19, మార్చి 2024, మంగళవారం

జంతు బలులు"

 *💥"జంతు బలులు"💥*

హింసనా? అహింసనా? 

ఈ యొక్క ఆచారాలు ఎలా వచ్చాయి. దీనికి ఆద్యుడు ఎవరు?

 దీని యొక్క పూర్వాపరాలు తెలుసుకుందాం.మిత్రులారా....!

అరుణాచలశివ 🌹


ప్రకృతిలో ని నియమం ధర్మం తప్పితే మనిషికి ఒక మాట,పశువుకు ఒక డెబ్బ,రాక్షస సంహారం;

చర్యకు ప్రతిచర్య-cause and effect-యద్భావంతద్భవతి ఇవే కర్మ సిధ్ధాంతానికి మూలాలు,తెలియక చేసిన తప్పు వలన తెలియకుండా అనుభవిస్తారు తెలిసి చేసిన తప్పు వలన తెలిసేలా,గుణపాఠంలా అనుభవిస్తారు;

మన ఆచారాలు దివ్యద్రష్టలైన ఋషులు తమ తపస్సు లో తాము తెలుసుకున్న అనుభవాలన్నింటినీ క్రోడీకరించి..

అర్ధం చేసుకుని ఆచరించి చెప్పిన అఖండ సత్య సూత్రాలే నేటి మన ఆచారాలు,

బుద్ధుడు,వర్ధమాన మహా వీరుడు ఖండించిన విషయాలు 

👉మొదటి ది జంతుబలులు ఖండించడం,

👉రెండోది ఖర్మకాండాలను, పిండ ప్రధానం,

 👉మూడోది గంగాస్నానం వల్ల పాపాలు(సంస్కారములు) పోవని.

 ➡️భారతీయ సాంప్రదాయం లో మన ఆచారాలలో రెండు ప్రధాన మార్గాలు 

1.దక్షిణాచారం(యోగాచారం సదాచారం,వైధికాచారం,దైవాచారం)

2.వామాచారం(రాక్షసాచారం, నిషేదితాచారం,

పంచ'మ'కార ఆచారం,క్షుధ్రాచారం) 

పై రెండు ఆచారాలలో వామాచారంలో మాత్రమే ఈ భలికి సంబంధించిన సమాచారం,వీటి ఆచారాలు వేద శాస్త్రాలకు భిన్నంగా వుంటు లక్ష్యం మాత్రం ఒక్కటే వుండేది,ఈ సాధనలో పతనానికి,మార్గబ్రష్టులవడాని,ప్రాణాలకు ముప్పు రావడానికి ఆస్కారం ఎక్కువ.వామాచారం మొట్ట మొదటిసారి ఆచరించింది రాక్షసులు,వారు నరభలులు,జీవ జాతుల భలులు భలిదేవతకి ఇచ్చి 

1.మాంసాహారాన్ని,

2.మధ్యపానాన్ని, 3.మైధునం(sex),

4.ముద్ర, 

5.మంత్రం 

పై వాటిని(పంచ'మ'కారాలు) వీరి సాధన అమవాస్య రోజు రాత్రి ఎందుకంటే మనస్సు పనిచేయదు కాబట్టి సాధన, జాగరణం అధ్బుతమైన ఫలితాలను ఇస్తుంది.కానీ ఈ సాధన చేయడం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడటమే,మనవులకు ఈ సాధనలు నిషేధించారు,వీటిలో మంత్రం,ముద్ర మాత్రమే తీసుకుని

శాఖాహారం తో సాధన చేయవచ్చును 

👉కృత,త్రేతా,ద్వాపర యుగాలలో పరమాత్మ రాక్షస సంహారం చేశాడు,రాక్షసభల్లులు(dino+asur)రాక్షసులు పూర్తిగా అంతరించి పోయాయి;

కలియుగంలో ఆ రాక్షసులకు "మహిష అసుర

(🐃దున్నపోతు🦬)"

అనే జన్మలు ఇచ్చి వాటిని భలి పశువుగా మానవులకు యోగుల ద్వారా కలియుగంలో భలిసాంప్రదాయ రూపంలో ఇచ్చారు,ఇక్కడ కర్మసిద్ధాంతం కూడా పనిచేస్తుంది. ఒక్కప్పుడు ఎవరైతే బలిచ్చారో వారే మరలా బలిపశువుగా మారి వారి వారి కర్మలను తీర్చుకుంటున్నారు,

➡️పార్వతీ దేవి భూలోకంలో గోమాతగా,వేపచెట్టుగా,తులసి ,గోరింట,నిమ్మ వృక్షం గా అవతరించింది.

ఈ అవతారాలు దుష్టశిక్షణ,చిత్తశుద్దికోసమే.ఇక భలి ఖచ్చితంగా ""⚡వేపచెట్టుకు""⚡మాత్రమే

ఇవ్వాలి,వేప చేదు రాక్షసుల గుణాలను లయం చేయగలదు ,భలిపశువుకు🦬🐃 నొప్పి తెలియకుండా కనురెప్ప పాటులో తల వేరుకావాలి. తల భలిదేవతకి వదిలేసి తలలోనే అహంకారం,కర్మలు, 

సంస్కారములు వుంటాయి కావున,

 మిగిలిన శరీరం శూద్రులు/అంటరానివారు(చెమట వచ్చే విధంగా పనిచేసే వారు కర్మేంద్రియాలను ఎక్కువగా వాడేవారు)దానంగా ఇచ్చేయాలి,ఇక్కడ భలి వలన హింసకు తావు లేదు.బలి పశువుకూడా మంచే జరుగుతుంది,

కానీ నాడు జంతుభలులు రాక్షస సంహారం కోసం మాత్రమే,మాంసాహారం కోసమో భలిదేవతకి ఆహారం కోసమో కాదు,కానీ నేటి జంతు భలులు కేవలం మాంసాహారం కోసం మాత్రమే అదికూడా హింసే,

 నేటి మాంసాహారంలో హలాల్ కూడా అంతా హింసే కదా,హింసించి కృూరంగా చంపుతున్నారు.అప్పుడు భలి అమావాస్య రోజు మాత్రమే ఇస్తే,ఇప్పుడు నిత్యం హింసనే,

నాడు శూద్రులు మాత్రమే మాంసాహారులు,

నేడు ప్రతి నిత్యం 800కోట్ల జనాభాలో 99%మాంసాహారులే(మాంసాహారులే అంటరానివారు)

 జంతు,పక్షి,హింసాహార విహారాలు,మానవులే రాక్షసులైవున్నారు మానవత్వం ఎక్కడుంది,అధర్మం అనగ హింసాత్మక ప్రకృతి విరుద్ధమైన జీవనవిధానం లో 

మనిషి రోగాలు,కష్టనష్టాలు,

కరోనావిజృంభన,ప్రకృతి వైపరీత్యాలు,ప్రళయాలు

ఎందుకుండవు,వినాశకాలేవిపరీతబుద్ది.నేను జంతు బలిని సమర్థిస్తున్నాను కాని పక్షుల భలులు కాదు

అంటే హింసాత్మక ఆహరాన్ని, మద్యపానాన్ని ప్రోస్తహించట్లేదు,కనీసం వాటికి హింస వుండదని(something better than nothing),గుడ్డి కన్నా మెల్లమేలు;

ఎర్రచీమ మాంసాహారి,నల్లచీమ శాఖాహారి మన శరీరంపై ఈ రెండుచీమలుప్రాకితే ఎర్రచీమను చంపేస్తాం.ఎందుకంటే అది హింసాజీవి,

జంతు భలులను ఖండించిన ప్రముఖులలో గౌతమ సిద్ధార్ధుడు(బుద్ధుడు) అగ్రగణ్యుడు,ఈయన చేసిన గణకార్యాలలో ఆనాపానసతి,విపస్సన,

పూర్తి శాఖాహారం

(బ్రాహ్మణజీవితం),

పంచశీలాలు;

అంతవరకూ బాగానేవుంది కాని మన భారతదేశ ఆచారాలు మూఢనమ్మకాలుగా చిత్రించి ఖండించడం బాగా ఆలోచించాల్సిన విషయం,ఖండిస్తే ఖండింపబడటం 

ప్రకృతి నియమం,అందుకే

సాక్షాత్తు ఆధి శంకరాచార్యులు బౌద్ధంను,జైన మతమును పూర్తిగా ఖండించాడు,

సమాజానికి మూఢనమ్మకాలు తీవ్రప్రమాదంకాదు 

కాని మూఢంగా ఖండించినవాడు సమాజానికి అత్యంత ప్రమాదకరం,

ఆ సమయంలో జంతుబలులు తగ్గడం వలన రాక్షసులు మానవరాజులుగా అవతరించి నేటి దుర్మార్గానికి పునాదులు వేశారు,

ఆ సమయంలో బుద్ధుడు

జంతువుభలులు ఖండించకుంటే,

నేడీ దుస్థితి లేకుండా వుండేది,

నిజానికి ఇప్పుడు(హింసాత్మకాహారం)మాంసాహారాన్ని పూర్తిగా నిషేధించాల్చిన సమయం వచ్చింది,

👉సృష్టి సదా ఒకే విధంగా వుంది కానీ 

ఒక్కొక్కరికి ఒక్కోలాగ వున్నట్లు బ్రమ కలిగిస్తుంది,

అంతమాత్రాన

సృష్టిలో లోపం ఉందనుకుంటే ఖచ్చితంగా అది నీ పొరపాటే అవుతుంది,సాధన లో మనస్సు మాయలో పడుతుంది,బుద్ధి బ్రమకులోనవుతుంది,యదార్థానికి బదులుగా పెడార్తాలు,అపార్థాలు చోటుచేసుకునేఅవకాశం వుంది కావున

అలాంటి సందర్భంలో పూర్వాపరాలు పరిశీలించి వేదాలను ప్రమాణంగా తీసుకుని అనుగుణంగా వుంటే సరియైనది,విరుద్ధంగా వుంటే ఆ గురువు సాధన లో ఇంకా విద్యార్థి దశలోనే వున్నట్లు,ఆఖరికి కరోనా కూడా అందరినీ సమానంగా కలుపుకొనివెళ్ళింది,

దేవుడు/గురువు మాత్రము నా భక్తులు,నా శిష్యులు,నా సాధన అన్నాడంటే నిజమైన దేవుడు/గురువు ఎలా అవుతాడు,

➡️వేదాలు సృష్టి జరగకముందే వున్నాయి వీటిని

సృతులు(పరబ్రహ్మ నుండి వినిపించినవి,వెలువడినవి),ఋషులు,మునులు,యోగులు,బుద్ధులు వారి సాధన అనుభవాలను 

 స్మృతులు అంటారు,

➡️“అహం బ్రహ్మాస్మి” 🟰ఋగ్వేదము

➡️"తత్వమసి"🟰సామవేదము

➡️"అయమాత్మా బ్రహ్మ " 🟰యజుర్వేదము

➡️" ప్రజ్ఞానం బ్రహ్మ"🟰

         అధర్వణవేదము

ఈ మహా వాక్యములు నాలుగు వేదముల,ఉపనిషత్తుల

సారాంశం

👉ఈ అనంతమైన విశ్వంలో అనంతమైన సాధన మార్గాలు ఋషులు,మునులు మనకు అందించారు,ఒక మార్గంలో ప్రయానించేవారు ఇంకొక మార్గంలో ప్రయాణించే వారిని గౌరవించాలి,కలుపుకొని పోవాలి లేదా పరామర్శించాలి కాని విమర్శించద్దు,

ఖండించవద్దు అవి ప్రకృతి విరుద్ధమైన వ్యతిరేక పదాలు,మనలోనే వ్యతిరేకత వుంటే ప్రపంచశాంతికి ఎలా ఉపయోగపడుతుంది అని ఆత్మ విమర్శ చేసుకోవాలి 

Don't judge the book by its cover

👍

👉పిండం పెట్టడం అనేది ప్రాచీనశాస్త్రము(advanced

science)

మనిషి చనిపోయిన వారి శరీరం 27 నుండి 100 గ్రాములు వరకు తగ్గుతుంది,అంటే అర్ధం పొయిన వారు శూక్ష్మశరీరం తోవున్నారనే కదా అర్థం,దేవలోకం,భువర్లోకం

మోక్షం పొందనివారంతా పిండప్రదానాలపై ఆదారపడతారు,

వారికి ప్రతిసంవత్సరం ఒక ముద్ద అన్నం వారి శరీరానికి సంవత్సరం కాలం పోషంపబడుతుంది,

దీనికి ఆధారాలు గరుడ పురాణం,

💥మోక్షం పొందినవారికి, బ్రహ్మలోకానికి కారణ శరీరంతో చనిపోయిన వారికి పిండం అవసరం లేదు వారు మరలా కారణజన్మలుగా అవతరిస్తారు,

మీ తదనంతరం మీ వారసులు పిండం పెడతారో లేదో ఈ జన్మలోనే మోక్షం పొందితే పిండం ప్రదానాలమీద ఆధారపడవలసిన అవసరం లేదు

👉ఇక గంగానది పవిత్రత,శక్తిని గురించిన విషయం నేను చెప్పను మీరే ప్రత్యక్షంగా గంగోత్రి కి వెళ్ళి తెలుసుకోండి,పురుషులలో పుణ్యపురుషులు వేరు అలాగే నదులలో గంగానది ప్రత్యేకం చూడటానికి ఒకేవిధంగా వుండవచ్చును,

ఆ నదిలో బ్యాక్టీరియా ఉన్నట్లు

నేటికీ శాస్త్రవేత్తలు నిరూపించలేకపోయారు,

భగవద్గీత లో ప్రపంచంలోని నదులలో గంగానదిని నేను అన్నాడు

💥మీఆచారం,మీమతం,

మీసాధన బాగుంది అనిపిస్తే గోరంతను

కొండంతగా చెప్పుకోండి,మాది గొప్ప సాధన/మతం అన్నా పర్వాలేదు,మీ సాధన/మతం "కన్నా"మాదే గొప్ప అనడం,

 విమర్శలు,ఖండించడం వలనే మతకలహములు,అభిప్రాయబేధములు,వాదోపవాదాలు,

మాదేవుడు/మాగురువు గొప్పోడు అనడంలో తప్పు లేదు కానీ మీదేవుడు/మీగురువు కన్నా మాదేవుడు/మాగురువు గొప్ప అనడం ఎంతవరకు సరియైనది,

దేవుడు&గురువు అంటేనే గొప్ప వీరు అందరికీ చెందిన అందరివాళ్లు,పంచభూతాలు మాదిరిగానే;

*"నేను&నాది"*

అనే అజ్ఞానతత్వము పోవాలి,*మనం&మనది*అనే మన అనే మానవత్వం రావాలి,మన భూమాత(mother earth),

మన వసుదైక కుటుంబం(universal family)అనే అర్థం మారిపోయింది,మత,దేశ కుటుంబాలు వచ్చాయి🤦‍♂️;

➡️ప్రపంచదేశభక్తి రావాలి,మనం మనుషులము మనకు నిజాలు కావాలి,సత్యం గ్రహించి సత్యం లో జీవిద్దాం; 

👉ఈ భూప్రపంచం అంతటా మనభవిష్యత్ అంతా మన ఆచారాలతో ఓలలాడబోతోంది,ఎందుకంటే ప్రస్తుత సమస్యలకు పరిష్కార మార్గం మన భారతీయ ప్రాచీన శాస్త్రములు,ఆచారాలు,సంప్రదాయాలు దారి చూపిస్తాయి

💥ఏ ఆచారానైనా మతాన్నైనా,సిద్దాంతాన్నైనా

గుడ్డిగా నమ్మకండి గుడ్డిగా ఖండించకండి,తెలియకపోతే

తెలియదు అనాలి కానీ గుడ్డిగా ఖండించవద్దు,అజ్ఞానాన్ని సమాజంలో రూపుమాపాలి,బౌద్ధధర్మం,మతము పేరుతో 

దేవతల నుండి వచ్చిన సదాచారాలను ఖండించవద్దు,

భారతీయ ఆచారాలు ఎల‍ా తప్పో నిరూపించు ప్రకృతి కూడా సత్యానికి సహకరిస్తుంది,

👉నా దృష్టిలో మతములు పగటి వేషాల లాంటివి,ప్రపంచంశాంతికి/

ప్రపంచానికి మతం ఏవిధమైన ఉపయోగం లేదు,ప్రస్తుతానికి మానవులకు మతం అవసరం లేదని చెప్పాడమే నా అభిమతం

➡️ప్రపంచం లోని అన్ని దుఃఖములకు

బుద్ధుడు చెప్పినట్లు 

కోరికలు కాదు,మనస్సు కాదు 

 అజ్ఞానం,అవిధ్య&అధర్మం మాత్రమే మూలకారణం అనగా

అజ్ఞానమే దుఃఖహేతువు,

పరమాత్మ లేదా యోగులు సదా సంపూర్ణమైన జ్ఞానాన్ని కలిగివుంటారు,యోగులు సర్వం తెలిసినవారు,సామాన్యులు కార్యం చూస్తే యోగులు 

కార్యకారణ సంబంధం,పూర్వాపరాలు పరిశీలించి నిర్ధారిస్తారు,

అజ్ఞానమే దుఃఖహేతువు.

➡️లోకులు లోకానికి సంబంధించిన జ్ఞానం కల్గి వుంటే.... యోగి లోకానికి సంబంధించిన జ్ఞానం తో పాటు లోకాతీత జ్ఞానం కూడా కల్గివుంటాడు.

అరుణాచలశివ 🌹

*💥సత్య మేవ జయతే💥*

***గురు బ్రహ్మ 

     గురు విష్ణు

     గురు దెేవోమహేశ్వర 

     గురు సాక్షాత్త్ పరబ్రహ్మ***


🙏సమస్త లోకా,సర్వేజనా

సుఖినోభవంతు🙏

కామెంట్‌లు లేవు: