26, సెప్టెంబర్ 2020, శనివారం

ఆచార్య సద్భోదన*





భక్తి మనలను విశ్వవ్యాప్తితో ఏకం చేస్తుంది.




మనం ఉన్నత జ్ఞానాన్ని పొందాలని పరితపిస్తూంటే, మనలోని సందేహాలను నివృత్తి చేసుకుంటుంటే, మనలోని అంధకారం పటాపంచలు అవుతూ హృదయ కవాటాలు తెరవబడతాయి.




అప్పుడు మనం సత్యాన్ని భక్తి యొక్క తీవ్రతతో కనుగొంటాం.




విశ్వాస పూర్వక పోరాటంతో మనం దివ్యత్వాన్ని గ్రహిస్తూ తేజోవంతువంతులం అవుతాము.




ప్రపంచం మన యందే, మన లోపలే ఉన్నది, దానిని వెలికి తీయగలగాలి.




దీనిని అకుంఠిత దీక్ష, ధ్యానం, ప్రార్థనలతో సాధించవచ్చు.




సర్వేజనా స్సుఖినోభవంతు.




*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

కామెంట్‌లు లేవు: