29, ఆగస్టు 2023, మంగళవారం

అయోధ్య రామమందిరం



*జనవరి 22 వతేదీ, 2024 నాడు* అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం జగజ్జాయమానంగా జరుగబోతోంది:


1) ప్రారంభోత్సవానికి ఒక నెల ముందుగానే... *రామ్ ధుని* (శ్రీరామ నామ భజన) దేశవ్యాప్తంగా లక్షకుపైగా దేవాలయాల్లో మారుమ్రోగుతుంది.


2) ఈ అపురూప ఘట్టం అంతర్జాతీయ స్థాయిలో విరాజిల్లనుంది.


3) దాదాపు 160 దేశాలనుండి ప్రజలు ప్రారంభోత్సవాన్ని తిలకించటానికి రాబోతున్నారు.


4) 6500 మీడియా విలేకరులు ప్రపంచం నలుమూలల నుండి ఈసందర్భంగా రిజిస్టర్ చేయించుకున్నారు.


5) అయోధ్య ప్రముఖమైన అతిపెద్ద పుణ్యక్షేత్రంగా, పర్యాటకస్థలంగా అవతరించబోతుంది.


6) మొదటి సంవత్సరం 5 కోట్లమంది సందర్శిస్తారని అంచనా.


7) విరివిగా త్రీ స్టార్, ఫైవ్ స్టార్ హోటల్స్ నిర్మాణం చురుకుగా సాగుతోంది.


8) దేశంలోని పలు ఎయిర్ పోర్ట్ లనుండి విమానాలు చేరుకోవటానికి అయోధ్య విమానాశ్రయ నిర్మాణం ముమ్మరంగా సాగుతోంది.


9) అయోధ్య రైల్వే స్టేషన్ కొత్తకొత్త హంగులతో సిద్ధమవుతోంది.


10) విశాలమైన సరయూ నదీతీరం పరిశుభ్రతతో, రంగవల్లుల అలంకరణలతోవేడుకకు అతిసుందరంగా ముస్తాబవుతోంది.


11) అయోధ్య, పరిసరాలు పదిలక్షల దీపాలతో ప్రకాశించనున్నాయి.

కామెంట్‌లు లేవు: