26, సెప్టెంబర్ 2020, శనివారం

*ఆచార్య సద్భోదన*

 


భక్తుని యొక్క మొదటి కర్తవ్యం భగవంతుని సేవించడమే. భక్తులకు భగవంతుని వద్ద ప్రవేశం నేరుగా ఉంటుంది. వారు ఇలా అంటారు.


*నాకు భగవంతుని గురించి తెలుసుకోవాలని ఉంది, ఆయన ఉనికిని అనుభూతిలోనికి తెచ్చుకోవాలని ఉంది, ఆయనతో సంభాషించాలని ఉంది, భగవంతునిలో లీనమవ్వాలని ఉంది*.


భగవంతుని గురించి స్పష్టత ఏర్పడాలంటే నిశ్శబ్ధంగా ఆయన ధ్యానంలో మునిగిపోవాలి. దీనికి కాలంతో ప్రమేయం లేదు. అన్ని సమయాల్లోను ఆయనను ప్రార్థించవచ్చు. మన జీవితంలోని ప్రతి ఘడియకాలమూ భగవంతుని ఎడల ఆరాధనా భావంతో నిండి ఉండాలి.


సర్వేజనా స్సుఖినోభవంతు.


*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

కామెంట్‌లు లేవు: