18, జూన్ 2023, ఆదివారం

నిత్యాన్వేషణ

 నిత్యాన్వేషణ:



శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు అంటే ఎవరు? నిజమైన పాత్రేనా లేక కల్పితమా? వారి గురించి తెలుపగలరు.


శ్రీకాకుళం'పేరుతో రెండు ఊర్లు ఉన్నాయి,ఉత్తరాంధ్ర లో,కృష్ణాజిల్లాలో.ఆంధ్ర' అని ఒక జాతికి కలుపుతూ మహా విష్ణువు' గుడి ఉండుట ఒక ప్రత్యేకమైన విషయమే.ఎందుకనగా మరాఠీ విష్ణు, కన్నడ విష్ణు తమిళ విష్ణు లేదా కళింగ విష్ణు అనే జాతిపేర్లతో విష్ణుమూర్తి గుడులు ఎక్కడా లేవు.

మధ్య భారతంలో క్రీ.శ6 నుండి 14శతాబ్దం వరకు కాలచూరులన రాజవంశం పరిపాలించింది. 6శతాబ్దం ముందు వీరు ఎక్కడ ఉండేవారో తెలియదు.కల్ చురి' అంటే కల్లి' అంటే మీసాలు, చురి 'అనగా కత్తి'అని చరిత్రకారులు వివరణ.బహుశా 'చురకత్తి లాంటి మీసాలు'కలిగిన రాజులు అయిఉండవచ్చు.వీరికే 'కాలాభ్ర' 'హైహయ' ముదిరాజ్' అని కూడా అంటారు.తమిళ రాజ్యాలను బహుశా 3,4 శతాబ్దాలలో అల్లకల్లోలం చేసిన కాలాభ్ర' రాజవంశం వీరే. ఈ హైహయ' వంశస్థులకు. అనగా రాజులకు 'కొక్కుల' లేదా 'కొక్కోల' లేదా 'కోకుల' కొక్కొలని' అని 'బిరుదు' లేదా 'వంశనామం' ఉన్నది.కల్ చూరి' రాజ్యస్థాపకుడు 'కొక్కుల'లేదా 'కొక్కోల'గా భావిస్తారు. 6శతాబ్ది నుండి 14 వరకు వీరి పాలన గుజరాత్,మాళవ,మధ్య ప్రదేశ్,కర్ణాటక,ఆంధ్ర మొదలగు ప్రాంతాలలో సాగింది.వీరు కార్తవీర్యార్జుని వంశస్థులుగా, పరుశు రాముని చేతిలో మరణం తప్పించుకొనుటకు మీసాలు,గడ్డాలు పెంచుకుని మారువేషాలలో తిరిగారని,అందువల్లనే 'కల్ చురి' అని పిలిచేవారని ఒక వదంతి ప్రాచుర్యంలో ఉన్నది.

వీరి ఇష్టదైవం శివుడు,మహామాయ.మహిష్మాతి వారి జన్మస్థానం.బహుశా 'శ్రీకాకుళం' పేరు 'కొక్కుల,కొక్కోల, కోకల్ల,కోకోల,కోకోలు అని పిలవబడే 'హైహయ' వంశరాజుల పేరు మీదగా వచ్చి ఉండవచ్చునని అనిపిస్తుంది.వీరు బహుశా శాతవాహనులకు పూర్వం ఆంధ్ర ప్రాంతం 'శ్రీకాకుళం'రాజధానిగా పరిపాలించి ఉండవచ్చు. క్రీస్తు పూర్వం 2 -3 మధ్యఆంధ్ర శాతవాహనులు వారినిజయించి 'మీసాల దైవాన్ని (బహుశా ఉజ్జయిని శంకరునిలా మీసాలు గల) తమ జాతి పేరున 'ఆంధ్ర మహావిష్ణు' గా మార్చి ఉండవచ్చు.వైశాఖ పూర్ణిమ' ఉత్సవాలు వైష్ణవ మతంలో 'వల్లభ సాంప్రదాయం'స్థాపించిన వల్లభా చార్యుని జన్మోత్సవాలయి ఉండవచ్చు.ఇక్కడ గల ప్రాచీనరాజీవలోచన మందిరంలో కూడా వైశాఖ ఉత్సవాలు చాలా గొప్పగా జరుగుతాయి.శ్రీ వల్లభా చార్యులు ఆంధ్రులు.జన్మస్థానం 'చంపారణ్' ఛత్తీస్ గడ్.గుజరాతీలలో అత్యధికులు వల్లభాచార్యుల అనునూయిలు.

కామెంట్‌లు లేవు: