3, జనవరి 2022, సోమవారం

హవిర్ హరయే నమః🙏🕉️

 🕉️🙏హవిర్ హరయే నమః🙏🕉️


 ఒకానొకకాలంలో కుంభకోణంలో సుదర్శనుడనే విష్ణుభక్తుడు నివసిస్తూండేవాడు. 


ఆయనకు తన ఇంటికి సమీపంలోనే శ్రీరాముడికి , శ్రీకృష్ణుడికి ఆలయాలను నిర్మించి తరించాలనే కోరిక కలిగింది.

కాని ఆయనవద్ద ఒక ఆలయం నిర్మించడానికి కావలసిన ధనం మాత్రమే వున్నది. ఎవరికి ఆలయం నిర్మించాలనే సంశయంలో పడ్డాడు సుదర్శనుడు.


 ఒకనాటి రాత్రి సుదర్శనుని స్వప్నంలో శ్రీరాముడు

గోవులను కాస్తూ కనిపించాడు. సుదర్శనునికి

ఆశ్చర్యం కలిగింది. "కృష్ణుడు కదా..గోవులని కాసేది ? 

గోవులను మేపినందున

కదా 'గోపాలకునిగా' పిలువబడుతున్నాడు .


మరి ఇక్కడ రాముడు గోపాలకునిగా

దర్శనమిస్తున్నాడే , ఏమిటి దీని అంతరార్ధం అని ఆలోచించాడు. అప్పుడు రాముడు సుదర్శనునితో , 

' కృష్ణుడు మాత్రమే గోపాలకుడా? నేను

గోవుల కాపరిగా వుండతగనా

ఒప్పుకోరా? అని ప్రశ్నించాడు. ఇంతలో కల చెదిరింది.


తృళ్ళిపడి లేచాడు సుదర్శనుడు. మహావిష్ణువు

తనకి ఏదో సంకేతమివ్వబోతున్నాడని భావించాడు.


మరునాడు ఉదయం కుంభకోణంలోని సారంగపాణి

ఆలయానికి వెళ్ళి అక్కడ కొలువైయున్న మహావిష్ణువుని శరణు వేడుకుని

 " స్వామీ ..మీరు నాకేదో సందేశమివ్వ

బోతున్నారు

అదేమిటో తెలియజేసి కర్తవ్యం ఆజ్ఞాపించడని కోరాడు.


అప్పుడు మహావిష్ణువు ఆ ఆలయంలో వున్న ఒక అర్చకుని ద్వారా సుదర్శనునికి

ఒక విషయం తెలియచేశాడు.

" సుదర్శనా.. నీవు వున్న నివాసానికి సమీపమున

రాముడే గోపాలకునిగా

కొలువై వుంటాడు. "   

శ్రీరాముని మూలవిరాట్ గా గోపాలకుడైన శ్రీకృష్ణుని 

ఉత్సవ విగ్రహంగానూ ప్రతిష్టించమని పరమాత్మ అనుజ్ఞ అని బోధించాడు. 


భగవంతుని కరుణకు పాత్రుడైన సుదర్శనుడు పరమానందంతో రాముని

మూల విగ్రహంగాను , కృష్ణుని

ఉత్సవ విగ్రహంగాను ప్రతిష్టించడానికి ఏర్పాట్లు ఆరంభించాడు 


కానీ ఆ ఊరులో నివసించే ఒక పండితుడు లోక విరుధ్ధమైన ఈ ఆలయ నిర్మాణానికి అడ్డుతగిలాడు.

ఉత్సవ విగ్రహం, మూలవిగ్రహం ఒక స్వామివే

అయివుండాలి, ఉత్సవమూర్తి

కృష్ణుని గా, మూలవిగ్రహం

రామునిగా ప్రతిష్టించి

పూజించరాదు అని అన్నాడు.

నేను రామునికి, కృష్ణుని కి వేరు వేరు

ఆలయాలు నిర్మించలేక

పోతున్నానని

చాలా రోజులుగా బాధ పడ్డాను. 

ఇప్పుడు నారాయణుని

ఆనతి ప్రకారం ఇద్దరికి కలిపి ఒక ఆలయం నిర్మించాలనుకుంటే బయటవారి

 అడ్డంకులు ఏర్పడినందుకు అమితంగా విచారించాడు సుదర్శనుడు.

ఆ సమయంలో ఒక బాలుడు అక్కడకి వచ్చి పండితునితో

"కృష్ణునికి మాత్రమే గోపాలుడనే పేరు సార్ధకమని మీరెలా చెపుతారు. 

గో అనే వేదాలను విశ్వప్రళయ సమయాన  

మత్స్యావతారం ధరించి కాపాడిన 

మహావిష్ణువు గోపాలుడే.

గో అనే పర్వతాన్ని వీపు మీద మోసి కాపాడినందున 

కూర్మమూర్తి కూడా గోపాలుడే.

భూమి జలప్రళయంలో

ములిగిపోకుండా సముద్రమునుండి కాపాడిన

వరాహమూర్తి గోపాలుడే.

ప్రహ్లాదుడు ' గో ' అని స్తుతించగానే దయతో

అనుగ్రహించిన నారసింహుడు గోపాలుడే.


' గో' అనే భూమిని తన మూడడుగులతో కొలిచిన వామనుడు

గోపాలుడని పిలువబడుతున్నాడు.

గో అనే భూలోకంలోని

అధర్మాన్ని నాశనం చేసి శిష్ట రక్షణ చేసిన

పరశురాముడు గోపాలుడే.

" గో' అనే భూలోకాన్ని పాలించిన రాముడు 

గోపాలుడే. 

గో అనే భూమిని

నాగలితో దున్నిన బలరాముడు

గోపాలుడే.  


భవిష్యత్తులో అవతరించబోయే

 కల్కి కూడా యీ భూమిని కాపాడే గోపాలుడే.

" ఈమాత్రం తెలియని మీరూ ఒక

పండితులేనా ? " అని హేళనగా నవ్వి

ఆ బాలుడు మాయమైనాడు.

ఆ బాలుడు మహావిష్ణువు కాదు అనడానికి వీలులేదు.


మహావిష్ణువు అనుగ్రహం ప్రకారం ,సుదర్శనుడు 

కోరుకున్న విధంగా ఉన్నతమైన ఆలయం నిర్మించబడినది.

సంప్రోక్షణం జరిగింది. 


ఆ ఆలయమే ఈనాటికీ

కుంభకోణం తోపు వీధిలో వున్న 

శ్రీ రాజగోపాల స్వామివారి

ఆలయం. ఆ ఆలయంలో

మూలవిగ్రహం గా శ్రీ రాముడు

సీతా లక్ష్మణ సమేతుడై, హనుమంతుడు సేవిస్తుండగా

దర్శనమిస్తున్నాడు.


శ్రీ కృష్ణుడు ఉత్సవ మూర్తిగా, రుక్మణీ ,సత్యభామా సమేతుడై రాజగోపాలునిగా పశువులను మేపే

గోపాలునిగా దర్శన

మనుగ్రహిస్తున్నాడు.

సుదర్శనుని వెతుకుతూ వచ్చి తనే స్వయంగా సుదర్శనునికి అనుగ్రహం ప్రసాదించినట్లు , తన భక్తులను సమయానుకూలంగా

 తానే స్వయంగా వచ్చి కాపాడుతున్నందున

మహావిష్ణువు 

"హవిః" అని 

పిలువబడుతున్నాడు.

హవిః అంటే యివ్వడం

అని అర్ధం. సుదర్శనుడు

ఆలయం నిర్మించిన సమయంలో ఏర్పడిన

అడ్డంకులు తొలగించినట్లు 

మహావిష్ణువు తనను కోరివచ్చే భక్తులకు ఏర్పడే సకల

ఆడ్డంకులను తొలగిస్తున్నందువలన

' హరిః' అని పిలువబడుతున్నాడు.


భక్తుల న్యాయ సమ్మతమైన కోరికలను తీర్చి ఆదుకుంటున్న 

శ్రీమహావిష్ణువు

' హవిర్ హరిః' అని పిలువబడుతున్నాడు.

యీ నామము సహస్రనామములలో

361 వ నామము.


' హవిర్ హర నమః' అని నిత్యం జపించే భక్తులకు నారాయణానుగ్రహం తప్పక సిధ్ధిస్తుంది...

2, జనవరి 2022, ఆదివారం

ద్వాదశి వ్రతం

 అంబరీష చక్రవర్తి ఒక సంవత్సరము ద్వాదశి వ్రతం మొదలుపెడతాడు. కార్తీక శుద్ద ఏకాదశినాడు ఉపవాసముండి ద్వాదశినాడు మహావిష్ణు పూజ ముగించి అనేకమందికి అన్నదానము చేసి తాను భోజనానికి ఉపక్రమిస్తాడు. ఇంతలో దూర్వాస మహామునియు తన శిష్యులతో వస్తాడు. అంబరీషుడు దూర్వాసునకు అర్గ్య పాదులు ఇచ్చి భోజనానికి ఆహ్వానిస్తాడు . దూర్వాస మహామునియు స్నానం చేసి వస్తానని నదికి వెళ్లి ఎంతసేపటికి రాడు . ఇంకా ద్వాదసి కాలం ఒక ఘడియ మాత్రమే ఉంది. ఈ లోపున భుజింకపోతే వ్రతం కాస్తా వృధా అయిపొతుంది . బ్రాహ్మణోత్తముల సలహాతో తులసి తీర్ధమ్ పానముగా స్వీకరించి దుర్వాసముని రాకకై ఎదురుచూస్తుంటాడు. దూర్వాస మహాముని రానే వచ్చాడు, సంగతి గ్రహించాడు. తనని ఎదురుచూడకుండా ముందుగా పానము చేసినందుకు ఆగ్రహించి , కృత్స అనే స్త్రీని అప్ప్పటికప్పుడు సృష్టించి అంబరీషుని హతం చేయమని ఆజ్ఞఇస్తాడు. కానీ అంబరీషుని భక్తివల్ల మహావిష్ణువు ఆయుధం విష్ణుచక్రము అతనిని సదా కాపాడుతుంటుంది. వెంటనే విష్ణు చక్రము కృత్యని వధించి, దుర్వాసుని వెంటపడుతుంది. దుర్వాసుడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి రక్షించమనంటాడు. బ్రహ్మదేవుడు తాము అంతా మహవిష్ణువు అధీనములో ఉంటామని చెప్పి తాను ఏమీ చేయలేనని అంటాడు. మహేశ్వరుడు కూడా ఆ విధముగానే సమాధానము ఇస్తాడు. ఇంకా చేసేదేమిలేక మహావిష్ణువుని ఆశ్రయిస్తాడు.మహావిష్ణువు కూడా తాను భక్తులకు ఆశ్రయుడనని తానేమిచేయలేనని, మళ్ళి అంబరీషునినే వేడుకోమని సలహా ఇచ్చి పంపించి వేస్తాడు.. ఇక్కడ శ్రీ మహావిష్ణువు ముఖ్యమైన విషయము చెప్తాడు. " సద్భ్రాహ్మణులకను విద్య, తపస్సు సదా కాపాడుతూ ముక్తిని కలిగిస్తాయి. అదే విద్య, తపస్సు దుర్జనులైన బ్రాహ్మణులకు కీడు చేయకుండా ఉండలేవు సుమా. సాధువులలో ఉండే తేజము వారిని సదా కాపాడుతుంటుంది. వారిని హింసించే వ్యక్తులను ఆ తేజమే భయబ్రాంతులకు గురిచేస్తుంది.". తదుపరి దుర్వాసుడు తప్పు తెలుసుకొని అంబరీషుని వేడుకొని , అంబరీషుని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు.

గుడికి ఒక్కో ప్రత్యేకత.

 ఒకొక్క గుడికి ఒక్కో ప్రత్యేకత.

మన పూర్వీకులు గొప్ప సివిల్ ఇంజనీర్ లు.

పూర్వకాలంలో దేవాలయాలు ( కోవెలలు,గుడులు) నిర్మీంచేటప్పుడు ఒక ప్రత్యేకత కలిగి ఉండేటట్టు నిర్మించేవారు.

అయితే ఒక్కొక్క కోవెలకు ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉండేది.

ఉదాహరణకు కొన్ని చూద్దాం.

1.ఉత్సవవిగ్రహం లేకుండా మూలవిగ్రహమే బయటకు మాడవీధులకు వచ్చేది చిదంబరం నటరాజస్వామి.

2.కుంబకోణంలో ఐరావతేశ్వరస్వామి గుడి తారాశురం అనే గ్రామంలో వుంది.అక్కడశిల్పకళా చాతుర్యం చాలా గొప్పగా చెక్కబడివుంది.

ఒక స్తంభము నుంచి చూస్తె వాలిసుగ్రీవులు యుద్ధం మట్టుకే తెలుసుతుంది ,కొంచం దూరంలో ఇంకొక స్తంబములో రాముడు ధనుర్దారిగా ఉండేటట్టు చెక్కబడివుంది.ఇందులో గొప్ప ఏమిటి అంటే మోదటి స్థంబము నుంచి చూస్తె శ్రీరాముడు కనపడడు కాని రెండవ స్తంబము నుంచి చూస్తె వాలిసుగ్రీవుల యుద్దము చాల బాగా తెలుస్తుంది.

3.ధర్మపురి(తమిళనాడు)

మల్లికార్జునస్వామీ కోవెలలోన వంగామంటపం అంటే తొమ్మిదిస్తంభముల మంటపం అన్నమాట.ఇందులో రెండు స్థంబములు భూమిపై ఆనకుండా గాలిలో వేలాడుతున్నట్టుగా ఉంటాయి .

4.కరూర్(కోయంబత్తూర్)

సమీపంలోని కుళిత్తలై అనే ఊరిలో 

కదంబ వననాధస్వామి కోవెలలో రెండు నటరాజ విగ్రములు ఒకే మండపములో ప్రతిష్ట గావించబడి వున్నాయి.

5.గరుడుడు నాలుగుకరములతో( చేతులతో) అందులో రెంటిలో శంఖచక్రములతో దర్శనము ఇచ్చేది కుంబకోణం ప్రక్కన వేల్లియంగుడి అనే గ్రామ దెవాలయంలోమాత్రమే.

6.కుంభకోణంలో నాచ్చియార్కోవిల్ అనే స్థలంలో విష్ణుగుడి వుంది.అక్కడ గరుడవాహనం రాతితో చేసినది స్వామీ సన్నిధిలో ఉంది అది నలుగురు మోసే బరువు వుంటుంది.

కాని క్రమంగా ఒక్కొక్క ప్రాకారందాటి బయటకు వస్తుంటే రానురాను 8,16,32 అలా బయటవీదిలోకి వచ్చేటప్పటికి 64 మంది మోసే అంత బరువు అయిపోతుంది 

మరి స్వామీగుడిలోనికి పోతున్నప్పుడు అదేవిధముగా బరువు తగ్గిపోతూ వుంటుంది ఇక బయటవీధికి వచ్చేటప్పటికి గరుడవిగ్రహమునకు చెమటపట్టడం కూడా ఒకవిచిత్రమే.

7.చెన్నైసమీపంలో శ్రీపెరుంబుదూర్ అనే స్థలములో రామానుజుల వారి గుడి వుంది అక్కడ మూలస్థానంలో విగ్రహం రాతిది కాదు

పంచలోహవిగ్రహము కాదు కేవలం 

కుంకుమపువ్వు పచ్చకర్పూరం మూలికలతో చేసినది.

ఆశ్చర్యం కదా.

8.తిరునెల్వేలి కడయం మార్గములో నిత్యకల్యాణి సమేత విశ్వనాథస్వామి దేవాలయంలో ఒకబిల్వచెట్టు స్థలవృక్షం గా వుంది.ఆ చెట్టులో కాచే బిల్వకాయలు లింగాకారంలో వుంటాయి.

9.కుంభకోణం సమీపంలో తిరునల్లూరు అనే స్థలంలో ఈశ్వరుని గుడి వుంది అక్కడ శివలింగం రోజుకు ఐదువర్ణములుగా మారుతూ వుంటుంది అందుకే ఆ కోవేలని పంచవర్నేశ్వరుడు కోవెల అని పిలుస్తారు.

10.విరుదునగర్ ప్రక్కనా ధన్పుదూర్ అనే ఊరిలోని తవ(తపస్)నందీశ్వరుని కోవెలలో నందికి కొమ్ములు చెవులు వుండవు.

11.ఆంధ్రప్రదేశ్ 

సామర్లకోటలో మూడువీదుల సంగమములో ఒకపెద్ద ఆంజనేయ విగ్రహం వుంది.దీని ప్రత్యేకత ఆంజనేయ విగ్రహం కనులు భద్రాచల శ్రీరామసన్నిధిలో శ్రీరాముని పాదములు ఒకే ఎత్తులో వుండడం.

12.వేలూర్ సమీపంలో విరించిపురం అనే వూరి కోవెలలో ఒకస్థంభములో అర్ధచంద్రాకారముగా ఒకటి నుండి ఆరు వరకు,ఆరునుండి పంన్నెండు వరకు అంకెలు చెక్కబడి వున్నది .

పైన వుండే పల్లము నుండి మనము ఒక పుల్లను పెడితే నీడ ఏ అంకెపై పడుతుందో అదే అప్పటి సమయం.

గడియారం చూసుకొఖ్ఖర లేదు.

13.చెన్నైనుంచి తిరుపతి వెళ్ళే దారిలో నాగలాపురం వద్ద వేదనారాయణస్వామి కోవెలలో మూలవిగ్రహం శిరస్సునుంచి నడుమువరకు మానవఆకారం నడుమునుంచి పాదములవరకు మత్స్యఆకారంలో వుంటుంది.

14,ధర్మపురి(తమిళనాడు)పక్కన పదుహారు అంటే పదిమైళ్ళదూరంలో అభీష్టవరదస్వామీ అనే విష్ణుగుడిలో నవగ్రహములు స్త్రీ రూపముతో ఉంటారు.

ఇలా మనకు తెలియని , తెలిసినా పట్టించు కోకుండా గొప్పగా చెప్పుకోనివి ఇంకా ఎన్నో ప్రత్యేకతలు పూర్వకాలంలో ఆగమవిధానంగా కట్టిన దేవాలయాలు వున్నాయి.

****ఈ క్రింది చిత్రంలో కనిపిస్తున్న దేవాలయం మురుడేశ్వర దేవాలయం, కర్నాటక.

జై శ్రీరామ్, జై భారత మాత. 🚩

అమావాస్య పూజ

 🌸🌸🌸🌸🌸🌸🌸

🌷అమావాస్య పూజ🌷


పౌర్ణమి కి వెన్నెల పారాయణ చేస్తున్నారు బాగుంది, మరి అమావాస్య రోజు ఎలా చేయాలి అని అడిగారు కదా... ఏమీ చేయాలో ఎలా చేస్తే మంచిసో చూద్దాం...


అమావాస్య రోజు ముజ్యంగా లక్ష్మీ దేవిని, భైరవుడిని, కాళీ మాతను, దుర్గా దేవిని, విశేషంగా పూజించే రోజు అలాగే పరిహార మంత్రాలు జపం చేస్తున్న వాళ్ళు ఉద్ది గారెలు బెల్లం పానకం నైవేద్యం పెట్టి అధికంగా అమావాస్య రోజు జపము చేసి విశేషంగా జపం చేస్తున్న దేవతను పూజించాలి.. అది ఏ ఉపాసనా దేవత అయినా అవే నైవేద్యంగా పెట్టి ఆ  ప్రసాదాన్ని ఒక రెండు వడలు అయినా కుక్కకు పెట్టాలి మీరు తీసుకోవాలి..


1.అమావాస్య రోజు లక్ష్మీ దేవిని పూజించాలి అనుకునే వారు.. మీకు నేను ఇచ్చిన కమలాత్మిక హైమావతి సంపుటికరణ చేసి ఇచ్చిన అష్టోత్తరం తో అర్చన చేసి కమలాత్మిక స్త్రోత్రం చేసి కమలాత్మిక ఖడ్గమాల చదివి.. మీ శక్తి కొద్దీ నైవేద్యం సమర్పించి మీ గృహస్థులు కానీ వారికి ఎవరికైనా కాస్త ప్రసాదాన్ని పంచి తర్వాత ఆ అర్చన కుంకుమ ఇంటిల్లి పాది ధరించాలి ధనం ఇంట్లో నిలుస్తుంది , రావాల్సిన ధనం కి ఆటంకాలు పోతుంది, వృత్తిలో, వ్యాపారం లో అధిక లాభాలు వస్తుంది.. కొత్త అవకాశాలు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి విజ్ఞాలు తొలగుతుంది.. భార్య స్త్రోత్రం చదువుతూ భర్త కుంకుమ పూజ చేస్తే ఆ కుటుంబంలో నిత్య అవసరాలకు లోటు ఉండదు..ఈ శ్లోకాలు అన్ని గ్రూవ్ లో ఉన్నాయి గమనించండి..


2.  అమావాస్య రోజు భైరవ ఉపాసన చాలా విశేషం కుటుంబ కలహాలు, ఆస్తి గోడవలు, శత్రు బాధలు, అనుమానాలు, ఇంటి  మీకు వృత్తి వ్యాపారాలకు ఉన్న నరధిష్ఠి మొత్తం అమావాస్య రోజు చేసే భైరవుడు ఆరాధన ద్వారా తొలగి పోతుంది... భైరవుడు ఎన్నో జప మంత్రాలు శ్లోకాలు గ్రూవ్ లో పెట్టాను అవి చేయవచ్చు.. ముఖ్యంగా సాయంత్రం చేయాలి సాంబ్రాణి పైన తెల్ల ఆవాలు వేసి బైరావుడిని స్మరిస్తూ ఇల్లంతా ధూపం వేయాలి , తర్వాత సాంబ్రాణి పైన బిర్యానీ ఆకులు వేసి మీ భర్త పిల్లలకు ఆ సాంబ్రాణి వేయాలి తరచుగా కిందపడటం దెబ్బలు దిష్టి దోషాలు పోతుంది.. బైరావుడిని తీపి పదార్ధంలో లడ్డు అంటే ఇష్టం అది పెట్టగలిగితే ఆ రోజు నైవేద్యంగా పెట్టి కుక్కకు ఆహారంగా వేయండి శత్రు బాధలు మిమల్ని భయపెడుతున్న బాధలు తొలగి పోతుంది..


3. కాళీ మాతకు విశేషం మైన రోజు ఆ తల్లికి అరటిపండ్లు నైవేద్యం పెట్టి స్త్రోత్రం చేసి హారతి ఇవ్వాలి.. వయసు అయిన పెద్ద ముత్తైదువులకు  ఆ అరటిపండు తాంబులం ఇవ్వాలి ఆమె స్వయంగా స్వీకరిస్తుంది .


4. దుర్గా మాత నా తల్లి విశేషంగా పూజించాల్సిన రోజు ఎప్పుడూ లోకాలను రక్షిస్తూ కాపాడుతూ ఉండే రూపం దుర్గా రూపం విశేషం ఏంటి తల్లి అంటే ఆ శివుడికి కూడా కష్టం వచ్చినప్పుడు దాల్చే రూపం అంత శక్తి రూపం దుర్గ రూపం నా ఆరాధ్య దైవం , ఆ రోజు పసుపు నీళ్లతో  అభిషేకం చేయాలి వేప మండలు అలంకారం చేయాలి అంబలి (అన్నంలో రాగిపిండి కలిపి ఉడికించి చల్లార్చి మజ్జిగ కలపడం) నైవేద్యం పెట్టి  దుర్గా స్తోత్రాలు, అష్టోత్తరం, మహిషాసుర మర్దిని స్త్రోత్రం ఇలా ఎన్ని స్తోత్రాలతో అయినా పూజ కుంకుమ అర్చన చేసి హారతి ఇచ్చి ఆ నైవేద్యం పంచుకుని తాగాలి.. అన్ని రకాల విజ్ఞాలు ,ఆపదలు తొలగిస్తుంది కుటుంబానికి రక్షణ కవచం లా కాపాడుతుంది.. ముఖ్యంగా మిరియాలు పొడి కలిపిన గారెలు చేసి నైవేద్యం పెట్టాలి అది పూజ తర్వాత కుక్కకు పెట్టి తర్వాత తీసుకుంటే మీకు ఉన్న జాతక దోష ప్రభావం తగ్గుతుంది.


అన్ని బాగానే ఉంది అన్ని చేయాలి అనిపిస్తుంది కదా అన్ని చేసిన గంట సమయం కన్నా పట్టదు అన్ని స్త్రోత్రలు ఇదే గ్రూప్ లో ఉన్నాయి లేదా మీదగ్గరే బుక్స్ ఉంటుంది చూసి చేయండి.. సాంబ్రాణి పైన తెల్ల ఆవాలు ధూపం అందరూ ఇంట్లో వేసుకోవచ్చు పూజ చేయకపోయినా... ఇవన్నీ సాయంత్రం చేసే పూజలు ఉపవాసం అవసరం లేదు..

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌿🌿🌿🌿🌿🌿🌿🌿


👉అద్దె ఇంటిలో ఉండే వారు అమావాస్య రోజు ఇంటికి గుమ్మడికాయ కడితే చాలు అది కుళ్ళిన తర్వాత మార్చాలి, అదే సొంత ఇల్లు అయితే గుమ్మానికి కట్టిన గుమ్మడికాయతోనే దిష్టితీసి పగలగొట్టి కొత్త గుమ్మడి కాయ గుమ్మానికి కట్టాలి. ఇలా తరచుగా చేస్తే ఇంటికి యజమానికి క్షేమం..


వ్యాపారస్థలంలో అయితే సొంతం అయినా అద్దె అయినా ప్రతి అమావాస్య కి గుమ్మడికాయ కొట్టాలసిందే, వ్యాపార స్థలంలో మంగళవారం నాడు గుమ్మం ముందు నిమ్మకాయ రెండుగా కోసి కుంకుమ అద్ది ప్రవేశద్వారం వద్ద గడపకు అటూఇటూ ఉంచి మరుసటి రోజు తీసి పడేయాలి.


👉గుమ్మడికాయ లో అధికశాతం మెగ్నీషియం ఉంటుంది కనుక తరచుగా తింటే ఎముకలు గట్టి పడతాయి


ఇంటి యజమాని నిదిరించే గదిలో నైరుతి ములలో రాళ్లఉప్పు ఒక కప్ బౌల్ లో ఉంచాలి అలా మూడు రోజులు ఉంచాక దాన్ని తీసి దూరంగా ఎక్కడైనా మురికి గుంటలో కానీ పారె నీటిలో కానీ పడేసి రావాలి.. తరచుగా వచ్చే తగాదాలు తగ్గుతుంది. దిష్టి పోతుంది..ధనం నిలుస్తుంది. 


👉 కొందరు ఆడవాళ్లకు తల చిక్కు తీసిన వెంట్రుకలు ఇంట్లో దాచే అలవాటు ఉంటుంది అది అన్ని రకాల దరిద్రాలకు ఆహ్వానం చెప్తుంది.. ఇది వరకు కాలంలో ఇంటిబయట సపారులో గూటిలో వెంట్రుకలు దాచి సవరం కట్టుకుని వారు కానీ ధాన్యం ధనం నిలువ ఉండే గృహంలోపల పెట్టేవారు కాదు.

🌷శ్రీ మాత్రే నమః🌷

1, జనవరి 2022, శనివారం

హనుమాన్ చాలీసా

 ॐ హనుమాన్ చాలీసా


31. అష్టసిద్ధి నవనిధి కే దాతా I 

        అసవర దీన(న్హ) జానకీ మాతా ॥ 


    - అణిమాద్యష్టసిద్ధులను, నవనిధులను సంప్రాప్తింప చేసేవాడివి.

      సీతాదేవి ఆవిధంగా వరం నీకు ఒసగింది.


    - Mother Sita granted you the boon that 

       you will be the bestower of the eight powers and nine wealths.


వివరణ


 అష్టసిద్ధులు,నవనిధులు అంటే ఏమిటి?


అష్టసిద్ధులు...


1.అణిమ,2.మహిమ3. గరిమ,4.లఘిమ,5.ప్రాప్తి, 6.ప్రాకామ్యము,7.ఈశత్వం,8.వశిత్వం.


1) అణిమ: శరీరమును అతి చిన్నదిగా చేయుట

2) మహిమ: శరీరమును అతి పెద్దదిగా చేయుట

3) గరిమ: శరీరము బరువు విపరీతముగా పెంచుట

4) లఘిమ: శరీరమును అతి తేలికగా చేయుట

5) ప్రాప్తి: కావలసిన వస్తువులు పొందుట

6) ప్రాకామ్యం: కావలసిన భోగము అనుభవించుట

7) ఈశత్వం : ఎవరిపైనైనా, దేనిపైనైనా అధికారము పొందుట

8) వశిత్వం: అన్ని భూతములను లోబరచుకొనుట


నవనిధులు...


1. పద్మం,2. మహాపద్మం,3. శంఖం,4. మకరం,5. కచ్చపం,6. ముకుందం,7. కుందం, 8.నీలం, 9. ఖర్వం


(ఇవి ఐశ్వర్య ప్రతీకలైన నిధులు. ఇవి కుబేరుని వద్ద మహాలక్ష్మి దయవలన కలిగి ఉన్నాయి. ఈ నిధి దేవతల వలన భూ,జల, లోహ భోగాది సంపదలు లభిస్తాయి)


          ఆంజనేయ స్వామి సురస పరీక్షను ఎదుర్కొనే సమయంలోనూ,

          సింహికను సంహరించు సమయానా తాను స్వయంగా అణువులా మారి నోటిలో వెళ్ళి తిరిగి బయటకు రావడం మనకు తెలిసిన విషయమే... 

          అలానే సంజీవని పర్వతాన్ని తెచ్చేందుకు లంక నుండి హిమాలయాల వరకు లంఘించారు.. 

          ఆంజనేయస్వామికి ఇన్ని శక్తులున్నా, అవసరమైనమేరకే విచక్షణతో వాటిని ఉపయోగిస్తారు.

          శక్తులను కలిగి ఉండడం గొప్ప కాదు.. కానీ వాటిని మంచి కార్యాలకు వినియోగించడం గొప్ప... 

          వాటి విలువ తెలుసుకుని వాటిని గౌరవించడం ఇంకా గొప్ప. 

          అందుకే హనుమ గొప్ప నమ్మకస్థుడు, భక్తుడు, దైవం అయ్యారు...


    బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రిగారి వివరణ 👇


    https://youtu.be/rax3zcZJszQ


                    =x=x=x=


    — రామాయణం శర్మ 

             భద్రాచలం

31, డిసెంబర్ 2021, శుక్రవారం

శ్రీకృష్ణదేవరాయలకు

 శ్రీకృష్ణదేవరాయలకు దేశభాషలందు తెలుగు లెస్స అని చెప్పిందెవరో తెలుసా ?

...............................................................

శ్రీకృష్ణదేవరాయలు తూర్పు దిగ్విజయయాత్రలో విజయవాటిక అంటే విజయవాడలో కొన్నాళ్ళు వున్న తరువాత శ్రీకాకుళంలోని ఆంధ్రమహ విష్ణువు దర్శనార్థమై వెళ్ళాడు. అక్కడ ఏకాదశి ఉపవాసం వుండి రాత్రి నిద్రించాడు. ఆ రాత్రి నాల్గవ యామంలో శ్రీకృష్ణరాయడుకి స్వామి కలలో కనిపించి ఇంతవరకు అనేక ప్రాంతాలు జయించావు. సంస్కృతంలో మదాలస చరిత్రము, సత్యవధూప్రీణనం, సకలకథాసార సంగ్రహం, సూక్తినైపుణి జ్ఞానచింతమణి, రసమంజరి ఆనే గొప్ప సంస్కృత గ్రంథాలను వ్రాశావు.


కాని దేశభాషలందు తెలుగు లెస్స కాబట్టి శ్రీవైష్ణవ అళ్వారులలో ఒకత్తైన గోదాదేవి చరిత్రను తెలుగులో వ్రాయమన్నాడు. అలా శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో వ్రాసినదే అముక్తమాల్యదగా పిలవబడిన విష్ణుచిత్తియమనే గ్రంథం.


అళ్వారులు 12 మంది, వీరు శ్రీవైష్ణవభక్తులు. తమిళసాహిత్యంలో విష్ణువు మీద 4 వేలవరకు పాశురాలను తమిలంలో వ్రాశారు. వీటికే దివ్యప్రబంధాలని పేరు.

12 మంది అళ్వారులలో గోదాదేవి ఒక్కర్తే స్త్రీ.


ఆళ్వారులు12 మందని చెపుకొన్నాము కదా ! వారెవరంటే.


 (1) పొయ్‌గై యాళ్వార్ (2) పూదత్తాళ్వార్ (3) పేయాళ్వార్ (4) పెరియాళ్వార్ (5) తిరుమళిశై యాళ్వార్ (6) కులశేఖరాళ్వార్ (7) తిరుప్పాణాళ్వార్ (8) తొండరడిప్పొడి యాళ్వార్ (9) తిరుమంగై యాళ్వార్ (10) ఉడయవర్ (11) నమ్మాళ్వార్ (12) గోదాదేవి.


దేశభాషలలో తెలుగు లెస్స అని శ్రీకృష్ణరాయల కంటే చాలా ముందుగానే పలికినవాడు క్రీడాభిరామమనే గ్రంథాన్ని వ్రాసిన వినుకొండ వల్లభరాయుడు.


వల్లభరాయుడు శ్రీనాథకవికి సమకాలికుడు. వల్లభరాయునికి క్రిడాభిరామ గ్రంథరచనలో సాయ పడ్డాడు కనుకనే కొంతమంది సాహితి విమర్శకులు క్రీడాభిరామ కావ్యాన్ని వ్రాసింది శ్రీనాథకవి సార్వభౌముడేనంటారు.

............................................................................జిబి.విశ్వనాథ, 9441245857, అనంతపురం.

30, డిసెంబర్ 2021, గురువారం

డయాబెటిస్‌కు

 డయాబెటిస్‌కు శుభవార్త.

 

ఈ సమాచారం అవసరమైన వారికి సహాయపడటానికి మీరు ఈ క్రింది సందేశాన్ని ఫార్వార్డ్ చేయగలరని ఆశిస్తున్నాము ...!

 

ఒక మహిళ (65) గత 20+ సంవత్సరాలుగా డయాబెటిస్ కలిగి ఉంది మరియు రోజుకు రెండుసార్లు ఇన్సులిన్ తీసుకుంటుంది. ఆమె పక్షం రోజులపాటు ఇంటిలో తయారు చేసిన (medicine) ఔషధాన్ని ఉపయోగించింది మరియు ఇప్పుడు ఆమె డయాబెటిస్ నుండి పూర్తిగా ఉచితం మరియు స్వీట్స్‌తో సహా ఆమె ఆహారాన్ని సాధారణమైనదిగా తీసుకుంటుంది.

 

ఇన్సులిన్ మరియు రక్తంలో చక్కెరను నియంత్రించే మందులను ఆపమని వైద్యులు ఆమెకు సూచించారు. దయచేసి మీ అందరికీ ఈ క్రింది మెసేజ్ ను మీకు వీలైనంత ఎక్కువ మందికి పంపించి, దాని నుండి అధిక ప్రయోజనం పొందమని నేను కోరుతున్నాను.

 

DR. టోనీ అల్మైడా

 (బొంబాయి కిడ్నీ స్పెషాలిటీ నిపుణుడు) పట్టుదల మరియు సహనంతో విస్తృతమైన ప్రయోగాలు చేసి మధుమేహానికి విజయవంతమైన చికిత్సను కనుగొన్నారు.

ఇప్పుడు డయాబెటిస్ కారణంగా చాలా మంది ప్రజలు, వృద్ధులు మరియు మహిళలు చాలా బాధపడుతున్నారు.

 

 కావలసిన పదార్థాలు

 1 - * గోధుమ 100 గ్రా

 2 - * బార్లీ 100 గ్రా 

 3 - *నల్లజీలకర్ర (కొలుంజీ) 100 గ్రాములు *

 కొలుంజీ తమిళంలో * కరుంజీరాహం*

తయారీ విధానం:

 పైన పేర్కొన్న అన్ని పదార్థాలను 5 కప్పుల నీటిలో ఉంచండి.

దీన్ని 10 నిముషాలు మరిగించాలి 

స్వయంగా చల్లారాలి!


ఇది చల్లగా మారినప్పుడు, వడపోసి ఒక గాజు పాత్ర లేదా సీసాలో ఈ నీటిని నిలువ చేయండి!

 

 దీన్ని ఎలా వాడాలి?

ప్రతిరోజూ ఉదయాన్నే మీ కడుపు ఖాళీగా ఉన్నప్పుడు ఈ నీటిని ఒక చిన్న కప్పు తీసుకోండి.

దీన్ని 7 రోజులు కొనసాగించండి.

వచ్చే వారం అదే కానీ ప్రత్యామ్నాయ రోజులలో (రోజుమార్చి రోజు) పునరావృతం చేయండి. ఈ 2 వారాల చికిత్స తో మీ ఆరోగ్యం మామూలుగా మారిందని మీరు ఆశ్చర్యపోతారు. 

 సమస్య లేకుండా సాధారణ ఆహారం తీసుకోవచ్చును!

 

గమనిక:

దీన్ని వీలైనంత ఎక్కువ మందికి విస్తరించాలని ఒక అభ్యర్థన, తద్వారా ఇతరులు కూడా దాని నుండి ప్రయోజనం పొందవచ్చు.

 

 ఇవి అన్ని సహజమైనవి, వాటిని తీసుకోవడం హానికరం కాదు. ఈ చికిత్స గురించి నైపుణ్యం ఉన్నవారు ఏ హాని లేకుండా ప్రయత్నించవచ్చు.

 

మరోసారి ఈ సందేశం పంపినందుకు ధన్యవాదాలు ...

చాలా మందిని చక్కెర వ్యాధి నుండి కాపాడండి .... (డయాబెటిస్)

సర్పబంధనం

 సంపదను దాచుకునే పురాతన టెక్నాలజీ "సర్పబంధనం" .అప్పట్లో రాజులకు బ్యాంకులు లాకర్ లు లేవు కాబట్టి వారు విలువైన సంపాదన సర్పబంధనం వేసేవారు. అది ఎవరైన తవ్వితే వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో పాములు వచ్చేవి.మరి ఆ పాములు తెచ్చి అక్కడ ఎలా పెడతారు.....? పూర్వం రాజులు తమ సంపద దాచాలనుకున్న చోట లోతుగా అంటే ఒక తాటి చెట్టు అంత లోతు తవ్వి అందులో సంపద పెట్టి కొంత మట్టి వేసి తరువాత కొన్ని టన్నుల బెల్లం వేసి పెట్టేవారు. ఆ బెల్లం కోసం వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో చీమలు వచ్చి చేరి పెద్ద చీమల పుట్ట ఏర్పడేది.చీమల పుట్ట లే కదా పాములకు ఆవాసాలు అయ్యేవి.అంత పెద్ద చీమల పుట్ట లో వందల సంఖ్యలో పాములు చేరి గుడ్లు పెట్టి పిల్లల్ని చేసి కాలక్రమం లో అవి లక్షల్లో చేరుతాయి. అలా సర్పాలకు ఆవాసమయిన ఆ గుంత సర్ప గృహం గా మారుతుంది. పుట్ట కాదు సర్ప గృహం. అది ఎవడైనా తవ్వితే వేల సంఖ్యలో విష సర్పాలు బయటికి వచ్చి వాటి కాటుకు మరణిస్తాడు.


ఆ సంపద తీయలనుకున్నప్పుడు నిపుణుడు అయిన వ్యక్తి అక్కడ సమీపం లో మరొక గుంత తొవ్వి మళ్ళీ సేమ్ బెల్లం తో పెద్ద చీమల పుట్ట ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేక ద్రవ్యాలతో హోమం నిర్వహించి ఆ పొగ కు ఆ పాములు అన్ని అక్కడి నుండి వేరే పుట్టలోకి పోయిన తరువాత ఆ సంపద తిరిగి రాజ్యానికి చేర్చేవారు అని "తంత్ర శాస్త్రం" చెబుతుంది

జ్ఞాన మండలి

 జ్ఞాన మండలి...


 రోజూ భగవంతునికి పూజ చేసే వారు కూడా... 

భగవంతుడు అంటే ఏమిటి...

అంటే.....

ఎంతోమంది సరైన సమాధానం చెప్పలేరు. 


కాబట్టి ఓపిక చేసుకుని... 

ఈ చిన్న కథను చదవండి. 


ఓ దేశాన్ని పాలించే రాజు మనసులో... ముఖ్యంగా మూడు అర్దంకాని ప్రశ్నలు మెదడును తోలుస్తూ ఉన్నాయి. 

అవి... 


1.దేవుడు ఏ వైపు చూస్తుఉంటాడు? 

2.దేవుడు ఎక్కడ ఉంటాడు? 

3.దేవుడు ఏం చేస్తాడు? 


ఆ ప్రశ్నలకు ఎన్నోమార్లు ఎంత యోచించినా సరైన సమాధానం దొరకలేదు.


తన ఆస్థానంలో ఓ రోజు సమావేశమై... పండితులను, 

శాస్త్రకారులను, 

మేధావులను ఆహ్వానించాడు.

తాను మూడు ప్రశ్నలు వేస్తానని, 

వాటికి జవాబులు చెప్పడానికి ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పిన వారికి గొప్ప బహుమతి లభిస్తుందని చెప్పాడు. 

సరైన సమాధానం చెప్పకపోతే కారాగారం పాలు చేస్తానని చెప్పాడు. 

దాంతో భయపడి ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయం దేశమంతా చాటింపబడింది.


ఓ కుగ్రామం నుండి పశువుల కాపరి ఒకాయన ముందుకు వచ్చాడు.

రాజాస్థానం చేరుకొన్నాడు. 

రాజు సభలో ఎందరో మేధావులు శాస్త్ర పండితులు కూర్చొన్నారు.


పశువుల కాపరి, రాజుగారి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు.... రాజుకో విషయం నిర్దేశం చేసాడు.

‘చెప్పేవాడు గురువు, 

వినేవాడు శిష్యుడు. 

గురువు పైన ఉండాలి, 

శిష్యుడు క్రింద ఉండాలి’ 

అని కండీషన్ పెట్టాడు . 


దానికి రాజు అంగీకరించి సింహాసనం నుండి క్రిందికి దిగాడు. 

పశువుల కాపరి సింహాసనం అధిష్ఠించాడు. 


‘మహారాజా ఇప్పుడు అడగండి మూడు ప్రశ్నలు’’ అన్నాడు పశువుల కాపరి. 


మొదటి ప్రశ్న

దేవుడు ఏ వైపు చూస్తుఉంటాడు? 

దీనికి జవాబు చెప్పండి అన్నాడు రాజు.


వెంటనే ఒక దీపాన్ని తెప్పించమన్నాడు గురువు స్థానంలో వున్న పశువుల కాపరి. దీపం తెచ్చి సభ మధ్యలో పెట్టారు.


మహారాజా! ఈ దీపం ఎక్కడ చూస్తుంది? నావైపా? నీవైపా? తూర్పువైపా? పశ్చిమానికా? పైనకా? క్రిందకా? ఎక్కడ చూస్తుందో చెప్పండి? అని ప్రశ్నించాడు.

‘అన్నివైపులకు చూస్తుంది’ అని జవాబిచ్చాడు రాజు.


ఇంత చిన్న జ్యోతి అన్నివైపులా చూడగలిగినపుడు.... పరంజ్యోతి స్వరూపమైన భగవంతుడు అన్నివైపులా చూడలేడా? సమస్త జీవుల కళ్ళల్లో వెలుగుగా వున్న పరంజ్యోతి పరమాత్మే.


మరి ఇక రెండవ ప్రశ్న.... 


దేవుడు ఎక్కడ ఉంటాడు? 

అన్నాడు రాజు.


‘సరే! ఓ చిన్న పాత్రలో పాలు తెప్పించండి’ అన్నాడు పశువుల కాపరి. 

పాలు తెచ్చారు.

‘మహారాజా ! ఈ పాలల్లో నెయ్యి ఎక్కడ ఉందో చెప్పగలవా?’ అని అడిగాడు.


‘పాలను బాగా మరుగబెట్టాలి. 

వాటిని తోడు (మజ్జిగ) కలిపి కొన్ని గంటలు కదలకుండా ఉంచాలి. 

పెరుగు సిద్ధం అవుతుంది. 

దాన్ని కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది. తర్వాత తయారైన వెన్నను కాస్తే నెయ్యి తయారవుతుంది’ అన్నాడు రాజు.


‘సరిగ్గా చెప్పారు మహారాజా! 

అలాగే హృదయం అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి, 

మనస్సు అనే తోడు వేసి, 

స్థిరంగా ఉంచితే వచ్చే సత్యం అనే పెరుగును, 

సాధన అనే కవ్వంతో చిలికితే 

జ్ఞానం అనే వెన్న వస్తుంది.

ఆ సాధన ‘అంతర్ముఖం’ అనే నిప్పులపై బాగా కాచినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది’అన్నాడు కాపరి.

సభలో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి.


ఇక చివరి ప్రశ్న. 

దేవుడు ఏం చేస్తాడు? అని.


నేను పశువుల కాపరిని, మీరు మహారాజు.

క్రింద వున్న నన్ను సింహాసనం పైన కూర్చోబెట్టారు. 

పైన వున్న మిమ్మల్ని క్రిందికి దించేశారు. ఇదే పరమాత్మ లీల.

సత్కర్మలు చేసే జీవులను పై జన్మల్లో ఉత్తమ జన్మగా మార్చడం, 

దుష్కర్మలు చేసే వాళ్ళను మరుజన్మలో క్రింది స్థాయికి పంచడమే పరమాత్మ పని’ అన్నాడు.


సభలో గంభీర వాతావరణం నెలకొంది. రాజు పశువుల కాపరి ముందు పాదాక్రాంతుడయ్యాడు. 

పశువుల కాపరి రూపంలో ఉన్న పరమాత్మ తాను వచ్చిన దిక్కుగా తిరుగు ప్రయాణం అయ్యాడు.  


మంచిని ఎక్కడ ఉన్న గ్రహిద్దాము..

మంచిని నేర్చుకుందాము..  

మంచిని ఆచరించుదాము... 

మంచిని అందరికి పంచుదాము... 


హరే కృష్ణ 🙏

27, డిసెంబర్ 2021, సోమవారం

ఆయుర్వేద ఔషధాలలోని రకాలు -

 ఆయుర్వేద ఔషధాలలోని రకాలు - 


 * కషాయము - 


     కషాయము కాచునప్పుడు పైన మూత వేయకుండా కాయవలెను . మూసినచో కషాయము చెడిపోవును . కషాయము నందు ఉపయోగించవలసిన ద్రవ్యములు దినుసు (మూలిక) 4 తులముల చొప్పున గ్రహించి వాటిని మెత్తగా నలుగగొట్టి కొత్త కుండ యందు వేసి అందు 2 శేర్ల మంచినీటిని పోసి మందాగ్ని చేత కాచి అష్టాశముగా దింపి వడగట్టి బాలురకు పావుతులము నుంచి తులము మోతాదులో మరియు పెద్దవారికి 4 తులముల మోతాదు వరకు ఇవ్వవచ్చును . ఇందు చక్కర చేర్చవలసి వచ్చిన వాతరోగులకు 4 వ భాగము , పిత్తరోగులకు 8 వ భాగము , శ్లేష్మరోగులకు 16 వ వంతు ఇవ్వవలెను . తేనె కలుపవలసి వచ్చిన శ్లేష్మరోగులకు 4 వ వంతు , పిత్తరోగులకు 8 వ వంతు , వాతరోగులకు 16 వ వంతు చేర్చవలెను . జీలకర్ర , గుగ్గిలము , శిలాజిత్ , క్షారములు , ఇంగువ వంటివి పావుతులము కన్నా ఎక్కువ చేర్చకూడదు . 


 * కల్కము - 


      అల్లము తదితర శుష్కపదార్థాలను ఉదకము ( నీరు ) చే నూరి తీసేడు రసమును కల్కము అందురు . ఈ కల్కము నందు ద్రవ్యము తులప్రమాణములో ఉండవలెను . ఈ కల్కమున నెయ్యి , తేనె , నూనె కలపవలసి వచ్చినప్పుడు ఒకదాని మీద మరొకటి రెట్టింపుగాను , బెల్లము మరియు చక్కెర సమభాగాలుగా చేర్చవలెను . 


 * చూర్ణము - 


      ఎండిన ద్రవ్యములను మెత్తగా నూరి వస్త్రగాలితము ( మెత్తని వస్త్రము నందు నూరిన చూర్ణం వేసి జల్లెడ పట్టుట ) చేసి అరతులము నుంచి 1 తులము వరకు , చిన్నవారు ఒక మాషము ( 1 గ్రాము ) నుంచి 3 మాషములు 

(3 గ్రాములు ) వరకు దేహతత్వమును , వ్యాధి బలమును , దేశ కాలభేదములను బట్టి గుర్తెరిగి పుచ్చుకొనవలెను . 


            ఈ చూర్ణములో బెల్లము కలపవలసి వచ్చిన చూర్ణపు మోతాదుకు సమానంగా , చక్కెర కలపవలసి వచ్చిన చూర్ణముకు రెట్టింపు మోతాదులో కలపవలయును . ఇందు ఇంగువను కలపవలసి వచ్చిన ఇంగువను నేతితో పొంగించి కలుపవలెను . నెయ్యి కలపవలసి వచ్చిన ఇంగువకు రెట్టింపు మోతాదులో , నీటిని కలపవలసి వచ్చిన చూర్ణముకు నాలుగురెట్లు చేర్చవలెను . 


                 చూర్ణము అయినను , మాత్రలు అయినను , లేహ్యమైనను , కల్కమ్ అయినను సేవించిన పిదప పాలు మొదలగువాటిని తాగవలసిన యెడల వాతరోగము నందు 12 తులములు , పైత్యరోగము నందు 8 తులములు , శ్లేష్మరోగము నందు 4 తులములు పుచ్చుకొనవలెను . 


     చూర్ణమును భావన ( నానబెట్టి ఆరబెట్టుట ) చేయవలసిన చూర్ణమును , చూర్ణం మునుగునంతవరకు రసము పోసి ఆ రసం ఇగురునంత వరకు భద్రపరచి ఉంచవలెను . ఒకసారి భావన చేయుటకు 24 గంటలు పట్టును . 


 * ఔషధాలు పుచ్చుకొనవలసిన కాలనిర్ణయం - 


      చూర్ణరూపము , కషాయ రూపము మొదలగు ఔషధములను ఉదయము మరియు సాయంకాలము పుచ్చుకొనవలెను . ముఖ్యముగా ఉదయం ప్రాతఃకాలం అనగా సూర్యాస్తమయానికి ముందు సాయంకాలం సంధ్యాసమయం తరువాత అనగా చీకటి పడిన తరువాత పుచ్చుకొనుట ఉత్తమం . అసాధ్యరోగములకు అనేకసార్లు , వమనము , విరేచనాదులకు ప్రాతఃకాలము నందు కలికాదులకు సాయంత్రసమయం ఉత్తమం . 


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేదం 


                  9885030034