11, ఫిబ్రవరి 2022, శుక్రవారం

బాలుడిని మేము సేవింతుము

 శ్లోకం:☝️

    *చాతుర్త్యైక నిధానసీమ*

*చెపలా పాంగ్ చ్చటామంథరం l*

    *లావణ్యామృత వీచి*

*లాలిత దృశం లక్ష్మీ కటాక్షదృతం ll*

    -శ్రీకృష్ణ కర్ణామృతం


భావం: గొప్ప నైపుణ్యములకు కారణములై, చలించుచున్న క్రీగంటి కాంతులచే శోభించు వాడును; దివ్య ప్రకాశములనే అమృతవీచికల చేత కదులుతున్న నేత్రములు గలవాడును; సైకత శ్రేణులలో వివరించుటకు అనురాగ శక్తులు గలవాడును; మన్మధుని  పుట్టుకకు కారణమైనవాడును; సమస్త సౌందర్యరాశియును, శ్రీదేవి కటాక్ష వీక్షణముల చేత ఆధరింపబడేవాడును అగు నల్లని బాలుడిని మేము సేవింతుము.🙏

మధ్వనవమి

 హిందుతత్వ గురువులలో త్రిమూర్తులుగా పరిగణించబడే వారిలో మొదటి గురువు శ్రీ ఆది శంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించగా రెండవ గురువైన శ్రీ రామానుజాచార్యుల వారు విష్టాద్వైత సిద్దాంతాన్ని ప్రతిపాదించారు. ఈ గురువులలో మూడవ గురువు మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. 


1317వ సంవత్సరం మాఘమాసం 9వ రోజున శ్రీ మధ్వాచార్యులు కర్ణాటకలోని శ్రీ అనంతేశ్వర ఆలయంలో తన శిష్యులకు ఐతరేయ ఉపనిషద్ భాష్యాన్ని బోధిస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆయనపై పూలవర్షం కురిసింది. తర్వాత ఆ పూల కుప్పలో వెతికి చూడగా మధ్వాచార్యులు అదృశ్యమయ్యారు అని శిష్యులు తెలుసుకున్నారు. మధ్వాచార్యులు బదరీకాశ్రమంలో ప్రవేశించిన రోజుగా (మోక్షం పొందిన రోజు) పరిగణించబడుతున్న మాఘమాసంలో 9వ రోజును మధ్వనవమిగా జరుపుకుంటారు. హనుమంతుడు మరియు భీముని తర్వాత మధ్వాచార్యులను వాయు దేవుడి మూడవ అవతారంగా భావిస్తారు. 


మధ్వాచార్యులు కర్ణాటకలోని ఉడిపికి దగ్గరలో గల పజక అనే గ్రామంలో జన్మించారు. శ్రీ మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని లేదా ద్వంద్వ తత్వశాస్త్రాన్ని ప్రతిపాదించారు. ద్వైత సిద్దాంతం ప్రకారం విష్ణువు (పరమాత్మ) మరియు జీవులు (జీవాత్మ) రెండూ వేర్వేరు. మనం చూసే ప్రపంచం నిజమైనది. విష్ణువు మాత్రమే స్వతంత్ర వాస్తవికత. అన్ని జీవులు మరియు నిర్జీవులు విష్ణువుపై ఆధారపడి ఉంటాయి. జీవాత్మలు మరియు ప్రపంచం విష్ణువుపై ఆధారపడి ఉంటాయి మరియు విష్ణువు నుండి వేరుగా ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే అద్వైత సిద్ధాంతానికి పూర్తి భిన్నంగా ద్వైత సిద్దాంతం ఉంటుంది.  


ద్వైత సిద్దాంతం ప్రకారం భక్తి ఒక్కటే మోక్షాన్ని పొందే సాధనం. సర్వసంగ పరిత్యాగం, భక్తి మరియు ప్రత్యక్ష జ్ఞానముతో భగవంతుని సేవించడం, ధ్యానం మోక్షప్రాప్తికి దారి తీస్తుంది. సాధకుడికి భగవంతుని దర్శనం కావాలంటే వేదాల అధ్యయనం, ఇంద్రియాలపై నియంత్రణ, వైరాగ్యం మరియు పరిపూర్ణ స్వీయ శరణాగతితో తనను తాను సిద్ధం చేసుకోవాలని ద్వైత సిద్దాంతం చెబుతుంది.  


శ్రీ మధ్వాచార్యులు ద్వైత సిద్దాంత ప్రతిపాదకులే కాకుండా ఒక సామాజిక మరియు మత సంస్కర్త కూడా. మోక్షం మార్గం అందరికీ తెరిచి ఉందని మరియు కొన్ని వర్ణాలకు లేదా పుట్టుకతో పరిమితం కాదని ప్రకటించారు. శ్రీ మధ్వాచార్యులు ప్రసిద్ధ ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని స్థాపించారు. మధ్వాచార్యుల బోధనలు చాలా మంది అనుచరులను ఆకర్షించాయి మరియు కర్ణాటకలో భాగవత లేదా భక్తి సంప్రదాయాలను పునరుద్ధరించాయి. మంత్రాలయ గురు రాఘవేంద్ర స్వామి శ్రీ మధ్వాచార్యుల గురుపరంపరకు చెందిన వారు. 


: నాగరాజు మున్నూరు

బ్రాహ్మణ కన్య వృత్తాంతము

 _*మాఘమాసం*_

      🚩 _*శుక్రవారం*_🚩

_*ఫిబ్రవరి 11వ తేది 2022*_


 🌹 _*మాఘ పురాణం*_🌹 

🌴 _*10 వ అధ్యాయము*_🌴


🕉🌹🕉️🌹🌹🕉️🌹🕉️


*ఋక్ష కయను బ్రాహ్మణ కన్య వృత్తాంతము*


☘☘☘☘☘☘☘☘️


పూర్వము భృగుమహాముని వంశమునందు ఋక్షకయను కన్య జన్మించి , దినదినాభివృద్ధి పొందుచుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు , పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయెను. ఋక్షక తన దురదృష్టమునకు దుఃఖించి , విరక్తితో ఇల్లువిడిచి గంగానది తీరమునకుపోయి ఆశ్రమము నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభించెను. ఆ విధముగా చాలా సంవత్సరములు ఆచరించుటవలన అనేక మాఘమాస స్నానములు ఫలములు దక్కెను. ఆమె మనోవాంఛ తీరు సమయము దగ్గర పడినది. ఒకనాడామె తపస్సు చేసుకొనుచూ ప్రాణములు విడిచెను. ఆమె చాల సంవత్సరములు వైకుంఠ మందేవుండి తరువాత బ్రహ్మలోకమునకు పోయెను. ఆమె మాఘమాస వ్రత ఫలము కలిగిన పవిత్రురాలగుటచే బ్రహ్మదేవుడామెను సత్యలోకములో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా జేసి *"తిలోత్తమ"* అను పేరుతో సత్యలోకమునకు పంపెను. ఆ కాలములో సుందోపసుందులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోరతపస్సు చేసిరి. వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై *"ఓయీ ! మీకేమి  కావలయునో కోరుకొనుము"* అని అనగా , *"స్వామీ మాకు ఇతరుల వలన మరణము కలుగకుండునట్లు వరమిమ్ము"* అని వేడుకొనగా , బ్రహ్మ అటులనే ఇచ్చితిని అని చెప్పి అంతర్ధానమయ్యెను.


బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులును మహాగర్వము కలవారై దేవతలను హింసించిరి. మహర్షుల తపస్సుకు భంగము కలిగించుచుండిరి. యజ్ఞయాగాదిక్రతువులలో మల మాంస రక్తాదులు పడవేసి , ప్రజలను నానా భీభత్సములు చేయుచుండిరి. దేవలోకమునకు దండెత్తి , దేవతలందరినీ తరిమివేసిరి , ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని *"మహానుభావా ! సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము కలవారై తపశ్శాలురను బాధించుచు దేవలోకమునకు వచ్చి మమ్మందరను తరిమి చెరసాలలో బెట్టి నానాభీబత్సము చేయుచున్నారు. కాన వారి మరణమునకు యేదైనా ఉపాయమాలోచించు"* మని ప్రార్థించిరి. బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి తిలోత్తమను పిలిచి  *"అమ్మాయి ఈ సుందోపసుందులను రాక్షసులకు యితరులెవరి వల్లను మరణము గలుగదని వరము నిచ్చియున్నాను. వారు వర గర్వముతో చాల అల్లకల్లోలము చేయుచున్నారు. కాన , నీవుపోయి నీచాకచక్యముతో వారికి మరణము కలుగునటుల ప్రయత్నించుము"* అని చెప్పెను. తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుందులు వున్న అరణ్యమున ప్రవేశించెను. ఆమె చేత వీణపట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులున్న నివాసములకు సమీపములో తిరుగుచుండెను. వీణానాదమును ఆమె మధురగానమునూ విని ఆ దానవసోదరులు అటు నిటు తిరుగునట్లామెననుసరిస్తూ ప్రేక్షకులవలె వెంటాడుచుండీరి , నన్ను వరింపుము నన్ను వరింపుమని తిలోత్తమను యెవరికి వారు బ్రతిమలాడసాగిరి. అంతట నా తిలోత్తమ ఓ రాక్షసాగ్రేసురులారా ! మిమ్ములను పెండ్ళియాడుట నాకు ఇష్టమే. మీరిద్దరూ నాకు సమానులే నేను మీ ఇద్దరియెడల సమాన ప్రేమతోనున్నాను. కాని ఇద్దరిని వివాహమాడుట సాధ్యము కానిది కాని నాకోరిక యొకటి యున్నది అది ఏమనగా మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారికే నేను  స్వంతముకాగలను అని చెప్పెను.


ఆమె మాటలకు సుందోపసుందులకు పౌరుషములు వచ్చినవి. మీసములు మెలిపెట్టి నేను బలవంతుడనగా నేను బలవంతునని ఇద్దరూ తొడలు కొట్టుకొనిరి , గ్రుద్దుకొనిరి. మల్లయుద్దము చేసిరి , ఇక పట్టుదల వచ్చి గదలు పట్టిరి , మద్దరాలనెత్తిరి , దెబ్బకు దెబ్బ కొట్టుకొనుచుండిరి. వారి పోరాటము రెండు పర్వతాలు ఢీకొన్నట్లుగా ఉన్నది. మేఘాలు ఉరిమినట్లుగా అరచుచు భయంకరంగా యుద్ధము చేసిరి గదాయుద్ధము తరువాత కత్తులు దూసిరి. ఆ కత్తి యుద్ధములో ఒకరిఖడ్గము మరొకరికి తగిలినందున ఇద్దరి తలలూ తెగి క్రిందపడినవి , ఇద్దరూ చనిపోయిరి.


తిలోత్తమను దేవతలు దీవించిరి. ఆమె బ్రహ్మకడకు పోయి జరిగినందా తెలియపర్చగా బ్రహ్మ సంతోషించి , *"తిలోత్తమా ! నీవు మంచికార్యము చేసితివి. నీ వలన సుందోపసుందులు మరణించిరి. నీకీ బలము వచ్చుటకు కారణము నీవు చేసియున్న మాఘమాస వ్రతఫలమే గాన , నీవు దేవలోకమునకు వెళ్ళుము , దేవతలు నిన్ను గౌరవిస్తారు. అచట అప్సరసలందరికంటే నీవే అధికురాలవగుదు"* వని పంపెను.


      🌹🌷 *సేకరణ*🌷🌹

        🌴 *న్యాయపతి*🌴 

      🌿 *నరసింహారావు*🌿

🌴🎋🌾🕉️🕉️🌾🎋🌴


🙏🙏🌹🙏🙏🌹🙏🙏

తేనె పూసిన కత్తి

 ✍

 _కొన్ని పదాలు పైకి ప్రగతి శీలం గాను, ఆదర్శవంతంగానూ కనిపిస్తాయి. నిజానికి ఆ పదాలు తేనె పూసిన కత్తి లాంటివి. అలాంటి పదాలను పదే పదే ఉపయోగించడం వెనుక అమాయక హిందువులను దెబ్బతీసే మహా కుతంత్రం ఉన్నది. అలాంటి వాటిలో ఐదు పదాలను గురించి నేను మీకు వివరిస్తాను. ఈ పదాలను పదేపదే వాడే నాయకులతో మేధావులతో అత్యంత అప్రమత్తంగా ఉండవలసిందిగా సూచన_ .


 *సెక్యులర్/లౌకిక:* 

---------------------

ఈ పదం 1950 జనవరి 26 నాడు అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగంలో లేదు. ఎమర్జెన్సీ సమయంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభ రద్దు అయిన సమయంలో ఎలాంటి చర్చ లేకుండా రాజ్యాంగ ప్రవేశిక లో బలవంతంగా చేర్చడం జరిగింది.

ఈ సెక్యులర్ అనే పదాన్ని ఉపయోగించి... హిందూ పురాతన సంస్కృతిని వెలుగులోకి రానివ్వకుండా.... భారతీయ వీరులను అవమానించే తీరులో రాయబడ్డ పుస్తకాలతో.....ఈ దేశాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

 _కాబట్టి తిరిగి రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సెక్యులర్ అనే పదాన్ని తొలగించేందుకు మనం పోరాటం చేయాలి._ 


 *ఫెడరల్/సమాఖ్య:* 

------------------------

అనేక రాష్ట్రాలు కలిసి ఒక ఒప్పందం ద్వారా దేశంగా ఏర్పడితే అటువంటి దేశాన్ని ఫెడరల్ అని అంటారు. దీనికి అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఉదాహరణ.

  భారత రాజ్యాంగంలో ఫెడరల్ అనే పదమే లేదు. కానీ మాటిమాటికీ అనేకమంది కుహనా మేధావులు, కొంత మంది రాజకీయ నాయకులు ఫెడరల్ ప్రభుత్వము  అని పదే పదే వాడుతున్నారు.

  దీని వెనుక కూడా భయంకరమైన కుట్రకోణం ఉన్నది. ఫెడరల్ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వము బలహీనంగా ఉంటూ రాష్ట్రాలపై అధికారాన్ని కలిగి ఉండదు. కేంద్ర ప్రభుత్వాన్ని బలహీనం చేసి వేర్పాటువాద ఉద్యమాలను బలోపేతం చేయడమే ఈ కుహనా మేధావుల అసలు లక్ష్యం.

దేశ విచ్ఛిన్నానికి దారి తీసే రాజ్యాంగంలో లేని ఫెడరల్ అనే పదాన్ని మాటిమాటికి ఉపయోగించడం దేశానికి ప్రమాదకరం _కాబట్టి ఇటువంటి భావజాలాన్ని తిప్పికొట్టాలి_ .


 *లిబరల్/ఉదారవాద:* 

------------------------------

మైనారిటీలను బుజ్జగించడం కోసం.... వెయ్యేళ్ళ పాటు వలసవాద ప్రభుత్వాలు భారతదేశ ప్రజలను నాశనం చేసిన తీరును కప్పిపుచ్చడం కోసం..... హిందువులను రెండవ తరగతి పౌరులుగా ఉంచడం కోసం.... _లిబరల్ అనే పదాన్ని ఉపయోగిస్తూ  హిందుత్వాన్ని వెలుగులోకి రాకుండా ఈ నక్కజిత్తుల కుహనా మేధావులు అడ్డుపడుతున్నారు_ .


*హిందూ-- ముస్లిం భాయ్ భాయ్* :

--------------------------------------------

భారతీయ తాత్విక గ్రంధము లైన ఉపనిషత్తుల ప్రకారం సకల మానవులు సోదరులే. ఇందులో భిన్నాభిప్రాయం లేదు. కానీ ఖురాన్ ప్రకారం ప్రపంచంలోని ముస్లింలు మాత్రమే సోదరులు. హిందువులను వారు హీనజాతి గా భావిస్తూ కాఫీర్లు అని పిలుస్తారు.

 _కాబట్టి ఈ అర్థంలేని సిద్ధాంతం అనవసరమైనది_ .


*గంగా- జమున తెహజీబ్:* 

----------------------------------

క్రైస్తవ ,ఇస్లాం మతాలు పుట్టడానికి  వేల సంవత్సరాల ముందే... గంగా జమున నదులు హిందువులకు అత్యంత పవిత్రమైన నదులు. అయితే ఈ పదాన్ని హిందూ ముస్లిం ఐక్యత కోసం వాడుతుంటారు. ముస్లింల శాస్త్రాల ప్రకారం నదులపై వారికి ఎటువంటి పవిత్రమైన ఆరాధనా భావం లేదు. భారత స్వతంత్ర ఉద్యమం లో బ్రిటిష్ వాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవడం కోసం ఈ పదాన్ని వాడేవారు. కానీ ఇస్లాం మతం కోసం వారికి మరొక దేశం కావాలని రక్తపాతాన్ని సృష్టించి పాకిస్తాన్ దేశాన్ని ముస్లింలు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి గంగా జమున తెహజీబ్ అనే పదం మిథ్య.... భ్రాంతి అనే విషయం స్పష్టమైపోయింది.

    _*దేశ విభజన నుండి నేటి వరకు కూడా జరిగిన నరమేధాన్ని చూసి కూడా ఈ పదాన్ని ఇప్పటికీ ప్రయోగించడం అంటే దాని వెనుక కుట్ర కోణం ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి* ._ 


--SBR TALKS



10, ఫిబ్రవరి 2022, గురువారం

అష్టస్థాన పరీక్ష

 అష్టస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ - 5 . 


 * జిహ్వ పరీక్ష - 


       వాతరోగము నందు నాలుక పగిలి ముళ్ళ వలే గరగరలాడుచుండును . తడారిపోయి నల్లగా గాని బూడిద వర్ణములో గాని ఉండును . పైత్యవ్యాధుల యందు నాలుక ఎర్రబారి పూసి మంట కలిగి ద్రవం కారుచూ మృదువుగా ఉండును . శ్లేష్మరోగము నందు నాలుక తెల్లగా కరుడుగట్టి పాచి కలిగి ఉండును . మొద్దుగా ఉండును . జ్వరము నందు పాకము కలిగి చేదువాసన కొట్టుచుండును . దోషభేదమును బట్టి జ్వరము నందు నాలుక పాకము చెంది చేదుపట్టి వాసన తీపి జిగటగా అయ్యి సాగుట ఎండిపోవడం వంటి లక్షణాలు కలుగును . 


          సన్నిపాతము నందు ద్రవము లేక నాలుక ముళ్ళు కలిగినట్లుగా మాడి ఉండును . ద్వందరోగమున రెండు రెండు లక్షణాలు కలిగి ఉండును . రక్తపోటు అధికమై రోగికి మంటగా ఉండిన నాలుక ఎర్రగాను తాకిన వేడిగాను ఉండును . మంటతో కూడి జ్వరము నందు నాలుక తడి ఎండిపోయి ఉండును . 


              తీక్షణ జ్వరము నందు భయంకరమగు ఒళ్ళు మంటలు గూడిన వ్యాదుల యందును , అజీర్ణరోగము నందు , వాతవ్యాధుల ప్రారంభదశలో నాలుక తెల్లగా ఉండుటయే కాక దాని మీద ఒక కొత్తపొర కప్పినట్లుగా కనిపించును . త్రిదోష ప్రకోపము వలన జనియించిన జ్వరము నందు నాలుక దళసరి ( మందం ) ఎక్కి ద్రవ హీనమైన పొరచే కప్పబడినట్లు ఉండును . మరియు నల్లనై నిప్పు ఆరిపోయిన బొగ్గు వలే కనిపించును . కాలేయము యొక్క పని సక్రమముగా నిర్వర్తిన్చబడనప్పుడు , పిత్తముకు , మలముకు అవరోధము ఏర్పడినప్పుడు నాలుక పాలిపోయి పొరతో కప్పబడినట్లు ఉండును . కాలేయము మరియు ప్లీహము ( spleen ) దోషము చెందినప్పుడు అపాయస్థితిలో క్షయ యందు వలే నాలుక పైన పుండ్లు కనిపించును . తీక్షణమగు జ్వరము , అతిసారము , మూర్చ , కాస , శ్వాసల యందు నాలుక తాకిన చల్లగా ఉండును . దౌర్బల్యముగా ఉండును . మంటతో కూడిన వ్యాధుల యందు నాలుక పెద్దది అగును . 


                ఆరోగ్యవంతుని నాలుక ద్రవము కలిగి ఉండును. తాగుడు అలవాటు ఉన్నవారి నాలుక పగిలి ఉండును . వాత వ్యాధుల యందు లాలాజలము ఉప్పగా ఉండును . పైత్యవ్యాధుల యందు చేదుగా , శ్లేష్మ వ్యాధుల యందు తియ్యగాను , రెండురకాల దోషముల కలిగి ఉన్న రెండురకాల లక్షణములు కలిగి ఉండును . 


 * మూత్రపరీక్ష - 


       పాశ్చత్య వైద్యులు మొదటి ధార వదిలి తరువాతది సీసాలో పట్టి దానియందు కొన్ని రకాల రసాయనాలు కలిపి స్పిరిట్ లాంతరు పైన వేడిచేస్తారు . మూత్రము నందు చక్కెర తెల్ల శ్వేత ధాతువు , వీర్యము , తీపి , మున్నగు వాటిని ఉండకట్టుట , కలిసిపోవుట , రంగు మారు ట , పైకి తేలుట , అడుగున మునిగిపోవుట , ఇసుక వలే పొడిపొడిగా అవ్వుట , వాసన వేయుట మొదలగు బేధములచే వ్యాధిని గుర్తిస్తారు . కొందరు రోగుల మూత్రము నందు వీర్యము ముద్దగట్టి సన్నసన్నని ఇసుక కణములవలె కనబడును . కొందరి మూత్రము ( మధుమేహరోగులు ) విడిచినచోట బెల్లమునకు వలే చీమలు , ఈగలు , దోమలు ముసురును . మానవుని జీవితము మూత్రము పైన ఆధారపడి ఉండును . మూత్రమును బట్టియే ఆహారము ఎలా జీర్ణమగుచున్నది , సప్తధాతువులు ఎట్టి స్థితిలో ఉన్నవి , రక్తము , బలము ఎలా ఉన్నది చివరకు సంతానము కూడా మూత్రమును బట్టి తెలుసుకొనవచ్చు . 


          తరవాతి పోస్టు నందు మూత్రపరీక్ష విధానము గురించి సంపూర్ణముగా వివరిస్తాను . మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . ఆయుర్వేదం నందలి అత్యంత రహస్యమైన ఔషధయోగాలు మరియు మా వంశపారంపర్య అనుభవ యోగాలు అన్నియు సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది . 


     గమనిక -


           నేను రచించిన నా మూడొవ గ్రంథం అయిన " సర్వమూలికా చింతామణి " యందు అనేక రకాల మొక్కల గురించి అత్యంత విపులముగా , వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . మా వంశపారంపర్య రహస్యయోగాలు మాత్రమే కాకుండా అత్యంత పురాతన , అరుదైన గ్రంథాలు మరియు కొన్ని తాళపత్రాల నుంచి తీసుకోబడిన ఎన్నొ విలువైన యోగాలు అన్ని ఎంతో పరిశోధించి మీకు ఇవ్వడం జరిగింది . ఒకటి మాత్రం ఖచ్చితముగా చెప్పగలను . ఈ గ్రంథములో లభ్యమయ్యే సంపూర్ణ సమాచారం మరియు అత్యంత సులభయోగాలు మరే గ్రంథములో మీకు దొరకవు . ఈ ఒక్క గ్రంథం రచించుటకు సుమారు సంవత్సన్నర సమయం కేటాయించడం జరిగింది . 50 రకాల మొక్కల గురించి ఈ ప్రథమ భాగములో ఇవ్వడం జరిగింది . కేవలం మొక్కల గురించియే కాకుండా యే వ్యాధికి ఏమి పథ్యం చేయవలెనో కూడ వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . 


        ఈ గ్రంథం ఎక్కువ కాలం మన్నికగా ఉండుటకు కుట్టించి ఇవ్వడంతోపాటు 90gsm పేపర్ వాడటం జరిగింది . మొక్కల యొక్క రంగుల ఫొటోస్ తో పాటు సంపూర్ణ సమాచారం ఇందులో మీకు లభ్యం అగును . దీని ఖరీదు 550 రూపాయలు ( ఆంధ్ర మరియు తెలంగాణ ) మరియు వేరే రాష్ట్రమునకు పంపుటకు మరొక్క 50 రూపాయలు అదనంగా ఖర్చు అగును . 


      ఈ గ్రంథము కావలసిన వారు 9885030034 నంబర్ కి phoneపే , google pay or paytm చేసి ఇదే నంబర్ కి whatsup నందు screenshot పెట్టి మీ Adreass pincode and landmark తో సహా ఇవ్వగలరు . 


             కాళహస్తి వేంకటేశ్వరరావు . 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                    9885030034

గంగా జలం మహిమ*

 _*మాఘమాసం*_

_*🚩గురువారం🚩*_


  _*🌷మాఘ పురాణం🌷*_

 🌴 _*9 వ అధ్యాయము*_🌴


🕉🎋🌾🌷🌹🌾🎋🕉️


*గంగా జలం మహిమ*


☘☘☘☘☘☘☘☘


ఓ కార్తవీర్యార్జునా ! శివపూజ గురించి శివమహత్మ్యమును గురించి వివరించెదను వినుము. మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రముపై వారధి కట్టినచోట శివలింగమును ప్రతిష్టించి శివుని ధ్యానించి , వారధిదాటి రావణుని చంపెను. అటులనే హనుమంతుడూ సముద్రమును దాటునపుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి , మహా బలమును సంపాదించి సముద్రమునుదాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసియే యుద్ధరంగములో ప్రవేశించును. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి జయము చేకూర్చుకొనిరి. స్త్రీలు తమ మనోవాంచలను తీర్చుకొనిరి. కనుక , పూజదు శివపూజ పవిత్రమైనది. అటులనే నదులలో గంగానది పరమపవిత్రమైనది. ఎటులనగా , గంగాజలము విష్ణుపాదములనుండి పుట్టినదియు , శివుని శిరస్సునుండి ప్రవహించునట్టిదియు అయినందుననే సర్వపాపహరమైనది. గంగా జలములో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకనూ గంగాజలము గురించి చెప్పబోవునది ఏమనగా యే నీళ్ళనుగాని , *"గంగ గంగ గంగ"* అని మూడు పర్యాయములు అనుకొని శిరస్సున చల్లుకొనినచో ఆ నీళ్ళు గంగాజలముతో సమానమయినవగును. గంగాజలము విష్ణుమూర్తి ప్రతి రూపము కనుక , మాఘమాసములో అంగాస్నానము అత్యంత పుణ్యప్రదమని తెలుపుచూ గంగా జల మహత్మ్యము గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుదు వివరించెను.


కొంత కాలము క్రిందట మగధరాజ్యములో పురోహితవృత్తిచే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులుండిరి. నలుగురికి నలుగురు కుమార్తెలుండిరి. వారు నిండు యవ్వనవతులై ఉండీరి. కొన్నాళ్ళకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చెను , బ్రాహ్మణ కన్యలాయువకుని అందము చూచి , మోహించి , అతనిని సమీపించి చుట్టుముట్టి మమ్ములను వివాహం చేసుకోమని బలవంతము చేయగా ఆ బ్రాహ్మణ విధ్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోర్కెలను నిరాకరించెను. అంత ఆ కన్యలు కోపంతో నీవు పిశాచానివి కమ్మని శపించగా , ఆ విధ్యార్థియూ , మీరుకూడ పిశచులగుదురుగాక అని ప్రతి శాపమిచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే వుండి , అందరిని బాదించి , ఆహారము దొరికితే వాటాలకై పెనుగులాడుకొనుచుండిరి.


కొంతకాలమునకు ఒక సిద్దుడాకోనేటి దగ్గరకురాగా నా పిశాచముల తల్లి దండ్రులు , తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములెట్లు పోవునని అడిగిరి. ఆ సిద్దుడు వారందరిచేత మాఘమాసములో గయలోనున్న త్రివేణిలో స్నానము చేయించినచో వారికున్న పిశాచ రూపములు తొలగిపోవునని చెప్పగావారట్లు చేయుటచే అయిదుగురికి యధా రూపములు కలిగినవి. ఇట్లు జరుగుటకు మాఘమాసమహత్మ్యమే కారణము. మాఘమాస మందలి నదీ స్నానము మనుజులకే కాక దేవతలకు , గంధర్వులకు కూడ పవిత్రమైనది.


ఓక మాఘమాసములో నొకగంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడెను. అతని భార్య మాత్రము స్నానమాచరించనని చెప్పుటచే ఆమెకు దైవత్వము నసించి గంధర్వలోకానికి వెళ్ళలేకపోయినది. ఆమెను విడిచి పెట్టి ఆ గంధర్వుడొకడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుచూ విస్వామిత్రుడు ఉన్నచోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంటచూసెను. ఆమె అందానికి , యవ్వనానికి విస్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే యిద్దరూ కామక్రీడలలో తెలియాడుచుండగా , మరల ఆ గంధర్వుడు తన భార్యను వెదుకుచూ వచ్చి చూడగా , విస్వామిత్రుడు గంధర్వస్త్రీ క్రీడించుచుండిరి. ఆ దృస్యమును చూచి మండిపడుచు తపస్వివై యుండి కూడా యిలా కామతృష్ణ కలవాడవైనందున , నీకు కోతి ముఖము కలుగుగాకయని విస్వామిత్రుని , పాషాణమై పడియుండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. విస్వామిత్రుడు చేయునది లేక వానర ముఖం కలిగియుండగా నారదుడు ఆ విషయము తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి , *"విశ్వామిత్రా ! క్షణభంగురమైన తుచ్ఛకామ వాంఛకులోనై నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరేలెమ్ము గంగానదిలో స్నానము చేసి , నీ కమండలములో గంగా జలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము",* అని వివరించగా విశ్వామిత్రుడు గంగాస్నానముచేసి , విష్ణువును ధ్యానించి , కమండలముతో నీరు తెచ్చి , పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ శ్త్రీ రూపమును పొంది , గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. పూర్వరూపము నొందిన విస్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను.


      🌷🌷 *సేకరణ*🌷🌷

        🌴 *న్యాయపతి*🌴 

      🌿 *నరసింహారావు*🌿

🌴🎋🌾🕉️🕉️🌾🎋🌴



🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

ఈరోజు భారతదేశ ఆర్థిక పరిస్థితి

 *మోడీ గారు లేకుంటే ఈరోజు భారతదేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేదో పూర్తి ఆధారాలతో సహా RBI మాజీ గవర్నర్ శ్రీ రఘురామ్ రాజన్ సంచలన వెల్లడి.👇*


*RK*


 *దేశంలోని 5 లక్షల కిలోల బంగారం ఆగస్ట్ 2013లో నిలిచిపోయింది. రాహుల్ గాంధీ మరియు లుటియన్స్ మీడియాకు చెందిన కాంగ్రెస్ జర్నలిస్టులు దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క ఆ భయంకరమైన దుస్థితి యొక్క సిగ్గుమాలిన కథను ఎందుకు మరచిపోయారు?*


 *ఈ రోజుల్లో రాహుల్ గాంధీ మరియు లుటియన్స్ మీడియాకు చెందిన కాంగ్రెస్ సైకోఫాంటిక్ జర్నలిస్టులు ప్రధాని నరేంద్ర మోడీ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని నిరంతరం దుఃఖిస్తున్నారు.*


*కాబట్టి దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే విధ్వంసానికి అర్థం ఏమిటో ఈ రోజు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆగస్టు 29, 2013న దేశంలోని మీడియాలో ప్రముఖంగా ప్రచురితమైన ఒక వార్త యావత్ దేశంలో సంచలనం రేపింది. అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ట దారుణంగా మసకబారింది.*


 *దేశంలోని 5 లక్షల కిలోల బంగారాన్ని తొలగించాలని కేంద్ర ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ సూచించినందున దేశ ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా మారిందని ఈ వార్తలో చాలా స్పష్టమైన మాటలలో ప్రస్తావించబడింది. దేశం యొక్క బంగారు కార్పస్. తనఖా పెట్టాలి.*


 *ఆ సమయంలో దేశంలోని గోల్డ్ కార్పస్‌లో కేవలం 5 లక్షల 57 వేల కిలోల బంగారం మాత్రమే ఉంది. అంటే, దేశంలోని 90% గోల్డ్ కార్పస్‌ను తాకట్టు పెట్టమని అప్పటి కేంద్ర ప్రభుత్వ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి ఆనంద్ శర్మ తప్ప మరెవరూ సలహా ఇవ్వడం లేదు. అప్పటి మార్కెట్ ధర ప్రకారం (10 గ్రాములకు 27,750) ఇంత బంగారం ధర రూ.1.38 లక్షల కోట్లు గొప్ప ఆర్థికవేత్త అని చెప్పుకునే ప్రధాని మన్మోహన్ సింగ్ తన పదవీ ప్రస్థానంలో 10వ సంవత్సరంలోనే దేశ ఆర్థిక వ్యవస్థను ఇంత దయనీయ స్థితికి తీసుకొచ్చారు.*


*మీడియాలో పై సంచలన వార్త ప్రచురితమైన తర్వాత, దేశంలోని ప్రజల ఆగ్రహంతో ఒత్తిడికి లోనవడంతో, అప్పటి దేశ వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ నా ఉద్దేశాన్ని తప్పుగా చూపించారని స్పష్టం చేశారు. కానీ ఆనంద్ శర్మ యొక్క ఈ స్పష్టీకరణ తరువాతి 2-3 నెలల సంఘటనలతో దెబ్బతింది. దేశంలోనూ, ప్రపంచంలోనూ జరుగుతున్న విపరీతమైన హడావుడి కారణంగా బంగారం తాకట్టు పెట్టలేదు.కానీ దేశ దయనీయమైన ఆర్థిక వ్యవస్థను కప్పిపుచ్చే రెండో దొంగ తలుపును అప్పటి యూపీఏ ప్రభుత్వం మన్మోహన్‌ కనిపెట్టింది. యుపిఎ ప్రభుత్వం తన పాలన యొక్క చివరి సంవత్సరంలో, సెప్టెంబర్ 2013 మరియు డిసెంబర్ 2013 మధ్య విదేశీ కరెన్సీ నాన్-రెసిడెంట్ డిపాజిట్ (ఎఫ్‌సిఎన్‌ఆర్ (బి)) ద్వారా దాదాపు $ 25 రుణాలతో సహా మొత్తం సుమారు $ 32.32 బిలియన్ (రూ. 2.23 లక్షల కోట్లు) బిలియన్, దేశం యొక్క మొత్తం అయాచిత రుణం అతని నుదిటిపై పెట్టబడింది. ఈ అప్పు భారాన్ని కూడా మోదీ ప్రభుత్వం వడ్డీతో సహా తగ్గించింది.*


 *మన్మోహన్ సింగ్ తన పదవీకాలం చివరి సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థను ఇంత దయనీయమైన మరియు దరిద్రపు స్థితికి తీసుకువచ్చారని, దేశంలోని 90% బంగారాన్ని తాకట్టు పెట్టి రూ. 1.38 లక్షల కోట్లు సంపాదించారని పై వాస్తవం ద్వారా కూడా స్పష్టమవుతుంది. పరిస్థితి మెరుగుపడదు. అందుకే యుపిఎ ప్రభుత్వం "ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ డిపాజిట్" అంటే FCNR (B) ద్వారా 2.23 లక్షల కోట్ల రూపాయల రుణాన్ని సేకరించింది.*


 *చివరికి దేశంలోని బంగారం నిల్వలను ఆగస్టు 2013లో 557 టన్నుల నుంచి మోదీ ప్రభుత్వం 148 టన్నులకు పెంచింది. 30 జూన్ 2021 నాటికి దేశంలో బంగారం నిల్వలు 705 టన్నులకు చేరుకున్నాయి.*

 


 1. అప్పటి RBI గవర్నర్ రఘురామ్ రాజన్ యొక్క ఈ *ఒప్పుకోలు* చదవండి.

 https://indianexpress.com/article/business/banking-and-finance/fcnr-bonds-were-least-bad-option-to-raise-dollars-raghuram-rajan-3011772/


 2.*మోడీ ప్రభుత్వం ఆ రుణాన్ని తిరిగి చెల్లించింది.* దీన్ని ధృవీకరించడానికి ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా దీన్ని చదవండి.

 https://www.thehindubusinessline.com/money-and-banking/fcnr-deposits-of-2013-set-to-mature-reserve-bank-ready-to-tackle-volatility/article8472235.ece


 *కాంగ్రెస్, కమ్యూనిస్టు మొదలైన తప్పుడు ప్రచారాలను తెలుసుకొని అర్థం చేసుకోండి.*


 కాబట్టి దేశ ప్రయోజనాల దృష్ట్యా మేలుకోండి.


 *వినండి, పప్పువో- పింక్యో*


 స్వతంత్ర భారత చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ చేయలేని పనిని మోదీ ఈ 7 ఏళ్లలో చేశారు. తప్పక చదవండి, మధ్యలో ఎక్కడైనా వదిలేస్తే, మీ కళ్ళు మూసుకుపోతాయి, కాబట్టి ఖచ్చితంగా పూర్తిగా చదవండి,,


 *మొదటి విజయం*

 మన దేశాన్ని 200 ఏళ్ల పాటు బానిసలుగా మార్చిన బ్రిటన్‌లో 53 దేశాల సమావేశంలో మోడీ జీ జనరల్ ప్రెసిడెంట్ అయ్యాడు,,, దీన్ని బట్టి ప్రతి భారతీయుడి ఛాతీ గర్వంగా విశాలం కావాలి,,,


 *రెండవ విజయం*

  UN హ్యూమన్ రైట్స్ కౌన్సిల్‌లో భారత్‌కు భారీ విజయం లభించింది, అత్యధిక ఓట్లు సాధించిన సభ్యుడు, 97 ఓట్లు అవసరం, 188 ఓట్లు వచ్చాయి,,,, మోడీ విదేశాలకు ఎందుకు వెళ్తారని భారత ప్రజలు ఇంకా అడుగుతారా,,, ,


 *మూడవ విజయం*


 ప్రపంచంలోని 25 అత్యంత శక్తివంతమైన దేశాల జాబితా విడుదలైంది


 *నాల్గవ విజయం*

 GST యొక్క నెలవారీ పన్ను వసూళ్లు 1 లక్ష కోట్లకు చేరాయి,,,,, ఇది టీ అమ్మేవారి ఆర్థికాంశం,,,


 *ఐదవ విజయం*

 ,,, కొత్త సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో అమెరికా మరియు జపాన్‌లను వెనక్కి నెట్టి భారతదేశం రెండవ స్థానానికి చేరుకుంది,,,,


 *ఆరవ విజయం*,,,,, 2017-18లో సౌరశక్తి ఉత్పత్తి రెండింతలు,,,,

 చైనా, అమెరికాలు కూడా కంగుతిన్నాయి


 *ఏడవ విజయం*

 ఆకాశాన్నంటుతున్న భారతదేశ జిడిపిని చూస్తే,,,

 భారతదేశ జిడిపి 8.2%, చైనా 6.7% మరియు అమెరికా 4.2%. మోడీ విదేశాలకు ఎందుకు వెళ్తాడో ఇప్పుడు కూడా భారతీయులు చెబుతారు,,,


 *ఎనిమిదవ విజయం*

  ,,, భూమి మరియు ఆకాశం అనే మూడు ప్రాంతాల నుండి సూపర్ సోనిక్ క్షిపణులను ప్రయోగించిన మొదటి దేశం భారతదేశం,,,, ఇది మోడీ యుగం,,, మీరు గర్వంగా ఉంటే, జైహింద్ అని రాయడం మర్చిపోకండి,,,,


 *తొమ్మిదవ విజయం*,

 70 ఏళ్లలో పాకిస్థాన్ పేదరికాన్ని ఎప్పుడూ చూడలేదు, కానీ మోడీ జీ వచ్చిన వెంటనే, పాకిస్తాన్ దరిద్రంగా మారింది,,,


 *పదో విజయం*

  ఇంకా చదవండి,,,,,, ఒక్క విషయం అర్ధం కాలేదు,,,

 2014లో కాంగ్రెస్ రక్షణ మంత్రి ఎ.కె. దేశం దరిద్రంగా ఉందని, మనకు రాఫెల్, చిన్న జెట్ కూడా దొరకదని ఆంటోనీ అన్నారు,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

 రాఫెల్ డీల్ కూడా కుదిరింది, ఎస్-400 కూడా తీసుకుంటోంది!

 మరి కాంగ్రెస్ హయాంలో దేశ సొమ్ము ఎక్కడికి పోయింది?


 *పదకొండవ విజయం*

 ,, సైన్యం బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో యొక్క రక్షణ కవచాన్ని పొందింది,,,

 జమ్మూ కాశ్మీర్‌లో సైన్యానికి 2500 బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో దొరికింది


 *బాహ్య సాధన*

  ఈ 4 సంవత్సరాలలో భారతదేశ అభివృద్ధికి ఏమి జరిగిందో ఇప్పుడు నేను మీకు చెప్తాను,,,

 ఆర్థిక వ్యవస్థలో ఫ్రాన్స్‌ను వెనక్కి నెట్టి 6వ స్థానానికి చేరుకుంది,,,


 *పదమూడవ విజయం*

 ఆటో మార్కెట్‌లో 4వ స్థానంలో నిలిచింది, జర్మనీని వెనక్కి నెట్టి,,,


 *పద్నాలుగో విజయం*

  ,,, విద్యుత్ ఉత్పత్తిలో రష్యా వెనుకబడి, 3వ స్థానంలో నిలిచింది,,,


 * పదిహేనవ విజయం *,, వస్త్ర ఉత్పత్తిలో ఇటలీని అధిగమించి 2వ స్థానానికి చేరుకుంది,,,


 పదహారవ విజయం*,

 మొబైల్ ఉత్పత్తిలో వియత్నాం వెనుకబడి 2వ స్థానంలో నిలిచింది


 *పదిహేడవ విజయం* ,,, ఉక్కు ఉత్పత్తిలో జపాన్‌ను అధిగమించి 2వ స్థానానికి చేరుకుంది,,,


 *పద్దెనిమిదవ విజయం* ,,, చక్కెర ఉత్పత్తిలో బ్రెజిల్‌ను అధిగమించి నంబర్ 1గా నిలిచింది,,,


 *పంతొమ్మిదవ విజయం*

 రామమందిరం, ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్,

 * CAA.NRCలో ఏ పని జరుగుతోంది. యూనిఫాం సివిల్ కోడ్, జనాభా నియంత్రణ చట్టం మొదలైనవి*


 *ఇరవయ్యవ విజయం*

 ఎప్పుడూ నిద్రించే హిందువులు

 నేను *జాతీయవాదాన్ని* మేల్కొన్నాను, ప్రపంచం మొత్తం మీద 125 కోట్ల మంది హిందువులు ఉన్న ఒక్క దేశం కూడా లేదు.

 నేను ఈ పనిని అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తున్నాను.


 *దీన్నే మోడీ యుగం అంటారు*

 మోదీ ప్రభుత్వంలో ఉగ్రవాదులు లోయ నుంచి తుడిచిపెట్టుకుపోతున్నారు.

 లష్కరే తోయిబా ఉగ్రవాది నవేద్ వట్ హతమయ్యాడు.

 హిజ్బుల్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

 8 నెలల్లో, 72 హురాన్ సమీపంలో 230 మంది ఉగ్రవాదులను నరకానికి తీసుకువచ్చారు.


 కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదులు భయాందోళనలకు గురయ్యారు

 మోడీ రాజ్‌లో, ఉగ్రవాదుల కోసం సైన్యం *భయపడుతోంది*,,,

 ఇదీ మోడీ రాజ్ ఫార్ములా,,,,


 ఇప్పుడు ఆయన అవినీతి వ్యూహాలు ఫలించలేకపోతున్నాయని, ఆ తర్వాత ఒక అభిమన్యుని చంపాలని, అవినీతిపరులు అంతా కలిసి 2024లో మోడీని ఓడించేందుకు చక్రవ్యూహం ఏర్పాటు చేస్తున్నారని మోడీ జీకి పెరుగుతున్న కీర్తిని చూసి మొత్తం ప్రతిపక్షం ఆశ్చర్యపోయింది, కానీ ఆ అవినీతిపరులు అలా చేయరు. ద్వాపర విద్యలోని అభిమన్యుడు చక్రవ్యూహాన్ని ఛేదించడానికే తల్లి గర్భంలో ఉన్నాడని తెలుసుకో, అది కూడా ప్రవేశించి బయటకు రావడమే కాదు, ఈ మోడి రూపం అభిమన్యుడు చక్రవ్యూహాన్ని ఛేదించి పగలగొట్టడానికి ప్రయత్నించాడని తెలుసు. అజేయురాలు, ఓడిపోలేని తల్లి భారతి,,,,


 2024లో ఈ సేవకుడిని ఇంత భారీ మెజారిటీతో గెలిపించేలా ఈరోజు మనందరం ఒక తీర్మానం చేద్దాం, ఆ సంఖ్య ఎవరూ ముట్టుకోలేని గిన్నిస్ బుక్‌లో నమోదై ఉంటుంది,,,,,


  * 2024లో మోదీని తిరిగి భారత ప్రధానిని చేయండి.*

     భారతదేశానికి నమస్కారం


 * *నా ఈ పోస్ట్‌ను గర్వంగా ఐదు గ్రూపులుగా పంపండి * * తద్వారా నా సందేశం ప్రజలకు చేరుతుంది * * సందేశం చేరుతుంది మరియు పోస్ట్ యొక్క ప్రాముఖ్యత * * నిరూపించబడింది *


రచ్చ శ్రీనివాస్ యాదగిరిగుట్ట

అమ్మను మోసం చేస్తున్నాను

 🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹

❗ *ఔను, అమ్మను మోసం చేస్తున్నాను.* 


తల్లికి నిద్ర మాత్రలు వేసుకోవటం అలవాటు అయిపోయింది. మాత్రలు ఇవ్వకపోతే నిద్రపోను అని జిద్దు చేస్తున్నది. కొడుకుకు ఈమధ్యే పెళ్లయింది. కోడలిది వైద్య వృత్తి. నిద్ర మాత్రలు మంచివి కావు అని అత్త గారికి చెప్పటానికి చాలా ప్రయత్నం చేస్తున్నది. కానీ అత్తగారు వినటం లేదు. 'మీరు ఎంత అరిచి గీపెట్టినా మాత్రలు ఇవ్వను.' అని కోడలు తేల్చి చెప్పేసింది. 


చివరికి ఆ తల్లి తన కొడుకుని పిలిచింది. కొడుకు వస్తూనే 'అమ్మా నోరు తెరువు' అని నిద్ర మాత్రలు తీసి ఆమె నోట్లో వేసి మంచినీరు అందించాడు. ఆమె వాటిని మింగి కొడుకుని మనసారా ఆశీర్వదించి హాయిగా నిద్రపోయింది. 


ఆ అమ్మాయి కోపంగా 'ఎందుకు ఇట్లా చేశారు?' అని భర్తను అడిగింది. అతను ఆ మందు డబ్బా భార్యకు చూపించాడు. అది విటమిన్ మాత్రలు అని చూస్తూనే అమ్మాయి పెదవులపై నవ్వు విరిసింది. నెమ్మదిగా, 'అమ్మని మోసం చేస్తున్నారా?' అని అడిగింది. 


అప్పుడు అతను, 'అమ్మ కూడా చిన్నప్పుడు మోసం చేసి మాకు బోలెడు తినిపించేది. అప్పట్లో ఆమె చేసేది. ఇప్పుడు నేను పగ తీర్చుకుంటున్నాను.' అని అన్నాడు.


ఇలా కూడా అమ్మను ప్రేమించవచ్చు...!!!


*అమ్మానాన్నలు దేవుని* *ప్రతిరూపాలు...!!!*

మధ్వనవమి విశిష్టత

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

.*🌹మధ్వనవమి విశిష్టత🌹*

               🌷🌷🌷

*ఈరోజు ఫిబ్రవరి 10 గురువారం మధ్వనవమి.* 


మాఘ శుక్ల నవమి మధ్వనవమిగా ప్రసిద్ధం.


భారతీయ దర్శనాల్లో ముఖ్యమైన మూడు సిద్ధాంతాలలో ఒకటి ద్వైత సిద్ధాంతం.  ద్వైత సిద్ధాంతాన్ని విశ్వవ్యాప్తం చేసిన ధర్మమూర్తి, పూర్ణప్రజ్ఞులు శ్రీమధ్వాచార్యులు. ఆయన ఉడుపిలోని అనంతేశ్వరాలయంలో ఐతరేయోపనిషత్తుకు భాష్యం చెబుతూ, దేవతలు కురిపించిన పుష్పవృష్టిలో అంతర్థానమై బదరికాశ్రమాన్ని చేరిన రోజు మధ్వ నవమి.


త్రిమతాచార్యుల్లో ఆఖరి అవతారం.. శ్రీమధ్వాచార్యులు. ఆయన ఆశ్వయుజ విజయదశమినాడు 1238లో దక్షిణ కన్నడ ఉడిపివద్ద పాజక గ్రామంలో జన్మించారు. మధ్వాచార్యుని జీవిత కథను రచించిన నారాయణ పండితాచార్యులు ఆయన తల్లిదండ్రుల పేర్లను మధురేహ భట్ట, వేదవతిలుగా పేర్కొన్నారు. ఆయనకు మొదట్లో వాసుదేవ అని పేరు పెట్టినా తరువాతి కాలంలో పూర్వ ప్రజ్ఞ, ఆనందతీర్థ, మధ్వాచార్యులు అనే పేర్లతో ప్రసిద్ధి పొందారు.


పనెనండో ఏట అచ్యుతప్రజ్ఞ తీర్థుల గురుకృపతో సన్యాసం స్వీకరించారు. బాల్యంలో ఉండగానే వాసుదేవ ఆధ్యాత్మికత విషయాలవైపు ఆసక్తిచూపుతూ వాటిని ఆకళింపు చేసుకునేవారు. చిన్నవయసులోనే సకల శాస్తజ్ఞ్రానం సంపాదించుకున్నందువల్ల పూర్ణ ప్రజ్ఞుడన్న బిరుదు ప్రసాదించారు. ద్వైతమతాన్ని ప్రతిపాదించినందువల్ల ఆయన అనుసరించిన మధ్యేమార్గానికి చిహ్నంగా శ్రీమధ్వాచార్యులన్న నామధేయం కూడా వరించింది. గొప్ప కార్యసాధకుడు అనటానికి ఆయన చేపట్టిన విస్తృత సైద్ధాంతిక కార్యక్రమాలే ప్రబల నిదర్శనాలు. రుక్మిణీ దేవి పూజించే బాలకృష్ణ విగ్రహం ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ఠించింది మధ్యాచార్యులవారే. శ్రీమధ్వాచార్యులవారు సుదీర్ఘ జీవితకాలంలో మూడు పర్యాయాలు బదరీయాత్ర విజయవంతంగా నిర్వహించారు. వారి చివరియాత్ర 1317లో 79వ ఏట పరిపూర్ణమైంది. ఆ తిరిగిరాని పయనమే మధ్వానవమి వైశిష్ట్యానికి సంప్రదాయంగా మారింది. ఈ సందర్భంగా అన్ని మఠాల్లో దేశ వ్యాప్తంగా ఆరాధనా కార్యక్రమాలు నిర్వహిస్తారు.


జీవుడు వేరు, బ్రహ్మము వేరు, జీవుడు మిథ్య కాదు. అలాగే జడ జగత్తు కూడా మిథ్యకాదు. ఈశ్వరుడు ఎంత సత్యమో జీవ జగత్తులు కూడా అంత సత్యం. భక్తి ఒక్కటే ముక్తిదాయకం. అది జ్ఞాన పురస్కృతమైన భక్తి అయి ఉండాలి. మధ్వాచార్యుడు ఆసేతుసీతనగ పర్యంతం దేశమంతా పర్యటించి ద్వైతమతాన్ని ప్రచారం చేశాడు. దేశంలో వైష్ణవమత వ్యాప్తికి, ముఖ్యంగా కృష్ణ్భక్తి వ్యాప్తికి మధ్వమతం ఎంతగానో తోడ్పడిందనటంలో సందేహం లేదు. జగత్తు మాయ మాత్రమే. జీవితం ప్రత్యక్ష ప్రామాణికమే.


పరమాత్మ సర్వస్వతంత్రుడు, జీవాత్మ అస్వంతంత్రుడు, జీవోత్తముడు ఆచార్యుడు, ధర్మమార్గంలో ఆచార్యుల అనుగ్రహం సంపాదించి, అర్హమైన ఆనందాన్ని అనుభవించమని ఆయన చెప్పిన సూక్తిముక్తావళి మధ్వులకు శిరోధార్యం. మధ్వాచార్యులు నిలిపిన సాంప్రదాయాలను పాటించేవారిని మధ్వులు లేదా మధ్వమతస్థులు అని పిలుస్తారు. మధ్వాచార్యుడు, హనుమంతుడు మరి భీముడు అనంతరము వాయుదేవునకు తృతీయ అవతారమని నమ్ముతారు. తన ద్వైత సిద్ధాంతాన్ని నిరూపించడానికి మధ్వాచార్యుడు ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు భాష్యాలు వ్రాశాడు. ఋగ్వేదంలోని 40 సూక్తాలకు మరియు భారత భాగవతాలకు వ్యాఖ్యానం వ్రాశాడు. తర్కంతోపాటు 37 గ్రంథాలను రచించాడు. మధ్వాచార్యులు అనంతరం మరే ఆచార్యులు భారతావనిలో పుట్టలేదు. వారు చేసిన ద్వైత సిద్ధాంతాన్ని ఖండించి దానికంటే ఉన్నతమైన మరొక సిద్ధాంతాన్ని ఎవరూ ప్రతిపాదించలేదు.


ఒకసారి వీరు దక్షిణ కన్నడలోని మాత్నే తీరం సమీపంలో మునిగిపోతున్న ఓడను రక్షించగా, ఓడలోని ముఖ్య నావికుడు భక్త్భివంతో వీరికి ఒక గోపీ చందనం మూటను బహూకరించాడు. శ్రీమహావిష్ణువుయొక్క వివిధ అవతారాలను స్తుతిస్తూ ఆ మూటను వీరు ఉడిపికి తెచ్చారు. ఆ స్తోత్రమే తరువాత కాలంలో 3ద్వాదశస్తోత్రంగా పిలువబడింది. ఆ గోపీచందనం మూటను మధ్వ సరోవరంలో శుద్ధిచేసి దానిని విప్పిన వీరికి ఆ గోపీచందనం కణికల మధ్య ఒక చిన్న కృష్ణ విగ్రహం లభించింది. ఆ విగ్రహానే్న 800 సంవత్సరాల పూర్వం ఉడిపిలో ప్రతిష్ఠించారని అంటారు. తనను అమితంగా కొలిచే అంత్య కులజుడైన కనకదాసుని కరుణించి తూర్పు ముఖంగా వున్న శ్రీకృష్ణుడు పశ్చిమ ముఖుడై గవాక్షం గుండా అతనికి దర్శనం అనుగ్రహించాడు. ఇప్పటికి కూడా ఉడిపిలో శ్రీకృష్ణుడు పశ్చిమాభిముఖుడై ఉండే మనల్ని అనుగ్రహిస్తున్నాడు. మూఢ నమ్మకాల్ని వ్యతిరేకించాడు. యుక్తవయస్సులో కన్యకుమారి, రామేశ్వరం, శ్రీరంగం మొదలైన క్షేత్రాలను సందర్శించారు మధ్వాచార్యులు ప్రవచించిన మతం ద్వైతం. జీవాత్మ, పరమాత్మలు రెండూ వేర్వేరుగా ఉంటాయని చెబుతారు. సృష్టిలో కంటికి కనిపించే ప్రతిదీ పరమాత్మ వాసుదేవుడిమీద ఆధారపడి వుంటుందని, ఆయనే ఈ సృష్టికి మూలకారకుడని తెలుపుతుంది. పరబ్రహ్మ ఒక్కడే. అతను విష్ణువు అని ప్రబోధించాడు. మధ్వ మతతత్వానికి వనె్నతెస్తున్న ఉడిపికి చెందిన ఎనిమిది మఠాలు పెజావర, పుత్తిగె, పాలిమార్, ఆడనూరు, సోధె, కవియూరు, శిరూరు, కృష్ణాపురం మఠాలు. సంప్రదాయాలకు, మతపరమైన ఆచారాలకు, ద్వైత సిద్ధాంతాలకు ఉడిపి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది.


పురందరదాసు, కనకదాసు వంటి వాగ్గేయకారులకు ఉడిపి నిలయం కావటంతో దీనిని దాస సాహిత్య కేంద్రమని పేర్కొంటారు.


మధ్వాచార్యులు తమ 79వ ఏట 1317లో శిష్యసమేతంగా బదరీ నారాయణుని మరోమారు దర్శించి ఒంటరిగా చేరుకుని వ్యాసభగవానుని కైంకర్యాలలో నిమగ్నమైపోయారు.


*ఓం నమో నారాయణాయ🙏*


🍂🥀🍂🥀🍂🥀🍂🥀🍂🥀

నా భార్య ఏ పనీ చేయదు

 నా భార్య ఏ పనీ చేయదు!


ఒక భర్తకు, సైకాలజిస్టుకు మధ్య జరిగిన

#సంభాషణ

సై: మీరు ఏం చేస్తారు?

భ: నేను బ్యాంక్ లో ఎకౌంటెంట్ గా

పనిచేస్తున్నాను .

సై: మీ భార్య ఏం చేస్తారు?

భ: ఆమె ఇంట్లోనే ఉంటుంది.

సై: మీ కుటుంబానికి ఉదయం పూట అల్పాహారం

ఎవరు తయారు చేస్తారు?

భ: నా భార్య. ఎందుకంటే తనకు ఉద్యోగం

ఏమీ లేదు కాబట్టి.

సై: అల్పాహారం తయారు చేయడానికి మీ భార్య

ఏ సమయానికి నిద్ర లేస్తుంది?

భ: తను తెల్లవారుజామున 5 గంటలకు

లేస్తుంది. ముందు ఇల్లు శుభ్రం చేసి

తర్వాత అల్పాహారం తయారు చేస్తుంది.

సై: మీ పిల్లలు స్కూల్ కు ఎలా వెళ్తారు?

భ: పిల్లలను నా భార్య స్కూల్ కు 

తీసుకువెళుతుంది . ఎందుకంటే తను ఏ

ఉద్యోగం చేయదు కాబట్టి.

సై: పిల్లలను స్కూల్లో దింపి వచ్చిన తర్వాత

మీ భార్య ఇంట్లో ఏం చేస్తుంది?

భ: మార్కెట్ కు వెళ్ళి కూరగాయలు తెచ్చి వంట

చేస్తుంది. తర్వాత బట్టలు ఉతుకుతుంది.

మీకు తెలుసు కదా తను ఉద్యోగం ఏమీ

చేయదని! అందుకే అలా....

సై: మీరు సాయంత్రం ఇంటికి చేరిన తర్వాత ఏం

చేస్తారు?

భ: విశ్రాంతి తీసుకుంటాను. ఎందుకంటే రోజంతా

పని చేసి అలసి పోయి ఉంటాను అందుకే.

సై: మీ భార్య ఏం చేస్తుంది?

భ: వంట తయారు చేస్తుంది. పిల్లలకు

పెడుతుంది. తర్వాత నాకు. ఆ తర్వాత పిల్లలను

నిద్ర పుచ్చుతుంది. తర్వాత అంట్లు

తోముకుంటుంది. ఇల్లు శుభ్రం

చేసుకుంటుంది. తర్వాతే తను నిద్రపోతుంది.

పైన చెప్పిన కథలో ఎక్కువ పని ఎవరు

చేస్తున్నారంటారూ 🤔

తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు

విశ్రాంతి లేకుండా రోజంతా పనిచేసేది భార్యే.

కానీ భర్త దృష్టిలో ఆమె ఉద్యోగం ఏమీ

చేయడం లేదు కాబట్టి, పని చేయనట్టే!

అవును! గృహిణులకు ఇంటి పని చేయడానికి

ఎలాంటి విద్యార్హతలు, అనుభవం అవసరం

లేదు. కానీ కుటుంబంలో తన పాత్ర చాలా

ముఖ్యం.

ఉద్యోగం చేస్తేనే పని చేస్తున్నట్లు అనే

భావన నుంచి బయటపడాలి. ముందు మీ

భార్యను అభినందించండి. ఎందుకంటే వారు

చేస్తున్న త్యాగాన్ని దేనితోనూ కొలవలేం.

ఎలాంటి ప్రతిఫలాన్నీ ఆశించ కుండా వారు

చేస్తున్న బాధ్యతాయుతమైన పనిని కించ

పరచకండి. ఈ సంభాషణ చాలామంది ఆలోచన

లకు ప్రతిబింబం లాంటిది. అందుకే ఎప్పుడూ

ఇంట్లో ఒకరి పాత్రను మరొకరు

కించపరుచుకోకుండా సహకరించుకోండి.

అప్పుడే సంసారం ఆనందమయం అవుతుంది ❤️❤️కదా 😊👍🙏




[09/02, 5:15 pm] +91 98662 42585: అనసూయా కోడూరి గారు షేర్ చేసిన పోస్ట్ అర్ధవంతంగా ఉంది. అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అందుకే  నా వాల్ మీద షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే మీ అందరూ కూడా షేర్ చేయండి. ఈ #పోస్ట్ ని కాపీ పేస్ట్ చేస్తారో,

షేర్ చేస్తారో మీ ఇష్టం కానీ ఈ పోస్ట్ పదిమందికి చేరాలి,


#ముచ్చింతల్ లో 1000కోట్లు పెట్టి #రామనుజులవారి అంత పెద్ద విగ్రహం పెట్టే బదులు హాస్పిటల్ కడితే రామానుజులకి గర్తింపు వస్తుంది కదా

అక్కడ యాగాల్లో&హోమాల్లో వృధా చేస్తున్న #నెయ్యి పంచిపెట్టొచ్చు కదానాస్తిక హేతువాద&హిందుత్వ వ్యతిరేక సన్నాయి నొక్కులు చూస్తున్నాము వింటున్నాము గత వారంరోజులుగా,


#చినజీయర్_స్వామి వారు పదేళ్లముందే తమ ఆశ్రమంలో 100 పడకల #ఆస్పత్రి కట్టించారు అందులో ఉచిత సేవలు అందిస్తున్నారు, దానిముందు చిన్న విగ్రహము పెట్టించారు ఈ విమర్శించే లోకులకి ఈ విషయం తెలుసా..?? తెలీదు కానీ విమర్శించేస్తాం..... 


ఇవే కాదు #ఆశ్రమంలో #హోమియో_కాలేజ్ ఉంది, వేదపాఠశాల ఉంది,

#గోశాల ఉంది,

అంధులకి స్కూల్&కాలేజి ఉంది అందులో చదివే పిల్లలకి స్టేటు ర్యాంకులు ఉన్నాయ్ ఇవేవీ మనకి తెలీదు కానీ విమర్శించేస్తాం... 


#JET (jeeyar educational trust ) ద్వారా కొన్ని వందల మంది గిరిజన విద్యార్థులకి 2004 నుంచి ఉచిత విద్య,

వసతి ఇస్తున్నారు అది తెలుసా తెలీదు కానీ విమర్శలు చేస్తారు,


#వికాసతరంగిణి అనే ట్రస్టు ద్వారా కొన్ని వేల మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ మీద అవగాహన కల్పించారు,

సేవలు అందించారు ఇవేవీ మనకి తెలీవు కానీ విమర్శించేస్తాం....


అబ్బే లేదండి స్వామీజీ పెద్దపెద్ద వాళ్లనే ముందు వరుసలో పెడతారండి,

ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలకి తోడ్పాటునిచ్చే వారిని ముందు పెట్టడంలో తప్పేంటి..? 


విమర్శకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఆ విగ్రహం ఎందుకండి అని అంటే అన్నారు రేపు #తిరుమలలో వెంకన్న ఎందుకండీ అక్కడ కూడా హాస్పిటల్ పెట్టండి అనకండి. 

అయినా ఆ 1000కోట్లలో మీకు సంబంధించి ఒక్కరూ రూపాయి కూడా లేదు 

ఆ డబ్బు అంతా హిందువులు ఇచ్చిన విరాళాలు&చందాలు&కానుకల ద్వారా పొగుచేసినవి,

మరి మా డబ్బులు దేనికి ఖర్చు పెడితే  మీకెందుకు?


చిన జీయర్ గారు చేసిన చేస్తున్న కార్యక్రామలు చాలామందికి వివరాలు తెలియవు,

వారు #పబ్లిసిటీ కోరుకోరు,

అలాంటివారికి ఈ పోస్ట్ ద్వారా కొంత సమాచారం తెలియజేయాలి అని ఈ పోస్ట్,


#వేద_



To see more posts like this and join ALL INDIA BRAHMIN FEDERATION, click here 👇👇


https://kutumbapp.page.link/9PDt6KZyDDNAe7K39