29, జనవరి 2024, సోమవారం

హిందూ బంధువులకు

 సమస్త హిందూ బంధువులకు ఒక సూచన ! మనం ఒక విచిత్రమైన తప్పిదం చాలా కాలంగా చేస్తున్నాం .ఒకసారి కుటుంబ సమేతంగా తిరుపతి, శ్రీ శైలం, కనక దుర్గమ్మ ఆలయాలు దర్షించాక మళ్లీ మళ్లీ అవే ఆలయాలకు 15/20/25 వేలు ఖర్చులు పెట్టి, క్యూ లలో నిల్చుని, రూం.లు దొరకక, చంటి పిల్లలతో అవస్థలు పడి, 300/1000 రూ టిక్కెట్లు పెట్టీ వెళుతుంటే ప్రభుత్వాలు ఆ సొమ్ము ఇతర వర్గాలకు మళ్లిస్తున్నారు. అదే వెంకన్న, మల్లన్న, దుర్గమ్మ గుడులు మన వూళ్ళో ఉన్నా బాగు చేయడానికి మనసు రాదు.

మరి మనం ఇదే ఖర్చులో పావలా వంతు మన ఊరి గుడికి ఖర్చు పెట్టుకుంటే ఏ అలసట లేకుండా ,దర్శనం,ప్రసాదం, ఆశీర్వాదం లభిస్తాయి. పేద పూజారి కడుపు నిండుతుంది. కొంత సొమ్ము మీ దగ్గర లోని గోషాలలకు ఇస్తే గోమాతల కడుపు నిండి ఆశీర్వాదం,పుణ్యం లభిస్తాయి . కొన్నాళ్ళకు ప్రభుత్వాలు గుడులపై పెత్తనం వదులుకుంటారు. ఇది సాధ్యమే ! తిరుపతి వెంకన్న ,మనగుడిలో వెంకన్న ఒకరే కదా !! ఆలోచించండి ,అర్థం చేసుకోండి !!

పది మందికీ ఇదే విషయం చెప్పి మీ గుడి, మీ వూరు,మీ గోవులను కాపాడుకోండి !జై శ్రీ రామ్!!!

కామెంట్‌లు లేవు: