9, అక్టోబర్ 2021, శనివారం

తమిళనాడు ప్రభుత్వ రాయల్ గన్ సెల్యూట్..

 🙏🙏. 👆🏽👆🏽👆🏽


దేవతల సేనాని కుమారస్వామి వారికి తమిళనాడు ప్రభుత్వ రాయల్ గన్ సెల్యూట్..


దసరా నవరాత్రి వేడుకల కోసం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్యాకుమారి జిల్లా నుంచి తిరువనంతపురం నగరానికి బయలుదేరిన సరస్వతీ దేవీ..


మున్నుట్టి నంగా .. కుమారస్వామి ..

వందల సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆచారం..


అప్పట్లో ఇప్పటి కన్యాకుమారి తిరువంతపురం రాజ్యంలో భాగంగా ఉండేది..


తిరువనంతపురం రాజ్యానికి పేరుకు రాజు ఉన్నా రాజ్యానికి సర్వంసహా చక్రవర్తి సాక్షాత్తు ' పద్మనాభ స్వామి వారే ' ..


నవరాత్రి ఉత్సవానికి తన రాజ్యంలోని 3 ప్రధాన ప్రాంతాల నుంచీ .. అంటే సరస్వతి దేవిని కళ్లుకుల్లమ్ నుంచీ..

కుమారస్వామి వారిని వెల్లిమల కుమార కోవిల్ నుంచీ..

మన్నుట్టి నంగా అమ్మను సుచీంద్రమ్ నుంచీ తిరువంతపురం ప్యాలెస్ కు ' పద్మనాభ స్వామి వారు సగౌరవంగా ఆహ్వానించేవారు..



పాలకులు ఎవరున్నా.. రాష్ట్రాలు విడిపోయినా నాటి రాజశాసనాన్ని అందరూ గౌరవించడం సాంప్రదాయం..


ఒకసారి ముస్లిం నవాబు దీన్ని పాటించనందు వలన అతని కుటుంబం దసరా రోజే సజీవదహనం అయ్యిందని కన్యాకుమారి లో జానపద గాధ ఉన్నది..


కారణాలు ఏమైనా ఈరోజుకూ ఈ ఉత్సవం నిరాటంకంగా జరుగుతుంది..


ఆ ఉత్సవాన్ని కళ్ళారా చూసే అదృష్టం ఉండాలి..


దేవతల సేనానికి తమిళనాడు నుంచీ బుల్లెట్లతో వీడ్కోలు...

తిరువంతపురం లో దేవతలకు స్వాగతం పలకడానికి అద్భుతమైన ఏర్పాట్లు..


ఆ బుల్లెట్ సౌండ్స్ వినండి..శివగణాల హ్రూంకార ద్వనుల్లాగా వినబడతాయి..


ఒక్కసారి చేతులవంక చూసుకోండి రోమాంచితం అయ్యుంటాయి..


*హరహర మహదేవ్.. * *జయ జయ కార్తికేయ.. * *జయ పద్మనాభ..*


              🌸🙏🙏🌸

కామెంట్‌లు లేవు: