శ్రీమద్భగవద్గీత: నాల్గవ అధ్యాయం
జ్ఞానయోగం: శ్రీ భగవానువాచ
యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనమ్
నాయం లోకో௨స్త్యయజ్ఞస్య కుతో௨న్యః కురుసత్తమ (31)
ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే
కర్మజాన్ విద్ధి తాన్ సర్వానేవం జ్ఞాత్వా విమోక్ష్యసే(32)
కురుకులభూషణా.. యజ్ఞాలలో మిగిలిన అన్నమనే అమృతాన్ని భుజించేవారు శాశ్వత పరబ్రహ్మం పొందుతారు. యజ్ఞం ఒకటీ చేయనివాడికి ఇహలోక సుఖం లేదు; పరలోకసుఖం అసలేలేదు. ఈ విధంగా వివిధ యజ్ఞాలు వేదంలో విశదీకరింపబడ్డాయి. అవన్నీ కర్మలనుంచి ఏర్పడ్డాయని తెలుసుకుంటే నీవు సంసారబంధం నుంచి విముక్తి పొందుతావు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి