29, జులై 2025, మంగళవారం

పరమాచార్య వైభవమ్…

 ప్రతిరోజూ…

శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…

114a;307e2.    నడిచే దేవుడు…

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌼P0282.పరమాచార్య పావన గాధలు…


*పరమాచార్య స్వామి*– 

                 *ఉప్పు వ్యాపారి*

                    ➖➖➖✍️

```

అనుకోకుండా నాకు ఒక పెద్ద దుఃఖం, భరింపరాని శోకం కలిగింది. నాలుగు నెలల దాకా మహాస్వామి వారిని దర్శించుకోవడానికి కూడా వెళ్ళలేదు. మహాస్వామి వారు నాకోసం కబురు పంపారు. ఇద్దరు లేదా ముగ్గురు పెద్ద అధికారులు వచ్చి నన్ను వారి వద్దకు తీసుకుని వెళ్ళారు. 


అప్పుడు రాత్రి పది గంటలు.... 

కటిక చీకటి.... కేవలం ఒక మట్టి ప్రమిద మాత్రమే వెలుగుతోంది. 


“...నిపుణౌ”, మహాస్వామి వారు మెల్లిగా చెప్పారు, “చెప్పు”. 


“తవ హి చరణావేవ నిపుణౌ... సౌందర్యలహరి లోని నాలుగవ శ్లోకం

త్వదన్యః పాణిభ్యాం...”


పరమాచార్య స్వామి వారు చిన్నగా అన్నారు, “అందరికీ ఆ అమ్మే ఆశ్రయం. ఎవరెవరికి ఏమి ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఆమెకి తెలుసు.”


అంతా నిశ్శబ్ధం.... “సాంబమూర్తి నీకు సంత అంటే ఏంటో తెలుసా?”


“తెలుసు పెరియవ. చాలామంది వర్తకులు సరుకులు తెచ్చి అమ్ముతూ ఉంటారు. వారంలో ఒక రోజు ప్రతి గ్రామంలో సంత జరుగుతుంది. వారు ఈరోజు ఇక్కడ రేపు అక్కడ అని ప్రయాణిస్తూంటారు.”


“నీవు ఉప్పు వ్యాపారి గురించి ఎప్పుడైనా విన్నావా?”


“అవును. వారు సంతలో ఉప్పు అమ్ముకుని జీవిస్తూ ఉంటారు. వారికి అదే జీవనాధారం.”


“అవును. అటువంటి ఒక ఉప్పు వ్యాపారి కామాక్షి అమ్మకి పరమ భక్తుడు. ఒకసారి అతను ఒక ఊరిలో సంత ముగించుకుని మరొక ఊరికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక అడవి గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమంది దొంగలు ఇతన్ని చూసారు. గాడిద పైన ఉప్పు మూటలు తీసుకువెళ్తున్న అతన్ని చూసి “రేయ్ రేపు సంతలో ఇతను ఈ ఉప్పునంతా అమ్మి డబ్బులతో మళ్ళా ఇదే మార్గంలో వెళ్తాడు. అప్పుడు మనం ఇతని ధనాన్ని దొంగిలించాలి.” వారు ఒక పథకం వేసారు. 


“ఇంకా, వాళ్ళు పేల్చే మందుగుండు సామాగ్రి గురించి నీకు తెలుసా?”


“దేవాలయాలలో ఉత్సవాల సమయంలో పేలుడు పదార్థాలతో మందుగుండు సామాగ్రి తయారుచేస్తారు. గొట్టాలలో గట్టిగా కుక్కి ఒక వత్తి పెడతారు. ఆ వత్తి చివరకు అగ్ని తగిలితే అది చిన్నగా వెళ్ళి మందుగుండును తాకి పెద్దగా శబ్దము చేస్తూ పేలుతుంది.”


“అవును. ఆ దొంగల పథకము కూడా అదే. ఒక మందుగుండు పేలిస్తే 

ఆ గాడిద కంగారులో అటు ఇటు పరిగెడుతుంది. ఆ ఉప్పు వ్యాపారి భయతో అరుస్తూ గగ్గోలు పెడతాడు. అప్పుడు అతని దట్టీ నుండి డబ్బు తస్కరించవచ్చు.”


“ఆ రోజు సంతలో ఉప్పు వ్యాపారి తన దగ్గర ఉన్న ఉప్పును అమ్మడానికి కుప్పలుగా పోసాడు. కాని ఆరోజు బాగా వర్షం పడి ఉప్పు మొత్తం కరిగిపోయింది. అతనికి ఆరోజు వ్యాపారం లో నష్టము, మనస్సుకు కష్టము కలిగింది. బుద్దికి తోచినట్టుగా మనస్సుకు వచ్చినట్టుగా కామాక్షిని తిట్టడం మొదలుపెట్టాడు. అతని కోపం ఏంటంటే డబ్బులేకుండా ఇంటికి వెళ్ళాలి అని. ఇంటికి వెనుతిరిగి నడక మొదలుపెట్టాడు. అడవి మార్గంలోకి ప్రవేశించగానే దొంగలు అతన్ని చూసి మందుగుండు పేల్చడానికి సిద్ధపడ్డారు. వత్తి గుండా మంట లోపలికి వెళ్ళి మందుగుండు సామాగ్రిని చేరింది కాని పేలలేదు. వారు దానికి కారణం వెతకగా ఆ మందుగుండు బాగా తడిసిపోయింది పొద్దున్న పడిన వర్షానికి. వాళ్ళు ఉప్పు వ్యాపారితో ఇలా అన్నారు. “దేవుడు నిన్ను కాపాడాడు. నీకోసమే ఈరోజు వర్షం పడినట్టుంది. పో ఇంటికి పోయి దేవున్ని ప్రార్థించు”


ఆ ఉప్పు వ్యాపారి నిశ్చేష్టుడయ్యాడు. “అమ్మ నాకు ద్రోహం చేసింది అనుకున్నాను. కాని అది తప్పు. ఆమె నన్ను కాపాడింది. అమ్మా కామాక్షి నన్ను క్షమించు. నాకు ఎప్పుడు ఎక్కడ ఏమి ఇవ్వాలో నీకు బాగా తెలుసు. నా అజ్ఞానాన్ని మన్నించు తల్లీ. వర్షం రాకపోయి ఉంటే నేను ఉప్పు మొత్తం అమ్మి డబ్బుతో వస్తుండేవాడిని. డబ్బు తీసుకోవడంతో పాటు ఈ దొంగలు నన్ను కొట్టేవారు. నన్ను కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు.”


కావున మనకి ఏమి లభించినా అది అమ్మ అనుగ్రహమే. మిగిలినది దేనికోసమూ ఆశించకుండా పరులకు మంచి చెయ్యడమే. 


మహాస్వామి వారు చిన్న గొంతుకతో, తీరికగా చెప్పిన ఈ దీర్ఘ ఉపన్యాసం ముగిసే సరికి రాత్రి 2:30 అయ్యింది.


అప్పుడు నేను “నా తల పైన ఉన్న వెయ్యి టన్నుల బరువు తీసేసినట్టు అయ్యింది” అని అన్నాను. 


పరమాచార్య స్వామి వారు సంతతో మొదలుపెట్టి కామాక్షి అమ్మతో ముగించారు. అది నా మనస్థితి కోసం చెప్పబడినా ఇది అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే అందరూ ఇటువంటి స్థితిలో ఉన్నవారమే కదా! 


తరువాత మహాస్వామి వారు “క్రమం తప్పకుండా ప్రతిరోజూ రామాయణం చదువు. నీ మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది.” అని అన్నారు.


ఈనాటికీ నాకు రామాయణ పారాయణ - మనస్సుకు ప్రశాంతత ఒకేసారి వస్తుంది. ✍️```

*--- బ్రహ్మశ్రీ రామకృష్ణ దీక్షితర్,* శ్రీమఠం విద్వాన్. మహాపెరియావళ్ దరిశన అనుభవంగళ్-1

*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।*

*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥*

```

#KanchiParamacharyaVaibhavam # “కంచిపరమాచార్యవైభవం”🙏

.     సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

            🌷🙏🌷


🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...  9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.

శ్రీమద్భాగవత కథలు*```

 🔯🌹🌷🪔🛕🪔🌷🌹🔯

*🍁మంగళవారం 29 జూలై 2025🍁*

                       1️⃣5️⃣

                   *ప్రతిరోజూ*

*మహాకవి బమ్మెర పోతనామాత్య*


          *శ్రీమద్భాగవత కథలు*```


(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా)```

``

*వేదాలు వేయి సార్లు చదివినా లభ్యం కాని ముక్తి, భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది..!*``



*పరీక్షిత్తుకు ముక్తి మార్గాన్ని*                  

    *తెలియచేసిన శుకుడు*               

```

ప్రాయోపవేశం చేసి, శ్రీహరి కథలను వినాలనీ, తనకు హరిమీద భక్తి కలగాలనీ, తద్వారా ముక్తి పొందాలనీ ఆసక్తితో ఉన్న పరీక్షిత్తు దగ్గరకు వచ్చిన అవధూతమూర్తి, వేదవ్యాస మహర్షి కొడుకు, శుక మహర్షిని,``` 'కాలం చెల్లిపోతున్నవారు భగత్పాప్తిని పొందాలంటే ఉపాయం ఏమిటి? వారి కర్తవ్యాకర్తవ్యాలు ఏమిటి'``` అని ప్రశ్నించిన పరీక్షిత్తుకు సమాధానం చెప్తాడు శుకుడు వివరంగా...

``` 

*'ముక్తిని కోరుకునేవాడు విష్ణువును గురించే ఆలకించాలి. ఆరాధించాలి. స్తుతించాలి. తలచాలి. సర్వం ఈశ్వరమయంగా భావించినప్పుడే మోక్షం కలుగుతుంది. సాంఖ్య యోగం వల్ల స్వధర్మాచరణ ద్వారా జీవులందరూ తమ ఆయువు తీరేదాకా విష్ణువును ధ్యానించగలుగుతారు. నా తండ్రి వ్యాస భగవానుడు ద్వాపరయుగంలో భాగవతాన్ని అధ్యయనం చేయించాడు. భాగవతం మోక్షమార్గాన్ని ప్రతిపాదించే శాస్త్రం. భాగవతంలోని భగవంతుడి అవతార లీలలు నా మనస్సును ఆకట్టుకున్నాయి. ఆ ఆనందమే నన్ను చదివించేలా చేసింది. నీకు ఆ భాగవత తత్త్వాన్ని తెలియచేస్తాను శ్రద్ధతో విను. భాగవతాన్ని వినడం వల్ల నీకు భగవంతుడి మీద ప్రేమ కలిగి, విష్ణువును సేవించాలనే బుద్ధి పుడుతుంది. రెప్పపాటు కాలం హరినామ స్మరణ చేసినా చాలు, ముక్తి కలుగుతుంది'*``` అని ఖట్వాంగ మహారాజు వృత్తాంతాన్ని చెప్పాడు శుక మహర్షి పరీక్షిత్తుకు.

```

*“పూర్వం ఖట్వాంగుడు అనే రాజు ఏడు దీవులకు ఏలిక. ఒకనాడు రాక్షసుల చేతిలో ఓడిపోయిన ఇంద్రుడు, సహాయం చేయమని ఖట్వాంగుడి దగ్గరకు వచ్చి అడిగాడు. వెంటనే ఖట్వాంగుడు భూలోకం నుండి స్వర్గలోకం వెళ్ళి రాక్షసులను అంతం చేశాడు. దేవతలు ఆనందించి, ఆయన్ను వరం కోరుకొమ్మని అడగ్గా, తనెంత కాలం బతుకుతానో చెప్పమని కోరాడు. ముహూర్త కాలం అంటే, రెండు గడియలు మాత్రమే అని చెప్పారు దేవతలు. రాజు క్షణాల మీద భూలోకానికి తిరిగి వచ్చాడు. అన్నిటినీ తక్షణమే త్యజించి విరాగి అయ్యాడు. వెంటనే గోవింద నామాన్ని ధ్యానించాడు. స్థిర చిత్తంతో రెండు గడియల్లోనే ముక్తి పొందాడు.”*


ఈ కథ చెప్పి, పరీక్షిత్తుకు ఏడు రోజులు దాటిన తరువాత కానీ ఆయువు తీరదు కాబట్టి, అంతవరకు విష్ణు ధ్యానం చేస్తే, మోక్షపథం పొందే వీలుంది అని అన్నాడు శుకుడు. భగవంతుడిని ధ్యానం చేసే విధానం వివరంగా చెప్పాడు శుకుడు…


*ఓంకారాన్ని స్మరిస్తూ యోగనిష్ఠతో ప్రాణవాయువును స్వాధీనంలోకి తెచ్చుకోవడం, మనస్సు అనే పగ్గాన్ని చేజారనీయకుండా గట్టిగా పట్టి ఉంచడం. భక్తే లక్షణంగా కల యోగాన్ని ఆశ్రయించడం, తద్వారా విష్ణు పథాన్ని చేరుకోవడం గురించి చెప్పాడు. ధారణ అంటే ఏమిటి, ఎలాంటి సాధనతో అది నిలబడుతుంది, దాని స్వరూపం ఎలా ఉంటుంది. అది జీవుల మానసిక మాలిన్యాన్ని ఎలా రూపుమాపగలుగుతుంది అనే విషయాలను పరీక్షిత్తు ప్రశ్నలకు జవాబుగా వివరించాడు శుకుడు.*


'పండితుడైన వాడు ప్రాణవాయువులను బిగబట్టి శ్వాసను జయించాలి. సర్వమయుడైన విరాట్పురుషుడి విగ్రహంతో మోక్షగామి (ముముక్షువు) తన మనస్సును సంధానించాలి. బుద్ధిమంతుడు వాసుదేవుడిని సేవించాలి. విష్ణువును స్మరించని వాడు మత్తులో ఉన్నవాడితో సమానం. పరమేశ్వరుడిని మనస్సులో ధారణతో నిలుపుకోవాలి. ఆయన ప్రతి అవయవాన్నీ ఒక్కటొక్కటిగా అనుక్షణమూ ధ్యానించాలి. పరిపూర్ణమైన నిశ్చలబుద్ధి కుదిరేదాకా ఆ భగవత్ చింతనాసక్తి తోనే ఉండాలి. శరీరాన్ని విడిచి పెట్టే సమయంలో ఇంద్రియ సాంగత్యాన్ని వదలిపెట్టాలి. ఇలా బ్రహ్మలోకానికి పోవాలనుకున్న యోగి ఆకాశమార్గంలో పోతుంటాడు. పోయి, పోయి విష్ణువు స్థానమైన శింశుమార చక్రం చేరుకుంటాడు. విష్ణు లోకానికి వెళ్లినవాళ్లు విష్ణు పదాన్ని పొంది ప్రకాశిస్తుంటారు'.```


ఇలా చెప్పిన శుకుడు పరీక్షిత్తుకు భక్తి మార్గమే ముఖ్యమని అంటాడు. 'జగన్నాథుడైన శ్రీహరి సర్వ ప్రాణుల్లో ఆత్మరూపంలో ఉంటాడు. నిత్యం నమస్కరించతగినవాడు, ఎల్లకాలం భక్తుల పట్ల వాత్సల్యం కలవాడు, ఆత్మరూపి, ఇలాంటి శ్రీమహావిష్ణువు కథాసుధను సంతృప్తిగా ఆస్వాదించే భక్తులు పుణ్యాత్ములు. 

ఆ లక్ష్మీనాయకుడి కథలు అమృతోపమానాలు. అవి విన్నవారికి వీనుల విందుగా ఉంటుంది. విష్ణు గాథలు, కీర్తనలు వింటూ కాలాన్ని వెళ్ళబుచ్చేవాడి ఆయువు గట్టిది. హరినామ సంకీర్తనలు వినని చెవులు కొండలలో గుహల లాంటివి' అని చెప్పాడు శుక మహర్షి.


చనిపోవడం అనే భయం ఏమాత్రం లేకుండా, ధర్మార్థ కామాలను మూడింటినీ మానుకుని, ఆ పురుషోత్తముడి మీదనే మనస్సును నిలుపుకుని, అంత్యకాలం గడపాలనే అభిప్రాయానికి వచ్చాడు. పరీక్షిత్తు.


                *(సశేషం)*

*🙏కృష్ణం వందే జగత్ గురుమ్!🙏*


        *రచన:శ్రీ వనం* 

 *జ్వాలా నరసింహారావు* *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷``


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

మంగళవారం🍁* *🌹29 జూలై 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

     *🍁మంగళవారం🍁*

   *🌹29 జూలై 2025🌹*  

     *దృగ్గణిత పంచాంగం*  

                

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్షఋతౌః* 

*శ్రావణమాసం - శుక్లపక్షం*


*తిథి  : పంచమి* రా 12.46 వరకు ఉపరి *షష్ఠి*

*వారం    : మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం   : ఉత్తర* రా 07.27 వరకు ఉపరి *హస్త*

*యోగం : శివ* రా 03.05 వరకు ఉపరి *సిద్ధ*

*కరణం  : బవ* మ 12.00 *బాలువ* రా 12.46 ఉపరి *కౌలువ*


*సాధారణ శుభ సమయాలు:*

*మ 12.00 - 01.00 సా 04.00 - 06.00*           

అమృత కాలం  : *ప 11.42 - 01.25*

అభిజిత్ కాలం  : *ప 11.48 - 12.40*

*వర్జ్యం      : రా 04.42 - 06.28 తె*

*దుర్ముహూర్తం  : ఉ 08.22 - 09.13 రా 11.07 - 11.52*

*రాహు కాలం   : మ 03.27 - 05.04*

గుళికకాళం       : *మ 12.14 - 01.50*

యమగండం     : *ఉ 09.00 - 10.37*

సూర్యరాశి : *కర్కాటకం*  

చంద్రరాశి : *కన్య*

సూర్యోదయం :*ఉ 05.55*

సూర్యాస్తమయం :*సా 06.51*

*ప్రయాణశూల   : ఉత్తరం దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.47 - 08.22*

సంగవ కాలం         :     *08.22 - 10.56*

మధ్యాహ్న కాలం    :     *10.56 - 01.31*

అపరాహ్న కాలం    : *మ 01.31 - 04.06*


*ఆబ్ధికం తిధి         : శ్రావణ శుద్ధ పంచమి*

సాయంకాలం        :*సా 04.06 - 06.40*

ప్రదోష కాలం         :  *సా 06.40 - 08.54*

రాత్రి కాలం           :*రా 08.54 - 11.52*

నిశీధి కాలం          :*రా 11.52 - 12.36*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.19 - 05.03*

****************************

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🚩శ్రీ ఆంజనేయ స్తోత్రం🚩*


*మహాబలాయ వీరాయ* 

*చిరంజీవిన ఉద్ధృతే*

*హారిణే వజ్రదేహాయ* 

*చోల్లంఘిత మహాబ్దయే!*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

28, జులై 2025, సోమవారం

సోమవారం🕉️* *🌹28 జూలై 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

     *🕉️సోమవారం🕉️*

 *🌹28 జూలై 2025🌹*        

   *దృగ్గణిత పంచాంగం*  

                

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్షఋతౌః* 

*శ్రావణమాసం - శుక్లపక్షం*


*తిథి  : చవితి* రా 11.24 వరకు ఉపరి *పంచమి*

*వారం    : సోమవారం* (ఇందువాసరే)

*నక్షత్రం   : పుబ్బ* సా 05.35 ఉపరి *ఉత్తర ఫల్గుణి ( ఉత్తర )*

*యోగం : పరిఘ* రా 03.03 వరకు ఉపరి *శివ*

*కరణం  : వణజి* ఉ 10.57 *భద్ర* రా 11.24 ఉపరి *బవ*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 10.00 - 12.30 సా 05.00 - 06.30*           

అమృత కాలం  : *ఉ 10.52 - 12.33*

అభిజిత్ కాలం  : *ప 11.48 - 12.40*

*వర్జ్యం      : రా 01.21 - 03.04*

*దుర్ముహూర్తం  : మ 12.40 - 01.31 & 03.14 - 04.06*

*రాహు కాలం   : ఉ 07.24 - 09.00*

గుళికకాళం       : *మ 01.51 - 03.27*

యమగండం     : *ఉ 10.37 - 12.14*

సూర్యరాశి : *కర్కాటకం*

చంద్రరాశి : *సింహం/కన్య*

సూర్యోదయం :*ఉ 05.54*

సూర్యాస్తమయం :*సా 06.51*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.47 - 08.22*

సంగవ కాలం         :     *08.22 - 10.56*

మధ్యాహ్న కాలం    :     *10.56 - 01.31*

అపరాహ్న కాలం    : *మ 01.31 - 04.06*

*ఆబ్ధికం తిధి         : శ్రావణ శుద్ధ చవితి*

సాయంకాలం        :*సా 04.06 - 06.41*

ప్రదోష కాలం         :  *సా 06.41 - 08.55*

రాత్రి కాలం           :*రా 08.55 - 11.52*

నిశీధి కాలం          :*రా 11.52 - 12.36*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.18 - 05.03*

****************************

         *🌷ప్రతినిత్యం🌷*

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🕉️శివాపరాధ క్షమాపణ స్తోత్రం🔯*


*నానీతా పద్మమాలా సరసి* 

*వికసితా గంధపుష్పైస్త్వదర్థం*

*క్షంతవ్యో మేఽపరాధః శివ*  

*శివ శివ శంభో శ్రీమహాదేవ శంభో*


     *🕉️ఓం నమః శివాయ🕉️*


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

శీర్షిక.... భోజన ప్రియులు

 శీర్షిక.... భోజన ప్రియులు 


తిండికి లేక కండలు కరిగిస్తూ 

ఒకవైపు 

కండలు పెంచుతూ తినడమె

పనిగా, అదేపనిగా బ్రేవో అని తేన్చేదాకా!


*తిండి కలిగితే కండ కలదోయ్*

ఆనాడు అన్నారు గురజాడ 

నేడు తిండితో కండలు కొండలుగా పెంచేస్తూ 

సిక్స్ ప్యాక్ బాడీలు పెంచుతూ 

ఊపిరితిత్తుల శ్వాసకు ఎసరు పెడుతున్నారు 

గుండె జబ్బులతో మజా మజాగా..


తినడం తాగడం తొంగోవడం 

పౌరాణిక చారిత్రక గాథల్లో 

ప్రసిద్ధి పొందారు తిండిబోతులు 

రుచులు మరిగిన వారలు 

బద్ధకంతో మొద్దు నిద్రతో కాలం వెళ్లబుచ్చేస్తారు

వృధాగా, బేఫికర్ గా 

తినడం లోనె ఆనందాన్ని అనుభవిస్తుంటారు 

అప్పనపు పప్పన్నం బ్రతుకులు..


అన్నమో రామచంద్రా! అల్లాడే ఆకలికి 

దొరకవు పట్టెడు మెతుకులు 

విందులు వినోదాలతో దర్జాలు చేస్తూ

పొట్ట పెంచుకుంటున్న ధనికులు అజీర్తి రోగాలకు 

శరీరాన్ని అనారోగ్యం పాల్జేస్తూ..


మితాహారం.. సమతుల ఆహారం 

ఆరోగ్యానికి చిట్కాలు 

హితసూత్రాలు ఇంటికీ--ఒంటికీ

వంటింటికీ..ఇంటావిడవికీ 

నిండా ఆయుష్ఫుతో నూరేళ్ళ పండుగ ప్రాణానికి..


నీతి ః--

*బతకడానికి తినండి.. తినటానికి బ్రతుకు వద్దండి*

ంంంంంంంంంంంంంంంంంం

ఇది నా స్వీయ కవిత 


ంంంంంంంంంంంంంంం

ఎవరి తప్పులు వారికి

 శు భో ద యం 🙏


ఎవరి తప్పులు వారికి తెలియవుగదా?


నరసింహ శతకం - శేషప్ప కవి   

      

పసరంబు ప0జైన పశులకాపరి తప్పు 

ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు 

భార్య గయ్యాళైన ప్రాణనాథుని తప్పు

తనయుండు దుష్టైన తండ్రి తప్పు 

సైన్యంబు చెదరిన సైన్యనాథుని తప్పు 

కూతురు చెడుగైన మాత తప్పు 

అశ్వంబు చెడుగైన నారోహకుని తప్పు 

దంతి దుష్టైన మావంతు తప్పు 

ఇట్టి తప్పు లెఱు౦గక నిచ్చవచ్చి

నటుల మెలగుదు రిప్పుడీ యవని జనులు 

భూషణవికాస! శ్రీ ధర్మపురనివాస! 

దుష్టసంహార! నరసింహ! దురితదూర!🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷👌🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కోరికలకోసమే దేవుని పూజించడం

 కోరికలకోసమే దేవుని పూజించడం సరికాదు 


“ఎన్ని సౌకర్యాలు ఉన్నా మాకు అవసరం లేదు. భగవంతుని సాక్షాత్కారం కావాలనేది మన పూర్వీకుల ఆశయం. అలాగే వారు 24 గంటలూ భగవంతుని పాదాలనే ఆశ్రయించేవారు, ఆయననే ధ్యానించేవారు. ఈకాలంలోమనం కూడా ధ్యానం చేస్తాం. దేని మీద?

  *ద్యతం విద్మహర్నిజం*

 24 గంటలు, “డబ్బును ఎలా సంపాదించాలి? ఆ సంపాదించిన దాన్ని ఎలా రెట్టింపు చేయాలి? ” అనే డబ్బు గురించే నిత్యం ధ్యానం చేస్తున్నాము. ఈ కారణాల వల్ల మన పూర్వీకులు పొందిన ప్రయోజనాలను మనం పొందకుండా మనమే మన తృష్ణతో, ఆశతో అడ్డుకుంటున్నాము .

*దత్తత్కర్మ కృతం యదేవ I* *మునిపిష్ఠైర్పలైర్వఞ్చితః ॥*

 మన సాధనాలకూ వారి మార్గాలకూ ఎంత తేడా! కాబట్టి మనం వారి మార్గాన్ని అనుసరించాలి. మనసులోని కోరికల కోసం దేవుడిని పూజించడం సరికాదు. కోరికలను వదిలించుకోవడం ద్వారా మాత్రమే నిజమైన ఆనందం లభిస్తుంది. తలెత్తే కోరికలను పరిష్కరించే ప్రయత్నంలో మనం విజయం సాధించలేము. కోరికలు తరగనివి. అందుకు పశ్చాత్తాపం మాత్రమే మిగిలి ఉన్నది. కోరిక ఎవరికీ ఆనందాన్ని కలిగించదు.అనేది తెలిసిన రోజున మీలో నిజమైన భక్తి జనిస్తుంది.


*-జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*

శ్రావణశ్రీలక్ష్ముల నోములు*

 *శ్రావణశ్రీలక్ష్ముల నోములు*


ఉ॥

శ్రావణలక్ష్మిపాదముల స్వచ్ఛమనమ్మును నిల్పి పూజలన్ 

పావనభక్తి సంచితపుపాపనివృత్తియవంగ వేడుచున్ 

నీవిఁక నాకు దిక్కు మరి నేఁ దలబెట్టను కిల్బిషమ్ములన్ 

కావవె యీయవే తిరముగాగ సుమంగళిభాగ్యమమ్మరో ! -1


కం॥

ఉత్తమగుణాఢ్యుడై వర

సత్తముడై మహితబుద్ధి సన్నుతమతియై 

చిత్తస్థిరత్వయుతుడై 

బత్తికి లోబడెడువాని భర్తగనిమ్మా! -2


కం॥

సుగుణోపేతులు కుదురగు 

నగణితధీశ్రీకుశలురు నమృతమూర్తుల్ 

పొగరెరుగని సంతానము 

తగ నీవిం జెలగు వారిఁ దయతో నిమ్మా! -3


కం॥

అని వేడంగవలయు శ్రా 

వణమాసపునోములందు మహిళామణులున్ 

మన గౌరియె శ్రీలక్ష్మియ 

మన భక్తియ పుష్పమౌను మంత్రము మాటౌన్ -4


కం॥

నోములు నోచెడి మహిళలు 

కామిత వరముల దలచుక కరుణను బ్రోవన్ 

లేమగు లక్ష్మినిఁ బూజల 

ధీమతులై గొల్వవలయుఁ దేజశ్శాలిన్ -5


కం౹

వరముల నిమ్మా కొమ్మా! 

సురవరుడౌ నీశుపత్ని! శోభితగౌరీ! 

యరమరికలు లేనట్టుల 

మురిపెముతో జూడు మనుచుఁ బూజలఁ జేయన్ -6


కం॥

కనికరమునుఁ జూపించును 

ననితర భక్తికి తనియుచు కామితమిచ్చున్ 

ఘనులగు భర్తల పుత్రుల 

పెనుసంతోషముల నిచ్చు వేలుపు తుదకున్ -7


కం॥

ఈ యింటికి నా యింటికి 

సాయంవేళల పడతులు సందడితోడన్ 

పాయక పేరంటములన్ 

వాయనముల నందఁ బోవ వారే లక్ష్ముల్ -8


తే.గీ.

పట్టుపరికిణీలనుగట్టి పైటవైచి 

పసుపు పాదాల మెడనిండ పసిడిఁబెట్టి 

వీథులందునఁ దిరుగాడు పేరటాళ్ళు 

భువిని శ్రీలక్ష్ము లనఁ జెల్లు ముదము గలుగ -9

*~శ్రీశర్మద*

శ్రీ దుర్గా బారి మందిర్

 🕉 మన గుడి : నెం 1185


⚜ నాగాలాండ్ : కోహిమా


⚜ శ్రీ దుర్గా బారి మందిర్ 


 

💠 కోహిమా నాగాలాండ్‌లోని ఒక సాంస్కృతిక నగరం. 

వివిధ నాగ సమాజాల సంస్కృతికి చెందిన ఆనవాళ్లను కోహిమాలో చూడవచ్చు. 

కోహిమా జాతిలో వివిధ తెగలు మరియు ఉప తెగలు ఉన్నాయి, వీరు పురాతన కాలం నుండి ఇక్కడ నివసిస్తున్నారు. కోహిమా ప్రజలు ప్రధానంగా క్రైస్తవ మతాన్ని అనుసరిస్తారు మరియు ఈ ప్రాంతంలో నివసించే ఇతర సమాజాలు హిందూ మతం మరియు ఇస్లాం రెండింటినీ అనుసరిస్తాయి.


💠 నాగ వారసత్వం చాలా గొప్పది మరియు ఇది వివిధ రకాల ఆచారాలు మరియు పండుగలను కలిగి ఉంటుంది, ఇది కోహిమాలో ఇప్పటికీ వారి అసలు సంప్రదాయాలు మరియు ఆచారాలను కాపాడుతుంది. 

నేటికీ, కోహిమా అంతటా చాలా సామాజిక-జాతి సమాజాలు కనిపిస్తాయి, అవి వాటి స్వంత సామాజిక మరియు సాంస్కృతిక గుర్తింపును కలిగి ఉన్నాయి.



💠 కోహిమాలోని దుర్గాబారి మందిరం అనేది నాగాలాండ్‌లో ఆధ్యాత్మికత మరియు సంస్కృతికి ఒక ఉత్కృష్టంగా నిలుస్తున్న ఒక గౌరవనీయమైన హిందూ దేవాలయం. 

ఈ ప్రశాంతమైన ఆలయం దుర్గాదేవికి అంకితం మరియు భక్తులను మరియు పర్యాటకులను ఆకర్షిస్తుంది. 


💠 పచ్చని కొండల నేపథ్యంలో ఉన్న ఈ ఆలయం ధ్యానం మరియు ప్రతిబింబానికి అనువైన ప్రశాంత వాతావరణాన్ని అందిస్తుంది. సందర్శకులు దాని అద్భుతమైన వాస్తుశిల్పంతో మంత్రముగ్ధులవుతారు, ఇది అద్భుతమైన శిల్పాలు మరియు శక్తివంతమైన అలంకరణలను ప్రదర్శిస్తుంది, ఇది ఈ ప్రాంతం గొప్పది కళాత్మక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. 


💠 ఈ ఆలయం కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు; ఇది ఒక సాంస్కృతిక కేంద్రం, ఇక్కడ వివిధ స్థానిక పండుగలను గొప్పగా జరుపుకుంటారు, నాగ ప్రజల శక్తివంతమైన సంప్రదాయాలను సంగ్రహావలోకనం చేస్తుంది. 


💠 దుర్గాబారి మందిరాన్ని సమీపించేటప్పుడు, ప్రకృతి యొక్క ప్రశాంతమైన శబ్దాలు మరియు గాలిలో వెదజల్లుతున్న ధూపం సువాసన మిమ్మల్ని స్వాగతిస్తుంది. 

ఆలయ ప్రాంగణం బాగా నిర్వహించబడుతుంది, సందర్శకులు అన్వేషించడానికి ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. 


💠 పవిత్ర స్థలం పట్ల గౌరవం చూపించడానికి సందర్శించేటప్పుడు నిరాడంబరంగా దుస్తులు ధరించడం మంచిది. 

ఆలయం సాపేక్షంగా నిశ్శబ్దంగా ఉంటుంది, ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయేలా చేస్తుంది. 


💠 కోహిమాలోని పచ్చదనం మరియు విశాల దృశ్యాలు మొత్తం అనుభవాన్ని మరింత పెంచుతాయి కాబట్టి, పరిసరాలను ఆస్వాదించడానికి కొంత సమయం కేటాయించండి. 

స్థానిక సంస్కృతిని లోతుగా అర్థం చేసుకునే వారికి, ఆలయ పూజారులు మరియు స్థానిక భక్తులతో నిమగ్నమవ్వడం ఇక్కడ నిర్వహించే ఆచారాలు మరియు వేడుకలు ప్రాముఖ్యత గురించి అంతర్దృష్టులను అందిస్తుంది. 

సమీప ప్రాంతాలను అన్వేషించడానికి ఈ ఆలయం ఒక సరైన ప్రారంభ స్థానం, ఇది కోహిమాలోని ఏ పర్యాటకుడైనా తప్పక సందర్శించాల్సిన ప్రదేశంగా మారుతుంది. 

 

💠 కోహిమాలో ఉన్న దుర్గా బారి మందిర్ దుర్గాదేవికి అంకితం చేయబడిన ప్రసిద్ధ ఆలయం. ఈ ఆలయంలో కాళి మాత మరియు శివుని విగ్రహాలు కూడా ఉన్నాయి.



💠 కోహిమాలోని హిందూ నివాసితుల ఉమ్మడి కల సాకారం కావడమే దుర్గాబారి కోహిమా.

 కోహిమాలో హిందూ సమాజం యొక్క ప్రార్థనా స్థలం మరియు సామాజిక-సాంస్కృతిక కార్యకలాపాలను నిర్మించడానికి ప్రత్యక్షంగా సంబంధం కలిగి ఉన్న మరియు పాల్గొన్న అనేక మంది ప్రముఖుల అవిశ్రాంత కృషి ఫలితం ఇది.


💠 గణేశ పూజ, దుర్గా పూజ, జగన్నాథ స్నానం, జగన్నాథ రథయాత్ర ఈ ఆలయంలో జరుపుకునే ప్రధాన పండుగల


💠 ఉదయం పూజ మరియు హారతి ఉదయం 07:30 నుండి ప్రారంభమవుతాయి.

ఉదయం 06:00 నుండి రాత్రి 09:00 వరకు



Rachana

©️ Santosh Kumar

18-61-గీతా మకరందము

 18-61-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

    

      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అII ఈశ్వరుడు తనమాయచే సమస్తభూతములను కీలుబొమ్మలను వలె త్రిప్పుచున్నారని తెలుపుచున్నారు – 


ఈశ్వరస్సర్వభూతానాం 

హృద్దేశేఽర్జున! తిష్ఠతి | 

భ్రామయన్సర్వభూతాని యన్త్రారూఢాని మాయయా|| 


తా:- ఓ అర్జునా! జగన్నియామకుడు పరమేశ్వరుడు (అంతర్యామి) మాయచేత సమస్తప్రాణులను యంత్రము నారోహించినవారిని వలె(కీలుబొమ్మలను వలె) త్రిప్పుచు సమస్తప్రాణులయొక్క హృదయమున వెలయుచున్నాడు.


వ్యాఖ్య:- ఈశ్వరు డెచట నున్నారు? ఏమి చేయుచున్నారు? అను ప్రశ్నలకిచట సమాధానము చెప్పబడినది. ఈశ్వరుడు (భగవంతుడు) దూరముగనే యున్నాడని తలంచుట వెఱ్ఱి. వారు జీవులకు, అతిసమీపమున హృదయమందుగూడ (ఆత్మరూపమున) అధివసించుచున్నారు. కనుకనే "సర్వభూతానాం హృద్దేశే” - అని చెప్పబడినది. కావున భగవత్సాన్నిధ్యమును ఎల్లపుడు ననుభవించుచు, పాపాచరణములేక, భక్తియుతులై మెలగవలెను. జీవులుచేయు సమస్తకార్యములను, సంకల్పించు సమస్త సంకల్పములను ఈశ్వరుడు సాక్షిమాత్రుడై సదా వీక్షించుచునేయుండునని ఎవరును మఱవరాదు. ఈశ్వరుడనగా ప్రభువు, శాసకుడు, నియామకుడు. రాజు ప్రజలను శాసించునట్లు వారు సమస్తప్రాణికోట్లను శాసించుదురు. వారివారికి కర్మానుకూలముగ ఫలముల నొసంగుదురు. రాజాజ్ఞను మీరినచో జనులకెట్లు దండనము లభించునో అట్లే ఈశ్వరుని ఆజ్ఞయగు ధర్మము నుల్లంఘించినచో మనుజుడు వారిచే శిక్షితుడై, తన దుష్కర్మఫలితమగు ఫెూరదుఃఖము ననుభవించును. కావున హృదయమున, బాహ్యమున, సర్వత్ర ఈశ్వరసన్నిధిని సదా భావించుచు ధర్మమును, సత్యమును, ఎవరును ఉల్లంఘించరాదు


         భగవంతుడు ఏ ప్రదేశమందుండును? వైకుంఠమందా? కైలాసమందా? పాతాళమందా? ఇతరలోకమందా? వారెల్లెడల వసించుచుందురు. అతిసమీపమునగల హృదయప్రదేశమందును ఉందురు. కావున అట్టి పరమాత్మను సదా భక్తితో గొల్చుచుండవలెను. "సర్వభూతానామ్" అని చెప్పుటవలన ఏ ఒకానొక ప్రాణియందో కాదనియు సమస్త జీవకోట్లయందును భగవానుడు వెలయుచుండుననియు స్పష్టమగుచున్నది. కాబట్టి చీమయందును, దోమయందును, పశువునందును, చండాలునియందును కూడ వారు నివసించుచున్నారు. కాని ఎవని చిత్తము నిర్మలముగా నుండునో ఆతనియందు లెస్సగ భాసించుచు, వ్యక్తమగును.

యన్త్రారూఢాని - ఈశ్వరుడు మాయద్వారా సమస్తజీవులను సంసారరూపయంత్రమున త్రిప్పుచున్నాడు. యంత్రముయొక్క పెద్దచక్రములపై చిక్కుకొనిన చీమగాని పురుగుగాని, ఆ చక్రముతో బాటు తిరుగుచునేయుండును. అట్లే జీవులున్ను (ఈశ్వరునిచే మాయద్వారా త్రిప్పబడుచున్న) ఈ సంసారచక్రమున తగుల్కొని, ఆ చక్రముతో బాటు వివశులై తిరుగుచున్నారు. దానినుండి తప్పించుకొనుట కుపాయము రాబోవు శ్లోకమున తెలుపబడును. ఆ యంత్రమును త్రిప్పుచున్నవానిని (భగవంతుని) ఆశ్రయించుటయే ఆ యుపాయము.

'మాయయా" అని చెప్పుటవలన ఈశ్వరుడు ఈ సంసారచక్రమును త్రిప్పుచున్నప్పటికిని మాయద్వారా ఆ పరిభ్రమణమును గావించుటవలన వాస్తవముగ వారికేమియు కర్తృత్వము లేకయేయున్నది. వారు సాక్షిమాత్రులై వర్తించుచున్నారు.


ప్ర:- ఈశ్వరుడు ఎచట నివసించుచున్నాడు?

ఉ:- సమస్తప్రాణికోట్ల హృదయమందు.

ప్ర:- ఏమిచేయుచున్నాడు?

ఉ: - ఈ సంసారచక్రమున తగుల్కొనియుండు జీవులందఱిని త్రిప్పుచున్నాడు.

ప్ర:- దేనిద్వారా?

ఉ:- మాయాశక్తి చేత.

ప్ర:- ఏ ప్రకారముగ?

ఉ:- యంత్రమందు తగుల్కొనియుండు పురుగులవలె.

【 కనుక వివేకవంతుడు పరమాత్మను భక్తిశ్రద్ధలతో ఆశ్రయించి దుఃఖవిముక్తిని, పరమశాంతిని పొందవలసియున్నాడు】.

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*స్త్రీ పర్వము ప్రథమాశ్వాసము*


*450 వ రోజు*

*ప్రధమాశ్వాసం*


వైశంపాయనుడు జనమేజయునకు చెప్పిన మహాభారతకథను సూతుడు శౌనకాది మహామునులకు చెప్పసాగాడు. మహాభారత కథను వింటున్న జనమేజయుడు వైశంపాయుడిని చూసి " మహాత్మా ! తన కుమారుడు సుయోధనుడు భీముని చేతిలో చనిపోయిన విషయం సంజయుడి ద్వారా తెలుసుకుని ధృతరాష్ట్రుడు ఏమి చేసాడు. హస్థినకు వెళ్ళిన రధికత్రయం ఎవరిని కలుసుకున్నారు. తరువాత ఎక్కడకు వెళ్ళారు. అశ్వత్థామ వ్యాసాశ్రమానికి వెళ్ళిన పిదప కృపాచార్యుడు, కృతవర్మ ఎక్కడకు వెళ్ళారు. మహావిజయమును సాధించిన పిదప కుమారుల బంధువుల మరణాన్ని ధర్మరాజు ఎలా తట్టుకున్నాడు "అని ఆడిగాడు. వైశంపాయనుడు ఇలా చెప్పసాగాడు.


*కుమారుల మరణానికి దుఃఖించిన దృతరాష్ట్రుడు*

తన నూరుగురు కుమారులు యుద్ధములో మరణించారు అని తెలుసుకున్న ధృతరాష్ట్రుడు మొదలు నరికిన వృక్షంలాగా కూలి పోయాడు. భరించరాని దుఃఖంలో మునిగి పోయాడు. అతడి హృదయం కకావికలైంది. దుఃఖభారంతో తనలో తానే కుమిలి పోతున్న సంజయుడు " ధృతరాష్ట్ర మహారాజా ! ఏమిటీ వెర్రి. ఎవరి కొరకు దుఃఖ పడుతున్నావు ? నీశోకానికి అంతు లేదా ! దుఃఖాన్ని వదిలి నేను చెప్పేది విను. కురుక్షేత్ర సంగ్రామంలో 18 అక్షౌహినుల సైన్యం మరణించారు. నీ తాతలు, తాండ్రులు, అన్నలు, తమ్ములు, బంధువులు, మిత్రులు, మిత్ర రాజులు, సామంత రాజులు నీ కోసం మరణించారు కదా ! వారికిదహన సంస్కారాలు చేయాలి కదా ! పద యుద్ధభూమికి వెళదాము " అన్నాడు. కాని ధృతరాష్ట్రుడు కదలలేదు తల బాదుకుంటున్నాడు. " సంజయా ! నా కొడుకులంతా చచ్చారయ్యా ! నా వైభవమంతా నశించిందయ్యా ! అతిదీనంగా బ్రతుకుతున్న నాకు ఈ దేహం ఎందుకు. ఒకరి దయాభిక్ష మీద బ్రతకడానికా ! నాదీ ఒక బ్రతుకేనా ! బ్రతికి నేను సాధించేది ఏముంది?.


*ధృతరాష్ట్రుడి పశ్చాత్తాపము*


సంజయా ! కృష్ణుడు సంధి చేయడానికి వచ్చినప్పుడు నాకు ఎంతో నచ్చచెప్పాడు. భీష్ముడు, ద్రోణుడు నా హితవు కోరి చెప్పారు. పరశురాముడు లాంటి మహా మునులు ఎందరో బుద్ధిమతి చెప్పారు. నేను దుర్బుద్ధితో వారి మాటలు పెడచెవిన పెట్టాను. పాండవులకు రాజ్యభాగం ఇవ్వ నిరాకరించి ఫలితం అనుభవిస్తున్నాను. కొడుకులను పోగొట్టుకున్నాను. బంధుమిత్రులను పోగొట్టుకున్నాను. అందరూ మరణించారు. దహనక్రియలు చేయడానికి నేను మాత్రం బ్రతికి ఉన్నాను. సంజయా ! రాబోయే ఆపద తెలిసి కూడా పాండవులకు రాజ్యభాగం ఇవ్వ లేదు. కనుక నా అనే వారందరిని పోగొట్టుకున్నాను. సంజయా ! నేను ఇలా కావడానికి నా పూర్వజన్మ సుకృతం కాక వేరు కాదు. అయినా ధర్మరాజు ఉండగా దహనక్రియలు చేయడానికి నేను ఎందుకు ? నా కుమారులను చంపి తమ ప్రతిజ్ఞలు నెరవేర్చుకున్న పాండవులు ఈ పని కూడా చేస్తారులే " అన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

27, జులై 2025, ఆదివారం

కామకళ -- స్వరూపం _నిరూపణ

 [ భాస్కర శర్మ: 🙏కామకళ -- స్వరూపం _నిరూపణ🙏

               మొదటి భాగం

కామకళను గురించి ఈ వ్యాసంలో వివరిస్తాను.

కొన్ని భాగాలుగా అందిస్తాను. రహస్యం ఆగుట చేత బీజాక్షరాలు చెప్పకుండా వాటి అర్ధం చెప్పడం జరిగింది గమనింప ప్రార్ధన

జాగ్రత్తగా చదవండి.అర్దమగుటకు ఉన్నంతలో తేలికగా వ్రాశాను.

ముందుగా సత్యము -- అసత్యము గురించి తెలుసుకోవాలి.

తరువాత ప్రకాశ, విమర్శ, మిశ్రమ, సంవిద్బిందువులు తెలుసుకొని అప్పుడు కామాకళా స్వరూపం గ్రహించాలి.


ఈ సృష్టిలో సకల వస్తువులు-- జీవులు 

 సత్యము -- అసత్యము అనే రెండు పదార్ధముల మేళనము కలిగియున్నవి. ఇందు అసత్యమనునది నామరూపములు కలది.నామ రూపములు ఉన్నాయి అంటే అది నశిస్తుంది అంతవరకు ఎందుకు?.మనకు నామ రూపములు ఉన్నాయి కదా! ఇది శాశ్వతం కాదు. కాబట్టి అసత్యం ఇక రెండవదైన సత్యము ఆ నామ రూపములకు చైతన్యమును, వృద్ధి -- క్షయములను కలిగించునది. ఇది మనలో కనబడకుండా ఉంటుంది.అదియే జీవుడు.ఈ సత్యాసత్యములు రెండును ప్రతివస్తువందును గలవు. -ఈరెంటిలో నామరూపములు గలది అసత్యభాగము. ఈరెండును కలసి జగత్తుగా నున్నది. ఆ రెంటిలో సత్య భాగమును సారమంటారు . తిలలందు తైలము సత్యము. అదియే సారము. రెండవది పిష్టము. అది అసత్య భాగము. మనుష్యునందు జీవుడు సత్యము. దేహము అసత్య భాగము. 

ఈరెండును కలసి ఉన్నపుడు ప్రవృత్తి ( జీవన విధానం ) కలుగుచున్నది కాబట్టి ప్రపంచ 

మందు సత్యము ప్రతి వస్తువులోను సారభూతముగా నున్నది. సారమనగా రసము.అంటే అనందస్వరూపం .

ముందు ప్రకాశ శక్తి, విమర్శ శక్తి చూద్దాము 

  ప్రకాశబిందువు,( అ )విమర్శ బిందువు,(హ) మిశ్రమ బిందువు, (అహం )ఇవే బిందుత్రయము.

వాటి వివరణ చూద్దాము

అక్షరాలలో "అ " కు ముందు ఏ అక్షరం లేదు. కాబట్టి అ అనేది సదాశివ స్వరూపం. చివరి అక్షరం " హ ". హ తరువాత ఇంక ఏ అక్షరం లేదు. ళ, క్ష ఉన్నాయి కదా అనుకుంటారు. కానీ స్వతంత్ర అక్షరాలు కాదు. ""ల ళ యోరభేదః "" అని చెప్పుటచేత ల - ళ భేదం లేదు. క్ష అనేది సంయుక్త అక్షరం ఇది కూడా స్వతంత్ర అక్షరం కాదు. కాబట్టి " హ " చివరి అక్షరంగా గ్రహించండి

హకారమే శక్తి స్వరూపం.


శివుని డమరుకం నుండి వెలువడినవి

వీటిని మహేశ్వర సూత్రాలు అంటారు.

1 అ,ఇ,ఉ,ణ్,


2 ఋ,ఌ,క్ 


3 ఏ,ఓ,ఙ్ 


4 ఐ,ఔ,చ్ 


5 హ,య,వ,ర,ట్ 


6 ల,ణ్


7 ఞ,మ,ఙ,ణ,న,మ్ 


8 ఝ,భ,ఞ్ 


9 ఘ,ఢ,ధ,ష్ 


10 జ,బ,గ,డ,ద,శ్ 


11 ఖ,ఫ,ఛ,ఠ,థ,చ,ట,త,వ్ 


12 క,ప,య్ 


13 శ,ష,స,ర్ 


14 హ,ల్

అనే వ్యాకరణ సూత్రములు ఇవే ప్రకటిస్తున్నాయి.

 అక్షరాలలో మొదటి అక్షరం 'అ " ఇది సదాశివ స్వరూపం. "హ " చివరి అక్షరం శక్తి

 స్వరూపం. రెండు అక్షరాలకు సామ్యం ఉన్నది.

"అ, కు, హ విసర్జనీయానాం కంఠః"

జాగ్రత్తగా గమనిస్తే రెండు అక్షరాల పుట్టుక కంఠ స్థానమే. తేలికగా పలికితే " అ" ఒత్తి పలికితే "హ " అంతేతేడా ఆ రెండింటి సంయోగం "అహం "

అ, హ కలిస్తే అహ అవ్వాలి గాని అహం ఎల్లా అయింది? అనే సందేహం వస్తుంది.రెండు బీజములు కలిసి నప్పుడు నాదం వస్తుంది.

రెండు వస్తువుల రాపిడి వలన ధ్వని వచ్చినట్లు. ఆ ధ్వనినే నాదం అంటాము. ఇక్కడ నాదం బిందువు (o) గ్రహించండి.అందుచేత అహం అయింది 

అకార హకారములు రెండు శివ, శక్తి స్వరూపాలు.

""న శివేన వినా దేవీ దేవ్యాచ న సదాశివః

నైత యోరంతరం నాస్తి చంద్ర చంద్రిక యోరివ""


శివుడు లేనిదే అమ్మ లేదు. అమ్మ లేనిదే శివుడు లేడు. ఇద్దరికీ తేడా లేదు. వారు చంద్రుడు వెన్నెలా వంటివారు 

అను ఆగమ సిద్ధాంతము వలన శివశక్తులకు అన్యోన్యబేధము లేదని తెలుస్తోంది.

(ఇక్కడ సమన్వయము జాగ్రత్తగా చూడండి )

 ప్రకాశబిందువు శివస్వరూపము, మరియు చంద్ర మండలము. ‘అ’కారముగా గ్రహింపవలెను.


 విమర్శ బిందువు శక్తి స్వరూపము. అగ్ని మండలము. ‘హ’ కారముగా గ్రహింపవలెను. ఈ ప్రకాశ, విమర్శ బిందువుల సంయోగము వల్ల అంటే చంద్ర అగ్ని కలయిక వల్ల మిశ్రమ బిందువైన సూర్యబిందువు ( అహం) జనించుచున్నది.


 అకార స్వరూపమగు పరమశివుడు, హకార స్వరూప పరాశక్తిని వీక్షించినపుడు, ఈ వీక్షణ సంయోగము వల్ల జనించిన మూడవ ప్రతిబింబము ‘అహం.’ ఇక్కడ "అహం "పరాశక్తి. కాబట్టి పరాశక్తి అద్దము వంటింది.

                     సశేషం

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ


                 రెండవ భాగం

""స్ఫుట శివశక్తి సమాగమ బీజాంకుర రూపిణీ పరాశక్తిః

అణుతర రూపానుత్తర విమర్శ లిపి లక్ష్య విగ్రహ భూతి""


బీజాంకుర రూపమయిన( విత్తనం, మొలక)

విత్తనం ప్రకాశ బిందువు. మొలక విమర్శ బిందువు అని గ్రహించండి.) ప్రకాశ విమర్శనాత్మక శివ మరియు శక్తి స్వరూప తేజోమయమయిన ‘అహ’ మనే బీజద్వయము శరీరముగా కలిగి పరాశక్తి ప్రకాశించుచున్నది.

(అహం అనేది పరాశక్తిగా గుర్తించండి.)అందువలన పదములు, వాక్యములు, వేదాది సకల శాస్త్రములు, గాయత్రీ మొదలగు మంత్రములు సృష్టింపబడినవి. కావున అన్ని వర్ణములు శివశక్తిమయములే. మనయందుగల అజ్ఞానమనే చీకటిని ప్రారదోలి జ్ఞానమనే వెలుగును ప్రకాశింపచేయునవి సదాశివశక్తులు.

ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనునవి మనోవాక్కాయ కర్మములు. ఇవి , సరస్వతి, లక్ష్మి, పార్వతి అను మూర్తిత్రయములు. వేరువేరుగా పిలవబడుచున్నా - ఏకత్వ లక్షణములు గల శక్తి మాత్రమే. ఈ మూడు శక్తి రూపములు ‘శారదా తిలకము’ నందు – ‘బిందు పుమాన్ శివః ప్రోక్తః స్వర్గః శక్తిర్నిశాకరః’ –అర్ధం : బిందువు శివుడని చెప్పబడింది. అమ్మవారు చంద్రుడు. ఏది శక్తితో కూడా యున్నదో అది సృష్టి రచనా శక్తి కలిగియున్నదని చెబుతోంది.

శ్రీచక్రము చూడండి 

శ్రీచక్రములోని త్రికోణం చూడండి.

ఈ అథోముఖముగా ఉన్న త్రికోణంలోగల త్రిరేఖల యందు సమానముగా 16 అక్షరాలు కలవు. ఒక రేఖ యందు అ నుండి అః వరకు 16 అక్షరములు, మరియొక రేఖ యందు క నుండి త వరకు 16 అక్షరములు, మరో రేఖ యందు థ నుండి స వరకు 16 అక్షరములు కలవు. 

ఇదే " అ క థ "" ఆది రేఖా త్రయం ప్రకాశ, విమర్శ, మిశ్రస్వరూపమైన మహాబిందువు ఉందికదా . అది అహమనే వర్ణద్వయం కలిగి ఉంది, ఇది రక్తశుక్ల బిందువుల మేళనము. అంటే చంద్రాగ్నుల సమిష్టి రూపం. ఈ బిందువులోని ప్రకాశవిమర్శాంశలే కామేశ్వర కామేశ్వరీ దివ్యదంపతులు. ఈ ఉభయాంశల మిశ్రబిందువే సూర్యస్వరూపం. ఇదే సర్వకారణ బిందువు.

అకారం నుండి అః వరకు ఉన్న షోడశ స్వరాలు సోమ మండలానికి సంబందించినవి.శివ స్వరూపాలు. య నుండి క్ష వరకు ఉన్న పది అక్షరాలు అగ్ని మండలానికి సంబందించినవి. శక్తి స్వరూపాలు. ఇక కకారము నుండి భకారం వరకు ఉన్న ఇరువది నాలుగు సూర్య కళలు.

ఇక్కడ ఒక విషయాన్ని గమనించగలరు.

కకారము నుండి ఠకారం వరకు అనులోమం లోను, డకారము నుండి భకారం వరకు విలోమం లోను ఒక్కటొకటి చొప్పున "కం భం" "ఖం, బం" అని ఈవిధంగా వస్తాయి.అనులోమ అక్షరాలు శివ స్వరూపం.విలోమ అక్షరాలు శక్తి స్వరూపం. ఇవి చంద్ర, అగ్ని కళల సమ్మిశ్రమంతో వచ్చినవి. ఇవి సూర్య కళలు. ఇది అహం రూపంగా గ్రహించాలి.ఇందులో క నుండి మ ఉన్న అక్షరాలు కామకళా రూపాలు అని గ్రహించాలి.

ఈ కళలతోనే మనము శ్రీచక్రార్చనలో పాత్రలను స్థాపన చేస్తాము. ఈ అగ్ని, సూర్య, సోమకళలు ఓంకార రూపంగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పాత్రాధారమును అకారంగా, పాత్రను ఉకారముగా, అమృతమును మకారము గా చెబుతాము.ఇక్కడ ఓంకారము సంవిద్బిందువు.

గమనించగలరు.

    ఈ మూడు బిందువులను కలిపి ఒక త్రిభుజం తయారుచేసుకొని, మూడు భుజాలు కలిసేచోట మూడు కోణాలు వస్తాయి. అనగా త్రిభుజము , త్రికోణాలు ఏర్పడతాయి . ఈ త్రికోణం మధ్యలో మూడు మండలముల యొక్క ప్రకాశముల ( కాంతుల ) కదలికలో, మూడు ప్రకాశముల యొక్క స్వభావంతో కూడి, నాలుగవ బిందువు తయారైనది ఈ నాల్గవ బిందువే సంవిద్బిందువు. నాల్గవ బిందువును కలిపి బిందు చతుష్టయం అంటారు. ఈ బిందు చతుష్టయము సృష్టికి పూర్వం ఉన్నటువంటి అవ్యక్తము. బిందు చతుష్టయము అంటే అవ్యక్తము,

బిందు త్రయాన్ని మరొక పద్ధతిలో చూద్దాము .

                  ..సశేషం

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ


               మూడవ భాగం

       ప్రకాశ బిందువు, విమర్శ బిందు ప్రకాశాలు (కాంతులు )రెండు కలిపితే బ్రహ్మ, మాయ కలవడం వంటిది. అవ్యక్త స్థితిలో శివశక్త్యాత్మకం, వ్యక్త స్థితిలో శివుడు శక్తి వేరుపడ్డారు. వేరుపడ్డప్పుడు శివుడు నిర్వికారం అయినప్పటికీ, ఈ వేరుపడ్డ శివుని మాయ వికారంగా ( చైతన్యంగా )చూపిస్తుంది. శివుడు వికారి కాలేదు, నిర్వికారమే, వికారం అయినట్లుగా మాయ చూపిస్తుంది. ఈ మాయ త్రిగుణ రహితమైన బ్రహ్మమును ఆశ్రయించి, ఆశ్రయ కారణంగా ఆ బ్రహ్మమును చూసే వారికి త్రిగుణాత్మకంగా ఉన్న బ్రహ్మముగా కనబడేలా చేస్తుంది.

పై విషయం జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి


ఋగ్వేదం అకారం తోను, యజుర్వేదం ఇకారం తోను సామవేదం ఐకారంతోను ప్రారంభం అగును.

    . పరమేశ్వరుడు వేదానికి మొదలైన "అ"కార రూపుడైతే వేదాలు తరువాత వచ్చినవి. వేదాలు రాకముందు ఏమి వచ్చింది? అకార, ఉకార, మకార మాతృకలతో ఉన్న ''ఓం'' వచ్చింది. ఓం తర్వాత అనేక అక్షరాలు వచ్చినవి. అన్ని రకాల అక్షరాలతో కూడి మంత్రాలైనవి. ఋగ్వేదం మంత్రయుక్తం. మంత్రంలో మంత్ర శక్తి ఉంటుంది. మంత్రంలో మంత్రార్థం ఉంటుంది. మంత్రం ఒట్టి అక్షరాలు కాదు. ప్రాణం ఉన్న అక్షరాలు. ప్రాణం ఉన్న అక్షరాలకే వాటి సముదాయాలకే అర్థం ఉంటుంది. అర్థంలేని పదాల కూడిక వ్యర్థం. అర్థం ఉన్న పదాలతో కూడినది ఒక అర్థాన్ని ,ఒక పరమార్ధాన్ని, ఒక భావాన్ని, ఊహను అందిస్తుంది. దానిని బట్టి ఈ వేదాలు తయారయ్యాయి. ఈ పరమేశ్వరుడు ప్రకాశ బిందురూపుడు, విమర్శ బిందువు యొక్క ప్రకాశంతో కూడినపుడు, శివశక్త్యాత్మకమైనపుడు అటువంటి పరమేశ్వరుని దగ్గర నుండి వేదాలు ఉత్పన్నమైనవి. పరమేశ్వరుని వలన సృష్టించబడిన సకల ప్రపంచానికి స్థానమైన ఆత్మశక్తియందు ప్రవేశించి, శుక్లబిందు రూపమును పొందెను. ఇదియే పురుషుడయ్యింది. విమర్శ శక్తి శుక్ల బిందువు నందు జేరి, రక్తబిందు భావమును పొందినది. శుక్ల రక్త బిందువుల కలయిక వలన ఏర్పడిన మిశ్రమ బిందువు వలన నాదము పుట్టెను.అదే అహం లోని బిందువు యొక్క నాదము వలన షోడశ కళలు ఉత్పన్నమైనవి. ఆ కళలే కళాతత్వ రూపమైన పదునాలుగు భువనములను సృష్టించినది.

సృష్టి శివశక్తి విలసితము. దైవము, దేవత, సృష్టి, స్థితి, లయములు, కాలము, దేశము సర్వము శివశక్తిమయములు. పంచభూతములు, సూర్యచంద్రులు, అగ్ని అను అష్టమూర్తులు శివశక్తి సంయములు. ‘అస్తి’ అనగా ఉన్నది. శివుడు ఒక్కడే కాడు. శక్తితో కూడి ఉన్నదే ఉండుట. 


       ఈ బిందు నాదములు అహం అనే రెండక్షరాలకు శరీరముగా ఉన్నాయి. రక్త బిందువు అగ్ని బిందువైనది. శుక్ల బిందువు చంద్ర బిందువైనది. ఈ రెండింటి మిశ్రమ రూపమైన బిందువు సూర్య బిందువైనది. అదే "అహం "ఈ బింద్రత్రయము వలన శ్రీచక్రములో త్రికోణ చక్రం ఆవిర్భవించెను. ఆ చక్ర మధ్యలో నున్నది సంవిద్బిందువు అని గ్రహించండి . ఈ సంవిద్బిందువే పరాశక్తి. ఈ నాల్గు బిందువులు కలసిన ఈ ఆవరణయే భ్రమణ వేగముతో కదలి, మిగిలిన చక్రములు సర్వము ఏర్పడినవి .



శ్రుతులు అనేక భేదములుగా ఉన్నను, ఉపనిపదర్థమందు సర్వశ్రుతులును లయ మగుచున్నవి గాన ఉపనిపత్తులకన్న వేరే ప్రమాణము లేదు గాన ఈ వివరణ సర్వోవనిషత్ సమ్మతముగా నున్నది.


    ప్రకాశ బిందువు, విమర్శ బిందువు, మిశ్రమ బిందువు - ఈ మూడు బిందువులను మూడు కోణములుగా చేసి త్రిభుజమును తయారుచేస్తే ఈ మూడు బిందువులను కలుపుతూ ఒక వృత్తము గీస్తే ఆ వృత్తమే సూక్ష్మ శ్రీచక్రము.

ఆ ప్రకాశ విమర్శ బిందువులు ప్రవంచావిర్భావ పరిపాలన లయములు గలవి.(సృష్టి, స్థితి సంహారం ) నిత్యయుతములు.(ఎప్ప్పుడు జరుగుతుంది )కామేశ్వరీ కామేశ్వరులు వాగర్థరూపములని చెప్పినందున పైన చూపించిన త్రికోణమందు ' మధ్యబిందువు నందు ప్రకాశ విమర్శ శక్తి సూక్ష్మముగా నున్నది, అదియే అత్మ. అంటే సంవిద్బిందువు. .

సృష్టి ఆది వస్తువునందు ఉన్నది శివశక్తులే.



ఆత్మ యందు శివశక్తుల వస్తుద్వయ మేళనము గలదు. అది భావిసృష్టికి కారణము. సృష్టికొరకు 

సత్వరజస్తమస్సులనే గుణత్రయరూపములను పొందినది. 

అవే కోణబిందువులుగా నున్నవి. ఆకోణ బిందువులు త్రిగుణమయ 

రూపములుగాను, వాగ్భవ కామరాజ శక్తి బీజములుగాను, అందు ప్రతి 

బిందువునందును ప్రకాశ విమర్శశక్తులు ఇమిడియున్నందున వాణీ హిరణ్య 

గర్భ ద్వంద్వమును, లక్ష్మీనారాయణద్వంద్వమును, ఉమామహేశ్వర 

ద్వంద్వమును అయియున్నవి. ఇక ఈ కోణబిందు త్రయమే సృష్టిలో

ప్రధాన వస్తువులగు చంద్రాగ్ని సూర్యమండ లముల "కాస్పద మైనది. వీని వలన ఆకాశాది పంచభూతములును, వాటివలన శాఖోవశాఖలుగా సృష్టి అంతయు పెరిగినది.


ఆస్తి భాతి ప్రియం అయిన పరమాత్మ తానే రెండు రూపములు ధరించగా, ఒకటి ‘పుం’ రూపము, మరియొకటి స్త్రీ రూపమయినది.అవే శివశక్తి రూపములు. ఒకే తత్త్వమును స్వభావమును, రూపమును, నామము కలవి. ఆయన సదాశివుడు ఆమె శక్తి. ‘నమశ్శివాభ్యం నవయౌవనాభ్యం’ అని శంకరాచార్యుల వారి స్తుతిని పరిశీలిస్తే . వారు నిత్య యవ్వనులు అనే మాట స్పష్టము అవుతుంది..


పరమాత్మ అంశములు – ఆస్తి, భాతి, ప్రియం, నామరూపములు , అనగా మొదటి మూడు పరమాత్మ యొక్క అవ్యక్తమైన స్థితి. నామమన్నది వాగర్ధ రూపము. వాక్కు శక్తిరూపం – అర్ధం శివరూపము. ఇది అక్షరము, సకలము, వ్యక్తము, మూర్తము కనుకనే శివశక్తులను గురించి మనము అనగలము, వినగలము, మాట్లాడగలము. ‘నశవేన వినాశక్తిర్న శక్తి రహితః శివః’, శక్తి లేనిదే శివుడు లేదు. శివుడు లేనిదే శక్తి లేదు.

ప్రకృతి అంతా శివునిచే చైతన్యవంతమైనది. ప్రకృతిలో లీనమైన పరమాత్మ వలన ప్రకృతి ప్రకాశించుచున్నది. అది అజడ ప్రకృతి. జడ ప్రకృతి జీవము లేనిది కనుక ప్రకృతికి శివుడే రూపము. రూపము కాలమును బట్టి, స్థలమును బట్టి ఏర్పడును. ఈ రూపము శక్తి భాగము. ఈ రూపమును చైతన్యము చేయువాడు శివుడు. ఇతి స్థూలంగా శివశక్తిమయమైన అంశపంచకము యొక్క లక్షణము.

                   సశేషం

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ


                   నాల్గవ భాగం

       వికాసము పొందినటువంటి రక్త బిందువు వలన, ఆ బ్రహ్మమే అంకురముగా గల శబ్ద బ్రహ్మముగా ఆవిర్భవించింది. రక్త బిందువనగా మాయాశబలిత బ్రహ్మము(మాయచేత చలించు లేదా స్పందించు బ్రహ్మము ). ఆ బ్రహ్మమునుండి అనాహత శబ్దము పుట్టింది.అనాహతం అంటే ప్రతిధ్వని లేని ధ్వని. అనాహత మొట్టమొదట ఆవిర్భవించినది అనాహతం నుంచి ఆవిర్భావించినవి శబ్దాలే కనుక దానిని అనాహతం లేదా మ్రోగించని శబ్దం అని అంటారు. అదియే నాదబ్రహ్మ. ఆ నాదము వలన ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివి అనబడే పంచభూతాలతో కూడిన ప్రకృతి జనించినది. అకారాది హకారాంతము అంటే అ నుండి హ వరకు గల అక్షరాలు ఉత్పన్నమైనాయి. పంచభూతాలు రూపాలైనాయి. అక్షరాలు నామాలైనాయి.


       ఈశ్వరుడు అనేటటువంటి మాయా ప్రతిబింబశక్తి కారణమై, రజోగుణముతో ఉద్రిక్తము అయింది . అప్పుడు మహత్‌ అని ప్రసిద్ధమై, అందులో విక్షేపశక్తి (వ్యాపాక శక్తి) విజృంభించినది. ఆ విక్షేప శక్తి యొక్క ప్రతిబింబ రూపమే హిరణ్యగర్భుడయినది. ఇతడే దృశ్య-అదృశ్యమైన రూపము కలిగి, మహతత్త్వమునకు అభిమానిగా ఉన్నాడు.(సృష్టి మొత్తం ఒకే పురుషుడుగా ఉండుట) అందువలన ఆ హిరణ్యగర్భునికి మహత్‌, అహంకారము అని పేరు కలిగినది.


కామకళ నిరూపణ


మూలకూటత్రయ-కళేబరా - లలితా సహస్రనామంలోని నామము .

మూలస్య కుటత్రయమేవ కళేబరం (=స్థూలరూపం) యస్యాః సా 


మూల మంత్రం యొక్క మూడు విభాగాలు ఆమె శరీరాన్ని ఏర్పరుస్తాయి.అదే అమ్మవారి స్థూలరూపం అని గ్రహించండి 


మంత్రం యొక్క మూడు కూటాలు ఆమె భౌతిక లేదా సూక్ష్మ రూపాన్ని ఏర్పరుస్తాయి.


అసలు అర్థంలో మూల అనే పదానికి కామకళ అని పిలువబడే సూక్ష్మ శరీరం అని అర్ధం , మరియు విభజనలు కామకళ యొక్క భాగాలు. కామకళ లోని మొదటి భాగాన్ని ఊర్ధ్వ బిందువు అని , రెండవ భాగాన్ని రెండు సూర్య చంద్ర బిందువులని మరియు చివరి భాగాన్ని సార్ధకళ అని అంటారు .

త్రయ అంటే మూడు. పంచదశి మంత్రంలోని మూడు కూటాలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. పంచదశికి 'కామకళ ' మూలమని మనం చూశాం. కాబట్టి, ఆమె భౌతిక మరియు సూక్ష్మ రూపాలు రెండూ 'కామకళ'ను సూచిస్తాయని ఇది సూచిస్తుంది. మూడు సూక్ష్మ రూపాలలో, మొదటి సూక్ష్మ రూపం పంచదశి మంత్రం, . రెండవ సూక్ష్మ రూపం , కామకళ రూపం ఇక్కడ చర్చించబడింది. క్లుప్తంగా చెప్పాలంటే, మూడు బిందువులు త్రికోణంగా కలిగిన హంస మరియు సోహం (హంస మంత్రం) కలయికను కామకళ అంటారు. ఇది లలితాంబిక యొక్క వాస్తవ భౌతిక రేఖాచిత్రం. ఇందులో ఉన్న బీజం 'ఈం '. ఈ బీజం చాలా శక్తివంతమైనది మరియు షోడశీ మంత్రంలో ఈ బీజాన్ని ఎలా ఉపయోగించాలో ఈ అంశం తెలుసుకొని శ్రీం బీజం చేర్చుకోవాలి . 


మంత్రాలు మూడు రకాలుగా వర్గీకరించబడ్డాయి - పురుష, స్త్రీ మరియు తటస్థ .


హుమ్ , వషట్ మరియు ఫట్‌తో ముగిసే మంత్రాలు పురుష మంత్రం.


స్వాహా మరియు వౌషట్ తో ముగిసేవి స్త్రీ దేవతా మంత్రాలు ;


నమః తో ముగియడం తటస్థ మంత్రాలు .


పురుష మరియు తటస్థ మంత్రాలను "మంత్రం" అని పిలుస్తారు మరియు స్త్రీ దేవతా మంత్రాలు " విద్య " అని పిలుస్తారు, అందుకే షోడశి మంత్రానికి శ్రీవిద్య అని పేరు.


జపం మూడు రకాలు:


1.వాచ్యం - వినబడేలా చేయబడింది


2. ఉపాంశు - గుసగుసల వలె జపించడం 


3. మానస – మానసికంగా చేస్తారు.

హ్రీం, శ్రీం సౌః వంటి బీజ మంత్రాలు అని పిలువబడే ఏక-అక్షర మంత్రాలు గుర్తుంచుకోవడానికి మరియు పఠించడానికి సులభమైనవి; అవి కూడా అత్యంత శక్తివంతమైనవి. ఒక చిన్న విత్తనంలో గంభీరమైన చెట్టు ఉన్నట్లుగా, ప్రతి బీజంలో అపారమైన ఆధ్యాత్మిక జ్ఞానం మరియు సృజనాత్మక శక్తి ఉంటుందని గ్రహించండి . ఈ బీజాలలో పురాతనమైనది మరియు విస్తృతంగా తెలిసినది ఓం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని ఉపనిషత్ చెబుతోంది.

ఓంను ప్రణవ మని పిలుస్తారు, 

ఓం అనేది విశ్వం యొక్క “ప్రాథమిక బీజం ”-ఈ ప్రపంచం మొత్తం, “ఓం తప్ప మరొకటి కాదు” అని ఒక పురాతన వచనం చెబుతోంది. ఇది అన్ని ఇతర మంత్రాలు ఉద్భవించే మూల మంత్రంగా కూడా పరిగణించబడుతుంది మరియు వేదాల యొక్క అనేక వేల శ్లోకాల యొక్క సారాంశాన్ని సంగ్రహిస్తుంది. కఠోపనిషత్తు ప్రకారం, ఓం అనేది "వేదాలన్నీ సాధన చేసే పదం."


అందుకని, ఓం అనేది ధ్యాన బీజం ., ఓం "మనలోని అనంతమైన అనుభవాన్ని" వ్యక్తపరుస్తుంది . ఈ విధంగా, ఓం జపించడం అనేది మనలో ఉన్న దైవాన్ని తాకడానికి సులభమైన మార్గం.

ఓం అనేది వైదిక కామకళ 

                     సశేషం

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ


                ఐదవ భాగం

యోగులు తరచుగా ఓంను ధ్యానం చేస్తారు.

 సన్యాసం తీసుకున్నవారు కేవలం ఓం మాత్రమే జపిస్తారు. రుద్ర నమకం ఒక్కటి పారాయణం చేయవచ్చు. ఇంక ఏ మంత్రములు చూడరు.

 సాధారణంగా ఓం అని ఉచ్ఛరించినప్పటికీ, మంత్రం వాస్తవానికి మూడు అక్షరాలను కలిగి ఉంటుంది, అ , ఉ మరియు o( మ్ .) ఉన్నాయి.


చంద్రుని యొక్క కళలు పదహారు. పాడ్యమి నుంచి పూర్ణమి వరకు తిథులు పదిహేను. కాగా పదహారవ కళ సాక్షాత్తూ ఆ పరమేశ్వరి అయి ఉన్నది.అదే కామకళ 


షోడశీ తు కళా జేయా సచ్చిదానంద రూపిణీ ||


అంటే పరమేశ్వరియే షోడశీకళ. సాదాఖ్యకళ, చిత్కళ, ధృవకళ, బ్రహ్మకళ, పరమాకళ, కామకళ అని పిలువబడుతోంది. 

కామము అంటే కోరిక. సాధకుని కోరికలు తీర్చేకళ. అదే కామకళ. సాధకుడి కోరికలు అనేకానేకాలు ముఖ్యంగా అవి రెండు రకాలు 1. ఇహము 2. పరము. ఇహానికి సంబంధించినవి అర్ధకామాలు. పరానికి సంబంధించినవి ధర్మమోక్షాలు. సంసార లంపటంలో కూరుకుపోయిన మానవుడు తన కష్టాలన్నీ తీరిపోవాలని, సుఖాలు పొందాలనుకుంటాడు. అందుకోసం ధన సంపాదన కావాలి. ఈ రెండింటి కోసమే అతడు ప్రాకులాడతాడు. అయితే ఉత్తర జన్మ ఉత్తమ జన్మ కావాలంటే ధర్మము తప్పనిసరి.

దానిద్వారానే మోక్షప్రాప్తి కలుగుతుంది. ఈ రకంగా భక్తులకు చతుర్విధ పురుషార్ధాలను తీర్చేది ఆ పరమేశ్వరియే. అందుచేతనే ఆమె భక్తుల యొక్క కోరికలు తీరుస్తుంది. కాబట్టి

కామకళ అనబడుతుంది.


ఇది సచ్చిదానంద స్వరూపము. కాబట్టి బిందుమండలంలో ఉంటుంది. అనగా శ్రీచక్రంలోని బిందువులో ఈ పరమేశ్వరి ఉంటుంది. మరి అక్కడ ఒక్క పరమేశ్వరియే ఉంటుందా? అన్నప్పుడు ఆ దేవి పరబ్రహ్మ స్వరూపము. అంటే శివశక్తుల సమ్మేళనము. కాబట్టి 'శివేన వినాశక్తిః' శివుడు లేకుండా శక్తి లేదు.

 శివశక్తులు ఇద్దరూ కలిసిన లలితా సహస్ర నామాలలో కామకళను వివరించటం జరిగింది.ఆ నామాలు ఇక్కడ చూద్దాము 

కామ్యా - కోరదగినటువంటిది.

జ్ఞానముచే పొందబడినది. ముముక్షువులచే కోరదగినది.

పరమేశ్వరి జ్ఞానరూపిణి. సాధకులు జ్ఞానభావంతో జీవాత్మ పరమాత్మ వేరుకాదు అని ఆ పరమేశ్వరుణ్ణి అర్చించినట్లైతే, అట్టివారికి మోక్షం ప్రసాదిస్తుంది. అందుచేత దేవి కామ్యా అనబడుతుంది. సృష్టి ప్రారంభం కాక ముందు పరమేశ్వరుణ్ణి సృష్టికి సుముఖునిగా చేసిన రూపవిశేషము ఆ దేవి. అందుకే ఆమె కామ్యా అనబడుతోంది.

కామము అనగా కోరిక. ఈ కోరికలన్నీ బుద్ధివలన కలుగుతాయి. బుద్ధికి చైతన్యము కలిగినప్పుడు పూర్వజన్మలలో చేసిన కర్మానుసారము ఈ కోరికలు కలుగుతాయి. అంటే జీవుల స్థాయిని బట్టే కోరికలు కలుగుతాయి..

అయితే ఈ కోరికలు నాలుగురకాలుగా ఉంటాయి. వీటిని ధర్మ, అర్ద కామ మోక్షలు అనే క్రమంలో కాకుండా వారి స్వభావాన్ని వేరే విధంగా వ్రాయవలసి వచ్చింది అవి

1. తాత్కాలికంగా ఇప్పుడున్న కష్టాలు తొలగిపోయి సుఖాలు పొందాలి అనుకోవటం. ఇది కామము. సాధారణంగా ఎక్కువ మంది ఈ మార్గంలో ఉంటారు కదా 


2. జీవించి ఉన్నంతవరకు దుఃఖము లేకుండా ఉండటము, సుఖాలు పొందాలి అనుకోవటము ఇది అర్ధము.


3. తనకు రాబోయే జన్మలలో దుఃఖం లేకుండా సుఖం పొందేటట్లు కోరటం. ఇది ధర్మము.


4. అన్ని జన్మలలోను నిత్య నిరతిశయ ఆనందాన్నే కోరటం. ఇది మోక్షము.


వీటిలో ధర్మాన్ని కోరేవాడు - ఉత్తముడు

అర్ధాన్ని కోరేవాడు - మధ్యముడు

కామాన్ని కోరేవాడు - అధముడు

మోక్షాన్ని కోరేవాడు - ఉత్తమోత్తముడు

జీవులు వారి కర్మఫలాన్ననుసరించే ఈ కోరికలు కోరతాయి. ఈ కోరికలు అన్నీ తీరుస్తుంది. ఆ పరమేశ్వరి. అందుచేతనే ఆమె కామ్యా అనబడుతుంది.

కామకళారూపా - కామేశ్వరుని కళయొక్క రూపమైనది.కామేశ్వరుని యొక్క కళా రూపమే కామకళారూపా అనే నామము 

కదంబకుసుమప్రియా - కడిమి పువ్వులయందు ప్రేమ కలిగినది.

కళ్యాణీ - శుభ లక్షణములు కలది.

జగతీకందా - జగత్తుకు మూలమైనటువంటిది.

కరుణా రససాగరా - దయాలక్షణానికి సముద్రము వంటిది.

                       సశేషం

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ


             ఆరవ భాగం

కళావతీ -కళా స్వరూపిణీ.

కలాలాపా - కళలను ఆలాపనా స్వరూపముగా కలిగినది.(ఆలాపనా అంటే పాటకు ముందు పాడే మధురగానము ) మరొక అర్ధం కూడా ఉంది 

కలాలాపా. :- అలాపము అనగా మాట్లాడుట . అమ్మవారు కలాలాపా కావున మృదువుగా పలుకు స్వభావము కలది. అందరు అలవరచుకోవలసిన ముఖ్య లక్షణం 


సమస్త వెలుగులకు కారణభూతులైన అగ్ని ,సూర్య ,చంద్రులకు కళలను ప్రసాదించి ఆ కళల ద్వారా మరియు సృష్టి స్థితి లయ కారకులగు బ్రహ్మ, విష్ణు , రుద్రులకు శక్తినిచ్చి దేవతా స్వరూపాలకు తానే వెలుగులను అందిస్తూ వివిధ కళా రూపాలతో విరాజిల్లుచున్నది


కాంతా - కామింపబడినటువంటిది. ఆకర్షణీయమైన శక్తి స్వరూపం

మరొక అర్ధం చూద్దాము 

కాంతా :-క అనగా బ్రహ్మ. అనగా బ్రహ్మ అంతమును కూడా సిద్ధింపజేయునది . బ్రహ్మమయ సిద్ధాంతము ద్వారా పరమార్థము తెలుపునది . బ్రహ్మ దేవుని జీవిత కాలపరిమితిని కూడా తానే నిర్ధారించి అంతమొందించునది

కాదంబరీ ప్రియా - ఆనందంతో పరవశించుటను ఇష్టపడునది

మరొక అర్ధం చూద్దాము 

కాదంబరీ అనగా కడిమి పువ్వుల మకరందము గ్రోలుట యందు ఇష్టపడుతుంది .


మరియొక అర్థంలో

మనము భక్తి భావ పూర్వకముగా పూజలో భాగముగా విశేషార్ఘ్యఅమృత తర్పణము మిక్కిలి ఇష్టపడును .


కాదంబరి అనగా సర్వ విద్యాధి దేవత అయిన సరస్వతి మాత అనిన అమ్మ లలితాదేవికి అత్యంత ప్రీతికరం . ఏలయన సరస్వతీ దేవి విద్య ద్వారా జ్ఞానం పెంపొందించు జ్ఞాన ప్రదాత. అందువలన ఆ జ్ఞాన ప్రకాశంతో జ్ఞానామృత పానము చేసిన తన భక్తుల యందు ప్రియత్వం కలిగియుండును 


 కామకలారూపా - అనే నామంలో కామకళను వివరించటం జరిగింది. ఆ దేవి యొక్క తత్త్వాన్ని వివరిస్తూ ఆమె కదంబ కుసుమప్రియ, మంగళ స్వరూపమైనది, చరాచర జగత్తుకూ మూలాధారమైనది. ఆమె కళాస్వరూపిణి. కళలు అంటే విద్యాకళలు, వృత్తి కళలు, దేవతా కళలు, షోడశ కళలు వీటన్నింటి స్వరూపము ఆ పరమేశ్వరి. ఆ దేవి మృదుమధురమైన వాక్కు గలిగినది. జగత్తులోని గొప్ప స్త్రీత్వమంతా ఆమెలోనే ఉన్నది. విలాసము కొరకు ఉత్తమమైన మధువును గ్రహిస్తుంది. 

మహిషాసురునితో యుద్ధం చేసేటప్పుడు ఆ రాక్షసుడు గర్జిస్తుంటే

గర్జ గర్జ క్షణం మూఢ మధు యావ త్విబా మ్యహమ్

అర్ధం 

ఓరి మూర్ఖుడా ! నేను ఈ మద్యము తాగేవరకు నువ్వు గర్జిస్తూ ఉండు అంటుంది.


 కామకళను అర్చిస్తే వచ్చే ఫలితము ఏమిటో చెబుతున్నాడు. ఆ పరమేశ్వరి కరుణామృతసాగరా, కరుణా సముద్రురాలు. భక్తులందరి కోరికలు తీరుస్తుంది. దయాసముద్రురాలు. ఆమె కామ్యా అనబడుతోంది. అంటే భక్తుల యొక్క అన్ని కోరికలను తీరుస్తుంది. ఇహపరాలు రెండూ ఇస్తుంది.

కామేశ్వర కామేశ్వరీ రూపమును , నాదరూపము, కామకళా రూపము అంటారు .


ఈశ్వరునియొక్క ఇచ్చాశక్తియైన మొదటి రూపమే కామకళ.


బిందువుతో కూడిన నాదరూపమే అమ్మవారు. ఈ రూపాన్నే 'కామకళారూపం' అంటారు


కామకలా విలాసము అనే 55 సూత్రాలున్న గ్రంథాన్ని పుణ్యానంద మునీంద్రుడు వ్రాశారు .  

ఆ గ్రంథములోని విషయాలు ఈ వ్యాసములో వ్రాస్తున్నాను.

కామాకళా ధ్యానం వలన వచ్చే ఫలితం గురించి ఈ శ్లోకం వివరిస్తోంది 

యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః

యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః

శ్రీ సుందరీ సాధక పుంగవానాం 

 భోగ శ్చ మోక్ష శ్చ కరస్థ ఏవ 


ఆ దేవిని అర్చిస్తే తీరని కోరిక అంటూ ఏదీ లేదు


. ""కామకళా రూపా "" అయిన శ్రీ లలితాంబికకు నమస్కారములు 

                      స్వస్తి

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

 *👉®️వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్న అమ్మాయిలు / అబ్బాయిలు మరియు వారి తల్లితండ్రులు ఈ క్రింది (సూచనలను ) వాస్తవాలను తప్పక గ్రహించాలి.....*


*🔹®️వధువు / వరుడు గ్రహించాల్సిన అంశాలు....🔹*

************************


®️వివాహం అంటేనే సర్దుకు పోవడం...


®️ వివాహం అంటే స్వర్గం అని భావించకండి... 


®️ వివాహం బాధ్యతలతో కూడిన జీవితం... 


®️ఆకతాయిగా తిరిగే అవకాశం అమ్మాయిలకు / అబ్బాయిలకు వివాహం తరువాత కుదరదు అనే వాస్తవాన్ని గ్రహించండి...


®️వివాహం తరువాత నాది, నీది అనే స్వార్థం వీడాలి... 




®️వివాహం తరువాత ఫ్రెండ్స్ ని/ సహ ఉద్యోగులను బయటి వరకే వుంచడం మంచిది... 


®️మీరు కోరుకున్న అన్ని అంశాలు మీ జీవిత భాగస్వామిలో వుండటానికి అంగట్లో వస్తువు కాదని గ్రహించాలి... 


®️మీరు పరస్పరం ఇరువురి తల్లి తండ్రులకు, బందువులకు గౌరవం ఇవ్వటం నేర్చుకోవాలి...


®️సంతానం ను పొందటం బాధ్యత...


®️విడాకులు అనే ఆప్షన్ మీ బ్రెయిన్ లో వుంటే వివాహం చేసుకోకపోవడమే మంచిది...


®️వివాహం తరువాత మీ భాగస్వామి మీ బానిస కాదు అని గ్రహించండి. ఒకరికి ఒకరు తోడు అని గ్రహించండి... 


®️జీవిత భాగస్వామిని మించిన నేస్తం ఎవరు లేరని గ్రహించండి...


®️ముఖ్యం గా అమ్మాయిలు మీ అత్త గారి కుటుంబ విషయాలను మీ తల్లి తండ్రులకు చెప్పకండి... 


®️భార్య భర్తలు తగువు ఆడటం సహజం. మళ్ళీ కలవటం మామూలే.. మీరు పడే గొడవలను మీ తల్లి తండ్రుల దృష్టికి తీసుకువెళ్ళవద్దు... 


*🔹®️వధువు బాధ్యతలు :🔹*

*****************

®️వంట పని, ఇంటి పనులు, అబ్బాయి తల్లి తండ్రుల భాగోగులు, కుటుంబం లో ఇంకా మీ కంటే చిన్న వారు వుంటే వారి బాధ్యత కూడా మీదే. అత్త వారి కుటుంబమే మీ కుటుంబం అని మరువకండి...


®️ ప్రతి విషయం ను మీ పుట్టినింటితో పోల్చుకోవద్దు...


*🔹®️వరుడు బాధ్యతలు...🔹*

*****************


®️ వధువు తన తల్లి తండ్రులను వదిలి మిమ్మల్ని , మీ తల్లి తండ్రులను నమ్మి వచ్చిందనే విషయం మరువకండి....


®️కుటుంబానికి కావాల్సిన ఆర్థిక వనరులు మీ బాధ్యత... 


®️ పెళ్లి అయిన కొత్తలో నా పెళ్ళాం మంచిది అని తొందరపడి కుటుంబం లో వున్న అన్ని విషయాలు విడమరిచి చెప్పకండి... 


®️మీ తల్లి తండ్రులు వలె మీ భార్య తల్లి తండ్రులను కూడా గౌరవించటం నేర్చుకోండి. 


*🔹®️అమ్మాయి తల్లి తండ్రులు...🔹*

**********************


®️అమ్మాయికి నేరుగా ఫోన్ చేసి సుత్తి వేయకండి. వియ్యంకులను గౌరవించటం నేర్చుకోండి...


®️కొత్తగా వెళ్లిన కుటుంబం లో కొన్ని ఇబ్బంది గా మొదట్లో అనిపిస్తాయని, సర్డుకోవడానికి సమయం పడుతుంది అని గ్రహించండి... 


®️భార్య భర్తల గొడవలో అమ్మాయి తల్లి తండ్రులు తల దుర్చారాదు. మీ అమ్మాయికి తల్లి తండ్రులు ఇకపై అత్త మామ అనే విషయాన్ని అమ్మాయికి చెప్పండి...


®️మీకు కూడా ఒక కోడలు వస్తుందని గ్రహించండి... 


®️అమ్మాయి చెప్పేవన్నీ నమ్మి ఆవేశపడకండి...


*🔹®️అబ్బాయి తల్లి తండ్రులు...🔹*

**********************


®️మీ కోడలికి మీ అమ్మాయి కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మరువకండి...


®️మీ వంశం ని నిలబెట్టే సంతానం ను మీ కోడలి గర్భం ద్వారా జరుగుతుంది. అలాంటి మీ ఇంటి కోడలిని అపురూపం గా చూసుకోవాలి అని మరువకండి...


®️మీ కోడలు బాగోగులు కుటుంబ పెద్దగా పూర్తిగా మామ గారివే. మీ కూతురు ,కొడుకు మీ ముందు కన్నీరు పెట్టిన పర్వాలేదు. కానీ కోడలు ఎప్పుడు కన్నీరు పెట్టకుండా చూసే బాధ్యత మీదే...


®️మీ కోడలిని మీరు ఎలా చూసుకుంటారో , మీ కూతురుని వాళ్ళ అత్త గారు లాగే చూసుకుంటారని అబ్బాయి తల్లి గ్రహించాలి. మీ కూతురు కంటే మీకు మీ కోడలే ముఖ్యం అని అర్థం చేసుకోండి. ఇదే పద్ధతి లో మీ కూతురు కి వర్తిస్తుంది అని గ్రహించండి... 


®️ఎవరో మహానుభావుడు ఎన్నో జీవితాలు చూసి ఈ వాస్తవాలను మన ముందు ఉంచారు... పాటిస్తే అందరూ హాయిగా ఉంటారు...®️👆👍 Beautiful message seen in a Hindu WhatsApp group, Please go through completely.


Every one should follow 👆

స్వర్ణ గౌరీ వ్రతమ్ నేడు

 *_𝕝𝕝 ॐ 𝕝𝕝 0 - స్వర్ణ గౌరీ వ్రతమ్ నేడు 𝕝𝕝 卐 𝕝𝕝_*

*≈≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈≈

'శ్రావణ శుక్ల తదియ' రోజున వివాహిత స్త్రీలు తమ ఐదవతనం, సిరిసంపదలు, ఆయురారోగ్యాలు పొందడానికి గాను, అత్యంత భక్తి శ్రద్ధలతో 'స్వర్ణ గౌరీ వ్రతం’ ఆచరిస్తారు.


పార్వతీ దేవినే గౌరీదేవి అంటారు. పరమ శివుడు లయకారుడు, ఎంతటి శక్తివంతమైనవాడో తెలిసిందే, పార్వతీ దేవి మహిళల సౌభాగ్యాన్ని కాపాడే శక్తిగా, వారి జీవితాన్ని సంతోషంగా ఉండేలా తన చల్లని చూపులతో ఆశీర్వదాన్ని ప్రసాదించే మంగళ గౌరీగా పూజించబడుతుంది. 


ఈ స్వర్ణ గౌరీ వ్రతాన్ని సాక్షాత్తు పరమశివుడు పార్వతీ దేవికి చెప్పాడని అంటారు. ఈ వ్రతాన్ని చేసుకోవడం వల్ల ఆడవాళ్ళ అయిదో తనం వందేళ్లు నిలుస్తుందని అంటారు.


*_అసలు వ్రత కథ ఏమిటీ?_*


పూర్వం ఒక రాజు అడవిలో వేటకు వెళ్లి ఒక నదీ ప్రాంతాన్ని చేరుకుంటాడు. ఆ నదీ ప్రాంతం దగ్గరగా ఒక చిన్న ఆశ్రమం, అక్కడి మహిళలు అంతా ఒకచోట గుమిగూడి ఉంటండటం గమనించి, వాళ్ళ దగ్గరకు వెళ్లి విషయం ఏమిటని అడుగుతాడు. వాళ్ళు ఆ రాజుతో మేము స్వర్ణ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తున్నామని, ఈ వ్రతం వల్ల ఆడవారి సౌభాగ్యం వందేళ్లు నిలుస్తుందని, వ్రతం చేసే మహిళ భర్త ఆయుష్షు పెరుగుతుందని చెబుతారు. మహారాజు వాళ్ళతో వ్రత విధానం గురించి తెలుసుకుని తిరిగి తన అంతఃపురానికి వెళ్లి తన ఇద్దరు భార్యలకు స్వర్ణ గౌరీ వ్రతం గురించి చెబుతాడు. 


ఆ ఇద్దరిలో పెద్ద భార్య వ్రతాన్ని పట్టించుకోకుండా కొట్టిపడేస్తుంది. చిన్న భార్య మాత్రం ఎంతో శ్రద్దగా వ్రతాన్ని చేసుకుంటుంది. వ్రతాన్ని గూర్చి హేళనగా మాట్లాడిన పెద్ద భార్య కష్టాల పాలవుతుంది. భక్తి, శ్రద్ధలతో వ్రతాన్ని చేసుకున్న చిన్న భార్య తన జీవితంలో సుఖసంతోషాలతో హాయిగా ఉంటుంది.


ఇదీ విషయం. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే వ్రతాన్ని చేసుకోకపోయినా పర్వాలేదు కానీ హేళన చేయడం, ఎగతాళిగా మాట్లాడటం వంటివి చేయకూడదు.


*_వ్రత విధానం:-_*


ఈ వ్రతాన్ని చేసుకునే మహిళలు తెల్లవారు జామున లేచి, ఇల్లంతా శుభ్రం చేసుకుని, తలంటు స్నానం చేసి, పూజా వేదికను ఏర్పాటు చేసి, పసుపు కుంకుమలు మరియు పూలతో అలంకరించాలి. తరువాత గౌరీ దేవి పటాన్ని లేదా గౌరీ దేవి రూపాన్ని తయారుచేసుకుని పూజా వేదిక మీద ప్రతిష్టాపన చేయాలి. నూలు దారంతో తోరాన్ని తయారు చేసి దానికి పదమూడు ముడులు వేసి, పసుపు రాసి దాన్ని చేతికి కట్టుకుని, గౌరీదేవికి షోడశోపచార పూజ చేయాలి. గౌరీ దేవికి పదహారు రకాల పూలను, పదహారు రకాల పండ్లను సమర్పించాలి. అమ్మవారి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పిండివంటలను నైవేద్యంగా పెట్టాలి. తరువాత చేతిలో అక్షింతలు తీసుకుని, స్వర్ణగౌరీ వ్రత కథను చెప్పుకుని, ఆ అక్షింతలను తలపైన వేసుకోవాలి. 

చాలామందికి స్వర్ణ గౌరీ పూజా విధానం గురించి అనేక సందేహాలు ఉంటాయి. పూజ విషయంలో మంగళ గౌరీదేవి వ్రత పూజనే స్వర్ణ గౌరీ పూజలో కూడా పాటించవచ్చు. ఈ స్వర్ణ గౌరీ నోమును పెళ్ళైన వాళ్ళు పదహారు సంవత్సరాల పాటు చేసుకోవాలి. 

సకల సౌభాగ్యాన్ని చేకూర్చే స్వర్ణ గౌరీ ఆశీస్సులు అందరికి కలగాలని కోరుకుందాం.


*_𝕝𝕝 ॐ 𝕝𝕝 oఓo శ్రీ మాత్రే నమః 𝕝𝕝 卐 𝕝𝕝_*


*_𝕝𝕝 లోకాస్సమస్తాః సుఖినో భవన్తు 𝕝𝕝_


🚩 *_స్వస్తి_* 🚩

ఐదవ దశ

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹బాల్య, యౌవన, కౌమార, వార్ధక్య మనే నాలుగు దశలు అందరికీ ఉంటాయని మనకు తెలుసు. కానీ ప్రతి జీవునికి ఆ నాలుగింటితోపాటు ఐదవ దశ కూడా ఉంటుందంటూ అర్జునుడికి హితబోధ చేస్తున్నాడు శ్రీకృష్ణుడు. దానిని గురించి ఎంతో చక్కగా ఈ ఎపిసోడ్ లో వివరించారు యువ సాధకుడైన సునీల్ ఆకెళ్ల. వినండి. వారం వారం గీతా మార్గం. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

కురవంజి

 🙏🙏🙏 జానపద కళారూపాలు---- కురవంజి

                మొదటి భాగము

జానపద కళారూపాలు ఉపోద్ఘతం 

జానపద కళారూపాలంటే ఈనాడు చాల మందికి అర్థం కావు.ఎందుకంటే ఈ కళా రూపాల ప్రదర్శన ఈనాడు కనబడుట లేదు ఈ కళలను పోషించువారు కరువైయ్యారు.

జానపదమంటే పల్లెటూరని, జానపదంలో నివసించే వారు జానపదులనీ, వారు పాడుకునే పాటలు గానీ ఆటలు గానీ, నృత్యం గానీ, జానపద కళారూపాలని పెద్దలు నిర్వచించారు.

తెలుగు జానపద ప్రదర్శన కళల చరిత్రలోనికి కొంచెం చూస్తే కొన్ని విషయాలు మనకు అవగతం అవుతాయి. ఎప్పటినుండి ఈ కళారూపాలు ఉన్నాయి అని ప్రశ్నిస్తే సరిగ్గా ఏ శతాబ్దంలో ఇవి ప్రారంభం అయ్యాయో చెప్పడానికి ఆధారాలు లేవు. వీటి మొదలు ఎప్పుడు అన్నది ఎవరూ చెప్పలేరు. కాని జానపద సాహిత్యమే జానపద ప్రదర్శన కళలకన్నా ముందటిదని మాత్రం తార్కికంగా చెప్పడానికి వీలున్నది. సంస్కృతి కొంత పరిణామ దశను చేరుకున్న తర్వాత ఆ క్రమంలోనే జానపద ప్రదర్శన కళలు క్రమంగా జీవం పోసుకొని ఉంటాయి. జానపద ప్రదర్శన కళలు పరివర్థిత నాటకాలలాగే, అన్నీ సమాహార కళలు. పరివర్థిత నాటకానికి ఆధునిక నాటకానికి జానపద నాటకాలే మూలాలు. రెండు వేల సంవత్సరాలనాటిదిగా భావిస్తున్న భరతుని నాట్య శాస్త్రంలో ఆనాటికి లభిస్తున్న దేశి నాటక రూపక ప్రక్రియల గురించిన వివరాలు ఉన్నాయి. వాటిని జానపద ప్రదర్శన కళలు అనే అర్థం చేసుకోవాలి. సంస్కృత ప్రక్రియలలో చేరిన వీధి అనే తరహా రూపక ప్రక్రియ జానపద ప్రక్రియకు మారు రూపమే. కాని భాష మారుతుంది. సంస్కృత సాహిత్యంలోని చాలా ఆధారాలను పరిశీలిస్తే భారత దేశంలో జానపద ప్రదర్శన కళలు దాదాపు ఈ కాలంనుండే ఉన్నాయని చెప్పడానికి వీలుంది. కాని అంత ప్రాచీన కాలంనుండి అంటే రెండు వేల సంవత్సరాల కాలంనుండి తెలుగు జానపద కళారూపాలు ఉన్నాయని చెప్పడానికి నిక్కచ్చి ఆధారాలు లేవు. అసలు తెలుగు భాష అప్పుడు ఉందో లేదో కుడా చెప్పడానికి అవసరమైన చారిత్రక ఆధారాలు ఏవీ మనకు లభించవు. శాతవాహనులు తెలుగు రాజులు అని చెబుతున్నారు. వారికాలం నాటిదైన గాథా సప్తశతిలో కళారూపాలకు సంగీత వాద్యాలకు చెందిన పరోక్ష ఆధారాలను కొంతమంది విద్వాంసులు చూపారు. కాని గాథాసప్తశతి తెలుగులో లేదు. ప్రాకృతంలో ఉంది. ఆధారాలు ఉన్నా కూడా అవి ఏ భాషలో ఉన్న కళారూపాలను తెలుపుతున్నాయో చెప్పడం, రుజువు చేయడం కష్టం. కేవలం 11, 12 శతాబ్దాల కాలం నుండే మనకు నమ్మదగ్గ చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి. 11 వ శతాబ్ది కాలంనాటికే ఎన్నో జానపద కళారూపాలు ఉన్నట్టు తిరుగలేని ఆధారాలతో చెప్పవచ్చు. కాని అంతకు ముందు లేవు అని అనడానికి వీలులేదు. ఆధారాలు లేనంత మాత్రాన ఐదారు, శతాబ్దాలు ఏడు ఎనిమిది శతాబ్దాలలో జానపద కళారూపాలు తెలుగులో లేవు అని అనడానికి వీలులేదు. ఆరవ శతాబ్ది కాలంనాటికే తెలుగు భాష బాగా అభివృద్ధి చెందినదని చెప్పడానికి చారిత్రకులు చాలా శాసన ఆధారాలు చూపుతున్నారు. అంత అభివృద్ధి చెందిన భాష ఉన్నప్పుడు ఆనాటికే జానపద ప్రదర్శన కళలు ఉండి ఉండాలి. కాని వాటిని వివరంగా చెప్పే వివరమైన ఆధారాలు ఆ శాసనాలలో లభించలేదు. క్రీస్తుశకం 1200 ప్రాంతం వాడైన పాల్కురికి సోమనాథుడు దేశిసాహిత్య పితామహుడుగా ఉండి పండితారాధ్య చరిత్ర, బసవ పురాణం అనే శైవసాహిత్య గ్రంథాలను దేశి సాహిత్యంలో రచించాడు. ద్విపద ఛందస్సు జానపద సాహిత్యనికి అత్యంత దగ్గరి రూపం. ఝటితిగా రచితమయ్యే చాలా జానపద గేయాలలో ఈ ఛందస్సు రూపాలు ఉంటాయి. అందుకే ప్రచారం అవసరం అనుకున్న విషయాలను ప్రజలకు విరివిగా అందించాలనుకున్న కథలను ఆనాటి కవులు జానపద సాహిత్యానికి చాలా దగ్గరిగా ఉన్న ద్విపద ఛందస్సును స్వీకరించి రచించారు. పాల్కురికి, శ్రీనాథుడు (పల్నాటి వీరచరిత్ర), రంగనాథ రామాయణ కర్త ఇందుకు మంచి ఉదాహరణలు. జానపద జీవితాన్ని విస్తారంగా వర్ణించిన సోమన జానపదులైన శివభక్తుల జీవితాలను కథలను విపులంగా వర్ణించిన సోమన వాటిలో భాగంగానే జానపద కళలను వివరంగా వర్ణించాడు. తన కాలం నాటికి తెలిసిన చాలా జానపద కళలను గురించి ఆచూకీ చెప్పడం మనకు ఇందులో బాగా కనిపిస్తూ ఉంది. పాల్కురికి రచనలలో ఉన్న జానపద కళల గురించి ఇప్పటికే చాలా మంది పండితులు చెప్పిఉన్నారు. వాటిని తిరిగి వివరంగా చెప్పవలసిన అవసరం లేదు. కాని ఏయే కళారూపాల ప్రసక్తి ఉందో చెప్పడం అవసరం. చాలామంది నాటకాలు ఆడుతున్నారని చెప్పాడు అవి జానపద నాటకాలే. రోకళ్ళ పాటలను గురించి చెప్పి వాటిని పాడే ఘట్టాల్ని చెప్పాడు. పిచ్చుకుంటి కళాకారులు శ్రీశైలం వెళ్తున్నట్లుగా వర్ణించాడు. పిచ్చుకుంటి కళాకారులు ఈనాటికీ జీవించి ఉన్నారు. వీరి కళారూపమైన పిచ్చుకుంటికథ ఇప్పటికీ బాగా తిరుగుతూ ఉంది.

కుఱవంజి 

తెలిసినంతలో తెలుగువారి మొదటి జానపద కళారూపం కొరవంజి. ఈ విషయాన్ని దృశ్య కళారూపాల మీద పరిశోధించిన చాలామంది పెద్దలు ఋజువు చేశారు. దీన్ని కుఱవంజి అని కూడా ఉచ్చరిస్తున్నారు.

వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఈ పదం నుంచే యక్షగానం అనే పదం ఉత్పన్నమైందని చెప్పారు. కుఱవంజి అంటే కొరవజాతి స్త్రీ (ఎఱుకది) అని సూర్యారాయాంధ్ర నిఘంటువు చెబుతుంది. కొరవంజి అను పాత్ర ప్రవేశము గల యక్షగాన రచనకు కొరవంజి అనిపేరు అని ఆంధ్ర వాఙ్మయ సూచిక చెబుతుంది. వంజి అంటే తమిళభాషలో స్త్రీ అని అర్థం. దక్షిణదేశంలో కొరవలుగా చెప్పబడుతున్న జాతిని తెలుగునాట ఎరుకలు అని పిలుస్తారు. అక్కడా ఇక్కడా ఈ జాతి స్త్రీ ఎరుక చెప్పడం ఉంది. దీనిని బట్టే ఈ జాతి ఎరుకలుగా పిలువబడుతున్నారు. వీరి వేషంలో చోటు చేసుకొన్న రకరకాల చర్మాలు, నెమలి ఈకలు, పులి గోళ్ళు వంటి వస్తువులతో వీరిని మొదట ఆటవికులై ఉండవచ్చని భావించవచ్చు.


ఈ కళారూపాన్ని గూర్చి శిలప్పదిగారంలో కురవైక్కూత్తు అని నృత్యవిశేషంగా చెప్పారు. అంటే ఈ కళారూపం ఎంత ప్రాచీనమైందో చెప్పవచ్చు. శిలప్పదిగారం క్రీ.శ. 2వ శతాబ్దం కాలం నాటిదని (దీక్షితులు వి.ఆర్‌.ఆర్‌.) పెద్దలు చెప్పారు. తమిళ దేశంలో కొండజాతి స్త్రీలు (కొరవలు) సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని కొలుస్తూ చేసే నృత్యం ఒకటి, కొరవ స్త్రీలు శ్రీకృష్ణుని కొలుస్తూ (రాసలీల) చేసే నృత్యం మరొకటి ప్రచారంలో ఉండేవని తెలుస్తుంది. మద్రాసు విశ్వవిద్యాలయ తమిళ నిఘంటువు కూడ కురవ అంటే ఒక నాట్య విశేషంగా చెప్పింది. అది మండల నృత్యంగా ఉండేదని ఉదహరించింది. తరువాతి కాలంలో తమిళంలో కొరవంజి పేరునే కొన్ని రచనలు వచ్చాయి. ఇప్పటికీ జానపద ప్రదర్శనలు వారు ప్రదర్శిస్తూనే ఉన్నారు.


తెలుగులో కొరవంజి శబ్దం మొదట వాడినవారు అయ్యలరాజు రామభద్రకవి. రామాభ్యుదయం ద్వితీయాశ్వాసంలో 131వ పద్యంలో,


అణునిభ మధ్యలాక్రియలు నాపరిభాషలు నొప్పఁజిందు జ

క్కిణి కొరవంజి మేళములఁ గేళిక సల్పిరి దేవతా నటీ

మణులకు బొమ్మువెట్లు క్రియ మర్దళతాళ నినాద పద్ధతిన్‌

రణదురు రత్ననూపుర ఝణం ఝణముల్‌ మెఱయం బదాహతిన్‌

అని కొరవంజి ప్రస్తావన చేశాడు. అంటే విజయనగర రాజుల కాలంలో దక్షిణాది అన్ని ప్రాంతాల్లోనూ ఈ కళారూపం విశేష ప్రచారంలో ఉండేదని చెప్పవచ్చు. అంతే కాదు యక్షగానంతో సమానమైన స్థానం ఈ కళారూపానికిచ్చి పోషించారని కూడా భావించవచ్చు.


కాలక్రమేణ కొరవంజి కళారూపానికి ఆదరణ అంతంత మాత్రం అయిపోయింది. కళారూపంలోనికి ప్రధాన పాత్రలు సింగి, సింగడు మాత్రం మిగిలాయి. ఎరుక చెప్పడం, అదే జీవనోపాధిగా ఎరుకలు స్వీకరించారు 


జానపద గేయాలనీ జానపద సాహిత్యమనీ, జానపద వీథి నాటకమనీ, తోలు బొమ్మలనీ, బుర్ర కథలనీ, పగటి వేషాలనీ,కురవంజి ఇలా ఎన్నో వందలాది జానపద కళా రూపాలు ఆనాడు పల్లె ప్రజలకు విజ్ఞాన వినోద వికాసాన్ని కలిగించాయి.

ఆంధ్రుల సాంఘిక చరిత్ర రెండు వేల సంవత్సరాల నాటిది. నాటి నుంచి నేటి వరకూ ఆయా రాజుల కాలాల్లో రకరకాలుగా ఈ జానపద కళలు ఆభివృద్ధి చెందాయి. శాస్త్రీయ కళలతో పాటు జానపద కళలు కూడా అభివృద్ధి పొందాయి. ప్రజలు ఆదరించారు.


శతాబ్దాలుగా రాజులు పోయినా, రాజ్యాలు మారినా జానపద కళలు మాత్రం ప్రజా హృదయాలలో అలాగే నిలిచి వున్నాయి. ఎన్ని ఆటు పోటులు వచ్చినా ప్రజలు వాటిని పోషించారు. కళాకారులను కన్న బిడ్డలుగా చూసుకున్నారు. తెలుగుజాతి గర్వించ తగిన కళారూపాలవి.


నాటకం, సినిమా, రేడియో, టెలివిజన్ లాంటి ఆధునిక ప్రక్రియలు రావడంతో ఈనాడు వాటి పట్ల ఆదరణ తగ్గింది. జానపద కళలను పోషించే వారు తగ్గి పోయారు. కళాకారులు కడుపు కోసం, కళలనే పట్టుకుని దేశ సంచారులుగా తిరుగుతూ కళా ప్రదర్శనాలను ప్రదర్శిస్తూ చాలీ చాలని ఆదాయాలతో కడుపు నింపుకుంటూ జీవిస్తున్నారు.

కురవంజి ఒక జానపద దృశ్యకావ్యం. కురవంజి అంటే, ఎరుకలసాని, పూర్వం ఈ ఎరుకలసాని సంఘంలో ఎక్కువ పలుకుబడి సంపాదించుకుంది. ఆ నాడు విజయనగర రాజుల కాలంలోనూ ఎరుకలసాని ఎంతో ప్రాముఖ్యత వహించింది. ఈ ఎరుకలసాని వినోద కాలక్షేపానికీ యదాలాపంగా ఆటలు పాటలు జోడించి ప్రారంభించిన కళారూపం కురవంజి.


                          సశేషం 

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

దుర్గ గుడిలో సేవ

 *విజయవాడ దుర్గ గుడిలో సేవ చేయాలనే భక్తులకు అవకాశం*



 *అమ్మవారి సన్నిధిలో*

 * *సేవ చేసేవారికి రిజిస్ట్రేషన్* *వసతి *ప్రారంభించిన* 

 *ఈవో శీనా నాయక్*



 అమ్మవారి ఆలయంలో భక్తి తత్వంతో సేవ చేయాలనే వారికి.. భక్త బృందాలకు ..

 సేవ చేసేందుకు వీలుగా వారికి అవకాశం కలిగించేందుకు విజయవాడ దుర్గ గుడి ఈవో శీనా నాయక్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎవరైతే భక్తులు అమ్మవారి ఆలయంలో సేవ చేద్దామని భావిస్తున్నారో వారు తమ పూర్తి వివరాలు తెలియజేస్తూ రిజిస్ట్రేషన్

 చేసుకునేందుకు వీలుగా దుర్గగుడి అధికారులు చర్యలు ప్రారంభించారు.




 విజయవాడ దుర్గ గుడి, 

 జులై 26 

 ఇంద్రకీలాద్రి క్షేత్రం దుర్గమ్మ వారి ఆలయంలో సేవ చేయడానికి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ఆరంభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె.శీనానాయక్ తెలిపారు.

 దుర్గమ్మ వారి సన్నిధిలో నిస్వార్థంగా ఉచిత సేవ చేసే సేవకులు, భక్త బృందాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి భక్తుల సేవలో వినియోగిస్తామని పేర్కొన్నారు.

భక్తులుకు త్రాగు నీరు అందించడం, అన్న ప్రసాద వితరణ,ఉచిత ప్రసాద వితరణ, దర్శనం క్యూ లైన్ల నిర్వహణ, క్లోక్ రూమ్, చెప్పుల స్టాండ్, మొబైల్ భద్రపరచే ప్రదేశం, భక్తుల ఫీడ్ బ్యాక్ కౌంటర్, లిప్ట్ క్యూ వద్ద,దేవస్థానం బస్ క్యూ వద్ద, పార్కింగ్, టోల్ గేట్ వద్ద వాహనాలు క్రమబద్దీకరణ తదితర చోట్ల సేవకుల, భక్త బృందాల సేవలు వినియోగించనున్నట్లు ఈవో పేర్కొన్నారు.

సేవ చేయడానికి వచ్చే సేవకులు మొదటగా దేవస్థానం వెబ్ సైట్ www.kanakadurgamma.org లో volunteer విభాగం లో join as అ volunteer గా తమ పేరు,ఫోన్ నెంబర్, పూర్తి చిరునామా, ఫోటో, ఆధార్ తో రిజిస్ట్రేషన్ చేయాలని ఈవో వివరించారు.

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న సేవకులకు సేవ ఎప్పుడు కేటాయించాము, ఎన్ని రోజులు, వసతి, అన్న ప్రసాదం, లాకర్ సౌకర్యం, సేవకులకు తాత్కాలిక గుర్తింపు కార్డు, వసతి నుండి దేవస్థానంకి రవాణా సదుపాయాల వివరాలు మెసేజ్ రూపం లో అందేలా పారదర్శకంగా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని,

భక్తి భావంతో అర్హత గలిగిన వ్యక్తులను సేవకు వినియోగిస్తామని ఈవో శీనా నాయక్ వివరించారు.


 **

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - వర్ష ఋతువు - శ్రావణ మాసం - శుక్ల పక్షం -‌ తృతీయ - మఘ -‌‌ భాను వాసరే* (27.07.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

నడిచే దేవుడు

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀181

ప్రతిరోజూ…

శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…

1311z;204e2. నడిచే దేవుడు…

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌼P0181.పరమాచార్య పావన గాధలు…



                  *తీర్థం - పెళ్ళాం*

                    ➖➖➖✍️

```

తంజావూరు జిల్లా పేరాలం జంక్షనుకు మూడు మైళ్ళ దూరంలో ‘విల్లుకుడి’ అనే గ్రామం ఉంది. 1949లో పరమాచార్య స్వామి వారు ఆ ఊళ్ళో నాలుగు రోజులు మకాం చేసారు. ఆ ఊళ్ళో ఉన్న మా అక్కగారు పాదపూజ చెయ్యడానికి ఆమె స్వామిపాదులను తన ఇంటికి ఆహ్వానించి, ఆ రోజుకు నన్ను కూడా అక్కడికి రమ్మని కబురు చేసింది.


స్వామి దర్శనం కోసం ఆ ఊరి వాళ్ళూ, చుట్టుపక్కల గ్రామస్థులూ, వందలాది ప్రజలూ వచ్చారు, పూజ ముగిసింది. స్వామి వారు భక్తులందరికీ తీర్థం ఇస్తున్నారు. తీర్థం పుచ్చుకుంటున్న వారిలో బొంబై నుండి వచ్చిన భార్యా భర్తలు ఇద్దరున్నారు. ఆ రాత్రే వారు తిరిగి బొంబై పోవడానికి ఏర్పాటు చేసుకున్నారు. వారితో బాటు, వారి కుమారుడు కూడా ఉన్నాడు... సుమారు 25 ఏండ్ల యువకుడు.*”


దంపతులిద్దరూ తీర్థం తీసుకున్నారు. కుమారుడు తీర్థం కోసం చెయ్యి చాపాడు.


“నీవూ, నీ భార్యా ఇద్దరూ వచ్చి తీర్థం పుచ్చుకోండి” అన్నారు స్వామి.


*”ఆ మాట విని తెల్లబోయాడు యువకుడు. దేనికో తటపటాయిస్తున్నాడు. ఇంతలో పక్కగా నిలచిన ఆడవాళ్ళ వైపు నుండి ఇంచుమించు ఇరవై సంవత్సరాల యువతి గబగబా ముందుకు వచ్చి ఆ యువకుడితో పాటు తానూ చేయిజాపింది. ఇద్దరూ కలిసి తీర్థం పుచ్చుకున్నారు.


తీర్థం తీసుకుని ఆ అమ్మాయి ఆ యువకుడి వెంట ఉండకుండా, దూరంగా వెళ్ళి నిలబడ్డది. స్వామి ఆ నలుగురిని ఆశీర్వదించి బొంబై వెళ్ళండని అనుజ్ఞ ఇచ్చారు.


ఆ తతంగమంతా చూస్తున్న మాకు ఆశ్చర్యం వేసింది. బొంబై నుండి వచ్చిన తలిదండ్రులిద్దరికి స్వామి తీర్థం ఇవ్వడమేమిటి, కుమారుడు రాగానే ‘భార్యాభర్తలు ఇద్దరూ వచ్చి తీర్థం పుచ్చుకోండి’ అని ఆదేశించడము ఏమిటి, ఆ యువకుడి భార్య ఎక్కడ నుంచో ఊడిపడ్డట్టు వచ్చి తీర్థం పుచ్చుకుని, తిరిగి దూరంగా వెళ్ళి నిలబడడమేమిటి, నలుగురూ కలిసి బొంబై వెళ్ళండని వారిని స్వామి ఆజ్ఞాపించడమేమిటి? ఇదంతా ఏదో వింతగా తోచింది అందరికీ!!!


బొంబై నుండి వచ్చిన ఆ పెద్దమనిషిని సమీపించి, ఆయనను అడిగాను ‘ఏమిటి ఈ వ్యవాహరమంతా?’ అని.


ఆయన ముందు కాస్త వెనకాడాడు తమ ఉదంతం చెప్పడానికి. తరువాత బయటపెట్టాడు కథ. కట్నం విషయంలో ఏదో కొంత పేచీ వచ్చిందనీ, ఆ కారణంగా మూడు సంవత్సరాల నుండీ తన కొడుకూ కోడలూ కలిసి కాపురం చెయ్యడం లేదనీ, తమ కోడలు ఇక్కడికి వచ్చే సంగతి తమకు ముందుగా తెలియదనీ, తాము స్వామి దర్శనం నిమిత్తం మాయూరం నుండి కారులో వచ్చామనీ, స్వామి ఆజ్ఞ అనుసరించి, ఇప్పుడిక కోడలను కూడా వెంటబెట్టుకుని బొంబైకి వెళ్ళదలచామని కథంతా వెళ్ళగక్కాడు.


అంతటితో నేను తృప్తి చెంది ఊరుకోలేదు. ఆ అమ్మాయిని అడిగాను. “ఏమిటమ్మా నీ పరిస్థితి?” అని. 


భరించలేని ఆవేదనతో ఆ అమ్మాయి మాట్లాడలేకపోయింది. అంతట పక్కనే ఉన్న ఆ పిల్ల తల్లి ఇలా చెప్పింది.


“కట్నం విషయంలో వచ్చిన మనస్పర్థల వల్ల మూడేళ్ళుగా నా కూతురు నా దగ్గరే ఉంటున్నాది. స్వామితో మా అవస్థ చెప్పుకుంటే, స్వామి ఏదైనా దారి చూపిస్తారనే ఆశతో మేము ఇక్కడికి వచ్చాము. అంతేగాని, మా వియ్యంకుడూ, వియ్యపురాలూ, అల్లుడూ వీరంతా ఇక్కడికి వచ్చే సంగతి మాకు ముందుగా తెలియదు. ఈ మూడేళ్ళ నుంచీ మాకూ వారికీ ఉత్తర ప్రత్యుత్తరాలేమి లేవు. ఇదంతా మాకూ వింతగానే ఉంది. అంతా స్వామి దయ”


కోడలును కూడా వెంటబెట్టుకుని నలుగురూ బొంబైకి వెళ్ళండని స్వామి ఆదేశించారు కాబట్టి, వెంటనే బయలుదేరి తమతో రమ్మని పిల్లవాని తండ్రి కోడలుతో చెప్పాడు.


“మేము ఇక్కడికి వచ్చేటప్పుడు బొంబై ప్రయాణం సంగతి మాకు తెలియకపోవడం చేత అమ్మాయి తన బట్టలు తెచ్చుకోలేదు” అన్నది పిల్ల తల్లి.


“లేకపోతే పరవాలేదు. అమ్మాయికి కావలసిన బట్టలన్నీ బొంబైలో కొంటాము” అంటూ కోడలును వెంటబెట్టుకుని బయలుదేరారు బొంబై ఆసాములు. 


ఆ అమ్మాయి తల్లికి కలిగిన ఆనందం అడుగుతారూ!!!


బొంబై కుర్రవాడు తీర్థం పుచ్చుకోవడానికి చేయిజాపినప్పుడు ‘భార్యాభర్తలిద్దరూ కలిసి తీర్థం పుచ్చుకోండి’ అని స్వామి సూచించడానికి, ఆ యువకుని భార్య అక్కడే ఉన్నట్టు స్వామికి ఎట్లా తెలుసు?✍️```


*ఈ ప్రశ్నకు సమాధానం ఎవ్వరూ చెప్పలేరు.*

--- శ్రీ టి.కె త్యాగరాజన్, ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ మాజీ జనరల్ మేనేజర్.

```

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥


#KanchiParamacharyaVaibhavam #

 “కంచిపరమాచార్యవైభవం”!🙏

. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

         🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.

         ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

“భగవంతుని విషయాలు గ్రూప్” లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏```

ఆదివారం 27 జూలై 2025🌞*

 🔯🌹🌷🪔🛕🪔🌷🌹🔯

*🌞ఆదివారం 27 జూలై 2025🌞*

                        1️⃣3️⃣

                    *ప్రతిరోజూ*

*మహాకవి బమ్మెర పోతనామాత్య*

         

        *శ్రీమద్భాగవత కథలు*```


(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా)```


``                     

*వేదాలు వేయి సార్లు చదివినా లభ్యం కాని ముక్తి, భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది..!*``


 *పాండవుల స్వర్గారోహణ*

        *పరీక్షిత్తు పాలన*          

```

ఒకనాడు ధర్మరాజు భీముడితో ఇలా అన్నాడు: “కాలం పోకడ చాలా వింతగా ఉన్నది. శ్రీకృష్ణుడిని చూడడానికి అర్జునుడు వెళ్లి ఏడు నెలలు దాటింది. ఇంకా తిరిగి రాలేదు. మురారి క్షేమంగా ఉన్నదీ, లేనిదీ అర్థం కావడం లేదు. 

నా మనస్సు విచారంగా ఉన్నది. దుశ్శకునాలు కనపడుతున్నాయి. మాధవుడు అవతారాన్ని ఉపసంహరించుకుందామని అనుకుంటున్నాడేమో? శ్రీకృష్ణుడి వృత్తాంతం తెలియడం లేదు” అని ధర్మరాజు భీముడితో విచారించసాగాడు.


అదే సమయంలో అర్జునుడు దుఃఖ భారంతో యాదవపురి నుండి తిరిగి వచ్చాడు. తన పాదాలమీద వాలిపోయిన తమ్ముడు అర్జునుడిని చూసి ధర్మరాజు, యాదవపురిలో అంతా క్షేమమే కదా అని పేరు పేరున అందరి గురించి అడిగాడు. ముఖ్యంగా శ్రీకృష్ణుడిని గురించి మరీ మరీ అడిగాడు. ఇలా అడిగిన అన్న గారితో అర్జునుడు, గద్గత స్వరంతో, శ్రీకృష్ణుడు అందర్నీ విడిచి పెట్టి వెళ్లిపోయిన విషయం బయట పెట్టాడు. వివిధ సందర్భాలలో ఆ మహానుభావుడు శ్రీకృష్ణుడు తమకు చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుంటూ ఆ మాటలు బాధాకరంగా చెప్పాడు అర్జునుడు.


నిండు సభలో ద్రౌపదిని ఆదుకున్న సందర్భం, దుర్వాసుడి కోపాగ్ని నుండి తమను కాపాడిన సందర్భాన్ని, పాశుపతాస్త్రాన్ని ఆయన దయతో పొందిన సందర్భాన్నీ, గోగ్రహణ విజయ సందర్భాన్నీ, కుఱుక్షేత్రంలో తనకు సారథిగా ప్రోత్సహించిన సందర్భాన్నీ, తనను యుద్ధంలో భీష్మ, కృపాచార్య, అశ్వత్థామ, కర్ణ, ద్రోణ మహావీరుల నుండి కాపాడిన సందర్భాలనూ, సైంధవ వధనాడు అండగా ఉండడాన్నీ అన్నగారితో పంచుకున్నాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు శరీరాన్ని విడిచిన తరువాత, ఆయన పదహారువేల మంది శుద్ధాంత స్త్రీలను తీసుకొస్తున్నప్పుడు బోయలు చుట్టుముట్టి అల్లరి చేస్తుంటే, చక్రిలేని కారణంగా తాను ప్రయోగించిన అస్త్రాలు వ్యర్థమైపోయిన సంగతి కూడా ధర్మరాజుకు చెప్పాడు. హరి వచనాలను తలచుకుంటూ, తన మనస్సు పరమేశ్వరుడి మీదనే ఉన్నదని చెప్పి మౌనంగా ఉండి పోయాడు అర్జునుడు.


ధర్మరాజు భగవంతుడైన శ్రీకృష్ణుడు వెళ్లిన మార్గాన్ని తెలుసుకుని, యాదవులు నాశనమైన విషయాన్ని కూడా విని, నిశ్చలమైన చిత్తంతో లోకాన్ని విడిచి పెట్టడానికి సిద్ధపడ్డాడు. మాధవుడి స్వర్గారోహణం విన్న కుంతీదేవి భక్తితో ఈ లోకాన్ని విడిచి పెట్టింది. ఏ రోజునైతే శ్రీకృష్ణుడు 

ఈ భూమ్మీద తన శరీరాన్ని విడిచి పెట్టేశాడో ఆ రోజు నుండి అశుభమైన కలియుగం ప్రారంభమైంది. ధర్మరాజు హస్తినాపురంలో మనుమడైన పరీక్షిత్తును రాజుగా దీవించి అభిషేకం చేశాడు. అనిరుద్దుడి కుమారుడైన ప్రజుడిని మధురకు రాజుగా పట్టం కట్టాడు.


ఆ తరువాత ధర్మరాజు వైరాగ్య మార్గాన్ని ఆశ్రయించాడు. ప్రాజాపత్యం అనే ఇష్టిని చేసి, అన్ని బంధాలను తెగతెంపులు చేసుకున్నాడు. నార చీరెలు ధరించి, మౌనిగా, నిరాహారుడై, దేనిమీదా ఆసక్తిలేకుండా, ఉత్తర దిక్కుగా ప్రయాణం సాగించాడు. ఆయన తమ్ములు అర్జున, భీమసేనాదులు ఆయన్ను అనుసరించారు. నారాయణ స్థానానికి చేరుకున్నారు. తదనంతరం, విదురుడు శరీరాన్ని విడిచి పెట్టాడు. ద్రౌపదీ దేవి కూడా వాసుదేవుడి మీద మనస్సు నిలిపి ఆ లోకాన్ని చేరుకుంది.


పట్టాభిషిక్తుడైన పరీక్షిత్తు సమస్త విద్యలను నేర్చుకున్నాడు. మహాభాగవత శేఖరుడై రాజ్య పాలన చేస్తూ, ఉత్తరుడి కూతురు ఇరావతిని పెళ్లి చేసుకుని జనమేజయుడుతో సహా నలుగురు కుమారులను కన్నాడు. మూడు అశ్వమేధ యాగాలను చేశాడు. కలిని శిక్షించాడు.


ఆ వివరాల్లోకి పోతే: పరీక్షిన్మహారాజు తన రక్షణలో ఉన్న కురుజాంగల దేశంలోకి కలి ప్రవేశించాడని విన్నాడు. యుద్ధం చేయాలన్న సంకల్పంతో దిగ్విజయ యాత్రకు బయల్దేరి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణంలో ఉన్న కురుభూములను జయించాడు. 

ఈ నేపథ్యంలో, ఒకనాడు, వృషభరూపాన్ని ధరించి ఒంటికాలితో సంచరిస్తున్న ధర్మదేవుడు, తన సమీపంలో ఆవు రూపంలో కన్నీరు కారుస్తూ ఉన్న భూదేవితో ఎందుకు అలా ఉన్నావని అడిగాడు. ఆమెకు వచ్చిన ఆపద ఏమిటని ప్రశ్నించాడు. జవాబుగా భూదేవి, 'ఈ లోకంలో పూర్వం నాలుగు పాదాలతో నడిచే నువ్వు ఈనాడు శ్రీవల్లభుడు లేని కారణంగా ఒంటికాలి మీద నడుస్తున్నావు కదా! అలాగే, చక్రి అవతారం చాలించగానే పాప సమూహంతో నిండిన జనాలను చూసి నేను దుఃఖిస్తున్నాను. దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, నాకు, నీకు, ధీరులకు, నానా వర్ణాశ్రమాల వారికి, గోవులకు బాధలు కలుగుతున్నందు వల్ల నేను దుఃఖిస్తున్నాను' అన్నది. 


ఇలా వారిద్దరూ తూర్పు దిక్కుగా ప్రవహించే సరస్వతీ నదీతీరంలో వృషభ, గోవు రూపాలలో మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడికి పరీక్షిత్తు వెళ్లాడు.


అప్పుడు ఆ వృషభాన్ని, రాజు వేషంలో ఉన్న ఒక క్రూరుడు, రాక్షసుడులాగా నేలమీద పడేట్లు తన్నాడు. అది అప్పుడు మూత్ర విసర్జన చేస్తూ నేలమీద పడిపోయింది. ఆ తరువాత పరమ పవిత్రమైన గోవును కూడా బలంగా తన్నాడు. ఇలా ఆ రెంటినీ దుర్మార్గంగా తన్నుతున్న రాజలక్షణాలతో ఉన్న పురుషుడిని చూశాడు. వెంటనే తన కోదండాన్ని ఎక్కు పెట్టాడు. వాడిని దండిస్తానన్నాడు. తన బాణంతో వాడిని చంపుతానని వృషభంతో, గోవుతో అన్నాడు. అలా భూదేవిని, ధర్మదేవతను బుజ్జగించి పరీక్షిత్తు తన ఖడ్గంతో 'కలి' ని రూపుమాపాలని ప్రయత్నించాడు. అప్పుడు వాడు తన రాజవేషాన్ని విడిచి వాడిపోయిన ముఖంతో భయపడి, పరీక్షిత్తు పాదాలమీద పడ్డాడు. శరణు వేడాడు. తనను చంపవద్దని ప్రాధేయపడ్డాడు.


పరీక్షిత్తు అప్పుడు వాడిని మందలించి, తన దుర్జన భావాన్ని విడిచిపెట్టి వెళ్లమని చెప్పాడు. పాపులకు బంధువైన వాడు తాను పాలిస్తున్న భూమ్మీద నిలవడానికి వీల్లేదన్నాడు. ఇక్కడ ఉండవద్దు అన్నాడు. తాను ఎక్కడికి పోవాలో చెప్పమని అడిగాడు కలి. జవాబుగా రాజు.. ‘ప్రాణివధ, స్త్రీ, జూదం, మద్యపానం’ అనే నాలుగు స్థానాలను ఇచ్చాడు కలికి. 


అవి తనకు సరిపోవని చెప్పేసరికి, సువర్ణం మూలంగా కలిగే ‘అసత్యం, మదం, కామం, హింస, వైరం’ అనే అయిదు ప్రదేశాలను ఇచ్చాడు. 


మిగతా ప్రదేశాలను స్పృశించకూడదు అని గట్టిగా చెప్పాడు. 


ఇలా కలిని నిగ్రహించి, వృషభ మూర్తి అయిన ధర్మదేవుడికి ఆయన పోగొట్టుకున్న తపస్సు, శుచిత్వం, దయ అనే మూడు పాదాలను ఇచ్చాడు. అప్పుడు భూదేవి అపరిమితమైన ఆనందాన్ని పొందింది.


ఆ తరువాత పరీక్షిత్తు హస్తినాపురంలో కౌరవ సామ్రాజ్య లక్ష్మిని పాలించాడు. శ్రీహరి నిర్యాణం అనంతరం భూలోకం అంతా వ్యాపించిన కలి, పరీక్షిత్తు కాలంలో మాత్రం అణగి మణగి ఉన్నాడు. అలా కలిప్రభావం తన రాజ్యంలో లేకుండా చేసినప్పటికీ, కలిని మాత్రం ప్రాణాలతో విడిచి పెట్టాడు.

```

                *(సశేషం)*

*🙏కృష్ణం వందే జగత్ గురుమ్!🙏*

``

         *రచన:శ్రీ వనం*    

  *జ్వాలా నరసింహారావు*                                       

 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

            🌷🙏🌷```


 *🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

ఆదివారం🌞* *🌹27 జూలై 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       *🌞ఆదివారం🌞*

   *🌹27 జూలై 2025🌹*  

     *దృగ్గణిత పంచాంగం*  

                  

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* *దక్షిణాయనం - వర్షఋతౌః* 

*శ్రావణమాసం - శుక్లపక్షం*


*తిథి  : తదియ* రా 10.41 వరకు ఉపరి *చవితి*

*వారం    : ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం   : మఖ* సా 04.23 ఉపరి *పూర్వ ఫల్గుణి (పుబ్బ)*


*యోగం : వరీయాన్* రా 03.03 వరకు ఉపరి *పరిఘ*

*కరణం  : తైతుల* ఉ 10.36 *గరజి* రా 10.41 ఉపరి *వణజి*


*సాధారణ శుభ సమయాలు:*

 *ఉ 06.30 - 09.30 మ 02.00 - 04.30*           

అమృత కాలం  : *మ 01.56 - 03.34*

అభిజిత్ కాలం  : *ప 11.48 - 12.40*

*వర్జ్యం      : రా 12.47 - 02.28*

*దుర్ముహూర్తం  : సా 04.58 - 05.50*

*రాహు కాలం   : సా 05.04 - 06.41*

గుళికకాళం       : *మ 03.28 - 05.04*

యమగండం     : *మ 12.14 - 01.51*

సూర్యరాశి : *కర్కాటకం*

చంద్రరాశి : *సింహం*

సూర్యోదయం :*ఉ 05.54*

సూర్యాస్తమయం :*సా 06.51*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.47 - 08.21*

సంగవ కాలం         :      *08.21 - 10.56*

మధ్యాహ్న కాలం    :     *10.56 - 01.31*

అపరాహ్న కాలం    : *మ 01.31 - 04.06*


*ఆబ్ధికం తిధి         : శ్రావణ శుద్ధ తదియ*

సాయంకాలం        :*సా 04.06 - 06.41*

ప్రదోష కాలం         :  *సా 06.41 - 08.55*

రాత్రి కాలం           :*రా 08.55 - 11.52*

నిశీధి కాలం          :*రా 11.52 - 12.36*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.18 - 05.02*

*****************************

         *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌞శ్రీ సూర్య పంజర స్తోత్రం🌞* 


*తేజోవర్ణాయ మమ* 

*సర్వరాజస్త్రీపురుష*

*వశీకరణార్థం పశ్చిమదిగ్భాగే* 

*మాం రక్షతు*


🙏 *ఓం నమో సూర్యాదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

26, జులై 2025, శనివారం

పండుగల నెల శ్రావణం

 


శ్రీభారత్ వీక్షకులకు శ్రావణ శుభాకాంక్షలు 🌹ఒక్క నెలలో ఇన్ని పండుగలా! అని ఆశ్చర్యపోతాం శుభ శ్రావణాన్ని చూసి. మంగళ గౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి, రాఘవేంద్ర జయంతి, పోలాల అమావాస్య వంటి దాదాపు పన్నెండు పండుగల నెల శ్రావణం. ఆ వివరాలు చాలా చక్కగా చెప్పారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

_అమ్మను మించిన

 *_అమ్మను మించిన దైవమున్నదా...!?!?_*

================

🌸 _అమ్మకు ఆరోగ్యం బాలేకపోతే.. కొడుకు హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు... పరిస్థితి సీరియస్... లోపల ట్రీట్మెంట్ జరుగుతోంది. కొడుకు ఆందోళనతో ఉన్నాడు. మధ్యాహ్నం ఒంటిగంట అవుతోంది. అతనికి ఆకలి అవుతోంది. ఈలోగా డాక్టర్ వచ్చి *"ఏం పర్వాలేదు.. నువ్వు వెళ్లి భోజనం చేసిరా!"* అని లోపలికి వెళ్ళిపోయాడు._

 

_మరలా ఓ రెండు గంటల తర్వాత ఆ కొడుకుకి డాక్టర్ ని కలిసే అవకాశం వచ్చింది. *"మా అమ్మ పరిస్థితి ఎలా ఉంది డాక్టర్ ..?"* ఆందోళనగా అడిగాడు కొడుకు..._


_డాక్టర్ గోడ గడియారం వైపు చూస్తూ... *"భోజనానికి వెళ్లొచ్చారా..?"* అంటూ వాకబు చేశాడు..._


_ఆ ప్రశ్న ఎందుకో అసందర్భంగా అనిపించింది అతడికి._ _*"ఆఁ! ఔను డాక్టర్... ఇప్పుడే చేశాను సార్..! మా అమ్మ పరిస్థితి... ఎలా ఉందో చెప్పండి సార్!*" అంటూ కాస్తా చిరాగ్గా, అంతకుమించి ఆత్రంగా అడిగాడు. దానికి చాలా ఇబ్బంది పడుతూనే జవాబిచ్చాడు వైద్యుడు..._


 _*"మీ అమ్మగారు ఇకలేరు. రెండు గంటల క్రితమే... మరణించారు!"* చెప్పాడు వైద్యుడు..._


_*"ఇది దారుణం.. ఇది అన్యాయం. ఆ విషయం ఇంత ఆలస్యంగా చెబుతారా..!?"* కోపం వచ్చింది అతడికి..._


_సమాధానంగా, ఓ కాగితం చూపించారు వైద్యుడు. అందులో... *"మా అబ్బాయి ఆకలికి తట్టుకోలేడు. ఆరునూరైనా మధ్యాహ్నం ఒంటిగంటకు భోంచేయాల్సిందే.. ఒకవేళ ఆలోపు నేను చనిపోయినా వాడితో చెప్పకండి డాక్టర్...!🙏"*_


*ఇంతకు మించి, అమ్మ గురించి ఇంకేం చెప్పగలం?* 

💐💐🚩🤔🤔🤔 *_మాతృదేవోభవ_* 💐💐🙏🙏🙏🙏

----------------------

*_{చాలా ఏళ్ళ క్రితం ఎక్కడో చదివి, సేకరించాను.: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు🙏}_*

గురువారం 24 జూలై 2025🌹*

 🔯🌹🌷🪔🛕🪔🌷🌹🔯

*🌹గురువారం 24 జూలై 2025🌹*

                         🔟

                 *ప్రతిరోజూ*

 *మహాకవి బమ్మెర పోతనామాత్య*


   *శ్రీమద్భాగవత కథలు*```


(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా)```

``

*వేదాలు వేయి సార్లు చదివినా లభ్యం కాని ముక్తి, భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది..!*``


          *వ్యాస మహర్షి*

             *భాగవతం*

       *ఎందుకు రాశాడు*               

```

మహర్షి వేదవ్యాసకృతమైన శ్రీమద్భాగవతం 'జన్మాద్యస్య యతో' అనే శ్లోకంతో ప్రారంభం అవుతుంది. అలాగే పోతనగారి తెలుగు భాగవతం 'విశ్వజన్మస్థితివిలయంబు లెవ్వని వలన' అనే పద్యంతో మొదలవుతుంది. జగత్తు సృష్టి, స్థితి, లయలు ఆ పరమాత్ముడి తోనే ఏర్పడ్డాయన్న అర్థంతో రాయడం జరిగింది వీటిని. పరమాత్మ ఉనికితోనే సృష్టికి ఉనికి ఏర్పడిందని దీని భావన. అందువల్ల ఆ పరమ సత్యమైన పరమాత్మను రచయితలు (సంస్కృతంలో వ్యాస మహర్షి, తెలుగులో బమ్మెర పోతనామాత్యుడు) ధ్యానించారు. 

వ్యాస మహర్షి శ్లోకం, బమ్మెర పోతన పద్యం ఇవే:```


*శ్లో: జన్మాద్యస్య యతో న్వయాదితరతశ్చార్థెష్వభిజ్ఞః స్వరాట్*

 *తేనే బ్రహ్మ హృదా య ఆదికవయే ముహ్యన్తి యత్సూరయః*

 *తేజోవారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గోమృషా*

 *ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి*


*సీ: విశ్వజన్మస్థితివిలయంబు లెవ్వని వలన నేర్పడు ననువర్తనమున*

 *వ్యావర్తనమునఁ గార్యములం దభిజ్ఞుడై తాన రాజగుచుఁ జిత్తమునఁజేసి*

 *వేదంబు లజునకు విదితముల్ గావించె నెవ్వఁడు బుధులు మోహింతురెవ్వ*

 *నికి నెండమావుల నీటఁ గాచాదుల నన్యోన్యబుద్ధి దా నడరునట్లు*


*ఆ: త్రిగుణసృష్టి యెందు దీపించి సత్యము, భంగిఁదోఁచు స్వప్రభానిరస్త*

 *కుహకుఁడెవ్వఁడతని గోరి చింతించెద, ననఘు సత్యుఁబరుని ననుదినంబు*```


అరణ్యాలన్నింటిలోకి నైమిశారణ్యం ప్రశస్తమైనది. ఆ నైమిశారణ్యంలోని విష్ణు క్షేత్రంలో శౌనకాది మహామునులు సత్రయాగాన్ని చేయడం మొదలు పెట్టారు. వారంతా సూతమహామునిని తమకు హరికథలు వినిపించమని కోరారు. వారి కోరికను అర్ధం చేసుకున్న సూతమహాముని నరనారాయణులకు నమస్కారం చేసి, భారతీదేవికి మొక్కి, వ్యాస భగవానుడి పాదాలకు ప్రణామం చేసి చెప్పడం ప్రారంభించాడు. దాని సారాంశమే ఇది...


ఈ విశ్వానికి పరమ పురుషుడు ఒక్కడే! ఆయనే పుట్టించడం, పాలించడం, నాశనం చెయ్యడం అనే పనులను బ్రహ్మ, విష్ణు, శివుడు అనే పేర్లతో చేస్తూ ఉంటాడు. ఆ ముగ్గురిలోనూ హరి చరాచర కోటికి శుభాలను ఇస్తాడు. భగవంతుడు 21 అవతారాలను ఎత్తాడు. 

ఈ కలియుగ- కృతయుగ సంధిలో 22 వ అవతారంలో విష్ణుయశుడు అనే బ్రాహ్మణుడికి కల్కి అనే పేరుతో అవతరిస్తాడు. ఈ అవతారాలన్నీ విష్ణువు అంశతో జన్మించిన వారే. శ్రీరాముడైనా, శ్రీకృష్ణుడైనా, వామనుడైనా, నృసింహస్వామి అయినా అంతా ఆయన అవతారాలే. ఆయన అవతారాల చరిత్ర సమస్తాన్ని భాగవత గ్రంథ రూపంలో వేదవ్యాస మహర్షి చెప్పాడు. శుకుడు అనే తన కొడుకుతో చదివించాడు. సకల వేదాల సారభూతమైనదీపురాణం. దీనిని శుక మహర్షి పరీక్షిన్మహారాజుకు చెప్పాడు.


అవే విషయాలను తనకు వచ్చిన రీతిలో శౌనకాది మహామునులకు చెప్తానన్నాడు సూతుడు. సూతమహాముని ఈ విషయం చెప్పగానే, భాగవత రచనలోని అంతరార్థం, ఎలా వ్యాసుడు భాగవత రచన చేశాడు, ఎందుకు చేశాడు, ప్రేరణ ఎవరిదీ, ఎందుకీ పురాణ గాథను పరీక్షిత్తుకు శుకుడు చెప్పాడు, అని అడిగారు వారంతా. 


ఆ విషయాలను చెప్తూ ఇలా అన్నాడు:


ఒకనాడు సకల లోకసంచారి నారద మహర్షి అశాంతితో వున్న వేదవ్యాసుడి దగ్గరకు వచ్చాడు. యధావిధిగా పూజలు అయిన తరువాత వారు సంభాషించారు. తన అశాంతికి కారణం తెలియడంలేదన్నాడు వ్యాసుడు. వ్యాసుడు సకల ధర్మాలను చెప్పినప్పటికీ, విష్ణు కథలను కొంచెమే చెప్పాడనీ, కేవలం ధర్మాలు చెప్తే సరిపోదనీ, గుణవిశేషాలు కూడా చెప్పాలనీ, శ్రీమహావిష్ణువును పొగడక పోవడమే ఆయన అశాంతికి కారణమనీ అన్నాడు నారదుడు. తెలియనివాడికి తెలిసేట్లుగా ఈశ్వరలీలలు గురించి వివరించమని చెప్పాడు. తన జన్మ వృత్తాంతాన్నీ, తానూ ముల్లోకాలు విష్ణు కథా గానం చేస్తూ తిరుగుతున్న వైనాన్నీ వివరించి నారదుడు వెళ్ళిపోయాడు.


నారదుడు వెళ్ళిపోయిన తరువాత ఆయన మాటలు అర్ధం చేసుకున్న వ్యాస మహర్షి, ఆ తరువాత, ఏం చేశాడో ఇలా చెప్పాడు సూతుడు శౌనకాది మహామునులకు.


సరస్వతీ నది పడమటి తీరంలో ఋషులు యాగాలు చేసుకోవడానికి వీలుగా బదరీ వృక్షాలతో కూడిన 'శమ్యాప్రాసం' అనే ప్రసిద్ధమైన ఆశ్రమం ఉన్నది. అక్కడ కూర్చుని వేదవ్యాసుడు జలాలను వార్చి, తన మనస్సును స్థిరం చేసుకుని, భక్తితో పూర్ణుడైన ఈశ్వరుడిని చూశాడు. నారాయణుడి మీద భక్తి మినహా తనకు వేరే ఉపశమనం లేదని నిశ్చయించుకున్నాడు.


ఈ భూమండలం మీద ఏ మహా గ్రంథాన్ని విన్న మాత్రం చేతనే లోకాలకు ఆధారభూతుడైన మాధవుడి మీద భక్తి విశేషాలు పుడతాయో, అలాంటి, ద్వాదశ స్కంధ భాగవతం అనే మహా గ్రంథాన్ని వ్యాస మహర్షి నేర్పుతో వ్రాశాడు. రాసి, దాన్ని నిర్మించి, మోక్షార్థి అయిన శుక మహర్షితో చదివించాడు. శ్రీహరి గుణాలను వర్ణించడం అంటే ఆసక్తికలవాడు, ఆయనమీద అమితమైన భక్తి కలవాడైన శుక మహర్షి ముల్లోకాలకు మంగళకరమైన భాగవత సంహితను పఠించాడు. వేదాలు వేయి సార్లు చదివినా ముక్తి లభ్యం కాదు కాని, భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది.

```

                *(సశేషం)*

*🙏కృష్ణం వందే జగత్ గురుమ్!🙏*


          *రచన:శ్రీ వనం* 

   *జ్వాలా నరసింహారావు*

 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

               🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

నాన్న నేర్పిన చదువు:*

 *నాన్న నేర్పిన చదువు:*


*తండ్రి:-*

।।ఓం నమః శివాయ।।

అబ్బాయీ! *పద్మము* అనే పదానికి పర్యాయవాచకాలను చెప్పు?


*కొడుకు:-*

కమలము, నళినము, తామరపూవు


*తండ్రి:-*

అంతేనా!?


*కొడుకు:-*

నాకంతే తెలుసు!!!


*తండ్రి:-*

నేను చెబుతాను చూడు - *వారిజము, నీరజము, జలజము, సలిలజము, కంజము, తోయజము, ఉదకజము, పుష్కరజము, పయోజము, అంభోజము, అంబుజము...*


*కొడుకు:-*

నాన్నా! నాన్నా! ఆగు.


*తండ్రి:-*

చెప్పు.


*కొడుకు:-*

వీటన్నిటికీ అర్థం *పద్మం* అనేనా!?


*తండ్రి:-*

అవును.


*కొడుకు:-*

మరి *నిఘంటువు* (డిక్షనరీ) వెదికితే ఇవన్నీ దొరుకుతాయా!?


*తండ్రి:-*

ఆయా డిక్షనరీ కర్తల ఓపికను బట్టి ఉంటుంది. అన్నీ అన్నిట్లోనూ దొరకకపోవచ్చు.


*కొడుకు:-*

మరి డిక్షనరీలలో కూడా దొరకని పదాలు నీకెలా దొరికాయి!?


*తండ్రి:-*

నేను *అమరకోశం* చదువుకున్నాను. అందువల్ల నేనే స్వయంగా అనేకపదాలను సృష్టించగలను. నాకు వేరే డిక్షనరీ అవసరం లేదు.  


*కొడుకు:-*

అదెలా!?


*తండ్రి:-*

*అమరకోశం* లో కొన్ని *పర్యాయపదా* లను *అమరసింహుడు* ఉపదేశించాడు. వాటికి కొన్ని *ప్రత్యయాలు* (Suffix) జోడిస్తే వేరే అర్థాన్ని బోధించే పదాలను మనం కూడా సృష్టించుకోవచ్చును.


*కొడుకు:-*

ఎలా?


*తండ్రి:-*

చెబుతా చూడు - *1. వారి, 2.నీరమ్, 3. జలమ్, 4.సలిలమ్, 5. కమ్, 6.తోయమ్, 7. ఉదకమ్, 8. పుష్కరమ్, 9.పయః, 10.అంభః, 11. అంబు...* ఇటువంటి కొన్ని పదాలను అమరసింహుడు *నీరు* అనే అర్థంలో చెప్పాడు.


*కొడుకు:-*

అయితే!?


*తండ్రి:-*

పద్మము పుట్టేది ఎక్కడ!? నీటిలో కదా!? అందువల్ల పైన చెప్పిన పదాలకు *జ* అనే ప్రత్యయం (suffix) చేరిస్తే - *పద్మము* అనేపదానికి సమానార్థకాలైన పదాలు వచ్చేస్తాయి. మళ్లీ చెప్పనా!? *వారిజము, నీరజము, జలజము, సలిలజము, కంజము, తోయజము, ఉదకజము, పుష్కరజము, పయోజము, అంభోజము, అంబుజము...*


*కొడుకు:-*

చివరలో *జ* - అని ఎందుకు చేర్చాలి!?


*తండ్రి:-*

*జ* - అంటే *జాతము, జన్మించినది* అని అర్థం వస్తుంది. *జలజ* అంటే *జలములో జన్మించినది* అని అర్థం. అలాగే *నీరజ* అంటే *నీటిలో జన్మించినది* అని అర్థం. అలా పదాలు పుట్టుకొస్తాయి.


*కొడుకు:-*

*జ* అనే ప్రత్యయం కాకుండా వేరే ప్రత్యయం చేర్చవచ్చా!?


*తండ్రి:-*

*"జాతము"* అనవచ్చు.


*కొడుకు:-*

అయితే నేను చెబుతాను చూడు. *వారిజాతము, నీరజాతము, జలజాతము, సలిలజాతము, కంజాతము, తోయజాతము, ఉదకజాతము, పుష్కరజాతము, పయోజాతము, అంభోజాతము, అంబుజాతము...*


*తండ్రి:-*

భలే! నీకు కూడా పదాలను సృష్టించే కళ వచ్చేసింది.


*కొడుకు:-*

*జ, జాత* మాత్రమే కాకుండా ఇంకే ప్రత్యయాలనైనా ఉపయోగించవచ్చా!?


*తండ్రి:-*

*భవ, ఉద్భవ, సంభవ* అనే పదాలను చేరిస్తే *పుట్టినది* లేదా *పుట్టినవాడు* అనే అర్థం వస్తుంది. ఉదాహరణకు *జలభవము, జలోద్భవము, జలసంభవము* అంటే *జలంలో పుట్టినది* అని అర్థం. అలాగే తృతీయ *నీరభవము, నీరోద్భవము, నీరసంభవము* అని చెప్పవచ్చు. అలాగే *రుహ* అనే ప్రత్యయం చేర్చవచ్చు. *రుహము* అంటే *పెరిగేది.* 


*కొడుకు:-*

అయితే నేను చెబుతా దానితో పేర్లు - *వారిరుహము, నీరరుహము, జలరుహము, సలిలరుహము, కంరుహము, తోయరుహము, ఉదకరుహము, పుష్కరరుహము, పయోరుహము, అంభోరుహము, అంబురుహము...*


*తండ్రి:-*

బాగా చెప్పావు. ఏకసంథాగ్రాహివి. వీటన్నిటికీ కూడా *పద్మము* అనే అర్థం. ఇంతకూ ఎన్ని పదాలను సృష్టించగలవో అర్థమైందా!?


*కొడుకు:-*

నీటికి *11* పర్యాయవాచకాలు చెప్పావు. వాటికి *జ* అనే ప్రత్యయం చేర్చి, *పద్మం* అనే అర్థంలో *11* పర్యాయవాచకాలు సృష్టించగలను. *జాత* అనే ప్రత్యయం చేర్చి మరో *11* పర్యాయవాచకాలు సృష్టించగలను. *రుహ* అనే ప్రత్యయం చేర్చి మరో *11* పర్యాయవాచకాలు సృష్టించగలను. *భవ* అనే ప్రత్యయం చేర్చి మరో *11* పర్యాయవాచకాలు చెప్పగలను, *ఉద్భవ* అనే ప్రత్యయం చేర్చి మరో *11* పర్యాయవాచకాలు చెప్పగలను, *సంభవ* అనే ప్రత్యయం చేర్చి మరో *11* పర్యాయవాచకాలు చెప్పగలను. అంటే, మొత్తానికి *పద్మము* అనే అర్థంలో ఇప్పటికిప్పుడు *66* పదాలను చెప్పగలను.


*తండ్రి:-*

మరి మొదట అడిగితే మూడే మూడు పదాలు చెప్పి, ఇంతకంటె మరేమీ చెప్పలేనన్నావు!? ఇప్పుడేమో ఏకంగా *66* పదాలు చెప్పగలనంటున్నావు!?


*కొడుకు:-*

నువ్వు ఇలా విడమరచి చెబితే ఎందుకు చెప్పలేను!?


*తండ్రి:-*

ఇంతే కాదు, వీటితో ఇంకా ఎన్నో అర్థాలలో ఎన్నెన్నో పదాలను సృష్టించవచ్చు.


*కొడుకు:-*

అదెలా నాన్నా!?


*తండ్రి:-*

పద్మంతో సంబంధం ఉన్న పౌరాణికవ్యక్తులెవరైనా ఉన్నారా చెప్పు!?


*కొడుకు:-*

పద్మాన్ని హస్తంలో ధరించే *విష్ణువు* ఉన్నాడు. పద్మాన్ని నాభిలో ధరించిన అదే *విష్ణువు* ఉన్నాడు. పద్మంలో జన్మించిన *బ్రహ్మదేవుడు* ఉన్నాడు. *క్షీరసాగర* మధ్యంలో *పద్మం* లో జన్మించిన *లక్ష్మీదేవి* ఉన్నది. 


*తండ్రి:-*

మంచి పురాణజ్ఞానం ఉన్నదే నీకు!? సరే, ఇప్పుడు చూడు. *పద్మం* అనే అర్థంలో నీవు *66* పదాలు చెప్పగలవు కదా!? వాటికి చివర *హస్తుడు* అని చేర్చు. వాటన్నిటికీ *పద్మాన్ని చేతిలో ధరించినవాడు* అనే భావంలో *విష్ణువు* అనే అర్థం వస్తుంది. అంటే ఈ క్షణంలో నీవు *విష్ణువు* అనే పదానికి పర్యాయవాచకాలు *66* చెప్పగలవు.


*కొడుకు:-*

ఓహో. బలే! అర్థమైంది. *వారిజహస్తుడు, నీరజహస్తుడు...* ఇలా అన్నమాట.  


*తండ్రి:-*

అవును.


*కొడుకు:-*

అయితే నాన్నా, *హస్తం* అనే పదంతో పాటు *కరము, పాణి* అనే పదాలను కూడా *చేయి* అనే అర్థంలోనే ప్రయోగిస్తాం కదా! వాటిని కూడా ప్రత్యయాలుగా ఉపయోగించవచ్చా!?  


*తండ్రి:-*

హాయిగా ఉపయోగించవచ్చు. ఆవిధంగా *హస్తుడు* అనే ప్రత్యయాన్ని చేర్చి *66*, *కరుడు* అనే ప్రత్యయాన్ని చేర్చి మరో *66*, *పాణి* అనే ప్రత్యయాన్ని చేర్చి మరో *66* మొత్తం *198* పదాలను నీవు స్వయంగా సృష్టించగలవు.


*కొడుకు:-*

అయ్యో నాన్నా, డబుల్ సెంచురీకి రెండు తక్కువైనాయే!?


*తండ్రి:-*

నీటికి ఇంకా *కబంధము, వనము, భువనము, అమృతము, అప్, సర్వతోముఖము, పానీయము, క్షీరము, శంబరము...* ఇట్లా చాలా పర్యాయవాచకాలు ఉన్నాయి. నీవు అన్నీ గుర్తుంచుకోలేక కంగారుపడతావని మొదట్లో ఓ పదకొండు మాత్రమే చెప్పాను. ఆ పదాలతో *పద్మం* అనే అర్థం సాధించి, మరలా ఆ *పద్మాన్ని చేత ధరించినవాడు* అనే అర్థంలో ఇంకెన్ని *విష్ణుపర్యాయవాచకాల* ను సృష్టించవచ్చో చూడు. 


*కొడుకు:-*

బలే నాన్నా! బలే. అలాగే *పద్మంలో పుట్టిన బ్రహ్మ* అనే అర్థంలో - పద్మం యొక్క *66* పర్యాయవాచకాలకు *జ, జాత, భవ, సంభవ, ఉద్భవ, రుహ* అనే ఆరు ప్రత్యయాలు చేర్చితే మొత్తం *396* (66x6) పదాలను ఈ క్షణంలోనే పుట్టించగలను.


*తండ్రి:-*

ఓహో! సమస్తప్రపంచాన్ని పుట్టించిన బ్రహ్మకే అన్ని పదాలు పుట్టించావా!? *పద్మజుడు, పద్మసంభవుడు* అంటూ వాటిని పుంలింగాలలో ప్రయోగిస్తే *బ్రహ్మ* అనే అర్థం వస్తుంది. వాటిని *పద్మజ, పద్మసంభవ* అంటూ స్త్రీలింగాలలో ప్రయోగిస్తే *లక్ష్మీ* అనే అర్థం వస్తుంది. మరి ఆ *బ్రహ్మకు తండ్రి విష్ణువు* అనే అర్థంలో మరెన్ని పుట్టించగలవో చెప్పు!? 

 

*కొడుకు:-*

*పద్మంలో పుట్టినవాడు బ్రహ్మ* అనే అర్థంలో *396* పదాలు సిద్ధంగా ఉన్నాయి కదా! *తండ్రి* అనే అర్థాన్నిచ్చే *జనక, గురు, పితా, జన్మద* అనే నాకు తెలిసిన ఓ నాలుగు ప్రత్యయాలను ఆ *396* పదాలకు చేరిస్తే (396x4) *1584* పదాలను *విష్ణువు* అనే అర్థంలో సృష్టించగలను.


*తండ్రి:-*

మరి *లక్ష్మీదేవికి భర్త విష్ణువు* అనే అర్థంలో ఎన్ని పదాలు సృష్టించగలవు!?


*కొడుకు:-*

*పద్మంలో పుట్టినది లక్ష్మీ* అనే అర్థంలో *396* పదాలు సిద్ధంగా ఉన్నాయి కదా! వాటికి *పతి, ప్రియ, వల్లభ, నాథ, భర్త, ప్రాణేశ* వంటి నాకు తెలిసిన ఓ *6* ప్రత్యయాలను చేర్చి (396x6) *2376* పదాలను సృష్టించగలను. 


*తండ్రి:-*

చూశావా, నీవు విష్ణుసహస్రనామాలను రచించావు. విష్ణువుకు మొత్తం *3960* నామాలను సృష్టించావు. (1584+2376)


*కొడుకు:-*

అయ్యో, నాలుగు వేల నామాలకు ఒక 40 తక్కువయ్యాయే.


*తండ్రి:-*

*పద్మాన్ని నాభిలో కలిగినవాడు పద్మనాభుడు* అంటే *విష్ణువు* కదా! పద్మానికి *66* పర్యాయపదాలు నీకు తెలుసు కదా! వాటికి చివర *నాభుడు* అనే ప్రత్యయం తగిలించు. *వారిజనాభుడు, జలజనాభుడు* అంటూ. కాబట్టి, *3960+66=4026* నామాలు వచ్చాయి. మొత్తానికి ఇలా *విష్ణుచతుస్సహస్రనామాలు* సృష్టించగలవు.


*కొడుకు:-*

సంస్కృతం కొద్దిగా నేర్చుకుంటే, పదసంపదను ఇంత సులువుగా, ఇంత అపారంగా సృష్టించవచ్చా!?


*తండ్రి:-*

అవును. ఇప్పుడు చెప్పినవి కేవలం మచ్చుకు మాత్రమే. ఈవిధంగా సంస్కృతపదాలను ఇంకా వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా అలవోకగా సృష్టించవచ్చు. ఇన్నేసి పదాలను డిక్షనరీలో చేర్చి వాటికి అర్థాలు ఎవరూ వ్రాయరు. అందువల్ల ఒక పదానికి అర్థం తెలియక డిక్షనరీ వెదికి, అక్కడ కనబడకపోతే అబ్బో అబ్బో సంస్కృతం చాల కష్టం సుమీ! అంటూ ఉంటారు.  


*కొడుకు:-*

అవును నాన్నా! ఇంతవరకు నేను కూడా ఇలాగే అనుకున్నాను.  


*తండ్రి:-*

సరే, *నళినదళేక్షణ* అనే పదం విన్నావా!?


*కొడుకు:-*

నా తరమా భవసాగరమీదను, నళినదళేక్షణ రామా అనే కీర్తనలో ప్రసిద్ధమే కదా!?


*తండ్రి:-*

*నళినదళేక్షణుడు* అంటే అర్థం ఏమిటి!?


*కొడుకు:-*

రాముడు.


*తండ్రి:-*

ఆ కీర్తన విని, ఆ కీర్తనలో రామపరంగా వాడిన పదాన్ని బట్టి *రాముడు* అంటూ రూఢి అర్థాన్ని గ్రహించావు. మరి *యౌగికార్థం* (యోగపరమైన) చెప్పు!?


*కొడుకు:-*

అదేమిటి?


*తండ్రి:-*

*నళినము* అంటే పద్మము. *నళినదళము* అంటే పద్మదళము, *ఈక్షణము* అంటే *చూపు* లేదా *కన్ను*. కాబట్టి *నళినదళేక్షణుడు* అంటే *పద్మపు రేకులవంటి కన్నులు కలవాడు* అని అర్థం. అది యౌగికార్థం అంటే. అటువంటి కళ్లు ఎవరికి ఉన్నా సరే, వాళ్లందరూ కూడా నళినదళేక్షణులే. నీవు ఇంతవరకూ చెప్పిన పద్మపర్యాయవాచకాలు, విష్ణుపర్యాయవాచకాలు, బ్రహ్మపర్యాయవాచకాలు, లక్ష్మీదేవి పర్యాయవాచకాలు అన్నీ యౌగికపదాలే.  


*కొడుకు:-*

ఓహో!!


*తండ్రి:-*

ఓహో!! అని ఆశ్చర్యపోవడం కాదు. *నళినదళేక్షణుడు* అంటే యౌగికార్థం తెలిసింది కదా!? మరి ఇప్పుడు సమానార్థకాలైన ఇంకెన్ని పదాలను సృష్టించగలవు!?


*కొడుకు:-*

*నళినము* అంటే పద్మము అనే అర్థంలో మునుపు *66* పదాలను సృష్టించివున్నాము కదా! వాటికి చివర *కన్ను* అనే అర్థంలో *ఈక్షణ, నేత్ర, నయన, లోచన, చక్షు, అక్ష* అని నాకు తెలిసిన *ఆరు* ప్రత్యయాలను ఉపయోగించి *పద్మేక్షణుడు, పద్మనేత్రుడు, పద్మనయనుడు, పద్మలోచనుడు, పద్మచక్షువు, పద్మాక్షుడు...* ఇలా *396* పదాలను (66x6) సృష్టించగలను. ఇలా పుంలింగంలో ఉపయోగిస్తే *396* పదాలతో *రాముడు* వస్తాడు. అలాగే *పద్మేక్షణ, పద్మనేత్ర, పద్మనయన, పద్మలోచన, పద్మచక్షువు, పద్మాక్షి* అంటూ మరో *396* పదాలను స్త్రీలింగంలో ఉపయోగిస్తే *సీతమ్మ* వారు. అంతేనా!?


*తండ్రి:-*

అవును. ఆ పదాలకు *రాముడు, సీతమ్మ* అని మాత్రమే అర్థాలను గ్రహిస్తే అవి నీకు *రూఢార్థాలు* (నిశ్చయింపబడిన అర్థాలు). అలా కాదు, *పద్మం వంటి కన్నులు* కలిగిన ఎవరైనా *పద్మాక్షుడు* లేదా *పద్మాక్షి* కావచ్చును అనే అర్థంలో గ్రహిస్తే అవి *యౌగికార్థాలు*


*కొడుకు:-*

అర్థమైంది నాన్నా!


*తండ్రి:-*

శుభమస్తు.


*కొడుకు:-*

*సర్వం శ్రీ నళినదళేక్షణార్పణమస్తు* అంటే *శ్రీరామార్పణమస్తు.*


*తండ్రి:-*

తథాస్తు.


*గమనిక:-* ఈ సందర్భంలో *ప్రత్యయం* అనే పదం ఆంగ్లంలోని *Suffix* అనే పదానికి సమానార్థకంగా వాడబడింది.