15, సెప్టెంబర్ 2024, ఆదివారం

శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 10

 _*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 10 వ భాగము*_ 

🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅


*కాలడిని విడనాడుట:*


ఒకనాడు బ్రహ్మచర్యాశ్రమం నాటి పలాశ దండాన్ని వదలి దాని స్థానే జ్ఞానదండం వహించాడు. రాత్రంతా పూర్ణ ప్రక్కన ఉన్న కృష్ణాలయంలో గడిపాడు. తెల్లవారు జామున లేచి, అరుణో దయవేళకే కాలకృత్యాలు తీర్చుకొన్నాడు. తన ప్రయాణానికి అంతరాయం ఉండదని, రవి రాకుండా బయలు దేరడానికి సిద్ధ మయ్యాడు. ఎలా తెలిసిందో ఊరు ఊరంతా వచ్చి ముట్టడించారు శంకరుని.  వచ్చినవాళ్ళలో ఉన్న తల్లిని చూచి సాష్టాంగ వందనంచేసి సెలవడిగాడు. ఆమె నోట మాట రాలేదు. మౌనం అర్థాంగీకారమని వచ్చిన వారందరి దగ్గతా సెలవు తీసికొని ఉత్తర దిశగా అడుగులు వేశాడు. ఊరివారు శంకరుని వెన్నంటే వస్తున్నారు.  ఊరు దాటినా వారు వదిలి పెట్టలేదు. శంకరుడు లేని ఊరిలో ఉండ గలమా! అనుకొంటున్నారు. జయజయ ధ్వానాలు మిన్ను ముట్టడంతో శంకరునికి అర్థమైంది ఊరందరూ తన వెంటే ఉన్నారని. అపుడు వారిని ఉద్దేశించి "తండ్రులారా! తల్లులారా! నేను దేశం విడిచి వెళ్ళిపోవడం లేదు. మీ మీ పనులు మానుకోకండి. ఇళ్ళకు వెళ్ళండి. నాపై నున్న ప్రేమను ఊరిపై పెట్టండి. దయ యుంచి మరలి వెళ్ళండి” అని ప్రార్థించాడు. విడువ లేక విడువ లేక మరలు ముఖాలు పెట్టారు ఆ ఊరి జనం. మనస్సులలో చింతా, విచారమూ అలముకొని కన్నీరుగా ప్రవహించాయి.


*గురువుకడకు ప్రయాణము:*


కోటిసూర్య తేజస్సుతో వెలిగి పోతున్న శంకర బాలయతిని ఎవరా అని సిగ్గుతో తొంగి చూస్తు న్నాడు బాలభాస్కరుడు. పల్లెలూ పట్టణాలూ దాటి వెళ్ళుతున్నాడు. దారిలో ఉన్న ఊరి ప్రజలు చాలా ఆసక్తిగా ఆశ్చర్యసంభూ తులై సందర్శించు కొంటున్నారు ఆ అవతార మూర్తిని. ఎలా ఉంది ఆ విగ్రహం! పసిమి చాయ తోడి పాల బుగ్గలు. దొండపండును మించిన అధరోష్ట్రము. శ్రీకారాలను మించిన దానిమ్మపండు రంగుకల వీనులు. పద్మ దళాలను పోలిన నేత్రాలు. లేత అరటి దూట వంటి కాలుచేతులు.బంగరు మేనిఛాయ. తళ తళ లాడే విభూతి రేఖలు. పాదపద్మాల నుండి పావుకోళ్ళకు జారుచున్న దానిమ్మ పుప్పొడి. చూచిన వారికి కన్నుల పండు వైంది. వీధులలో శంకరుడు నడచి వెడుతుంటే అరుగులపై కూచున్న వాళ్ళు చరచరా దిగి వచ్చి ఆ బాలయతికి వినయ విధేయ తలతో నమస్కారాలు  అర్పించే వారు. కొందరు ఆయన వెంట కొంత దూరం నడచి వెళ్ళేవారు. అప్రతిహత తేజంతో విరాజిల్లే ఆ బాల సన్న్యాసిని చూచి సంబర పడని వారు లేరు. మరికొందరు ఆ బాలుని తనివి తీరా పలకరించి అట్టిభాగ్యం తమకు లభించి నందుకు మురిసి పోయేవారు. అట్టివారికి శంకరుడు ఇచ్చే సందేశం ఎప్పుడూ ఇదే: “ధర్మం మఱువకుండా ఆచరించండి. సత్యాన్ని విడువకండి”.


ఊరి బయట బయళ్ళలో గోపాలబాలునిగా భ్రమించి ఆలమందలు మోరలెత్తి దగ్గఱగా సమీపించేవి. గోపాలురు ఆ వింత చూచి పరుగుపరుగున వచ్చి పడే వారు. వన్యమృగాలు బహుళంగా విహరించే కారడవిలోనుండి వెళ్ళడం శంకరునికి కష్టమనిపించ లేదు. అలా కొంత దూరం పోయాక మార్గం కంటకా వృతమయ్యింది. జాగ్రత్తగా అడుగులిడుతూ నడుస్తు న్నాడు. ఇరుపార్శ్వాలు దట్టమైన పొదలు అలుముకొని ఉన్నా ఆయన పురోగతికి అడ్డులేదు. వనంలోని మృగాలకు బాలయతి అర్థనారీశ్వరుడై కన్పట్టాడు. బహుదూరంగా ఉన్న సింహాలు తమ ఏలిక గిరిజయే వచ్చిందని శంకరుని వామ పార్శ్వం చేరాయి. మహానాగులు పడగ విప్పి ఛత్రం పట్టాయి. గజరాజులు ఘీంకారం చేస్తూ తొండాలెత్తి జేజేలు పలికాయి. పరమాత్మ చింతనలో ఉన్న ఆ అవతార పురుషుని మహిమలు ఎవరూహించ గలరు?


*నర్మదా నదీ ప్రాంతము:*


మన బాలశంకరుడు నర్మదానదీ ప్రాంతం చేరుకోబోతున్నాడు. లోకోత్తర మహాపురుషుడు అన్న వార్త తెలిసిన వాయుదేవుడు తన పరివారాన్ని ఆయత్తపరచి దారి పొడుగునా వృక్షరాజ ములచే వంగి వంగి నమస్కారాలర్పించ జేసాడు. పరిమళములు గుబాళించే పుష్ప వర్షాన్ని కురిపించి స్వాగతం పలికాడు. అందుండి సమీరుడు బాలయతిని ఒక నందన వనంలోనికి ప్రవేశ పెట్టాడు. కొంత విశ్రాంతి తీసికొన్న పిమ్మట మధురాతిమధురమైన ఫలాలను నివేదన చేశాడు. ప్రయాణపు బడలిక లేకున్నా ఆ పండ్లు తిని ఒకింత తడవు విశ్రమించాడు శంకరుడు. ముందు ముందు పోగా పోగా మునులు నివసించే జాడలు పొడగట్టాయి. మరి కొంత దూరం ఆ వైపుగా నడవగా ఆరవేసిన మునులు కట్టే బట్టలు కనబడ్డాయి. అక్కడ జంతువులు తమ తమ సహజ వైరం మరచి పరస్పర మైత్రీ భావంతో మెలగుచున్నాయి.


శంకరుడు రావడం చూచిన ఋషులు ఆడబోయిన తీర్థం ఎదురైంది అనుకొన్నారు. అతని లేబ్రాయమూ, దివ్యతేజమూ చూచి విభ్రాంతులయ్యారు. బాల్యంలోనే పరమవిరాగి అయిన అతని పూర్వభవ పుణ్యానికి విస్తుపోయారు. ఒక ముని ప్రశ్నించాడు: "బాలకా! ఎందుకో ఈ తావు చేరావు? ఎచటికి పోనుంటివి?” “మునివర్యా! గోవింద భగవత్పాదాచార్యుల కడకు నా ప్రయాణం" అని శంకరుని సమాధానం.


*శ్రీగోవింద భగవత్పాదాచార్యుల సన్నిధి:*


అప్పుడా ముని మారు మాటాడక తనతో రమ్మని దారి చూపుచూ ముందుకు నడుస్తున్నాడు.దగ్గరలో ఉంది ఒక గుహ. అక్కడికి చేరాక అందు దేదీప్య మానంగా వెలుగొందుచున్న గురువర్యుడు కానవచ్చాడు బాలయతికి. అది తన గురుని సన్నిధియే అని గ్రహించి శంకరుడు గుహ చుట్టూ ప్రదక్షిణచేస్తూ ఇలా ప్రార్థించాడు. 


“సద్గురుదేవా! జ్ఞానదాతా!

పరబ్రహ్మస్వరూపా! బ్రహ్మానందదాయకా! నిరంజనా! నిర్వికల్పా! సర్వధీసాక్షిభూతా! త్రిగుణాతీతా! దివ్యమూర్తీ! పూర్ణకృపానిధీ! ప్రసన్నాత్మా! యోగీశ్వరేశ్వరా! జ్ఞానస్వరూపా! నిరాకారా! చిదానందా! సచ్చిదానందా! జగద్గురో!”


అని ప్రధమ ప్రదక్షిణ చేసాడు. “విశ్వాతీతా! నిష్కళంకస్వరూపా! సమస్త జగదాధారమూర్తీ! దీనబాంధవా! ప్రణవ స్వరూపా! మహాప్రాజ్ఞా! త్రికాలజ్ఞా! ద్వంద్వాతీతా! సద్గురుమూర్తీ! ఆర్తత్రాణ పరాయణా!వందనములు” అని ప్రార్థిస్తూ రెండవ ప్రదక్షిణం. 


మూడవ ప్రదక్షిణం చేస్తూ ఇలా స్తుతించాడు గురువును: “నాదబిందుకళాత్మకా! జన్మకర్మనివారకా! భవతారకా! సర్వకారణ మహేశ్వరా! భూతాత్మా! భక్తవత్సలా! పురుషోత్తమా!”.


బిలద్వారానికి ఎదురుగా నిలబడి ఉన్నాడు శంకర యతి. ఆ ద్వారం చాలా చిన్నదిగా ఉంది. "స్వామీ! నిన్ను ఆశ్రయించ డానికి వచ్చిన దీనుడను. ఆత్మతత్త్వాన్ని బోధించి తరింప జేస్తూ అఖిలానందాన్ని ప్రసాదించుటకు అవతరించిన మహామహుడవు. శేషశయనునకు హాయి నిచ్చే ఆదిశేషుడవు. మమ్ము తరింపజేయుటకు వెలసిన కరుణామయుడవు. విశాల హృదయంతో వ్యాకరణశాస్త్రానికి భాష్యం అందించిన అప్రమే యుడవు. శరణని వేడిన శిష్యునిలో బంధింపబడి యున్న జుగుప్స, సంశయము, శీలము, కులము, బలము, భయము, మోహము, దయ అనబడే ఈ ఎనిమిది పాశాలను ఛేదించ గలవాడే సద్గురువని తెల్పి యున్నావు. అన్నింట మిన్న అయిన మిమ్ములను ఆశ్రయించ వచ్చాను”. అప్పుడు శంకరుడు ఈ విధంగా గుర్వష్టకం చదివాడు:


'శరీరం సురూపం తథా వా కలత్రం, 

యశశ్చారు చిత్రంధనం మేరు తుల్యమ్ మనశ్చేన్న లగ్నం గురో రంఘ్రి పద్మే, తతః కిం తతః కిం తతః కిం తతఃకిమ్


"గురుదేవా! వేరొకరి శరణుగానక మీ శరణు గోరి మీ చరణములు శిరమున దాల్చగోరి వచ్చిన వాడను. ఇదిగో మీ శిష్యుడు. అనుగ్రహించుడు. మీ యిచ్ఛ చొప్పున శాసించుడు" సవినయంగా నివేదించాడు శంకరుడు. ఆ పలుకులు వీనులకు విందులై ఈ తెఱంగున ఎవరూ వేడుకొన లేదే!' అని మదిలో తలపోసాడు శ్రీ గోవింద భగవత్పాదా చార్యులు.


*గురువుకు తానెవరో ఎఱిగించుట:*


చేతులు జోడించి బిలద్వారానికి ఎదురుగా వినయం ఉట్టి పడుతూ నిలబడిఉన్న ఆ బాలుణ్ణి “ఎవ్వడవు నీవు?” అని ప్రశ్నించారు గురువు. గురుడు కరుణామూర్తియై ఉన్నాడని తన పంట ఫలించిందని గ్రహించి ఈ క్రింది రీతిని చెప్పుకొంటున్నాడు.


“మనో బుద్ధ్యహజ్కార చిత్తాని నాహం, న జిహ్వా న చ ఘ్రాణ నేత్రమ్ న చ వ్యోమ భూమి ర్నతేజో న వాయు:, చిదానన్దరూపః శివోహం శివోహమ్–

ఈ అతుల విన్నపం విన్న శ్రీ గోవిందభగవత్పాదా చార్యులు పరమానంద భరితులై శంకరుని దగ్గరకు రమ్మని పిలిచారు.


*శంకరయతి శంకరాచార్యుడగుట:*


మన శంకరుని సన్న్యాస కర్మకాండ పూర్తి కావడానికి మరొక అంశం ఉంది. శిఖ, యజ్ఞోపవీతం విసర్జించాలి. ఆ పని కాస్తా గురువులు యధావిధిగా జరిపించారు. తక్కుగల కర్మకాండ యావత్తూ శాస్త్రోక్తంగా నిర్వర్తింపజేసి మహా మంత్రోపదేశం చేశారు. పిమ్మట మహావాక్యోప దేశం చేసారు. పూర్వాశ్రమంలో పెట్టిన పేరు విసర్జించాలి. అంతే కాదు విస్మరించాలి. జన్మించిన ఊరి పేరే కాక తల్లిదండ్రుల పేర్లు కూడా తలపరాదు. చెప్పరాదు. సన్న్యాసంతో అవన్నీ పోతాయి. ఈ ఆశ్రమం లోనిది క్రొత్త పుట్టుక. క్రొత్త పేరు ధరించాలి. శ్రీ గోవిందపాదులు ఆలోచించి శంకరాచార్యుడు అని నామకరణం చేసారు. శంకరుడంటే ఆనంద కరుడని. ఇది ఈ యతికి అన్వర్థనామం. తల్లిదండ్రులు పెట్టిన పేరు ఈ ఆచార్యరూపంలో ప్రసిద్ధి కెక్కినది. నేటి పీఠాధి పతులకూ ఇదే నామం. ఇక గురుపరంపరకు వస్తే పరాశరునకు వ్యాసుడు, వ్యాసునకు శుకుడు, శుకునకు గౌడపాదుడు, గౌడపాదునకు గోవింద భగవత్పాదుడు, గోవింద భగవత్పాదునకు శంకరాచార్యుడు శిష్యులైనారు.


*కైలాస శంకర కాలడి శంకర*


*శ్రీ శంకరాచార్య చరిత్రము* 

*10 వ భాగము సమాప్తము*

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

రాశి ఫలితాలు

  (16-09-2024) రాశి ఫలితాలు


గురు నారాయణ భవిష్యవాణి వారి ఉచిత నిత్య రాశి ఫలితాలు మీ రాశి ఫలితాలు

మీరు ఏ సమస్యల్లో ఉన్నా మీ జాతకం/హస్తరేఖలు చూసి మీ సమస్య లకు పరిష్కారం చేయగలం సమర్ధులం పూజ/గ్రహజపం/హోమం ద్వారా ఖచ్చితంగా పరిష్కారం చేయగలం ఇప్పుడే ఫోన్ చేయండి  "జ్యోతిష్య రత్న" జరిగిన విషయం లు చెప్పి మీ భవిష్యత్తు చెప్పగలం వివాహం నకు జాతకం లు సరిపోల్చుట కూడా చూడబడును మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి 7981622895 గత 35 సంవత్సరంల నుండి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం మా దగ్గర సిద్ధి పొందిన మంత్రాలు ఉన్నాయి మా గురువు ల ద్వారా మాకు వచ్చాయి. విద్య ఉద్యోగం వివాహం సంతానం కారాగృహ విముక్తి అనారోగ్యం రాజకీయ పదవులు ఋణ విమోచనం వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి రోగ నివారణ శత్రువులు నుంచి రక్షణ గృహ నిర్మాణం ఇలా ఏదైనా పరిష్కారం చేయగలం సమర్ధులం హోమం ద్వారా ఖచ్చితంగా మీ కోరికలు తీరేలా చేయిస్తాం మీ కోరికలు తీరకపోతే మీ ధనం వాపసు ఇస్తాం షరతులు వర్తిస్తాయి మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి

సకల శుభ పౌరోహిత్యం కార్యక్రమాలు చేయించబడును



మేషం

 16-09-2024

ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. పనులు చకచకా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు.


వృషభం

 16-09-2024

ప్రయాణాలు మధ్యలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్య ఈ విషయంలో  కొంత శ్రద్ధ వహించాలి.  వృధా ఖర్చులు పెరుగుతాయి. దైవచింతన కలుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలు అంతగా అనుకూలించవు. వ్యాపారాలు అధిక కష్టంతో అల్ప ఫలితాన్ని పొందుతారు.


మిధునం

 16-09-2024

బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు  వేగవంతం చేస్తారు. గృహమున బాధ్యతలు చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వ్యాపారమున ఆలోచించి ముందుకు సాగడం మంచిది. ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.


కర్కాటకం

 16-09-2024

ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఎంతటి వారినైనా మీ మాట తీరుతో ఆకట్టుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపార వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి.


సింహం

 16-09-2024

ధార్మిక సేవా  కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి.  మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు బాధ పడతాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.


కన్య

 16-09-2024

నూతన ఉద్యోగయోగం ఉన్నది. కుటుంబ విషయంలో   ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన  వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఉద్యోగులకు నూతన  వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన స్థానం చలనాలు కలుగుతాయి.


తుల

 16-09-2024

ఆకస్మిక ప్రయాణ నువ్వు చాలా ఉన్నవి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి ముఖ్యమైన  పనులు వాయిదా పడతాయి. మిత్రుల నుంచి రుణ ఒత్తిడి అధికమవుతుంది. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా సాగుతాయి.


వృశ్చికం

 16-09-2024

ముఖ్యమైన  కార్యక్రమాలలో అవాంతరాలు కలుగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. అధిక శ్రమతో కానీ  గాని పనులు పూర్తి కావు. స్వల్ప  అనారోగ్య సమస్యలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.


ధనస్సు

 16-09-2024

సన్నిహితుల  నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన  పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి.


మకరం

 16-09-2024

 వృత్తి వ్యాపారాలలో  శ్రమ తప్ప ఫలితం కనిపించదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. బంధువుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగాలలో శ్రమ మరింత అధికం అవుతుంది.


కుంభం

 16-09-2024

బంధువుల నుండి అందిన శుభవార్తలు ఉత్సాహాన్నిస్తాయి. సోదరులతో భూవివాదాలు కొలిక్కి వస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. దూరపు నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.


మీనం

 16-09-2024

నూతన ఋణ యత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.

భార్య ఇంటికి ఆభరణం!!*

 భార్య ఇంటికి ఆభరణం!!* 

(నేడు ప్రపంచ వివాహ దినోత్సవం)

* భరించేది భార్య,

* బ్రతుకు నిచ్చేది భార్య,

* చెలిమి నిచ్చేది భార్య 

* చేరదీసేది భార్య 

* ఆకాశాన సూర్యుడు లేకపోయినా...

ఇంట్లో భార్య లేకపోయినా...

అక్కడ జగతికి వెలుగుండదు,

ఇక్కడ ఇంటికి వెలుగుండదు. 

* భర్త వంశానికి సృష్టికర్త 

* మొగుడి అంశానికి మూలకర్త,

*కొంగు తీసి ముందుకేగినా...

* చెంగు తీసి మూతి తుడిచినా...ముడిచినా..

తనకు లేరు ఎవరు సాటి 

* ఇలలో తను లేని ఇల్లు... కలలో....

ఊహకందని భావన...

* బిడ్డల నాదరించి...

* పెద్దల సేవలో తరించి

* భర్తని మురిపించి..

మైమరపించి...

* బ్రతుకు మీద ఆశలు పెంచి... 

* చెడు ఆలోచనలు త్రుంచి...

* భ్రమరం లా ఎగురుతూ...

* భర్త ను భ్రమల నుండి క్రిందకు దించుతూ...

* కళ్ళు కాయలు కాచేలా...

* భర్త జీవితాన పువ్వులు పూచేలా చేసిన

జీతం లేని పని మనిషి.

 

జీవితాన్ని అందించే మన మనిషి.

 ... 

ఏమిచ్చి తీర్చుకోగలం భార్య రుణం 

ఆమెకు భారం కాకుండా ఉండడం తప్ప.. 


ఒకరికి ఒకరు తోడు నీడ చిరకాలం. 


బిడ్డల బాధ్యతలు తీరాక వృద్ధాప్యంలో నూతన వసంతం తోడు నీడ బంధం. 


అదే భార్యకు మనమిచ్చే విలువైన ఆభరణం..!

జ్ఞానం మీద ఆధారపడి నడిచింది

 హరి ఓం. సనాతన ధర్మం లో కులాలు కాదు. వర్ణాలు.*హిందూ ధర్మం జాతిని అనుసరించి ఉద్భవించింది కాదు* హిందూ ధర్మం

జ్ఞానం మీద ఆధారపడి నడిచింది


జన్మించిన కులం వల్ల కాదు. 


(వజ్రసూచికోపనిషత్తు ప్రకారం ..) 

 🙏🙏🙏

1. ఋష్యశృంగుడు .. జింకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు.


2. కౌశికుడు .. గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు.


3. జంబూక మహర్షి .. నక్కలు పట్టుకునే జాతివారు ..


4. వాల్మీకి .. ఓ కిరాతకుల జాతికి చెందిన వాడు. ఈతను రచించిన రామాయణం .. హిందువులకు పరమ పవిత్రమైన గ్రంథం. ఈయన్ని ఆదికవిని చేసి పూజిస్తారు.


5. వ్యాసుడు .. ఓ చేపలుపట్టే బెస్తజాతికి చెందినవాడు. హిందువులకు పరమపవిత్రమైన వేదములు .. ఈయన చేత విభజన చేయబడ్డవే. అందుకే ఇతణ్ణి వేదవ్యాసుడు .. అని పూజిస్తారు. 


6. గౌతముడు .. కుందేళ్లు పట్టేజాతికి చెందినవాడు.


7. వశిష్టుడు .. ఓ వేశ్యకు పుట్టినవాడు. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. ఈతని భార్య మాదిగ స్త్రీ అయిన అరుంధతీదేవి. ఈరోజుకు కూడా నూతన దంపతులచేత అరుంధతీవశిష్టులకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ప్రతి పూజలోనూ హిందువులచేత .. అరుంధతీవశిష్ఠాభ్యాం నమః .. అని పూజలందుకుంటున్నారు. 


వీరి కుమారుడు శక్తి. ఇతని భార్య ఓ మాదిగ వనిత .. ఛండాలాంగని. వీరికుమారుడే పరాశరుడు. ఈతను ఓ బెస్తవనిత మత్స్యగంధిని వివాహమాడి వ్యాసుణ్ణి కన్నారు. 


8. అగస్త్యుడు .. మట్టి కుండల్లో పుట్టినవాడు.


9. మతంగ మహర్షి.. ఒక మాదిగవాని కుమారుడు. బ్రాహ్మణుడయ్యాడు. ఈతని కూతురే .. మాతంగకన్య .. ఓ శక్తి దేవత. కాళిదాసుతో సహా ఎందరో మహానుభావులు ఈ మాతను ఉపాసించారు. ఉపాసిస్తూ ఉన్నారు. ఈమే శ్యామలాదేవి.


ఇంకా ..


1. ఐతరేయ మహర్షి ఒక దస్యుడి మరియు కిరాతకుడి కుమారుడు .. అంటే నేటి లెక్కల ప్రకారం SC or ST. జన్మ బ్రాహ్మణుడు కాదు. కానీ అత్యున్నతమైన బ్రాహ్మణుడు అయ్యాడు. అతను వ్రాసినవే ఐతరేయ బ్రాహ్మణం మరియు ఐతరేయోపనిషత్తు. ఐతరేయ బ్రాహ్మణం చాలా కష్టమైనది. ఇది ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు.


2.  ఐలుష ఋషి ఒక దాసీ కుమారుడు. అతను ఋగ్వేదంమీద రిసెర్చ్ చేసి చాలా విషయాలు కనిపెట్టాడు. అతన్ని ఋషులందరూ ఆహ్వానించి తమకు ఆచార్యుణ్ణి చేసుకున్నారు ( ఐతరేయ. బ్రా. 2.19)


3. సత్యకామ జాబాల మహర్షి ఒక వేశ్య కుమారుడు. తండ్రి పేరే కాదు.. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. కానీ జ్ఞానం చేత బ్రాహ్మణుడు అయ్యాడు.


ఉన్నతవంశాలలో పుట్టినవారిని కూడా వారిధర్మం నిర్వర్తించకపోతే .. వారిని నిర్మొహమాటంగా బహిష్కరించారు ... వారిలో కొందరు


1. భూదేవి కుమారుడు .. క్షత్రియుడైన నరకుడు .. రాక్షసుడైనాడు.


2. బ్రహ్మవంశజులైన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు,.. బ్రాహ్మణులైనా .. రాక్షసులయ్యారు ..


3. రఘువంశ మూలపురుషుడైన రఘుమహారాజు కుమారులలో ఒకడు అయిన ప్రవిద్ధుడు .. రాక్షసుడైనాడు. 


4. త్రిశంకుడు క్షత్రియుడు. కానీ చండాలడు అయ్యాడు.


5. విశ్వామిత్రుడు క్షత్రియుడు.. బ్రాహ్మణుడైనాడు .. వీరి వంశస్తులే .. కౌశికస గోత్ర బ్రాహ్మణులయ్యారు. విశ్వామిత్రుని కుమారులు కొందరు శూద్రులయ్యారు.


6. నవ బ్రహ్మలలో ఒకడైన దక్ష ప్రజాపతి కుమారుడు పృషధుడు. బ్రహ్మ జ్ఞానం లేని కారణాన శూద్రుడిగా మారిపోయాడు ( విష్ణుపురాణం 4.1.14)


7. నేదిష్టుడు అనే మహరాజు కుమారుడు .. నాభుడు. ఇతనికి క్షాత్ర జ్ఞానం లేని కారణాన, వర్తక జ్ఞానం కారణాన వైశ్యుడిగా మారవలసి వచ్చింది  ( విష్ణుపురాణం 4.1.13). 


8. క్షత్రియులైన రథోతరుడు, అగ్నివేశ్యుడు, హరితుడు .. బ్రహ్మ జ్ఞానం వలన బ్రాహ్మణులైనారు. హరితుని పేరుమీదే .. ఇతని వంశబ్రాహ్మణులకు హరితస గోత్రం వచ్చింది (విష్ణుపురాణం 4.3.5).


9. శౌనక మహర్షి కుమారులు .. నాలుగు వర్ణాలకు చెందినవారుగా మారారు (విష్ణుపురాణం 4.8.1).


10. అలాగే గృత్సమదుడు, వీతవ్యుడు, వృత్సమతి ... వీరి కుమారులు కూడా నాలుగు వర్ణాలకు చెందినవారు అయ్యారు.

*ఇదీ మన సనాతన ధర్మం యెుక్క గొప్పతనం.*


🌹🙏🌹. సనాతన వాహిని సంఘము.

*జై కాశీ విశ్వనాథ్,

 *జై కాశీ విశ్వనాథ్, జై కాశీ విశ్వనాథ్, జై కాశీ విశ్వనాథ్*.


*సమస్త లోకా సుఖినో భవన్తు*


*నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి నుండి 9611678545*


*18-9-24(సెప్టెంబర్ 18 బుధవారం)భాద్రపద మాసం పౌర్ణమి మరియు చంద్ర గ్రహణం మరియు ఉమా మహేశ్వరవ్రతం చేసుకొను రోజు*


*ఈ పౌర్ణమి బుధవారం రావటం వలన బుద్దికి సంబందించి మరియు చంద్ర గ్రహణం వలన చంద్రుని అనుగ్రహం కోరకు కాశీలోని చంద్ర కూపం వద్ద ఉన్నా చంద్రేశ్వర్ మహాదేవ్ వద్ద లోక కళ్యాణార్ధం మీ చంద్రశేఖర్ మహాదేవ్ దంపతులు మరియు మీ అందరి మనసు, బుద్ది, గొప్ప తేజో వంతంగా కావటం కోరకు మీ కుటుంబం లో ని వారి నామ గోత్రముల తో చక్కగా ఈ చంద్రేశ్వర్ మహాదేవ్ కి పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం జరిపించబడును*


*పౌర్ణమి తిధి రోజున చంద్రుని కిరణాలలో అమృతం ప్రసరిస్తుంది.యెవరు చంద్రుని అనుగ్రహమునకు పాత్రులు అవుతారో వారికి దీర్ఘాయుషు, నిత్య యవ్వనంగా వుండే అవకాశం ఎక్కువగా ఉంది.*


*కాశీలో చంద్రేశ్వర్ మహాదేవ్ (చంద్రకూపం వద్ద) కాశీ లో47వేల కోట్ల శివ లింగములు ఉన్నవి అని స్కంధ పురాణంలోని కాశీ ఖండంలో చెప్పబడినది. ఐతే ఈ చంద్రేశ్వర్ మహాదేవ్ ఆ 47వేల కోట్ల శివ లింగములకు మనసుకు (బుద్ది) సంబందిచిన సిద్ధి, మోక్ష, స్వయంభూ, లింగము. అమ్మవారి శక్తులలో ఒకరు సిద్దిదేవి సాక్షాత్ ఈచంద్రేశ్వరుని వద్ద పీఠమును స్థాపించుకొని సిద్ది పీఠము అని పిలవబడుతోంది*


*ఏవరి మనసు నిర్మలంగా, పరిశుద్ధంగా ఉంటుందో వారికి 11 నిమిషములలోనే వారి గురు మంత్రం లేధా ఇతర సాధన మంత్రములు అతి శీఘ్రముగా సిద్ధించును. ఇది నా అనుభవ పూర్వకముగా చెప్పుచున్న మాట.*


*ఇక్కడ ఉన్న చంద్రకూపంలో (బావిలో) మనము చూచిన యెడల మన ప్రతి బింబము కనపడనిచో అలా యెవరికి జరుగునో వారు 6 నెలలోనే చనిపోవుదురు.*


*ఇటువంటి గొప్ప శక్తి గల చంద్రేశ్వరుని వద్ద మీ నామ గోత్రాలతో భాద్రపద మాస పౌర్ణమి రోజున పంచామృతాభిషేకం మరియు రుద్రాభిషేకంనకు(205రూ) ఖర్చు అగును.*


*ఇందులో భాగం కాదలచిన వారు మీ కుటుంబం లో ని వారి నామ గోత్రముల ను చక్కగా ఈ 9611678545 phone number కు మాత్రమే whatsapp చేయవలెను.*


*ఇందులో భాగం కాదలచినవారుGoggle pay Name Chandra sekhar mahadev 7702627429*


*Phone pay Name koppala Latha 7702627429 చేయవలయును.*


*భాద్రపద మాస పౌర్ణమి చంద్రేశ్వర మహాదేవ్ కి పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం వలన కలుగు గొప్ప ప్రయోజనములు.*


*1 అన్నీ అనారోగములు పోయీ దీర్ఘాయుషుగా జీవించుట.*


*2 యెన్నో జన్మల నుంచీ వాసన రూపంలో మన మనసు పట్టుకొని ఉన్నా యెన్నో #అనవసరమైన# ఆలోచనలు అన్నీ భస్మం కాగలవు.*


*ఇది ఒక్కటి చాలు మనం తరించడానికి.*


*3 మనసు, బుద్ది, నిర్మలమై నిత్య యవ్వనంగా, వ్యాది లేని యవ్వనంగా జీవించుట.*


*4 ఒక వేళ అపమృత్యు దోషములు ఉన్నా తొలగించబడును.*


*5 కాశీఖండంలో కాశీలో ఉన్న 47వేలకోట్ల శివలింగములు అన్నీ ఈశ్వరుని శరీరంలో అంగములుగా భావించబడి ఉంది.*


*6 కాశీఖండంలో కాశీలో ఉన్న 47వేలకోట్ల శివలింగములు అన్నీ ఈశ్వరుని శరీరంలో అంగములుగా భావించబడి ఉంది ఐతే ఈ చంద్రేశ్వర్ మహాదేవ్ ఆ కాశీ విశ్వనాధుని మనసుగా ప్రకటించబడినది.*


*8 అనగ యెవరికి చంద్రేశ్వర్ మహాదేవ్ అనుగ్రహం ఉంటుందో వారు సాక్షాత్తు కాశీవిశ్వనాధునికి అత్యంత అత్యంత  ప్రియమైనవారు. వారికి కలుగు శుభములు, ఆనందములు విశ్వంలోనే మరి ఎవ్వరికి కలుగవు.*


*జై కాశీ విశ్వనాథ్, జై కాశీ విశ్వనాథ్, జై కాశీ విశ్వనాథ్*.

అకలుషవాయువీచికలు

 చం.

అకలుషవాయువీచికలు, నత్యతినిర్మలసజ్జలంబులున్ 

బ్రకటితదాతృభావలగు భవ్యమహీరుహరాజి సౌఖ్యముల్ 

సకలజగంబువారలకు సన్మతినిచ్చుచునుండు పచ్చికల్ 

ప్రకృతి యొసంగు కానుకలు వానిని భావ్యమె కూల్చ మిత్రమా! 30.


హ.వేం.స.నా.మూర్తి.

నిత్యపద్య నైవేద్యం

 నిత్యపద్య నైవేద్యం-1611 వ రోజు

సంస్కృత సుభాషితం-అనువాద పద్యం-246. సేకరణ, పద్యరచన: సహజకవి, డా. అయినాల మల్లేశ్వరరావు, తెనాలి, 9347537635, గానం: గానకళారత్న, శ్రీ వెంపటి సత్యనారాయణ, తెనాలి

ప్రోత్సాహం: "గీతాబంధు" శ్రీ గోలి లక్ష్మయ్య, గుంటూరు


సుభాషితం:

న భోగ భవనే రమణీయం 

న చ సుఖ శయనే శయనీయంl

అహర్నిశం జాగరణీయం 

లోకహితం మమ కరణీయంll 


తేటగీతి:

అమిత భోగాలలో తేలియాడరాదు,

అధిక సుఖాలలో నోలలాడరాదు 

ఊర కేమరపాటుతో నుండరాదు 

శ్రేష్ఠ కార్యాలకై కృషి చేయవలయు.


భావం: భోగాలలో తేలియాడరాదు. సుఖాలలో ఓలలాడరాదు. ఏమరపాటుతో నుండరాదు. లోక హితానికై కృషి చేయవలెను.

శ్రీరామ స్తుతి🙏

 🌸శ్రీరామ స్తుతి🙏


సీ. భూమిజపతి రామ ! భూపాల ! సర్వజ్ఞ !

                సజ్జనులనుకాచు సాధుపురుష !

     మోహనరూపాన మోక్షఫలమునిచ్చు

                రఘురామ ! రావయ్య రమ్యతేజ!

     జనులపాపములను శరవేగమున బాపి

               రఘువరా ! రక్షించు  రాగమునను

     నీలమేఘశ్యామ ! నినుగన్న వారలన్

                పాలించి  బ్రోవుమా పరమ పురుష  !

తే . సర్వజీవులయాత్మల సంతసింప

       జగతి పాలన నొనరించు సర్వ వేద !

       భక్తకోటిభజింతురు ముక్తి కోరి

       దశరథతనయ రఘురామ ! ధర్మ తేజ !


             జయలక్ష్మి

బూవుంబోఁడి బెడంగుతో*

 🌹🦜🙏🏽🦜🌹

    14.09.2024

       శనివారం 


" *బూవుంబోఁడి బెడంగుతో* 

 *మగతనమ్ముంజిమ్ము టాశ్చర్యమే".* 

.................................................


 *శార్థూలమ్...( పంచపాది )*     

   

సేవాధర్మము సేయనెంచి సుదతిన్ 

సీమాంతరంబేగుచున్ 


భావావేశపు శత్రుమూకల సదా

వాల్జూపులన్ గెల్చుచున్ 


జావున్ దప్పని వైరి భాగము , విదే

శంబందు ధీశాలియై 


త్రావన్నీరము లేకపోయినను తా 

దాయాదిపై బోరుచున్ 


బూవుంబోఁడి బెడంగుతో 

'మగతనమ్ముంజిమ్ము' టాశ్చర్యమే !

....................................................

మగతనము... పౌరుషము, శౌర్యము, నిర్భీతి

🦄🐓🦜🦢🐘

పి.ఎల్.నాగేశ్వరరావు 

హైదరాబాదు

దత్తపదులతో రామాయణార్థంలో


: కాకవద్దు రావణన్న ఖతముజేయ బుట్టె భూ

లోకమందు తాతతాత రూపుడిప్డు రాముడై 

వీకమా!మడదిని విడుము వెలదిమిన్న సీతయే 

లేక పాపఫలము తప్పునే మనకిల వింటివా!

విభీషణుడు రావణునితో


: కాక తాత మామ పాప దత్తపదులతో రామాయణార్థంలో