2, అక్టోబర్ 2021, శనివారం

అమ్మవారి చీరెను భక్తులు ధరించవచ్చా?



*అమ్మవారి చీరెను భక్తులు ధరించవచ్చా?* 


 సాక్షాత్తు శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి అలంకరింప చేసిన చీరె(శేష) వస్త్రాన్ని భక్తులు(మహిళలు) ధరించవచ్చా..? 

అందులో లాభాలేంటి ? 

పాటించాల్సిన నియమాలేంటి? 

ఈ విషయాలను తెలుసు కుందాము. 


👉శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు అనేక ప్రాంతాల్లో వివిధ రూపాల్లో కొలువుదీరి ఉంటారు. పురుషులకంటే ఎక్కువగా మహిళలు ఆ దేవాలయాలకు క్యూ కడుతుంటారు.


👉పూలు, కుంకుమ, గాజులు, చీరె, రవికెలను కానుకలుగా సమర్పిస్తుంటారు. ఆ చీరెను విశేషమైన రోజుల్లో ఆ చీరను మూలమూర్తికి అలంకరింప చేయమని పూజారులకు చెబుతుంటారు.


👉ఆ తరువాత ఇలాంటి చీరెలను ఆలయ నిర్వాహకులు భక్తుల సమక్షంలో వాటిని వేలం వేస్తుంటారు. ఆ చీరె దక్కితే చాలని చాలా మంది భక్తులు వేలంలో కొనుక్కుంటుంటారు.


👉అయితే అసలు అమ్మవారి చీరె(శేష వస్త్రం)ను సాధారణ మహిళలు ధరించవచ్చా ? 

అనే సందేహం కొంతమందికి కలుగుతూ వుంటుంది. అమ్మవారి చీరెలను ధరించవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతూ ఉన్నాయి.


👉కానీ, ధరించినప్పుడు పాటించాల్సిన నియమాలేమిటి? 

ఎంత సంతోషంగా వేలం పాటలో సొంతం చేసుకుంటామో.. ఆ చీరెను ధరించినప్పుడు కూడా అంతే పవిత్రంగా ఆ మహిళలు ఉండాలి. 

అందుకు కొన్ని నియమాలను పాటించాలని అంటున్నాయి.


👉అమ్మవారి శేష వస్త్రాన్ని ధరించే ముందు తిథి – వర్జ్యం చూసుకుని “శుక్రవారం” రోజున అమ్మవారి చీరను ధరించవచ్చు. అది కూడా ఉదయం వేళలో కొంతసేపు మాత్రమే ధరించాలి.


👉ఈ చీరెను ధరించినంత సేపు ప్రశాంతత కలుగుతుంది. అలాగే మనం కూడా ప్రశాంతంగా ఉండాలి. మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. రాత్రి సమయాల్లో ఈ చీరెను ధరించ కూడదు. ఆ చీరెను ఎప్పుడు ఉతికినా ఆ నీటిని ఎక్కడపడితే అక్కడ కాకుండా మొక్కలకు పోయవలసి వుంటుంది.


👉అప్పుడే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అలా కాకుండా నియమాలను పాటించకపోతే, ఫలితం ఉండదు. ఆ పవిత్రత మనకు దక్కదు.


ఇది సేకరణ 🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: