శ్రీమద్భగవద్గీత: నాల్గవ అధ్యాయం
జ్ఞానయోగం: శ్రీ భగవానువాచ
శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప
సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే(33)
తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః (34)
అర్జునా... ద్రవ్యం వల్ల సాధించబడే యజ్ఞం కంటే జ్ఞానయజ్ఞం శ్రేష్ఠం. సమస్తకర్మలూ జ్ఞనంలోనే పరిసమాప్తం కావడం దీనికి కారణం. తత్వవేత్తలైన జ్ఞానులు అలాంటి జ్ఞానం నీకు ఉపదేశిస్తారు. వారి వద్దకు వెళ్ళినప్పుడు వినయవిధేయతలతో నమస్కరించి, సమయం సందర్భం చూసి ప్రశ్నించి, సేవలు చేసి తెలుసుకో.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి