శ్రీమద్భగవద్గీత: ఎనిమిదవ అధ్యాయం
అక్షరపరబ్రహ్మయోగం:శ్రీ భగవానువాచ:
శుక్లకృష్ణే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే
ఏకయా యాత్యనావృత్తిమన్యయావర్తతే పునః (26)
నైతే సృతీ పార్థ జానన్ యోగీ ముహ్యతి కశ్చన
తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున (27)
పార్థా... శుక్ల, కృష్ణ అనే రెండింటినీ జగత్తులో శాశ్వతమార్గాలుగా భావిస్తున్నారు. శుక్లమార్గంలో పయనించినవాడికి జన్మరాహిత్యమూ, కృష్ణమార్గంలో పోయినవాడికి పునర్జన్మమూ కలుగుతాయి. ఈ రెండుమార్గాలూ తెలిసిన యోగి ఎవడూ మోహంలో పడడు. అందువల్ల నీవు నిరంతరం ధ్యానయోగంలో వుండు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి