20, ఫిబ్రవరి 2021, శనివారం

కర్మ

 కర్మ


కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు. తన వందమంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు.కృష్ణుడిరాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురువెళ్ళి బోరున విలపిస్తాడు. చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న ధృతరాష్ట్రుడిని కృష్ణుడు ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. 


ధృతరాష్ట్రుడి దుహ్ఖం కోపంగామారి కృష్ణుడిని నిలదీస్తాడు. "అన్నీ తెలిసి కూడా, మొదటి నుంచీ జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తూ భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండిపోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈరోజు తనకి వందమంది పుత్రులని పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు అని నిలదీస్తాడు. అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు.


. "ఓ రాజా! ఇదంతా నేను చేసిందీ కాదూ, నేను జరగనిచ్చిందీ కాదు. ఇది ఇలా జరగటానికి, నీకు పుత్రశోకం కలగటానికీ అన్నిటికీ కారణం నువ్వూ నీ కర్మ. యాభై జన్మల క్రితం నువ్వొక కిరాతుడివి (వేటగాడు). ఒకరోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడినా నీకు యేమీ దొరకని సందర్భంలో ఒక అశోక వృక్షం మీద రెండు గువ్వల జంట వాటి గూట్లో గుడ్లతో నివసిస్తున్నాయి. వాటిని నీవు చంపబోగా ఆ రెండు పక్షులూ నీ బాణాన్ని తప్పించుకుని బ్రతుకగా అప్పటికే సహనము నశించినవాడివై కోపంతో ఆ గూట్లో ఉన్న వంద గుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగా విచ్చిన్నం చేశావు. తమ కంటి ముందే తమ నూర్గురు పిల్లలు విచ్చిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూఉండిపోయాయి. ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపము నుండి విముక్తుడిని చేసి కర్మబంధం నుండి విడిపించింది, నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పక వెంటాడుతుంది, వదలక వెంటాడి ఆ కర్మ ఫలాన్ని అనుభవింపచేస్తుంది. కర్మ నుండి ఎవరూ తప్పించుకోలేరు" అని అంటాడు. 


ధృతరాష్ట్రుడు సమాధానపడ్డట్టు అనిపించినా మళ్ళీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు. కర్మ అంత వదలని మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు? ముందే ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నిస్తాడు. అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి "ఓ రాజా! వందమంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి.. ఎన్నో సత్కర్మలు ఆచరించాలి. ఈ యాభై జన్మలు నువ్వు ఈ వందమంది పుత్రులను పొందడానికి కావల్సిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు. వందమంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పని చేయడం మొదలుపెట్టింది అని శెలవిస్తాడు. అది విన్న ధృతరాష్ట్రుడు కుప్పకూలిపోతాడు. 


మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్యఫలాలన్నీ ఒక్క చెడ్డపనితో తుడిచిపెట్టుకుపోతాయి అని శ్రీ కృష్ణుడి అంతరార్థం. 


- మహాభారతం 


---- ✍🏼

❤*అన్నదానం*❤ "ఏమండీ!! ఒక్క నిమిషం!! ఆగండి... ప్యాకింగ్ చేయడం అయిపోయింది. ఇదిగో నండీ ఈ పార్సిల్ తీసుకెళ్ళండి" హడావిడిగా తడిచేతులు చీర కొంగుకు తుడుచుకుంటూ బయటకు వచ్చి పురుషోత్తంకు కవరు అందించింది సుశీల... "సూర్యభగవానుడు ఒకరోజు అయినా తూర్పున ఉదయించడం మర్చిపోతాడేమెా!! కానీ నువ్వు మాత్రం ఈ పార్సిల్ చేసిన కవరు నాకివ్వడం మర్చిపోవుకదా!!" "అసలు ఇంతమంచి అలవాటు నీకున్నందుకు, మనం తినేదానిలో ఒక్కరికి అయినా అన్నం పెట్టి మనం తినాలని ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఆచరిస్తున్నందుకు నీకు అభినందనలు సుశీలా"!! "నన్ను పొగడ్తలతో ముంచకండి!! మీకు ఆఫీసుకు టైమ్ అయింది మీరు వెళ్లండి"!! అంటూ సుశీల నవ్వుకుంటూ లోపలకి వెళ్లి పోయింది... పురుషోత్తం ఆఫీసుకు వెళుతూ దారిలో ముసలివాడు కనిపిస్తే అతనికి అన్నం కవరు ఇచ్చి ఆఫీసుకు వెళ్లి పోయాడు.. పెళ్లి అయిన కొత్తలో "నీకేం కావాలో చెప్పు? ఏంకావాలన్నా కొంటాను? ఎంత ఖరీదైన దయినా ఫరవాలేదు"? అని పురుషోత్తం పదిసార్లు అడిగితే అప్పుడు మెుహమాటపడుతూ "నేను ఏం అడిగినా కాదనకూడదు మరి నా కోరిక విని నవ్వకూడదు"అని ముందే షరతు విధించింది. సుశీల... అడిగిన కోరిక విని మతిపోయినంత పని అయింది. ఖరీదైన నగలు చీరలు కోరుకుంటుంది లేదా విదేశాలకు తీసుకెళ్ల మంటుందని ఊహించాడు కానీ ఇంత గొప్ప...కోరికా! అని ఆశ్చర్య పోయాడు పురుషోత్తం... "ఏమండీ!! చిన్నప్పుడు మా బామ్మగారు చెప్పేవారు అన్ని దానాలలో అన్నదానం గొప్పదని!! అది నా మనసులో నాటుకు పోయింది నేను రోజూ ఒకరికయినా అన్నదానం చేయాలి. నా ఒంట్లో ఓపిక వున్నంతవరకూ నేను చేయగలిగినన్ని రోజులు ఎవరో ఒకరికైనా అన్నం పెట్టాలి. ఇదీ నా కోరిక ఒప్పుకుంటారా" !! ఇది నేను కలలో కూడా ఊహించలేదు. ఎంత గొప్ప కోరిక కోరావు సుశీలా!! తప్పకుండా ఆచరిద్దాం. "భగవంతుడు దయవలన మనకి ఆర్థిక ఇబ్బందులు లేవు. మీరు ఉద్యోగంలో మంచి పొజిషన్ లో వున్నారు. ఒకరికి అన్నం పెట్టినంత మాత్రాన మన ఆస్థులు ఏమీ తరిగిపోవు ఏమంటారు మీరు"? "నువ్వు ఇంత మంచి పని చేస్తానంటే నేను ఎందుకు కాదంటాను. తప్పకుండా అలాగే చేద్దాం"!! పురుషోత్తం ఆనందంగా ఒప్పుకున్నాడు... ఒక్కక్క సారి మంచి చేసినాకూడా చెడు ఎదురు పడుతుంది అంటారు. అది నిజమే అన్పిస్తుంది. ఒకోసారి భోజనం టైమ్ వరకు ఎదురు చూసినా ఎవరు దొరికేవారు కాదు. ఎవరికైనా భోజనం పెడితేగానీ భోజనం చేయననేది సుశీల. పెడదామంటే ఎవరూ దొరికేవారు కాదు..అప్పుడు పక్క అపార్ట్మెంట్ వాచ్ మేన్ ని పిలిచి భోజనం పెట్టి తను తినేది. ఆ వాచ్ మేన్ తాగుబోతు ఎప్పుడూ మత్తులోనే వుండేవాడు... ఇది చూసి పురుషోత్తం ఒక ఐడియా చెప్పాడు "నేను ఆఫీసు కు వెళ్లే టైమ్ కి వంట ఎలాగా అయిపోతుంది. అన్నీ పేక్ చేసి ఇచ్చేయి. బైక్ లో వెళుతూ ముసలివారు గానీ అంగవైకల్యం గల వాళ్లు పని చేయడానికి శక్తి లేనివాళ్ళు ఆకలితో వున్న వాళ్లు గానీ కనిపిస్తే ఇస్తాను. నువ్వు కూడా టైమ్ కి భోజనం చేసేయచ్చు అని చెప్పి ఒప్పించాను ".. "అప్పుడు ఈ ఐడియా బావుంది కానీ మీకు ఇబ్బంది అవుతుంది కదా"!! అంది. "నాకేం ఇబ్బంది లేదు నువ్వు చేసే పని ముందు నాదెంత"!! అని సుశీలని ఒప్పించి అప్పటి నుంచీ పార్సిల్ చేసి తీసుకెళ్లి ముసలివారికి,అంగవైకల్యం వున్న వారికి, చిన్న పిల్లల తల్లులకు, పిల్లలకు ఇవ్వడం చేయసాగాడు పురుషోత్తం... రెండు విస్తరాకులు ఒకదాని మీద ఒకటి వేసి ఇద్దరికి సరిపడా అన్నం పెట్టి లాక్డ్ కవర్లలో కూర ఒక కవరు, సాంబారు లేక రసం ఒక కవరులో, పచ్చడి లేక ఆవకాయ ఒక కవరు, ఆకుకూర పప్పు ఒక కవరు, పెరుగు ఒక కవరు,ఒక వాటర్ బాటిల్ ఇవన్నీ దేనికి దానికి సెపరేట్ గా పేక్ చేసి ఒక కవరులో పెట్టి ఇవ్వడం మెుదలు పెట్టింది. ఆ భోజనం తిన్నవారు ఎవరైనా సరే కడుపు ఫుల్ గా నిండి పోవలసిందే !! నెలకి నాలుగు ఆదివారాలు మిగతా సెలవు దినాల్లో పనిమనిషికి పెట్టేది. పండగలలో మాత్రం వీధులు తుడిచేవాళ్లని, పనిమనిషి కుటుంబాన్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి పిల్లలకు బట్టలు చీరలు దుప్పట్లు కొని ఇచ్చేది సుశీల... సుశీల చేసిన ఏ పనికి అడ్డు చెప్పేవాడు కాదు పురుషోత్తం. తనకోసం ఏనాడు నగలు చీరలు కొనమని అడిగేది కాదు.. సుశీల డెలివరీకి పుట్టింటికి వెళ్లి నపుడు మాత్రం సుశీల అత్తగారు వంటచేసి పేక్ చేయడం చేసేవారు. అమ్మా! నీకు ఇబ్బందిగా వుంటే మానేయమ్మా! అని కొడుకు అంటే కోడలు మెుదలు పెట్టిన మంచి కార్యక్రమాన్ని మనం మానేయడమెందుకు ? మనకోసం వండిన పదార్థాలే కొంచెం ఎక్కువ వండుతున్నాను. ఇందులో నాకు శ్రమ ఏముంది అని ఆవిడ కూడా వండిన అన్ని పదార్థాలు పేక్ చేసి ఇచ్చేవారు... ఆ అన్నదానం ఫలితమే అనుకుంటా! వాళ్ల పిల్లలు ఇద్దరు మంచి చదువులు చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించుకుని మంచి జీవిత భాగస్వామిని పొంది చీకూచింత లేకుండా సంతోషంగా జీవితంలో స్ధిరపడ్డారు. "అలా మేలు జరుగుతుందో,లేదో తెలియదు కానీ... ఒక ప్రాణమైతే మాత్రం నిలుస్తుంది కదా మిత్రమా.."🤔 ఈ లాంటి కుటుంబాలు మనకందరికి ఆదర్శ ప్రాయం మిత్రులారా....🙏🙏

 ❤*అన్నదానం*❤

  "ఏమండీ!! ఒక్క నిమిషం!! ఆగండి...

ప్యాకింగ్ చేయడం అయిపోయింది. ఇదిగో నండీ ఈ పార్సిల్ తీసుకెళ్ళండి" హడావిడిగా తడిచేతులు చీర కొంగుకు తుడుచుకుంటూ బయటకు వచ్చి పురుషోత్తంకు కవరు అందించింది సుశీల...


   "సూర్యభగవానుడు ఒకరోజు అయినా తూర్పున ఉదయించడం మర్చిపోతాడేమెా!! కానీ నువ్వు మాత్రం ఈ పార్సిల్ చేసిన కవరు నాకివ్వడం మర్చిపోవుకదా!!"


  "అసలు ఇంతమంచి అలవాటు నీకున్నందుకు, మనం తినేదానిలో ఒక్కరికి అయినా అన్నం పెట్టి మనం తినాలని ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఆచరిస్తున్నందుకు నీకు అభినందనలు సుశీలా"!!


  "నన్ను పొగడ్తలతో ముంచకండి!! మీకు ఆఫీసుకు టైమ్ అయింది మీరు వెళ్లండి"!! అంటూ సుశీల నవ్వుకుంటూ లోపలకి వెళ్లి పోయింది...


  పురుషోత్తం ఆఫీసుకు వెళుతూ దారిలో ముసలివాడు కనిపిస్తే అతనికి అన్నం కవరు ఇచ్చి ఆఫీసుకు వెళ్లి పోయాడు..


  పెళ్లి అయిన కొత్తలో "నీకేం కావాలో చెప్పు? ఏంకావాలన్నా కొంటాను? ఎంత ఖరీదైన దయినా ఫరవాలేదు"? అని పురుషోత్తం పదిసార్లు అడిగితే


  అప్పుడు మెుహమాటపడుతూ "నేను ఏం అడిగినా కాదనకూడదు మరి నా కోరిక విని నవ్వకూడదు"అని ముందే షరతు విధించింది.


  సుశీల... అడిగిన కోరిక విని మతిపోయినంత పని అయింది. ఖరీదైన నగలు చీరలు కోరుకుంటుంది లేదా విదేశాలకు తీసుకెళ్ల మంటుందని ఊహించాడు కానీ ఇంత గొప్ప...కోరికా! అని ఆశ్చర్య పోయాడు పురుషోత్తం...


   "ఏమండీ!! చిన్నప్పుడు మా బామ్మగారు చెప్పేవారు అన్ని దానాలలో అన్నదానం గొప్పదని!!


  అది నా మనసులో నాటుకు పోయింది నేను రోజూ ఒకరికయినా అన్నదానం చేయాలి. నా ఒంట్లో ఓపిక వున్నంతవరకూ నేను చేయగలిగినన్ని రోజులు ఎవరో ఒకరికైనా అన్నం పెట్టాలి. ఇదీ నా కోరిక ఒప్పుకుంటారా" !!


  ఇది నేను కలలో కూడా ఊహించలేదు. ఎంత గొప్ప కోరిక కోరావు సుశీలా!! తప్పకుండా ఆచరిద్దాం.


  "భగవంతుడు దయవలన మనకి ఆర్థిక ఇబ్బందులు లేవు. మీరు ఉద్యోగంలో మంచి పొజిషన్ లో వున్నారు. ఒకరికి అన్నం పెట్టినంత మాత్రాన మన ఆస్థులు ఏమీ తరిగిపోవు ఏమంటారు మీరు"?


  "నువ్వు ఇంత మంచి పని చేస్తానంటే నేను ఎందుకు కాదంటాను. తప్పకుండా అలాగే చేద్దాం"!! పురుషోత్తం ఆనందంగా ఒప్పుకున్నాడు...


  ఒక్కక్క సారి మంచి చేసినాకూడా చెడు ఎదురు పడుతుంది అంటారు. అది నిజమే అన్పిస్తుంది. ఒకోసారి భోజనం టైమ్ వరకు ఎదురు చూసినా ఎవరు దొరికేవారు కాదు.


   ఎవరికైనా భోజనం పెడితేగానీ భోజనం చేయననేది సుశీల. పెడదామంటే ఎవరూ దొరికేవారు కాదు..అప్పుడు పక్క అపార్ట్మెంట్ వాచ్ మేన్ ని పిలిచి భోజనం పెట్టి తను తినేది. ఆ వాచ్ మేన్ తాగుబోతు ఎప్పుడూ మత్తులోనే వుండేవాడు...

 

  ఇది చూసి పురుషోత్తం ఒక ఐడియా చెప్పాడు "నేను ఆఫీసు కు వెళ్లే టైమ్ కి వంట ఎలాగా అయిపోతుంది. అన్నీ పేక్ చేసి ఇచ్చేయి. బైక్ లో వెళుతూ ముసలివారు గానీ అంగవైకల్యం గల   వాళ్లు పని చేయడానికి శక్తి లేనివాళ్ళు ఆకలితో వున్న వాళ్లు గానీ కనిపిస్తే ఇస్తాను. నువ్వు కూడా టైమ్ కి భోజనం చేసేయచ్చు అని చెప్పి ఒప్పించాను "..


  "అప్పుడు ఈ ఐడియా బావుంది కానీ మీకు ఇబ్బంది అవుతుంది కదా"!! అంది. "నాకేం ఇబ్బంది లేదు నువ్వు చేసే పని ముందు నాదెంత"!! అని సుశీలని ఒప్పించి అప్పటి నుంచీ పార్సిల్ చేసి తీసుకెళ్లి ముసలివారికి,అంగవైకల్యం వున్న వారికి, చిన్న పిల్లల తల్లులకు, పిల్లలకు ఇవ్వడం చేయసాగాడు పురుషోత్తం...


  రెండు విస్తరాకులు ఒకదాని మీద ఒకటి వేసి ఇద్దరికి సరిపడా అన్నం పెట్టి లాక్డ్ కవర్లలో కూర ఒక కవరు, సాంబారు లేక రసం ఒక కవరులో, పచ్చడి లేక ఆవకాయ ఒక కవరు, ఆకుకూర పప్పు ఒక కవరు, పెరుగు ఒక కవరు,ఒక వాటర్ బాటిల్ ఇవన్నీ దేనికి దానికి సెపరేట్ గా పేక్ చేసి ఒక కవరులో పెట్టి ఇవ్వడం మెుదలు పెట్టింది. ఆ భోజనం తిన్నవారు ఎవరైనా సరే కడుపు ఫుల్ గా నిండి పోవలసిందే !!


  నెలకి నాలుగు ఆదివారాలు మిగతా సెలవు దినాల్లో పనిమనిషికి పెట్టేది. పండగలలో మాత్రం వీధులు తుడిచేవాళ్లని, పనిమనిషి కుటుంబాన్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి పిల్లలకు బట్టలు చీరలు దుప్పట్లు కొని ఇచ్చేది సుశీల...


  సుశీల చేసిన ఏ పనికి అడ్డు చెప్పేవాడు కాదు పురుషోత్తం. తనకోసం ఏనాడు నగలు చీరలు కొనమని అడిగేది కాదు..


  సుశీల డెలివరీకి పుట్టింటికి వెళ్లి నపుడు మాత్రం సుశీల అత్తగారు వంటచేసి పేక్ చేయడం చేసేవారు.

  అమ్మా! నీకు ఇబ్బందిగా వుంటే మానేయమ్మా! అని కొడుకు అంటే కోడలు మెుదలు పెట్టిన మంచి కార్యక్రమాన్ని మనం మానేయడమెందుకు ? మనకోసం వండిన పదార్థాలే కొంచెం ఎక్కువ వండుతున్నాను. ఇందులో నాకు శ్రమ ఏముంది అని ఆవిడ కూడా వండిన అన్ని పదార్థాలు పేక్ చేసి ఇచ్చేవారు...


  ఆ అన్నదానం ఫలితమే అనుకుంటా! వాళ్ల పిల్లలు ఇద్దరు మంచి చదువులు చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించుకుని మంచి జీవిత భాగస్వామిని పొంది చీకూచింత లేకుండా సంతోషంగా జీవితంలో స్ధిరపడ్డారు.

   "అలా మేలు జరుగుతుందో,లేదో తెలియదు కానీ... ఒక ప్రాణమైతే మాత్రం నిలుస్తుంది కదా మిత్రమా.."🤔

          ఈ లాంటి కుటుంబాలు మనకందరికి ఆదర్శ ప్రాయం మిత్రులారా....🙏🙏

రమ యనగా

 రమ యనగా లక్ష్మీ యని వక భావన. ర శబ్ద భావమునకు రెండవ మాత్ర వలన అనగా సంగీత పరంగా రా దానికి ౦ పూర్ణము వలన రామ శబ్దం లక్షణము తెలియుట. పదార్ధ తత్వమైనది రామ. ర రుద్ర శబ్ద మని వేదం. రుద్ర శబ్దమునకు మ ఎమ్ మెటీరియల్ పదార్ధరూపంలేని యెడల ర శబ్ద లక్షణము తెలియదు. రామ రెండుమార్లు శబ్దమునకు యింత అర్ధం వున్నవున్ని. మరి రా దీర్ఘ స్వరముతో రా.... మ అనగా మన ప్రాణవాయువు అమితమై శ్వాస రూపంలో గల జీవ భావన కలుగును. అనగా సో హం సో అహం. నేనే హం తో రూప ప్రకృతి యైన ఓ జీవుడను అని తెలియును. రామ లో నమః శివాయః లో మ రెండునూ పూర్ణమైన శక్తి మ మెటీరియల్స్ అనగా పదార్ధ రూపం దాల్చింది. మ శబ్దం లేని నమః శివాయః తత్వం న శివాయః శివ తత్వం బోధపడదు. అందుకే పంచాక్షరీ కూడా రామ శబ్ద లక్షణమే. హ అనే అక్షరం పూర్ణమునకు మరో రూపం. అది హవ  హోత అగ్ని రూప జనితమైన శక్తి దానికి చైతన్యమే హరి. ర కారం రుద్రమైతే రి అనునది రుద్ర చైతన్యశక్తియైన మ రూపంలో అమ్మ. అమ్మ అయ్యల శక్తి కలయిక యే హరి తత్వం.హరి తత్వం తెలియక సందిగ్ధంలో యున్నప్పుడు రామ పూర్వక పదార్ధ శక్తి వలన హరి రూపంలో గల తత్వం. యిది రామ శబ్ద తత్వంగా హరి శబ్దం తెలియుట. సులువుగా ఏ సమయంలోనైనా పలుకు ప్రక్రియ. హర అనగా యి చైతన్యంలేని తత్వం వున్నా కూడా అది యిది అని తెలియదు. అది అణు తత్వం. చైతన్య తత్వము హరి యని అన్నమయ్య హరీ ....యని  దీర్ఘ స్వర సంబంధం రామ వ్యాప్తి తత్వం. తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూ నేను వుందాం.

మొగలిచెర్ల

 *సేవామార్గం..*


"నిన్న మధ్యాహ్నం ఇక్కడికి వచ్చానండీ..నిన్నటి సాయంత్రం జరిగిన పల్లకీసేవ లో కూడా పాల్గొన్నాను..ఈరోజు ఉదయం స్వామివారి సమాధి దర్శనం చేసుకున్నాను..మరో మూడు రోజులు ఇక్కడే వుందామని అనుకుంటున్నాను..ఈ మంటపం లోనే బస చేస్తాను.." అని ఆ యువకుడు ఒక ఆదివారం మధ్యాహ్నం హారతి అయిపోయిన తరువాత నన్ను అడిగాడు.."మీ వివరాలు మా సిబ్బంది వద్ద ఇవ్వండి..ప్రతిరోజూ మధ్యాహ్నం అన్నప్రసాదం ఉంటుంది.."అన్నాను.."నాపేరు కోదండరామ మూర్తి..షాద్ నగర్ వద్ద..తెలంగాణ.." అన్నాడు.."ఆ వివరాలన్నీ మా వాళ్ళ వద్ద నమోదు చేయించండి.." అన్నాను..సరే అని చెప్పి వెళ్ళిపోయాడు..


ఆరోజు సాయంత్రం స్వామివారి హారతి ఇచ్చే వేళకు మందిరం లోకి వచ్చి స్వామివారి హారతి కళ్లకద్దుకొని..వెళ్ళిపోయాడు..అతని గురించి నేను గానీ..మా సిబ్బంది గానీ పెద్దగా శ్రద్ధ చూపలేదు..ఏదో తాను స్వామివారి సన్నిధి లో ఓ మూడురోజులు ఉండటానికి వచ్చాడు..ఆ తరువాత వెళ్ళిపోతాడు అనే భావన లో వున్నాడు..సోమవారం ఉదయం అర్చకస్వాములు వచ్చి శ్రీ స్వామివారి మందిర తలుపులు తెరచి ప్రభాతసేవ కొఱకు ఏర్పాట్లు చేసుకునే సమయానికి కోదండరామమూర్తి తాను కూడా స్నానం చేసి ఆలయం లోకి వచ్చాడు..పూలు కోసుకొచ్చి పళ్లెం లో పెట్టి అందించాడు..తులసి ఆకులు తీసుకొచ్చి అర్చకస్వాములకు ఇచ్చాడు.."స్వామీ..మీకేదైనా సహాయం కావాలంటే నాకు చెప్పండి..స్వామివారి సేవ చేసుకోవాలని అనుకుంటున్నాను..నాకూ అవకాశం ఇవ్వండి.." అని అర్చకులతో చెప్పాడు..ప్రభాతసేవ పూర్తయ్యేదాకా మంటపం లో వుండి..పూజారి గారు స్వామివారికి ఇచ్చిన హారతి కళ్లకద్దుకొని..వరుసక్రమం లో వచ్చి తీర్ధం తీసుకొని..మంటపం లోకి తిరిగివెళ్లి కూర్చున్నాడు..ఉదయం తొమ్మిది గంటలకు నావద్దకు వచ్చి.."స్వామివారి మందిరం లో ఈ మూడురోజులూ ఏదో ఒక సేవ చేయాలని అనుకుంటున్నాను..మందిరం శుభ్రం చేయమన్నా చేస్తాను..మీ వ్యవస్థ లో వేలు పెట్టాలనే ఉద్దేశ్యం కాదు..నా వంతుగా సేవ చేసుకోవాలని ఒక కోరిక..మీరు ఏ పని చెప్పినా చేస్తాను.." అన్నాడు.."మీరే అన్నారు కదా మందిరం శుభ్రం చేయగలను అని..అదే చేయండి.." అన్నాను..సరే అన్నాడు..ఆ మూడురోజులూ ఉదయం సాయంత్రం స్వామివారి మందిర ప్రాంగణం అంతా శుభ్రం గా ఊడ్చాడు.మూడుపూటలా స్వామివారి హారతి కళ్లకద్దుకొన్నాడు..తీర్ధం తీసుకున్నాడు..మంటపం లోనే నిద్ర చేసాడు..గురువారం ఉదయం ప్రభాతసేవ హారతి తీసుకొని..తన ఊరికి వెళ్ళిపోయాడు..


ఐదు నెలలు గడిచిపోయాయి..ఒక శనివారం మధ్యాహ్నం కోదండరామమూర్తి స్వామివారి మందిరానికి వచ్చాడు..ఈసారి ఒంటరిగా రాలేదు..తన భార్యను తీసుకొని వచ్చాడు..పల్లకీసేవ కొఱకు తమ పేర్లు నమోదు చేయించుకొని..ఇద్దరూ మా దంపతుల వద్దకు వచ్చారు..అతనిని చూడగానే గుర్తుపట్టాను.."బాగున్నారా?.."అని అడిగాను..చప్పున నా రెండు చేతులూ పట్టుకొని..తన నుదుటి పై పెట్టుకొని..కళ్ళు మూసుకున్నాడు..ఒక్కసారిగా భావోద్వేగం తో కన్నీళ్లు పెట్టుకున్నాడు..అతని భార్య అతని భుజం మీద చేయి వేసి..ఓదార్పుగా తట్టింది..ఈ చర్య నాకు అర్ధం కాలేదు..అతను కొద్దిగా తేరుకొని..కళ్ళు తుడుచుకుని.."ప్రసాద్ గారూ..పోయినసారి నేనొక్కడినే ఇక్కడికి వచ్చి స్వామివారి వద్ద మొత్తం ఐదు రోజులు వున్నాను..శనివారం నుంచీ గురువారం ఉదయం వరకూ..స్వామివారి సేవ చేసుకుంటాను అని నేను అడిగితే..మీరు, మీ సిబ్బంది..మీ పూజారులు అందరూ నాకు సహకరించారు..అప్పుడు నేను ఇక్కడికి రావడానికి ఒక కారణం ఉన్నది..మాకు వివాహం జరిగి ఏడేళ్లు అవుతున్నది..సంతానం లేదు..మా ఇద్దరి జాతకాలు చూపిస్తే..సంతానయోగం ఉన్నది అని చెప్పారు కానీ..పిల్లలు పుట్టలేదు..నేను పనిమీద హైదరాబాద్ వెళ్ళాను..అక్కడ శ్రీనగర్ ఆలయం పూజారి గారు నా జాతకం చూసి..మొగలిచెర్ల వెళ్లి మూడురోజులు నిద్ర చేయి..ఆ అవధూత దత్తాత్రేయుడి కరుణిస్తే నీకు సంతానం కలుగుతుంది అని చెప్పారు..ఈ మందిరం అడ్రెస్ కూడా వారే ఇచ్చారు..తిరిగి ఇంటికి వెళ్లి..ఈమెతో చెప్పి ఇక్కడికి వచ్చాను..ఇక్కడ మీ సహకారం మరువలేనిది..స్వామివారికి నాకు తోచిన సేవ నేను చేసుకున్నాను..పూర్తిగా ఈ స్వామివారినే నమ్మి..ఆయన మీదే భారం మోపి..నమస్కారం చేసుకొని వెళ్ళాను..ఇప్పుడు నా భార్య గర్భవతి..మూడో నెల..ఇప్పుడు మేమిద్దరమూ ఈ స్వామివారిని దర్శించుకొని ..మరలా మాకు సంతానం కలిగిన తరువాత..ఆ బిడ్డతో సహా వస్తాము..ఈమె ప్రయాణం చేయడం ఇబ్బందేమో అనుకున్నాను..కానీ తాను వస్తానని పట్టు పట్టింది..ఈరోజు రేపు వుండి..రేపు సాయంత్రం తిరిగి మావూరు వెళతాము..స్వామివారు పరిపూర్ణ దయ చూపారు మామీద.." అని అత్యంత సంతోషంగా చెప్పాడు..


కోదండరామమూర్తి సేవామార్గాన్ని ఎంచుకున్నాడు..అదికూడా పరిపూర్ణ భక్తి తో పూర్తి చేసాడు..ఎక్కడ భక్తి విశ్వాసాలు ఉంటాయో..అక్కడ భగవంతుడు తన కృపాకటాక్షణాలను ప్రసరింపచేస్తాడు..ఈ కోదండరాముడి విషయం లోనూ అదే జరిగింది..నమ్మి కొలిచినందుకు..మొగిలిచెర్ల అవధూత దత్తాత్రేయుడు ప్రతిఫలం ప్రసాదించాడు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

Plots are available ప్లాటులల్లో పెట్టుబడి పెట్టండి

ప్రస్తుత పరిస్థితుల్లో మన సేవింగ్స్ ను పెంచుకోవటానికి వున్న ఒకే ఒక మార్గం ప్లాటులల్లో పెట్టుబడి పెట్టటమే.  మనం గమనించినట్లయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాలల్లో ప్లాటుల రేట్లు రోజు రోజుకి అనూహ్యంగా వృద్ధి చెందుతున్నాయి. 

గత సంవత్సరం గజం 10 వేలు పలికిన ప్లాటు ఇప్పుడు 20 వేలకు పైగా పలుకుతుంది. కాబట్టి మధ్యతరగతి వారికి వారి సేవింగులను పెంపొందించుకోవటానికి ప్లాట్లల్లో పెట్టుబడి పెట్టటమే ఒకే ఒక అవకాశం. ఇప్పుడు హైదరాబాద్ శివార్లలో గజం 30 వేలు పైన్ పలుకుతుంది. మీకు 5 వేలు నుంచి 15 వేల వరకు కేవలం హైద్రాబాదు నుండి 30 నుండి 40 కిలోమీటర్లల్లో వున్న ప్రదేశాలలో మాత్రమే దొరుకుతున్నాయి. ఒక 10 లక్షల నుండి 20 లక్షల వరకు పెట్టుబడి పెడితే ఒకటి రెండు సంవస్త్సరాలలో మీరు ఊహించని ధర పలకటం ఖాయం. 

ఇదే సరైన సమయం  

ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయం మీ ఆర్ధిక స్థితినే మారుస్తుంది. 

హైద్రాబాదు చుట్టుపక్కల వున్న తిమ్మాపూర్, కడ్తాల్, ఆమనగల్లు, శంకరపల్లిలలో ప్లాట్లు విక్రయానికి గలవు. మీరు హైద్రాబాదులో వున్నట్లైతే మీరు వున్న స్థలంనుండి కారులో మీకు మీరు కోరుకున్న బడ్జెట్లో మీకు సదరు ప్లాటు చూపెట్ట బడును. అదే మీరు వేరే దూర ప్రాంతంలో ఉండి ఇక్కడి ప్లాట్ కొనదలచిన కూడా మీరు కేవలం రిజిస్ట్రేషన్ సమయంలో వచ్చి మీ ప్లా టును కొనుక్కోవచ్చు. మీరు ఒకటి రెండు సంవత్సరాల తరువాత  అమ్మ దలిచిన అప్పటి రేటుకు మీకు అమ్మి మీకు మీ డబ్బు ఇప్పించగలము. 

వివరాలకు కాలు చేయండి 9848647145

బహుమతులు 

ఈ రెండు రోజలు అంటేశనివారము ( 20.2.2021) మరియుఆదివారము ( 21.2.2021) లలో బుకు చేసుకునే వారికి ఒక మిక్సీ కం గ్రైండర్ (750 watts ) బహుమతిగా ఇవ్వబడును. కనుక ఈ అవకాశము వినియోగించుకోగలరు. 


Plots are available in

Thimmapur, amangal, Kadtal, shankarpalli etc., For more information contact SARMA


9848647145

Car will be arranged for site visit from your place in Hyderabad


Good opportunity to invest today

For better profits of tomorrow



Gift.


The members booked plots on Saturday( 20.2.2021) and Sunday( 21.2.2021) will be gifted a mixture grinder of 750 watts

This gift will be given to those bookings of two days only 

For prices of plots call on phone

So 


Horry up

19, ఫిబ్రవరి 2021, శుక్రవారం

భృగు మహర్షి

 మన మహర్షులు- 26


భృగు మహర్షి


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷


భృగు మహర్షి బ్రహ్మగారి హృదయంలోంచి పుట్టాడు. 

భృగువు నవ ప్రజాపతులలో ఒకడు. సప్తర్షులలో ఒకడు.


 ఈయన వంశంని భృగువంశమంటారు. ఈ వంశంలో పుట్టినవాళ్ళు చ్యవన, జమదగ్ని, శుక్ర, దధీచి మొదలైనవాళ్ళు. విష్ణుమూర్తి అవతారం పరశురాముడు కూడ ఈ వంశమే.


 దక్షుని కుమార్తె ఖ్యాతి భృగుమహర్షి  భార్య..

దక్షుని అల్లుడు గనుక, దక్షయజ్ఞం సమయంలో భృగువుకూడా ఉన్నాడని వాయుపురాణం చెప్తోంది.


భృగుమహర్షి మరొకభార్య పులోమని ఒక రాక్షసుడు ఎత్తుకు పోవాలని ఆమె ఎక్కడ వుందని అగ్నిదేవుణ్ణి అడిగాడు. అగ్ని భృగుమహర్షి ఆశ్రమంలో వున్న ఈమే పులోమ అని చెప్పాడు.


ఆ రాక్షసుడు పులోమని ఎత్తుకుపోవడానికి ప్రయత్నించాడు..


 భృగుమహర్షి అగ్ని దేవుణ్ణి ఇదంతా జరగడానికి కారణం నువ్వే కాబట్టి ఏది కనిపిస్తే దాన్ని తింటూ సర్వభక్షకుడిగా వుండమని శపించాడు.


 అగ్నిదేవుడు బ్రతిమాలుకుంటే సర్వభక్షకుడివైనా అందరితో గౌరవించబడ్డావన్నాడు.


సరస్వతీ నదీ తీరంలో మహర్షులందరూ కలిసి ఒక యాగం చేస్తుండగా వాళ్ళల్లో ఒకళ్ళకి ఒక సందేహం వచ్చేసింది.  త్రిమూర్తు లలో ఎవరు గొప్పవారు అని భృగు మహర్షిని తేల్చి చెప్పమన్నారు.


భృగు మహర్షి బయల్దేరి ముందు బ్రహ్మలోకం వెళ్ళాడు. బ్రహ్మ నిండు సభలో ఉన్నాడు. భృగు మహర్షి వెళ్ళి మాట్లాడకుండ నిలబడ్డాడు. భృగు మహర్షి స్తోత్రం చెయ్యలేదని బ్రహ్మగారికి కోపం వచ్చింది. అక్కడ నుంచి బయలదేరి కైలాసానికి వెళ్ళాడు భృగుడు.


 శివుడు పార్వతీ సమేతంగా విశ్రాంతి తీసుకుంటూ భృగు మహర్షిని చూసి లేచి వచ్చాడు కానీ భృగు మహర్షి మాట్లాడలేదు. శివుడు కోపంతో శూలంతీశాడు. పార్వతి అడ్డుపడింది.


వైకుంఠం వెళ్ళి విష్ణుమూర్తిని కలిసాడు భృగు మహర్షి. వెంటనే విష్ణుమూర్తి లేచివచ్చి నువ్వు రావడం చూడలేదు .. నువ్వు రావడం వల్ల నేను ధన్యుణ్ణయ్యాను అన్నాడు- విష్ణుమూర్తి. 


విష్ణుమూర్తిని ఆనంద భాష్పాలతో అభిషేకం చేసి మళ్ళీ ఆశ్రమానికి వచ్చి తన కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి విష్ణుమూర్తే గొప్పవాడని చెప్పాడు భృగు మహర్షి.


భృగువు, భరద్వాజ మహర్షులు సమకాలికులని మహాభారతం పేర్కొంటోంది.


భృగుమహర్షి జ్యోతిష్య శాస్త్ర పితామహుడు.  ఈయన  జ్యోతిష్య శాస్త్ర గ్రంథం 'భృగుసంహిత ' లో  సృష్టిలోని దాదాపు అన్ని రకాల జీవుల గురించి వ్రాయబడ్డాయి. అనగా దాదాపు 50 లక్షల ప్రాణుల జాతకాలు పొందుపర్చబడ్డాయి. ఒక పరిశీలన ప్రకారం ఇప్పుడు కేవలం 01 శాతం జీవులు మాత్రమే మిగిలి ఉన్నాయని అంటున్నారు.


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

తేనె గురించి

 తేనె గురించి సంపూర్ణ వివరణ - 1 . 



    తేనెలోని రకాలు  - 


  *  అర్ఘ్యమను తేనె . 


  *  చాద్ర అనే తేనె . 


  *  చిన్ని పువ్వు తేనె . 


  *  జిద్దాల అనే తేనె . 


  *  జుంటి తేనె . 


  *  దండజం అనే తేనె . 


  *  పుట్ట తేనె . 


  *  పాత్రికం అనే తేనె . 


  *  పౌష్పికం అనే తేనె . 


  *  భ్రామరం అనే తేనె . 


  *  మాక్షికం అనే తేనె . 


  *  సౌషిరం అనే తేనె . 


  *  క్షౌద్రం అనే తేనె . 


  *  సామాన్యపు తేనె . 



      తేనె తియ్యగా రుచిగా ఉండి వేడి పుట్టించి శరీరంను ఆర్చును . త్రిదోషాలను హరించును . విరేచనం , బలమును కలిగించును . హిక్కా , శ్వాస , కాస , వమనము , పిత్త సన్నిపాత రోగములు , విషదోష , విదాహం , చర్ది , రక్తపిత్తము , కుష్ఠు , అతిసారం , శీతపిత్తము , పక్షవాతం , మలమూత్ర బద్దకం , కంటిజబ్బులు , అశ్మరీ , మూత్రాశ్మరీ మొదలగు సమస్యలను నివారించును. 


         సాధారణముగా మన వైద్యులు వాడు మందులలో తేనెని అనుపానంగా ఇవ్వడం జరుగును . దీనిని వైద్యుడు తన యుక్తిని అనుసరించి శాస్త్రానుభవసారముగా దీనిని ఉపయోగించినచో అనేక రోగాలు పుట్టుటకు కారణం అగును. కనుక దీనికి విరుగుళ్లు తెలుసుకుని ఉండవలెను . తేనెకి విరుగుడు వస్తువుగా నెయ్యి , నిమ్మకాయ , మాదీఫలము , ధనియాలు , దానిమ్మకాయ అను వీనిలో ఏదైనా ఒకటి తీసుకుని సేవించిన ఉపశాంతి కలుగును. తేనె వ్రణములను , గాయములను మాన్పును  . 



          తేనె గురించి మరింత విలువైన విషయాలు మరియు తేనెలొని రకాలు వాటి లక్షణాల గురించి తరవాతి పోస్టులలో సంపూర్ణముగా వివరిస్తాను . 



  

    గమనిక  -


                  నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

ఎవరో కొందరు చేసిన దానికి

 ఎవరో కొందరు చేసిన దానికి


 ఎవరో కొందరు చేసిన దానికి మొత్తం ముస్లిమ్లనందరినీ ఎలా నిందిస్తారు, అని ఈరోజున ముస్లిం సమాజం బాధపడుతోంది. వారి బాధ అర్ధం చేసుకోదగినదే. అయితే మరీ ఎప్పుడో ఎవరో చేశారు అనే అనుమానంతో ఇప్పటికీ బ్రాహ్మణులను బాపనోడు, పిలక పంతులు అని వారి వేషాలను, భాషని, అలావాట్లని ఇలా వారికి చెందిన అన్నిటినీ దాదాపు వంద సంవత్సరాలుగా అవమానిస్తున్నారే మరి వాళ్ళని ఏమనాలి? 


ఎప్పుడో 3500 సం. ల క్రితం ఆర్యులు అని ఎవరో వచ్చారని, వాళ్ళేదో చేశారని, వాళ్లే బ్రాహ్మణులు అని ఒక కట్టుకథని సృష్టించి, వాళ్ళ పిలకలు లాగి, పంచలు లాగి, యజ్ఞోపవీతాలు తెంపి, వందల, వేల సినిమాలలో బ్రాహ్మణులను వారు వృత్తులను, వారి భాషను, పనిగట్టుకుని అవమానించారు కద? దానికి వారెంత బాధపడి ఉండాలి? 


పోనీ ఈ ఆర్యన్ సిద్ధాంతం కథ ఏమైనా నిజమా అంటే అదీ కాదు. ఏ ఆధారమూ లేకుండా సృష్టించబడిన ఒక కట్టు కథ. అయినా సరే, కేవలం తమకి అది నచ్చింది కనుక కొందరు దానిని నిజం అని నమ్ముతున్నారు. పోనీ కొంతసేపు అదంతా నిజమే అనుకుందాం. నిజమే అయినా, ఎప్పుడో 3500 సం. ల క్రితం ఎవరో చేసిన దానికి మీరు ఇప్పటి వారిని ఎలా బాధ్యులను చేస్తారు? 


బ్రాహ్మణుల మీద ఇంతలా గత రెండు వందల సంవత్సరాలుగా దాడి జరగడానికి ఒక్కటే కారణం. బ్రాహ్మణ్యం పోతే హిందూత్వం కూడా నాశనం అవుతుంది అని మన ప్రత్యర్థులకు స్పష్టంగా తెలియడం. అందుకే వారి మీద ఇన్నిరకాల దాడులు. వారు అనుకుంది కొంత మేర సాధించారు కూడా. ఆ కారణం వల్లనే తెలివైన బ్రాహ్మణులలో చాలా వరకూ ఎవ్వరూ బ్రాహ్మణ వృత్తులు స్వీకరించడం లేదు. అటు డబ్బూ లేక, ఇటు గౌరవమూ లేకపోతే మాకెందుకు ఈ కంచి గరుడ సేవ అనుకుని చాలా మంది సుబ్బరంగా ఉద్యోగ వ్యాపారాలు చేసుకుని డబ్బులు సంపాదించుకుంటున్నారు.


బ్రాహ్మణుల పట్ల సమాజంలో గౌరవం పెరగడం చాలా అవసరం. అప్పుడే వారు మళ్లీ బ్రాహ్మణ వృతులైన వేదాధ్యయనం, పౌరోహిత్యం, ప్రవచనం వంటి వృత్తులను స్వీకరిస్తారు. హిందూ ధర్మం బలపడాలి అంటే అది చాలా ముఖ్యం. ఈ విషయాలు ఏ బ్రాహ్మణుడూ చెప్పలేడు, నిజానికి చాలా మందికి ఈ విషయాలు తెలుసు అనికూడా నేను అనుకోను.  డబ్బు రాకపోయినా, ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది అని తెలిసినా ఎందరో బ్రాహ్మణులు మన సంస్కృతికి ఆధారమైన విద్యలు కాపాడారు అంటే కారణం, అది ఈశ్వరుడు తమకు అప్పగించిన బాధ్యత అని వాళ్ళు నమ్మడమే. అలా వారు నమ్మకపోయి ఉంటే, అది అందరి బాధ్యత అని వారు అనుకుని ఉంటే, అంటే మన దేశంలో వర్ణ వ్యవస్థ లేకపోయి ఉండి ఉంటే, భారతదేశానికి కూడా ఇస్లాం, క్రైస్తవాలు అడుగుపెట్టిన తరువాత వర్ణవ్యవస్థ లేని మిగిలిన దేశాలకి ఏ గతి పట్టిందో, అదే గతి పట్టేది. ఆ రెండు మతాలూ అడుగుపెట్టిన తరువాత కూడా తమ సంస్కృతిని, ధర్మాన్ని, నాగరికతని నిలువుకున్న ఏకైక దేశం మనదే. నాకు తెలిసినంత వరకూ ఆఫ్ఘనిస్తాన్ అంత త్వరగా ఇస్లామీకరించబడింది అంటే అందుకు కారణం అక్కడ బౌద్ధం ఎక్కువ అవ్వడమే (ఈ విషయంలో నాది పొరపాటు అయితే తెలియచెయ్యగలరు) 


కనుక బ్రాహ్మణ్యం మన బలం. అజ్ఞానంతో దానిని మనం పోగొట్టుకుంటున్నాం. నిజంగా బ్రాహ్మణ వ్యవస్థ మన బలహీనత అయితే ముఘలులు, బ్రిటిష్ వాళ్ళు, తరువాత వచ్చిన కాంగ్రెస్/కమ్యూనిస్టులు బ్రాహ్మణ వ్యవస్థని బలపరచాలే కానీ బలహీనపరచ కూడదు. 


ఒక బ్రాహ్మణుడు ఈ పోస్ట్ లైక్ చెయ్యాలి అన్నా, షేర్ చెయ్యాలి అన్నా 10 సార్లు ఆలోచిస్తాడు. వారి ఆత్మవిశ్వాసాన్ని అంతలా తూట్లు పొడిచారు. ఒక్కసారి ఈ విషయాన్నీ అందరూ కొంత విశాల దృక్పధంతో ఆలోచించండి

తల్లితండ్రుల పుణ్యఫలం

 🙏!శుభోదయమ్!!*✨🌷

🌸 *卐ॐ!! _సుభాషితమ్_!!ॐ卐* 🌸


శ్లో|| సుశీలోమాతృపుణ్యేన 

పితృపుణ్యేన చాతుర

ఔదార్యం వంశపుణ్యేన

ఆత్మపుణ్యేన భాగ్యవాన్.


తా|| తల్లితండ్రుల పుణ్యఫలం వలన మంచి గుణాలు, చాతుర్యం పొందుతాము. అలాగే వంశ పుణ్యాన ఉదారత్వం లభిస్తుంది. కానీ, స్వంత పుణ్యఫలం ఉంటేనే భాగ్యవంతులు కాగలరు. అందుకని అందరం సత్కర్మలు అంటే ఇతరులకు ప్రయోజనం కలిగించే పుణ్యకార్యాలు చేయాలి....... 

🙏✨💖🌷

సాధు దర్శనం..*

 *సాధు దర్శనం..*


"అయ్యా..ఏడుగురు సాధువులు మందిరం వద్దకు వచ్చారు..వాళ్లకు తెలుగు రాదు..హిందీ లో మాట్లాడుతున్నారు..మన సిబ్బంది లో ఎవరికీ హిందీ లో మాట్లాడటం రాదు..మీరొక్కసారి వాళ్ళతో మాట్లాడి..విషయం కనుక్కుని చెపితే..మేము అందుకనుగుణంగా నడుచుకుంటాము.." అని మా సిబ్బంది నాకు ఫోన్ చేసి అడిగారు..వాళ్ళ చేతికి ఫోన్ ఇచ్చి మాట్లాడించమని చెప్పాను..వాళ్ళతో మాట్లాడిన తరువాత..ఆ సాధువులు హరిద్వార్ వద్ద ఉంటారని..వాళ్ళు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో వుండే క్షేత్రాల ను దర్శించుకుంటూ తిరుగుతున్నారని..గొలగమూడి వెంకయ్య స్వామి మందిరానికి వెళ్ళినప్పుడు..మొగిలిచెర్ల లో కూడా ఒక అవధూత మందిరం వున్నదని విని..దర్శించుకోవడానికి వచ్చారని అర్ధమైంది..ఆ సాధువులు ఆ రాత్రికి స్వామివారి మందిరం వద్ద ఉండడానికి ఏర్పాట్లు చేయమని మా సిబ్బందికి చెప్పాను..తమ ఆహారం తామే తయారు చేసుకుంటామని కూడా వాళ్ళు చెప్పారు..


ఆరోజు రాత్రి ఎనిమిది గంటలకు స్వామివారి మందిరం వద్ద ఉన్న భక్తులు భజన చేస్తూ వున్నారు..ఏడుగురు సాధువులూ ఆ భజనను ఆసక్తిగా విన్నారు..మరి కొద్దిసేపటికి వాళ్ళు కూడా హిందీ లో భజన చేయడం ప్రారంభించారు..అందరూ స్వామివారి ముఖ మంటపం లోనే పడుకున్నారు..తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి..స్నానాదికాలు ముగించుకొని మళ్లీ మంటపం లోకి వచ్చి ధ్యానం చేసుకోసాగారు..ఆరోజు ఉదయం ఏడు గంటలకు నేను స్వామివారి మందిరం వద్దకు వెళ్ళాను..ఆ సమయానికి సాధువులందరూ స్వామివారి హారతి కళ్లకద్దుకొని..తీర్ధం తీసుకుంటూ వున్నారు..నన్ను నేను పరిచయం చేసుకొన్నాను..


"నిన్న సాయంత్రం ఐదారు గంటల వేళ మేము ఇక్కడికి వచ్చాము..మీరు మీ సిబ్బందికి చెప్పిన తరువాత..వాళ్ళు మమ్మల్ని స్వామివారి సమాధి దర్శించుకునే అవకాశం కల్పించారు..స్వామివారి సమాధి వద్దకు వెళ్ళాము..మాకు తెలీకుండానే..మా వళ్ళంతా జలదరింపులు వచ్చాయి..ఇక్కడ అఖండమైన తపో శక్తి నిక్షిప్తమై ఉన్నది..కేవలం మా అదృష్టవశాత్తూ ఇటువంటి అవధూత మందిరాన్ని దర్శించుకున్నాము..తరువాత ఇక్కడ భజన లో పాల్గొని..మేము కూడా పారవశ్యం తో భజన చేసాము..ఆ మంటపం లోనే రాత్రి పడుకున్నాము..ఇప్పుడు సమయం తక్కువగా ఉన్నందున ఈరోజు మేము వెళ్లిపోతున్నాము..కానీ అతి త్వరలోనే ఇక్కడికి వచ్చి..కనీసం పదిహేను రోజులపాటు ధ్యానం చేసుకుంటూ గడుపుతాము..మాకొఱకు ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లూ వద్దు..మా ఆహారం మేమే వండుకుంటాము.." అని చెప్పి.."మా భాష అర్ధం కాకపోయినా..మీ సిబ్బంది బాగా సహకరించారు..మా సైగలు వాళ్ళు అర్ధం చేసుకున్నారు.."అని చెప్పారు..వాళ్ళు తెచ్చుకున్న కొద్దిపాటి సామాను సర్దుకొని..తిరిగి వెళ్లేముందు..స్వామివారి సమాధిని మరొక్కసారి దర్శించుకుంటామని అడిగారు..అలాగే వెళ్ళిరండి అన్నాను..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకొని ఇవతలికి వచ్చి మూకుమ్మడిగా అందరూ "జై గురుదేవ్..జై దత్తాత్రేయ.." అని పెద్ద స్వరం తో పలికి..ఒక ఐదు నిమిషాలు కళ్ళుమూసుకుని నిలబడ్డారు..ఆ తరువాత ఇవతలికి వచ్చి..దత్తపాదములు ఉన్న చిన్న మందిరం వద్దకు వెళ్లి నమస్కారం చేసుకున్నారు..ఒక్కొక్కరుగా తమ శిరస్సులను దత్తపాదములకు ఆనించి.."జై దత్తాత్రేయా.." అని పలికి ఇవతలికి వచ్చేసారు..


"ఈ స్వామివారు మమ్మల్ని అనుగ్రహిస్తే..అతి త్వరలో మళ్లీ ఇక్కడికి వస్తాము.." అని చెప్పారు..మరో గంట తరువాత సాధువులు వెళ్లిపోయారు..


స్వామివారి సమాధిని ఎందరో సాధువులు, సాధకులు, సన్యాసులు దర్శించుకుంటూ వుంటారు..ఇక్కడ స్వామివారి తపశ్శక్తి నిక్షిప్తమై ఉన్నది అని వారందరూ తరచు చెపుతూ వుంటారు..ఆ తపోమహిమ ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా అనుభవానికి వస్తుంది..అలా అనుభూతి పొందిన వారు మరలా మరలా ఈ క్షేత్రానికి వచ్చి వెళుతుంటారు..అలాటి సాధు సన్యాసుల దర్శనం కూడా స్వామివారి వలన మాబోటి వారికి లభిస్తున్నది..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).