30, అక్టోబర్ 2020, శుక్రవారం

అరటిపళ్ళు

 సురేష్ తన తోటలోని అరటిచెట్టులోని 100 అరటిపళ్ళు ఉన్న గెలను కోసి తన ఇంటి పనివాడైన రాముడిని పిలిచి గుడిలో ఈ గెలను ఇచ్చి రమ్మని చెప్పడు 

రాము అలాగే అయ్యగారని చెప్పి వెళ్ళాడు 

ఆరోజు రాత్రి సురేష్ కి దేవుడు కలలో కనిపించి 

సురేష్ నువ్వు పంపిన ఒక్క అరటిపండు నాకు అందింది అని చెప్పడు 

ఉలిక్కిపడి లేచి సురేష్ ఆశ్చర్యపోయాడు నేను 100 పళ్ళు పంపితే దేవుడు ఒక్కటే అందిందని అంటున్నాడే అని 

రాముని పిలిచి వెంటనే అడిగాడు 

రాము అయ్యా నేను గుడిలో గెలను ఇచ్చానయ్యా అని చెప్పడు 

సురేష్ కి కోపం వచ్చింది కాస్త గట్టిగ అరిచాడు 

రాము నిజాయితీగా నువ్వు చేసిన తప్పు ఒప్పుకో అన్నాడు 

రాము భయపడిపోయి అయ్యా నిజం చెప్పేస్తాను 

గుడికి వెళ్ళే దారిలో ఒక అతను చాలా ఆకలిగా ఉందని అడిగాడు అతనికి ఒక్క పండు ఇచ్చాను మిగతా అంత గుడిలో ఇచ్చాను అని చెప్పడు 


అప్పుడు అర్థం అయ్యింది సురేష్ కి 

ఆకలితో ఉన్నవాడికి ఇచ్చిన పండు ఆ పరమాత్ముడికి చేరుతుంది అని 

గుడిలో లక్షలు పోసి హోమాలు చేయడం కాదు ఆకలి అనేవారికి అన్నం పెట్టడం ఆ దేవుడికే సేవ చేసినట్టు 


పేదవారికి మనం చేసే సాయం ఆ భగవంతుడితో మన మొర ఆయనకు ప్రత్యక్షంగా విన్నవించుకున్నట్టే.

కామెంట్‌లు లేవు: