24, సెప్టెంబర్ 2021, శుక్రవారం

అల్సర్ నివారణ కొరకు

 తీవ్రమయిన అల్సర్ నివారణ కొరకు అద్బుత యోగం - 


       అల్లము , మంచిబెల్లం , నువ్వులు సమానభాగాలు గా తీసుకుని బాగా దంచి ఉసిరికాయ అంత మాత్రలు గా చేసుకొని రెండు పూటలా ఆహారానికి గంట ముందు తీసికొనవలెను. 40 రోజుల్లో ఎంత తీవ్రమయిన అల్సర్ అయినా నివారించబడును. 


 

గాయత్రీ మంత్ర రహస్యం…

 *చాలామందికి తెలియని గాయత్రీ మంత్ర రహస్యం…*


చాలా మందికి గాయత్రీ మంత్రమనేది ఒకటి వుందని తెలిసినా, అదేమిటో అసలు ఎలా జపించాలో తెలియదు. కొందరికి మంత్రము తెలిసినా కాలంతోపాటు పరిగెడుతూ హడావిడిగా జీవితాలను గడపాల్సిరావటం వల్ల ఈ మంత్రాన్ని గబగబ బట్టీయం పట్టినట్టు మొక్కుబడిగా దేవుని ముందు అప్పగించేసి హమ్మయ్య ఈ రోజుకి చదివేసాను అనుకుంటారు.


నిజానికి గాయత్రీ మంత్రాన్ని అలా చదవకూడదు. అసలు గాయత్రీ మంత్రమేమిటో అది ఎలా జపించాలో తెలుపవలెనని నాయొక్క చిన్న ప్రయత్నం.


*గాయత్రీ మంత్రము అంటే…*

“ఓం, భూర్భువస్సువః, 

తత్ సవితుర్వరేణ్యం,

భర్గోదేవస్య ధీమహి, 

ధియో యో నః ప్రచోదయాత్”

ఇది మంత్రము. ఈ మంత్రాన్ని ఏకధాటిగా చదవకుండా మంత్రన్ని నాలుగు చోట్ల ఆపి చదవాలి. 

*అది ఎలాగంటే…*


ఓం

భూర్భువస్సువః

తత్సవితుర్వరేణ్యం

భర్గోదేవస్య ధీమహి

ధియో యోనః ప్రచోదయాత్

ఇలా మంత్రం మద్యలో నాలుగు సార్లు ఆపి చదవాలి.


ఈ మంత్రములో “ఓం” అనేది “ప్రణవము”, “భూర్భువస్సువః” లోని భూ, భువః, సువః అనేవి “వ్యాహృతులు”. వ్యాహృతులు అనేవి దివ్యశక్తిని కలిగిన పదాలు. ఇవి మూడు లోకాలను సూచిస్తాయి. “తత్” నుంచి మిగిలిన భాగాన్ని “సావిత్రి” అని అంటారు.


గాయత్రి మంత్రం లో 24 బీజాక్షరాలున్నాయి. వాటిని ఆధారం చేసుకుని నిర్మితమైన కొన్ని గొప్ప ఆలయాలను ఒకసారి అవలోకించుకుందాం.


1. కంచి కామాక్షి మందిరం లో అమ్మవారు మూలవిరాట్టుగా కూర్చుని ఉన్న మంటపాన్ని గాయత్రి మంటపం అంటారు. ఆ ప్రాక్రారంలో 24 స్తంభాలున్నాయి. అవి 24 బీజాక్షరాలకు ప్రతీకలు.


2. కోణార్క్ లోని సూర్య దేవాలయ సముదాయం ఒక పెద్ద రధం మీద వున్నట్టు నిర్మించబడి వున్నది. ఆ రధానికి గాయత్రీ మంత్రానికి ప్రతీకగా 24 చక్రాలు వున్నాయి. వాటిని ఆంగ్లేయులు 24 గంటలని చెప్పారు. మనవాళ్ళు దానినే పట్టుకుని వేల్లాడుతున్నారు.


3. పురాణ కధనం ప్రకారం 24మంది

మహా ఋషులు వారి మంత్రశక్తిని ఈ 24 బీజాక్షరాలలో నిక్షిప్తం చేసారు. అశోకునిధర్మచక్రం లో వున్న 24 చువ్వలు (spokes ) వాటికి ప్రతీకలు. దాన్నే మనం సమయచక్రం అని కూడా అంటున్నాము.


4. జైన సిద్ధాంతంలో 24 తీర్ధంకరులు – ఇది అవైధిక మతమైనా వాటికి మూలం మన వేదమే.


5. 24 కేశవ నామాలు


6. 24 తత్వాలు :

*ఐదు జ్ఞానేన్ద్రియాలు,

*5 కర్మేంద్రియాలు,

*పంచ తన్మాత్రలు,

*5 మహాద్భుతాలు,

*బుద్ధి, *ప్రకృతి, *అహంకారం, *మనస్సు


7. ఛందస్సులలో ఒకానొక గొప్ప ఛందస్సు గాయత్రి పేరు మీద వున్నది. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఇలా చెబుతాడు : “ బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ చందసామాహం”


8. రామాయణం లో 24 సహస్ర శ్లోకాలు.


9. రామాయణం గాయత్రి మంత్రాన్నే ప్రతిపాదిస్తోంది. కావాలంటే మీరే ఒకసారి తరచి చూడండి. 1, 1001, 2001, 3001, 4001, 23001 శ్లోకాలను గనుక మీరు చూస్తె మీకు గాయత్రి మంత్రమే కనబడుతుంది. దీన్ని గాయత్రి రామాయణం అని కూడా అంటారు.


10. ఒక వీణలో 24 చిర్రలు వుంటాయి. సంగీత శాస్త్రం తెలిసినవాళ్ళు దీన్నే గాయత్రి ఉపాసన అని అంటారు.


11. మన వెన్నుబాములో 24 మ్రుదులాస్తులు ( Cartilage )వుంటాయి. వాటికి అధి దేవతలే గాయత్రి మంత్రాక్షరాలు.

“న గాయత్రీ త్రాహ్య పరం మంత్రం .. నమాతాః పర దైవతం” అన్నారు పెద్దలు.


24 బీజాక్షరాలతో కూడిన గాయత్రీ మాతను ఒక్కసారి జపిస్తే చాలు, సర్వ పాపాలు హరిస్తాయంటారు. సకల దోషాలు తొలగి పోతాయంటారు.

సకల దేవతా స్వరూపం గాయత్రీ.

రామాయణ సారం గాయత్రీ.

కోర్కెలు తీర్చే మంత్ర రాజం గాయత్రీ. 

విశ్వశాంతికి పరిష్కారం గాయత్రీ.

సకలకోర్కెలు ఈడేర్చే మహామంత్రం గాయత్రీ.

24 బీజాక్షర సంపుటి గాయత్రీ..


*అలాంటి గాయత్రి మాతను స్మరణం చేసుకోవడం అంటే నిజంగా పూర్వ జన్మ సుకృతమే అని చెప్పాలి…*

మంత్ర పుష్పం -

 మంత్ర పుష్పం - సందర్భం


 హిందూ ఆలయాలలో పూజల చివరిలో పూజారి గారు అక్కడ ఉన్న అందరికి తలో ఒక పుష్పం ఇచ్చి వేదం లోని 'మంత్రపుష్పం' చదువుతారు. ఆ తరువాత ఆ పుష్పాలను భక్తుల నుండి స్వీకరించి గర్భగుడిలోని దైవానికి సమర్పిస్తారు. వేదంలో భాగమైనది మంత్ర పుష్పం. ఇది దైవం గురించి దైవ విశిష్టతను, భగవంతుడి యొక్క ప్రాతినిధ్యం గురించి తెలుపుతుంది. మంత్రపుష్పం చదవనిదే, ఏ పూజ, పునస్కారం పరిసమాప్తి కాదు. మంత్రపుష్పం చివరిలో చదవాల్సిందే తప్పనిసరిగా.


మూలం :వేదం

 


మంత్ర పుష్పం - 1.


ఓం ధాతా పురస్తాద్య ముదా జహార

శక్రః ప్రవిద్వాన్ ప్రదిశః చతస్రః

తమేవం విద్వానమృతమిహ భవతి

*నాన్యః పంథా అయనాయ విద్యతే


తెలుగు భావం 

అన్ని దిక్కుల నుండి రక్షించువానిని 

ముందు బ్రహ్మ పూజించి సుఖించెను. 

ఆ ఆది దైవమును తెలిసిన చాలును 

అదే అందరికి అమృత మార్గము 

వేరేది లేదని ఇంద్రుడు ప్రకటించెను. 

 


మంత్ర పుష్పం - 2.


 సహస్ర శీర్షం దేవం

విశ్వాక్షం విశ్వశంభువం

విశ్వం నారాయణం దేవం

 అక్షరం పరమం పదం


తెలుగు. భావం 

 అంతటా తలలున్న దైవము 

అంతటా కనులున్న దైవము 

అన్ని లోకాల శుభ దైవము 

విశ్వమంతానిండిన దైవము 

నశించని నారాయణుడే 

ముక్తి నీయు పరంధాముడే 


 

 

మంత్ర పుష్పం - 3.


విశ్వతః పరమాన్నిత్యమ్

విశ్వం నారాయణగ్ం హరిమ్

విశ్వమే వేదం పురుషస్త

 ద్విశ్వ ముపజీవతి


తెలుగు. భావం 

విశ్వము కన్నా ఉన్నతుడు 

 అందరిలోనుండు ఆత్మయు 

శాశ్వత పోషకుడు హరే. 

సర్వాత్మడు పరమాత్ముడే. 

ఈ విశ్వ లోకాల కారకుడోయి

ఆ దైవమే విశ్వానికి తోడోయి.

 

మంత్రపుష్పం - 4.


పతిం విశ్వస్యాత్యే శ్వరగ్ం

 శాశ్వతగ్ంశివమచ్యుతమ్

నారాయణం మహాజ్ఞ్యేయమ్

విశ్వాత్మానం పరాయణం


తెలుగు భావం:

పతిలా పోషించువాడు

లోకాలకు ఈశ్వరుడు

శాశ్వితుడు శుభకరుడు

సకలలోక ఉన్నతుడు

సకల జీవ నాయకుడు

అతడు నారాయణుడు

అతడు మహా దేవుడు 

లోకమంత ఆత్మ వాడు

పూజింప తగు దేవుడు

 

మంత్ర పుష్పం - 5.


నారాయణ పరో

జ్యోతి రాత్మా

 నారాయణః పరః

నారాయణ పరమ్

బ్రహ్మ తత్వం

నారాయణః పరః

నారాయణ పరో

ధ్యాతా ధ్యానం

నారాయణః పరః


తెలుగు భావం


నారాయణుడే పరమలోకము

నారాయణుడే జ్యోతిరూపము

 నారాయణుడే ఆత్మ రూపము

నారాయణుడే పరబ్రహ్మము

నారాయణునే ధ్యానిoచుము


(సశేషం )


// సర్వం శ్రీకృష్ణార్పణమస్తు //

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*దిశానిర్దేశం!.*


"ఇక్కడ కొన్నాళ్లపాటు ఉండాలని వచ్చానండీ..నేను చేసే సాధన కొరకు ఈ ప్రదేశం సరైనదని అనిపిస్తున్నది..పైగా ఇక్కడ శ్రీ దత్తాత్రేయస్వామి వారు తన తపోసాధన చేసారు.. ఆ ప్రభావం ఈ క్షేత్రం లో ఉన్నది.." అన్నాడా పాతికేళ్ల వయసున్న యువకుడు..


అతనిని అంతకు ముందెన్నడూ చూడలేదు..ఒక కాషాయ వస్త్రాన్ని పంచె లాగా కట్టుకొని వున్నాడు..అదే రంగు చొక్కా ఉన్నది కానీ..దానిని ధరించకుండా భుజం మీద వేసుకొని వున్నాడు..నేను అతని గురించి వివరాలు ఆడిగేలోపలే..


"నేను ఇక్కడికి వచ్చి మూడురోజులవుతున్నది..ఉదయాన్నే శ్రీ స్వామివారి ప్రభాత హారతి సమయం లో మందిరం లోకి వచ్చి దర్శనం చేసుకొని..శివాలయం వద్ద చెట్ల క్రింద ధ్యానం చేసుకుంటున్నాను..నిన్నటి నుంచీ మనసులో బలంగా అనిపిస్తున్నది..ఇక్కడే కొన్నాళ్ల పాటు వుండి సాధన కొనసాగించాలని..మీరు అనుమతి ఇస్తే..కొనసాగిస్తాను.." అన్నాడు..


"ముందుగా మీ వివరాలు తెలుపండి..మీకు సౌకర్యం గా వుంటే..మీ సాధనను ఇక్కడ కొనసాగించండి..మధ్యాహ్నం పూట అన్నదానం జరుగుతుంది. అక్కడకు వెళ్లి ఆహారం తీసుకోవచ్చు..కానీ..ఒక్కమాట..మీ సాధన కు మేము ఎటువంటి ఇబ్బందీ కలిగించము..మీరు కూడా మందిర వ్యవస్థలో తలదూర్చ వద్దు.." అని చెప్పాను..


అతనిది కందుకూరు..పేరు.. నాగరాజు..కులరీత్యా యాదవులు..తల్లిదండ్రులు వున్నారు..సుమారు ఐదారేళ్ళ నుంచీ ఇతను ధ్యానం అనీ..సాధన..తపస్సు అనీ తిరుగుతున్నాడు..ఇంకా ఒక స్పష్టమైన లక్ష్యం ఏర్పడలేదు అని చెప్పాడు..ఆ గురి కుదిరేదాకా ఇక్కడ ఉండాలని అతని భావన..


ఒక వారం రోజులపాటు అతనిని దగ్గరగా గమనించాను..రోజులో ఎక్కువ సేపు ధ్యానం చేసుకుంటూ ఉంటున్నాడు..ఏదో ఒక సమయంలో భోజనం చేస్తున్నాడు..కానీ మరో రెండు రోజులు గడిచేసరికి..మెల్లిగా అతని చుట్టూ మనుషులు మూగడం ప్రారంభం అయింది..ప్రశ్నలు అడగడం..అతని చేత తమ జాతకాలు చూపించుకోవడం మొదలైంది..అతనూ తన సాధన ధ్యానం వదిలేసి..ఈ ప్రాపంచిక వ్యవహారాలలో కూరుకు పోతున్నాడు..


శ్రీ స్వామివారు జీవించి ఉన్న రోజులలో సాధకుల గురించి ఒక మాట చెప్పేవారు.."సాధన.. ధ్యానం..చేస్తూఉన్నప్పుడు.. కొంత కాలానికి ఆ సాధకుడి కి కొన్ని చిత్కళ లు స్వాధీనం అవుతాయి..వాటి మాయలో పడిపోయి..ఆ శక్తులను లౌకిక వ్యవహారాలకు ఉపోయోగిస్తే..తాత్కాలిక భోగాలు సమకూరుతాయి..ఆ భోగాలకు అలవాటు పడితే..ఇక ఆ సాధకుడి లక్ష్యం దెబ్బతిని..అతనొక సాధారణ మాంత్రికుడిగా మిగిలిపోతాడు.. దైవాన్ని చేరుకోలేడు.. ఇది ప్రకృతి కల్పించే మాయ పొర..ఆ వలలో పడకుండా వుండే వాడే నిజమైన అవధూత..నిజమైన సాధకుడు.." అని..ఆ మాటలు గుర్తుకొచ్చాయి..


నాలుగు రోజులు గడిచిన తరువాత..నా దగ్గరకు వచ్చాడు.."నిన్న రాత్రి ఒక సంఘటన జరిగింది.."అన్నాడు..అతని ముఖం లో ఏదో తెలియని బాధ కనబడుతున్నది..కళ్ళమ్మట ధారాపాతంగా కన్నీళ్లు కారిపోతున్నాయి..


"ఏమైంది?" అన్నాను..


"శ్రీ స్వామివారు స్వప్నం లో కనబడి..నన్ను గట్టిగా హెచ్చరించారు..నేను నడుస్తున్న దారి గమ్యం లేనిదనీ..దారి తప్పి తిరుగుతున్నాననీ..చెప్పారు..లేచి చూసాను..ఎవ్వరూ కనబడలేదు..కానీ ఆలోచిస్తే..ఈ మధ్య నేను చేసిన కొన్ని పనులు..నా సాధన కు ఉపయోగపడేవి కాదనిపించింది..నేనూ తప్పు చేశాను..కొందరి బాధలు పోగొడుతున్నాను అని భ్రమించాను..కానీ నేను అధోగతికి పోతున్నానని గ్రహించలేదు.." అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.."మా గురువు గారి దగ్గరకు వెళుతున్నాను..ఆయన హిమాలయాల్లో వుంటారు..ఆయన పాదాలు పట్టుకోమని స్వామివారు గట్టిగా ఆదేశించారు..వెళ్ళొస్తాను..మీకు చెప్పి వెళదామని వచ్చాను.."అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు..పశ్చాత్తాపం అతనిని దహించివేస్తున్నది..


ఆ తరువాత అతను మందిరం వద్ద నుంచి వెళ్ళిపోయాడు..కొన్నాళ్లపాటు తన గురువుగారి వద్ద వున్నాడు..ప్రస్తుతం ఆశ్రమ నిర్మించుకునే సన్నాహాల్లో వున్నాడు..మొత్తానికి శ్రీ స్వామివారు తనకు సరైన మార్గాన్ని చూపారని వినమ్రంగా చెప్పుకుంటాడు..


ఆ రకంగా నాగరాజు అనబడే ఒక సాధకుడికి స్వామివారు దిశానిర్దేశం చేసారు..అతని జీవితానికో గమ్యాన్ని నిర్దేశించారు..


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699)

పరమేశ్వర పూజ

 *🙏🙏నంస్కారం🙏🙏*


*పరమేశ్వర పూజా - ఫలితం*


శివున్ని దర్భలతో పూజిస్తే - దీర్ఘాయుస్సు! 


ఉమ్మెత్తపూలతో పూజిస్తే - సుతప్రాప్తి!


జిల్లేడు పూలతో పూజిస్తే - శౌర్యము !


కలువ పూలతో పూజిస్తే - విక్రమ వృద్ధి !


బంధూక సుమములతో పూజిస్తే - భూషణ ప్రాప్తి !


జాజి పూలతో అర్చిస్తే - వాహన ప్రాప్తి !


మల్లెపూలతో పూజిస్తే - భోగము ప్రాప్తిస్తాయి !


అవిసె పూలతో పూజిస్తే - పరమేశ్వర ప్రాప్తి !


కొండ గోగుపూలతో ఆరాధిస్తే - వస్త్ర లాభం !


నువ్వుల పువ్వులతో ఉమామహేశ్వరుణ్ణి పూజిస్తే - యౌవన ప్రాప్తి కలుగుతుంది !


తుమ్మి పువ్వులతో అర్చిస్తే - మోక్ష లాభం !


నందివర్థన పూజ - సౌందర్యాన్ని చేకూర్చుతుంది !


*లోకహితం కోసం శివుడు ఎత్తిన అవతారాలు*  


ఓంకార స్వరూపుడైన శివుడు లోకహితం కోసం ఎన్ని రూపాలు ధరించాడు. ఈ విషయంపై శివపురాణం ఓసారి తిరగేస్తే అందులో ఎనిమిది రూపాలు ధరించినట్లు పెర్కొంటోంది. 


అవేంటంటే....


1. రుద్రుడు !


2. భవుడు !


3. శర్వుడు !


4. ఉగ్రుడు !


 5. భీముడు !


6. పశుపతి !


7. ఈశానుడు !


8. మహాదేవుడు !


*1) రుద్రుడు* : దుఃఖ నివారకుడైన అగ్నిని అదిష్టించి ఉంటాడు !!


*2) శర్వుడు* : జీవుల మనుగడ కోసం భూమిని అధిష్టించి ఉంటాడు !!


*3) భవుడు* : ఈ జగానికి అత్యంతావశ్యకమైన జలాన్ని ఆశ్రయించి ఉంటాడు !!


*4) ఉగ్రుడు* : జగత్తు కదలికలకు కారకుడై వాయువును అధిష్టించి ఉంటాడు !!


*5) భీముడు* : ఆకాశాన్ని ఆశ్రయించి ఉంటాడు !!


*6) పశుపతి* : సంసార బద్ధులైన జీవులను పాప విముక్తులను చేసేందుకై జీవాత్మను అధిష్టించి ఉంటాడు !!


*7) ఈశానుడు* : ఈ చరాచర జీవులను శాసించే సూర్యునలో ప్రకాశిస్తుంటాడు !!


*8) మహాదేవుడు* : తన చల్లని కిరణాలతో జీవులను పాలించు చంద్రునిలో ప్రకాశిస్తుంటాడు !!


ఇది సేకరణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

qualifications of *RSS chief's...*

 How many of you know the qualifications of *RSS chief's...*


Read carefully


Academic information of *RSS chiefs ..............*


*EDUCATIONAL BACKGROUND OF RSS CHIEFS*


Many secular parties & Media is critisizing *RSS* for Conservative Pro Hindu Ideology ...


*🙏Dr.Keshav Baliram Hedgewar* - Founder, was a *MBBS* of 1914 from National Medical College Calcutta.


*🙏M.S.Golwalkar* - MSc. (Zoology Gold Medalist) from BHU & Worked as *lecturer* in BHU, while *Pandit Malviya* was Vice Chancellor in BHU


*🙏Bala Saheb Deoras*-B.A. & LLB of 1935 from Nagpur University


*🙏Prof. Rajendra Singh (Rajju Bhaiya)* - MSc. (Physics Gold Medal) was Professor & HOD Physics in Allahabad University.

*Dr. C. V. Raman* (Nobel Prize Winner) offered him a Scholarship


*🙏K S. Sudershan*- (BTech Gold Medalist) in (Telecommunication) from Govt. Engg. College Jabalpur


🙏The Present RSS Chief *Dr. Mohan Bhagwat* is a Qualified Veterinary Surgeon from Nagpur University..


If there is any Information about the Qualifications of Sonia, Rahul, Laloo, Mulayam, Maya, Mamta, then please tell us. It will be easy to compare such personalities.


*share this information in your other groups to let the nation know who are behind RSS activities if you like it*

Friends , 

Don't shy away from your party presidents or hide your faces . It's democracy.

😃😃😃😃😃


. *JAI BHARAT 🇮🇳 🚩 🙏🏻*

సంస్కృత మహాభాగవతం

 *24.09.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఏడవ అధ్యాయము*


*అవధూతోపాఖ్యానము - పృథివి మొదలుకొని కపోతముల వరకు గల ఎనిమదిమంది గురువుల కథలు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*7.66 (అరువది ఆరవ శ్లోకము)*


*సాఽసకృత్స్నేహగుణితా దీనచిత్తాఽజమాయయా |*


*స్వయం చాబధ్యత శిచా బద్ధాన్ పశ్యంత్యపస్మృతిః॥12491॥*


భగవంతుని మాయా ప్రభావమున తన పిల్లలపై అంతులేని మమకారముగల ఆడుపావురముయొక్క చిత్తము తన పిల్లల దురవస్థ కారణముగా మిగుల దైన్యస్థితికి లోనయ్యెను. వలలో బంధింపబడియున్న పిల్లలకు ఏవిధముగను తోడ్పడజాలక దిక్కుతోచనిదై, తానును స్వయముగా ఆ వలలో చిక్కుకొనెను.


*7.67 (అరువది ఏడవ శ్లోకము)*


*కపోతశ్చాత్మజాన్ బద్ధానాత్మనోఽప్యధికాన్ ప్రియాన్|*


*భార్యాం చాత్మసమాం దీనో విలలాపాతిదుఃఖితః12492॥*


అంతట మగపావురము తన ప్రాణములకంటె మిన్నగా చూచుకొనుచున్న తన పిల్లలను, ప్రాణతుల్యమైన తన భార్యయును వలలో చిక్కుపడి యుండుట చూచి, భరింపలేక మిగుల దుఃఖముతో విలపింపసాగెను. అప్పటి దాని పరిస్థితి ఎంతయో జాలిగొలుపునదిగా ఉండెను.


*7.68 (అరువది ఎనిమిదవ శ్లోకము)*


*అహో మే పశ్యతాపాయమల్పపుణ్యస్య దుర్మతేః|*


*అతృప్తస్యాకృతార్థస్య గృహస్త్రైవర్గికో హతః॥12493॥*


అప్పుడు ఆ కపోతము ఇట్లు తలపోయసాగెను. 'నా దౌర్భాగ్యమును చూడుడు. నేను మిగుల దురదృష్టవంతుడను. నేను చేయవలసిన పనులు ఏమియు పూర్తికాలేదు. పిల్లలను పెంచి పెద్దచేయదలచుకొనిన నా కోరికలు ఏమాత్రమూ ఈడేరలేదు. అంతేగాదు, ధర్మార్థకామములకు మూలమైన గృహస్థాశ్రమము పూర్తిగా దెబ్బతినినది. వేయేల? నా ఆశలన్నియును అడుగంటినవి'


*7.69 (అరువది తొమ్మిదవ శ్లోకము)*


*అనురూపానుకూలా చ యస్య మే పతిదేవతా|*


*శూన్యే గృహే మాం సంత్యజ్య పుత్రైః స్వర్యాతి సాధుభిః॥12494॥*


'నన్ను దైవముగా భావించెడి నా భార్య నాకు అన్నివిధములుగా తగినట్టిది. అట్టి అనుకూలవతియైన భార్య దొరకుట నా అదృష్టము. ఆమెలేని ఈ గూడు నాకు శూన్యము. నన్ను ఒంటరి వానిని జేసి, అన్నెంపున్నెం ఎఱుగని ఈ పిల్లలతో తాను స్వర్గమునకు వెళ్ళుచున్నది'


*7.70 (డెబ్బదియవ శ్లోకము)*


*సోఽహం శూన్యే గృహే దీనో మృతదారో మృతప్రజః|*


*జిజీవిషే కిమర్థం వా విధురో దుఃఖజీవితః॥12495॥*


'భార్యను, పిల్లలను పోగొట్టుకొని, బోసిపోయిన ఈ గూటిలో దిక్కులేని వాడనై నేను బ్రతికి లాభమేమి? భార్యావియోగమునకు గుఱియైన నా జీవితము మిగుల దుఃఖమయము, వ్యర్థము".


*7.71 (డెబ్బది ఒకటవ శ్లోకము)*


*తాంస్తథైవావృతాన్ శిగ్భిర్మృత్యుగ్రస్తాన్ విచేష్టతః|*


*స్వయం చ కృపణః శిక్షు పశ్యన్నప్యబుధోఽపతత్॥12496॥*


ఇట్లు చింతించిన పిమ్మట ఆ కపోతము వలలో చిక్కుకొని చేష్టలుడిగి మృత్యుముఖమున ఉన్న తమ పిల్లలను జూచి, దైన్యమునకు లోనై అజ్ఞానముతో తానును ఆ వలలో ప్రవేశించెను.


*7.72 (డెబ్బది రెండవ శ్లోకము)*


*తం లబ్ధ్వా లుబ్ధకః క్రూరః కపోతం గృహమేధినమ్|*


*కపోతకాన్ కపోతీం చ సిద్ధార్థః ప్రయయౌ గృహమ్॥12497॥*


అంతట క్రూరాత్ముడైన కిరాతుడు ఇంటికి యజమానియైన ఆ కపోతమును, కపోతిని, వాటి పిల్లలను తీసికొని, తాను వచ్చినపని పూర్తియైనట్లు తలంచి, మిగుల సంతసముతో తన ఇంటికి చేరెను.


*7.73 (డెబ్బది మూడవ శ్లోకము)*


*ఏవం కుటుంబ్యశాంతాత్మా ద్వంద్వారామః పతత్రివత్|*


*పుష్ణన్ కుటుంబం కృపణః సానుబంధోఽవసీదతి॥12498॥*


విషయసుఖలోలుడైన కుటుంబి చంచలమనస్కుడై తన కుటుంబపోషణకై ద్వంద్వములలో తలమున్కలగు దీనుడై కడకు కపోతమువలె సకుటంబముగా నశించును.


*7.74 (డెబ్బది నాలుగవ శ్లోకము)*


*యః ప్రాప్య మానుషం లోకం ముక్తిద్వారమపావృతమ్|*


*గృహేషు ఖగవత్సక్తస్తమారూఢచ్యుతం విదుః ॥12499॥*


ముక్తిసాధనమైన మానవ జన్మను పొందియు, పావురములజంటవలె సాంసారిక వ్యామోహములో చిక్కుకొనినవాడు శ్రేయో మార్గమునుండి పతనమగుట తథ్యమని భావింపవలెను. అట్టి వానిని పండితులు *ఆరూఢచ్యుతుడు* అని యందురు. శ్రేయోమార్గములను కోరుకొనువాడు సాంసారిక వ్యామోహములో చిక్కుకొనరాదని ఈ కపోతవృత్తాంతము లోకమునకు పరోక్షముగా హితవు పలుకుచున్నది.


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశస్కంధే సప్తమోఽధ్యాయః (7)*


ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి *అవధూతోపాఖ్యానము - పృథివి మొదలుకొని కపోతముల వరకు గల ఎనిమదిమంది గురువుల కథలు* అను ఏడవ అధ్యాయము (7)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*415వ నామ మంత్రము* 24.9.2021


*ఓం మనో వాచామగోచరాయై నమః*


మనోవాక్కులకు గోచరించని అనంత గుణములు గలిగిన జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మనోవాచామగోచరా* యను ఎనిమిదక్షరముల(అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం మనో వాచామగోచరాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ తల్లి భక్తిజ్ఞానసంపదలను ప్రసాదించి, నిరంతరము భగవద్ధ్యానముతో జీవనము కొనసాగించువారిగను, శాంతిసౌఖ్యములతో జీవించువారిగను అనుగ్రహించును.


జగన్మాత పరమాత్మస్వరూపిణి. ఆ తల్లి ఇట్లు ఉంటుందని మనస్సుచే ఊహించుటగాని, వాక్కుతో చెప్పుటగాని సాధ్యముగాదు. 'వాక్కులు పరమాత్మను బోధింపలేక వెనుదిరిగిపోయినవి , అలాగే పరమాత్మను తెలియలేక మనస్సు వెనుకకు తిరిగిపోయినది' అని వేదములు చెప్పినవి. 'మనోవాక్కులకు అతీతమైనది, జ్ఞానులకు మాత్రమే గోచరమైనది అగు పరమాత్మస్వరూపిణి అయిన పరమేశ్వరికి నమస్కరిస్తున్నాను' అని ప్రహ్లాదుడు అనినట్లు విష్ణుపురాణంలో చెప్పబడినది. సృష్టిలో తొలుత పుట్టినవారికి తరువాత పుట్టినవాటి గురుంచి తెలుస్తుంది. పరమాత్మ సృష్టికి మూలస్థితినుండి ఉన్నది గనుక ఆ తల్లికి అంతయు తెలియును. కాని ఆ తల్లి గురుంచి తెలియాలంటే బ్రహ్మజ్ఞాన సంపద అవసరము. ఆత్మ అన్నిటికి పూర్వమైనది. వాక్కు, మనస్సు మాత్రము తరువాత వచ్చినవి. గనుక ఆత్మగురుంచి మనోవాక్కులకు తెలియదు. అదే విధముగా పరమాత్మస్వరూపిణియైన అమ్మవారు మనోవాక్కులకు గోచరముకానిది గనుక *మనోవాచామగోచరా* యని అనబడినది. పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ యనునవి వాక్కుయొక్క నాలుగు రూపములు. అందులో పరమేశ్వరి పరాస్వరూపిణి. నాలుగరూపమైన వైఖరికి పరాస్వరూపము తెలియదు. అవ్యక్తము ఇది సృష్టికి పూర్వము. మహతత్త్వము, అహంకారము, పంచతన్మాత్రలు, పంచభూతములు, ఇంద్రియములు క్రమముగా ఏర్పడినవి. అన్నిటికి పూర్వమైన అవ్యక్తముగూర్చి ఇంద్రియములకు తెలియుట అసంభవము. కాని బ్రహ్మజ్ఞానులకు పూర్వాపరములన్నియు తెలియును. సృష్టికి పూర్వమైన అవ్యక్తస్వరూపిణియైన పరమాత్మ అన్నిటికి తరువాత ఏర్పడిన మనోవాక్కులకు తెలియదు. గనుక అమ్మవారు *మనోవాచామగోచరా* యని అనబడినది. అమ్మవారిని తెలియాలంటే కఠోరమైన యోగసాధన అవసరము. ఆ యోగసాధనలో ఉన్మనాస్థితికి చేరితేనేగాని ఆ పరమేశ్వరి తెలియదు. గనుకనే ఆ తల్లి *మనోవాచామగోచరా* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం మనో వాచామగోచరాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*999వ నామ మంత్రము* 24.9.2021


*ఓం శివశక్యైక్యరూపిణ్యై నమః* 


శివశక్తుల సామరస్యమే స్వరూపముగా విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శివశక్యైక్యరూపిణీ* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం శివశక్యైక్యరూపిణ్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగదాంబికను అత్యంతభక్తి ప్రపత్తులతో ఆరాధించు భక్తులకు ఇష్టకామ్యార్థసిద్ధియు, కైవల్యదాయకమైన ధ్యాననిమగ్నతను ఆ జగన్మాత అనుగ్రహించును.


శ్రీచక్రరాజమును శంకరభగవత్పాదులవారు ఈ విధంగా వర్ణించారు.


*చతుర్భిః శ్రీకంఠైః - శివయువతిభిః పంచభిరపి|*


*ప్రభిన్నాభిః శంభో ర్నవభిరపి మూలప్రకృతిభిః |*


*చతుశ్చత్వారింశ - ద్వసుదల-కలాశ్చ్త్రివలయ*


 *త్రిరేఖభిః సార్ధం - తవ శరణకోణాః పరిణతాః || 11 ||*


శ్రీచక్రం వర్ణన - నవ చక్రాకృతమై, నలుబది నాలుగు అంచులు కలిగి శివశక్త్యుభయ (శివశక్యైక్య) రూపముగా వెలయుచున్నది.



అమ్మా! .శ్రీచక్రంలో శివకోణములు నాలుగు అధోముఖముగాను ( వీటి కోణములు క్రిందకు ఉండును.) శక్తికోణములు ఐదు ఊర్ధ్వముఖముగాను ( వీటి కోణములు పైకి) ఉండి శివశక్తుల సామరస్యమును (శివశక్యైక్యమును) తెలియజేయుచున్నది. శ్రీచక్రమునందు మూలప్రకృతులు తొమ్మిది ,అష్టదళములు ఎనిమిది, షోడశదళములు పదునారు , త్రివలయములు మూడు,, భూపురత్రయములు మూడు . ఈ తీరున శ్రీచక్రంలో మొత్తం నలుబది నాలుగు కోణములు ఉండును. అటువంటి శ్రీచక్రము నీకు నిలయముగా నీ స్థానమై ఉన్నది తల్లీ. శ్రీచక్రము నందు సృష్టికి  మూల కారణమైన మూల ప్రకృతులను పేరుగల తొమ్మిది త్రికోణములు గలవు. శ్రీచక్రమునందు నలుబది నాలుగు కోణములు, ఇరువది ఎనిమిది మర్మ స్థానములు, ఇరువది నాలుగు సంధులు గలవు.   తొమ్మిది త్రికోణములు గలవు గనుక నవయోన్యాత్మక మందురు. ఈ నవ యోనులు నవ ధాతువులై సృష్టి మూలకము లగుచున్నవి. త్వక్కు, రుధిరము, మాంసము, మేధస్సు, ఆస్థి అనునవి ఐదు శక్తి మూలకములు,  ధాతువులు.  మజ్జ,  శుక్రము,ప్రాణము, జీవుడు అను నాలుగు ధాతువులు శివ మూలకములు. మన దేహము నవ ధాతుమయము, నవ యోని సముద్భవము. దశమ యోని బైన్ధవ స్థానము. ఇట్లు పిండాండము, బ్రహ్మాండము వీని వలన జనించినది. పంచ మహా భూతములు, పంచ తన్మాత్రలు,

పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు,మనస్తత్వము, మాయ, శుద్దవిద్య, మహేశ్వరుడు,సదాశివుడు, అను పంచ వింశతి తత్వములు శ్రీచక్రమునందంత ర్భూతములై యున్నవి. శివశక్త్యాత్మకమైన శ్రీచక్రము చరాచర జగత్తునకు సృష్టికి మూలమై యున్నది. షట్చక్ర భేదనముచే శ్రీచక్రోపాసన చేసే శ్రీదేవీ భక్తులకు అణిమాది అష్ట సిద్దులు అతి సునాయాసముగా సిద్ధించును. సిద్ధించే ముందు పరీక్షలు చాలా తీవ్రముగా వుండును. మానసిక, శారీరిక పరీక్షలు వుండును. ఎన్నో రకముల భ్రమలు గల్పించబడును. కంటి ముందు మెరుపు తీగలు మెరియును. చెవులు హోరెత్తును. తల పగలి పోవునట్లుగా వుండును. భరించలేని మాడు పోటు, తల గిర్రున తిరుగును. ఒకే సమయములో శీతోష్ణస్థితులు గలుగును. వున్నది లేనట్టుగా లేనిది వున్నట్టుగా అగుపించును. రకరకాల మాయలు గనిపించును. మనస్సు తీవ్ర భయాందోళనలకు లోనగును. శరీరము తీవ్ర కంపనములకు లోను అగును. శరీరము చెమట పట్టును. వెన్నులోని నాడులు తీవ్రముగా స్పందించును. తరువాత శరీరము నెమ్మదిగా తేలిక అగును. నాగ బంధములో కదలిక గల్గును. మూలాధారములో శక్తి చలనము, ఉత్కీలనము, ఆ తరువాత షట్చక్ర భేదనము.


ఆజ్ఞాచక్రములో త్రికోణ దర్శనము, త్రికోణాంతర దీపికా దర్శనము కలుగును.


 ఆ తరువాత ఆనందమే బ్రహ్మానందం. ఇక మిగతా విషయములు చెప్పకూడదు.


 అతి రహస్యములు. స్వయముగా ఎవరికి వారు అనుభవించి తెలుసుకోవాలి. మొదట సారి మాత్రమే ఈ సాదృశ్యములు అగుపించును. ఆ తరువాత నీ మానసిక, శారీరిక స్థితిగతులను బట్టి, నీకు తెలియకుండానే కుండలినీశక్తి సహస్రారము వరకు గమనము చేయుచూ వుండును. రహస్యమైన విషయమేమంటే సాధకుడు అఖండ బ్రహ్మచర్య నిష్ఠలో, పంచదశీ మంత్ర పునఃశ్చరణ దీక్షలో  వుండవలెను. అప్పుడే ఇది సాధించగలడు. లేనిచో ఇది కుదరదు. గురు ముఖతః దీక్ష తీసుకొన్నవారిలో మాత్రమే ఈ సిద్ధి కలుగును. ఇతరులు ఈ సాధన చేయకూడదు. చాలా తీవ్ర పరిమాణాలు వుంటాయి.


ఎవరికి వారు తమ్ము తాము ఉద్దరించుకోవడానికి మాత్రమే ఈ సాధన చేయవలెను. అన్యధా తగు మూల్యము చెల్లించుకోక తప్పదు. శ్రీవిద్య మోక్ష సాధనకు మాత్రమే అని గుర్తెరుగవలెను.


సాధకుడు అమ్మ పెట్టే పరీక్షలకు నిలబడాలి. సాధన తీవ్రముగా వుండాలి. మధ్యలో చలించగూడదు. ఏకోన్ముఖులై వుండాలి. ఎవరికి ఏయే బలహీనతలు గలవో, అవే పరీక్షలకు తావుగా నిలబడును. మెట్టు మెట్టుకూ చిత్ర విచిత్రమైన పరీక్షలు కల్గును.


'తిలలనుండి తైలము అభివ్యక్తమయినట్లుగనే శివతత్త్వముతో ఏకత్వమును పొందిన పరాశక్తి శివేచ్ఛచేతనే శివతత్త్వమునుండి విడివడి సృష్ట్యాదియందు అభివ్యక్తమగుచున్నది' అని వాయు సంహితయందు గలదు. బ్రహ్మముతో (పరమాత్మతో) అభేదము పొందిన శక్తి (పరమేశ్వరి) బ్రహ్మమేగాని, ఆ శక్తి అన్యముగాదు. ఇదియే శివశక్త్యైక్యము అనబడును. కాని అజ్ఞానులు శక్తివేరు, శివుడు వేరు అని చెప్పుచున్నారు. దీనినే ద్వైతభావన అందురు. శివశక్త్యైక్యము అద్వైతభావన. జ్ఞానుల భావన. వాయువు, దాని చలించే తత్త్వము, అగ్ని, దాని ఉష్ణగుణము రెండును విడదీయరానివి. వాయువు చలనము వేగవంతమయితే, అగ్నియొక్క ఉష్ణగుణము మరింత ఉధృతమగును. ఈ రెండుగుణములు అవినాభావ సంబంధమైనవి. శ్రీచక్ర నిర్మాణము శివచక్రముల మరియు శక్తిచక్రముల కలియికతో ఏర్పడగా, శివశక్త్యైక్యము ప్రకటితమగుచున్నది గనుక శ్రీచక్రనిలయ అయిన పరమేశ్వరి *శివశక్త్యైక్య రూపిణీ* యని అనబడుచున్నది. ఆపైన 'బిందుస్థానము, త్రికోణము కలసినవి, అష్టదళపద్మము, అష్టారము కలసియున్నవి అని చెప్పుచూ, అంత్యమున శివచక్రములు శక్తిచక్రములు అవినాభావబంధయుతముగా నున్నవి' అని బ్రహ్మాండ పురాణమున చెప్పబడినది. ఈ శివశక్త్యైక్యతను తెలిసినవాడే, శ్రీచక్రమననేమియో తెలిసినవాడు అని వక్కాణించవచ్చును. శివశక్త్యైక్యము అనగా అర్ధనారీశ్వరతత్త్వము గనుకనే జగన్మాత *శివశక్త్యైక్యరూపిణీ* యని అనబడినది. శివశక్తులు ఒకటే గనుకనే జగత్కారణము అనగా సృష్టికి మూలకారణము. అమ్మవారు హంస మంత్రస్వరూపురాలు. హంస మంత్రము శివశక్తుల ఏకత్వము తెలియజేయుచున్నది. *హ* (హం) కారము, *స* కారము *(హంస)* అయితే ఇందు *హ* కారము బీజము. అనగా *స* కారము శక్తి అయితే *హ* కారము శివుడు. ఇదియే *హంస* మంత్ర రహస్యము మరియు *శివశక్త్యైక్య* భావన. పృథివియందు ధూమావతీ శక్తి, ఉదకమందు హ్లాదశక్తి, అగ్నియందు భాస్వతీ శక్తి, వాయువునందు స్పందశక్తి, ఆకాశమునందు వైభవశక్తి వ్యాపించియున్నవి. ఈ పంచశక్తులు పంచమహా భూతములందు వ్యాపించి పాంచభౌతిమైన జగత్తు పంచశివశక్తియుతమై ఉన్నది. ఈ జగత్తు పాంచభౌతికము. ఈ పంచభూత శక్తులతో పరమేశ్వరి *శివశక్త్యైక్యరూపిణీ* యని అనబడినది. ఈ శరీరము పాంచభౌతికము. అనగా శివశక్త్యైక్యసామరస్యమయిన దేహము మన శరీరము. 


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం శివశక్త్యైక్య రూపిణ్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

సంస్కృత మహాభాగవతం

 *23.09.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఏడవ అధ్యాయము*


*అవధూతోపాఖ్యానము - పృథివి మొదలుకొని కపోతముల వరకు గల ఎనిమదిమంది గురువుల కథలు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*7.57 (ఏబది ఏడవ శ్లోకము)*


*కపోతీ ప్రథమం గర్భం గృహ్ణతీ కాల ఆగతే|*


*అండాని సుషువే నీడే స్వపత్యుః సన్నిధౌ సతీ॥12482॥*


*7.58 (ఏబది ఎనిమిదవ శ్లోకము)*


*తేషు కాలే వ్యజాయంత రచితావయవా హరేః|*


*శక్తిభిర్దుర్విభావ్యాభిః కోమలాంగతనూరుహాః॥12483॥*


కాలక్రమమున ఆడుపావురము గర్భమును దాల్చెను. పిదప అదీ తన పతి సన్నిధియందే తన గూటిలో గ్రుడ్లు పెట్టెను. అచింత్యమైన కాలశక్తి ప్రభావమున కొంతకాలమునకు ఆ అండములనుండి పిల్లలు బయటికి వచ్చెను. వాటి అంగములు, రెక్కలు మిగుల కోమలములై మనోహరముగా ఉండెను.


*7.59 (ఏబది తొమ్మిదవ శ్లోకము)*


*ప్రజాః పుపుషతుః ప్రీతౌ దంపతీ పుత్రవత్సలౌ|*


*శృణ్వంతౌ కూజితం తాసాం నిర్వృతౌ కలభాషితైః॥12484॥*


*7.60 (అరువదియవ శ్లోకము)*


*తాసాం పతత్రైః సుస్పర్శైః కూజితైర్ముగ్ధచేష్టితైః|*


*ప్రత్యుద్గమైరదీనానాం పితరౌ ముదమాపతుః॥12485॥*


ఆ పావురములజంట మిక్కిలి పుత్రవాత్సల్యముతో (మమకారముతో) తమ పిల్లలను పెంచి పోషించుచుండెను. వాటి లాలన, పాలన అపూర్వరీతిలో నుండెను. అవి తమ పిల్లలయొక్క వచ్చియురాని తీయని కలకలారావములను వినుచు మురిసిపోవుచుండెను. ఆ పక్షులు తమ పిల్లల బుల్లిబుల్లి రెక్కలయొక్క సుఖస్పర్శలకు పొంగిపోవుచుండెను. వాటి ముద్దుముద్దు పలుకులను వినుచు, పిల్లలచేష్టలను చూచుచు అవి పరవశించి పోవుచుండెను. కోమలములైన చిన్ని చిన్ని ఱెక్కలతో అవి ఎగురుచుండగా జూచినప్పుడు వాటి ఆనందమునకు మేరలేకుండెను.


*7.61 (అరువది ఒకటవ శ్లోకము)*


*స్నేహానుబద్ధహృదయావన్యోన్యం విష్ణుమాయయా|*


*విమోహితౌ దీనధియౌ శిశూన్ పుపుషతుః ప్రజాః॥12486॥*


విష్ణుమాయా ప్రభావమున ఆ రెండు పావురములయొక్క హృదయములలో పెనవైచుకొనియున్న ప్రేమాతిశయములు, వ్యామోహములు నిరుపమానములు. అవి తమ పసికందుల పోషణలో మునిగి, ఆ పారవశ్యమున ఈ లోకమునే మరచిపోవుచుండెను.


*7.62 (అరువది రెండవ శ్లోకము)*


*ఏకదా జగ్మతుస్తాసామన్నార్థం తౌ కుటుంబినౌ|*


*పరితః కాననే తస్మిన్నర్థినౌ చేరతుశ్చిరమ్॥12487॥*


ఒకానొకప్పుడు ఆ పెద్దపక్షులు తమ చిన్నారులకు ఆహారమును దీసికొనివచ్చుటకై అడవికి వెళ్ళెను. కుటుంబభారము పెఱుగుటవలన ఆహారపదార్థములను ఎక్కువగా సమకూర్చుకొనవలసియుండెను. అందువలన అవి ఆ వనమునందు నలువైపుల ఎక్కువకాలము తిరుగసాగెను.


*7.63 (అరువది మూడవ శ్లోకము)*


*దృష్ట్వా తాన్ లుబ్ధకః కశ్చిద్యదృచ్ఛాతో వనేచరః|*


*జగృహే జాలమాతత్య చరతః స్వాలయాంతికే॥12488॥*


ఆ సమయమున ఒక కిరాతకుడు వనమునందు తిరుగుచు అనుకొనకుండా ఆ పక్షులగూటి సమీపమునకు చేరెను. అప్పుడు ఆ గూటికి సమీపమున పక్షిపిల్లలు తిరుగాడుచుండగా చూచి, ఆ బోయవాడు వలపన్ని వాటిని బంధించెను.


*7.64 (అరువది నాలుగవ శ్లోకము)*


*కపోతశ్చ కపోతీ చ ప్రజాపోషే సదోత్సుకౌ|*


*గతౌ పోషణమాదాయ స్వనీడముపజగ్మతుః॥12489॥*


*7.65 (అరువది ఐదవ శ్లోకము)*


*కపోతీ స్వాత్మజాన్ వీక్ష్య బాలకాన్ జాలసంవృతాన్|*


*తానభ్యధావత్క్రోశంతీ క్రోశతో భృశదుఃఖితా॥12490॥*


నిరంతరము పిల్లలపోషణలో ఆరాటముతోనున్న కపోతము, కపోతియు ఎట్టకేలకు ఆహారమును తీసికొని తమ గూటికి చేరెను. అంతట ఆడుపావురము వలలో చిక్కుకొనియున్న తమ పిల్లలను చూచి, మిగుల దుఃఖిత అయ్యెను. వలలోపడి, గోడుగోడున విలపించుచున్న తమ పిల్లల దురవస్థను గాంచి, తట్టుకొనలేక అది పరితపించుచు వాటికడకు చేరెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235