం... 


ఇన్ఫ్లుయంజా చెల్లి దేశంలో 2020 లో వచ్చింది,., 


ఆంటిబయాటిక్సు, ఆంటివైరల్సున్నాయి, వెంటిలేటర్లున్నాయి... ఆక్సిజను,స్టీరాయిడ్సు ఉన్నాయి., పాశ్చాత్య వైద్యం అందరికీ ఆమోదమే,,. కాని తులసి మిరియాలు పసుపు శొంఠి బ్యాచులు ఉన్నాయి... అయినా మాస్కు, దూరం దూరం, శానిటైజర్, లాక్డౌన్ లు పక్కా ప్లానింగ్ తో మొదటి వేవును భారతదేశం అంతం చేసింది....

******************************************** 


2021 సంవత్సరం..... 


ఆత్మ విశ్వాసం పెరిగింది... ఈ కొరోనా రెండవ వేవు ఏమి చేయగలదు అని రొమ్ము విరుచుకు తిరిగాము.. మాస్కు శానిటైజర్ దూరం దూరం అనే నినాదాలను పట్టించుకోలేదు... మత విశ్వాసాలే ఎక్కువయ్యాయి.. అందరూ గుంపులు గుంపులుగా మాస్కు లు వదిలేసి చెలరేగారు... పండగలు, పబ్బాలు, పెళ్ళిళ్ళు పేరంటాలు, మేళాలు తాళాలు, గుళ్ళు గోపురాలు, తమ అస్తిత్వం పోతుందని చెలరేగిపోయారు.... 


వ్యాక్సిన్ ఉన్నా సరిగ్గా  ఉపయోగించ లేదు... వైద్యసహాయం చేసేకి సన్నద్దం చేసుకోలేదు.,.

ఎన్నికలు, కౌంటింగులు అయినాక తీరిగ్గా కొరోనా ను నలిపి పారేస్తాం అనుకున్నారు... అడ్డపడ్డారు... దిక్కుతోచక అందరినీ అడుక్కుంటూ బెంబేలెత్తి పోతున్నారు

******************-************************

Dr.C.  ప్రభాకర రెడ్డి MS MCh (CTVS)

గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు 

కర్నూలు. ఆంధ్రప్రదేశ్.

******************************************

అదను చూసి సెకండు వేవు విరిసిన పంజాకు దిమ్మ తిరిగి మేకపోతు గాంభీర్యం ప్రదర్సిస్తున్నారు,., బాబ్బాబు మాకు వ్యాక్సిన్ ఇవ్వు, ఆక్సిజన్ ఇవ్వు అని దేబురించాల్సిన పరిస్థితులు వచ్చాయి.,. 


మరలా భారతీయులందరూ భుజం భుజం కలిపి అక్కచెల్లెల్లకోసం అన్నదమ్ములకోసం పోరాడాల్సిన చారిత్రాత్మక సమయం వచ్చింది... 


మరలా మనమందరూ **కోవిడ్ ఆర్మీగా** మారాల.. 7th సైన్సు సినిమాలోలా మన జెనిటిక్ కోడును ఆక్టివేటు చేసుకోవాల.. పిరికి తనం వదిలెయ్యాల.. 


*ఇక సోషియల్ మీడియాలో అందరినీ తిట్టేది, అలాచేయండి, ఇలా చేయండి, మాకు బెడ్డు దొరకల, ఆక్సిజన్ దొరకల, మేమిచ్చాం, మేమే తెచ్చాం  అని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల నుండి పార్టీల పరంగా తిట్టిపోసి వీరాభిమానం చాటుకున్నది చాలు..* 


వైద్యసిబ్బంది, కలెక్టరు ల నుంచి బంట్రోతుల వరకు కొరోనాలో పని చేసే వారిని మీ సావు మీరు సావండి అని ఇంట్లో కూర్చుని తిట్టింది చాలు... 


*ఇక నడవండి..కోవిడ్ ఆర్మీ గా మారి సోషియల్ సర్వీసు చేయండి,,,* 


1. 130 కోట్ల మంది ఇంట్లో కూర్చో కుండా "covid army 🪖" గా మారాలి మాస్కు, భౌతికదూరం పాటిస్తూ అందరికీ ఎంతో కొంత సహాయంగా ఉంటే మంచిది 


2. టీచర్లు, విద్యా సంస్థలు పనిచేసేవారు, చదువుకున్న వాళ్ళు దగ్గర శిక్షణ  తీసుకొని ఎంతో కొంత  సహాయం చేయడం. 


3. చదువుకున్న ప్రజలు covid army 🪖 లో వైద్యసిబ్బంది చెయ్యగల పనులు మీరు చేయవచ్చు., 


4. ఊరికే టెన్షన్ పెంచే నెగటివ్ వార్తలు వ్యాప్తి చెంద కుండా చూడాలి 


5. ఇంట్లో నుంచే తెలిసిన వారిని భయపడకుండా ధైర్యం చెప్పి పర్యవేక్షణ  చేయచ్చు.. మందులు, ఆక్సిజను అవసరాన్ని తెలియ చేస్తూ హోమ్ఐసోలేషన్ కు సహాయం చేయవచ్చు.. మరణాల సంఖ్య పెరగ కుండా చేయ వచ్చు.,బెడ్లు అందరికీ అందేలా చేయవచ్చు.. 


6. హెల్తు వర్కర్సు, శానిటేషన్ వర్కర్సు, వారి కుటుంబాలకు ఎంతో కొంత సహాయం చేయండి.. వాళ్ళేం ఆస్తులు పెంచుకోరు.. తినడానికి సహాయం చేసి మే మున్నాం మీకు అని భరోసా కల్పించండి.. 


7. కోవిడ్ మీద అవగాహన, తేవచ్చు.. ప్రజలు  పానిక్  కాకుండా ఉండేందుకు కారులో మైకు పెట్టుకొని చుట్టూ పక్కల వారికి ఙ్ఞానం చెప్పవచ్చు 


8.చెరువులు కాలువలు శుభ్రం చేయ వచ్చు.. 


9. మాస్కు, భౌతిక దూరం పాటిస్తూ తో వీధి చివరున యోగ, మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సరసైజులు చేయించచ్చు.. 


10. అందరూ సాఫ్టువేరు ఇంజనీరులు కంప్యూటర్ లో బెడ్ ల వివరాలు సేకరించి, ఎక్కడ ఖాళీలున్నాయో ప్రజలకు సమాచారం చేయవచ్చు,, 


11. కోవిడ్ రికవరీ అయిన యువకులు, ఊరికే ఉండకుండా కోవిడ్ కేర్ సెంటర్లలో వాలంటరీగా సహాయకులుగా ఉండచ్చు... 


12. ఆంబులెన్సులు, ఓమ్నీ వ్యాన్లు ఉన్నవారు దినం మూడుగంటలు ఆసుపత్రి లలో పేషెంటులను వార్డులు మార్చేకి సహాయం చేయచ్చు.,, 


13. మీ ఊర్లలో ఉండే పెద్ద హాలులను కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ లుగా మార్చి సేవలందించచ్చు.., 


14.. ఈ బ్లాక్ మార్కెటింగ్ నాయాళ్ళ తోలు తీయవచ్చు.. 


*ఇలా చేసే ధైర్యం, దమ్ము, మనసు, ఈ కొరోనా యుద్ధంలో పాలుపంచుకొనే సామర్ధ్యం ఈ ఉక్కునరాల ప్రజలకుందా?* 


ఎవరికోసమో ఎదురు చూడకుండా సమాజహితం కోసం నీ సోదరులకోసం పని చేయమన్న *బాబాసాహెబ్* చెప్పినది పాటించే తెగువ ఉందా? 


ఉక్కునరాల యువకులే దేనినైనా సమర్ధవంతంగా చేసి సాధిస్తారు అన్న *వివేకానందుని* మాటలు ఆచరించ గలరా?

**************************************** 


ముగింపు మాట.,, 


చీకటిలో చిక్కుకున్నప్పుడు అందరినీ తిడితే బయటపడం... ఒక చిరు దీపం వెలిగించు కోవాల...

అలాగే మీ రాజకీయాలు, ఓట్లు, నోట్లు, తరువాత చూసుకోవచ్చు,,దానికి సమయం ఉంది... బ్రతికి తే అందరం మరలా 2024 ఎన్నికల లో కొట్టుకుందాం...

బ్రతకడమే ముఖ్యం ... ఎలాగైనా.... ఆ పాశ్చాత్య మీడియా ఇలా అంది.. వారు రిజైన్ చేయాల.. వీరు తోపు,.వాడు వీకు.. అనేటివి పక్కకు పెట్టి భుజంభుజం కలిపి పోరాడాల.... 


Dr.C.  ప్రభాకర రెడ్డి MS MCh (CTVS)

గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు 

కర్నూలు. ఆంధ్రప్రదేశ్.

కామెంట్‌లు లేవు: