డా. ఝాన్సీ ముడుంబై
హైదరాబాద్
శీర్షిక :నా తెలుగు భాష
***************
కలం పట్టిన ఆనాడే అనుకున్నాను కవితలే నా ప్రాణమని
తెల్లని కాగితం పై నల్లని అక్షరాల పూలు పూయించిన నాడే అనుకున్నాను కవితల సేద్యం చేయాలని
కావ్యాల పంటల్ని పండించాలని
నుడికారాల ఒంపులతో నయాగరా జలపాతంలా
జాలువారుతుంటే మురిసిపోతున్నాను అక్షర కవలల్ని జూసి
అద్దుతున్నాను సుగంధ పరిమళాలను... రాజఠీవీతో నడయాడే నా తెనుగు భాషకు నరద్రిష్ఠి తగలకుండా నలుమూలలా రాజరాజ నరేంద్రుని కాలంలా నఖశిఖ పర్యంతం ప్రతిహృదిలో పదికాలాలు
ప్రజ్వరిల్లాలని
అక్షరాలనే అందమైన అక్షర తోరణంలా మార్ఛి
అలంకరిస్తున్నాను నా తెలుగుతల్లికి...
నాతెలుగు రుణం కొంతైనా తీర్చుకోవాలని...
తెలుగే వెలుగై,
తెలుగే జిలుగై,
మెలగాలి మనమధ్య... తిరిగి తెలుగు భాషకు పట్టాభిషేకం కట్టేదాక కడుతూనే ఉంటాను ఈ అక్షరమాలల్ని అక్షర కుక్షినై
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి