17-01-గీతా మకరందము.
శ్రద్ధాత్రయవిభాగయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
శ్రీ భగవద్గీత
అథ సప్తదశోఽధ్యాయః
పదునేడవ అధ్యాయము
శ్రద్ధాత్రయ విభాగయోగః
శ్రద్ధాత్రయ విభాగయోగము
అర్జున ఉవాచ :-
యే శాస్త్రవిధిముత్సృజ్య
యజన్తే శ్రద్ధయాఽన్వితాః |
తేషాం నిష్ఠా తు కా కృష్ణ
సత్త్వమాహో రజస్తమః ||
తాత్పర్యము:- అర్జునుడు అడిగెను - ఓ కృష్ణా! ఎవరు శాస్త్రోక్తవిధానమును విడిచిపెట్టి శ్రద్ధతో గూడుకొని పూజాదుల నొనర్తురో వారియొక్క స్థితి సాత్త్వికమా, లేక రాజసమా, లేక తామసమా ? ఏది యైయున్నది?
వ్యాఖ్య:- క్రిందటి అధ్యాయముయొక్క చివర శాస్త్రవిధి నుల్లంఘించి స్వేచ్ఛాచారులై ప్రవర్తించువారికి మోక్షసిద్ధి కలుగదని చెప్పబడినది. అయితే కొందఱు శాస్త్రనిర్దిష్టములగు విధినిషేధములను శ్రమయనితలంచియో, లేక, ఔదాసీన్యము వహించియో, వానినిగూర్చి తెలిసికొనుటకై యత్నింపక, శ్రద్ధతోగూడుకొనినవారై, ఆస్తికబుద్ధి గలిగి దేవతాదులను అర్చించుచుదురు గదా! అట్టివారియొక్క ప్రవృత్తి యెట్టిది? అది సాత్వికమా,రాజసమా, తామసమా అని అర్జునుని ప్రశ్న.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి