31, డిసెంబర్ 2020, గురువారం

కలియుగం


_*కలియుగం అంటే ఏమిటి ?*_


_*కలి ఎవరు ?*_


_*కలి మనలో ఎలా ప్రవేశిస్తుంది?*_


_*కలి నుండి మనం ఎలా తప్పించు కోగలం ?*_


*ముఖ్యమైన యుగాలు 4.*


*1. కృతయుగం* 


*2. త్రేతాయుగం* 


*3. ద్వాపరయుగం* 


*4. కలియుగం* 


*కలియుగం అంటే ఏమిటి?* 


*ఇప్పుడు మనం ఉన్న యుగమే కలియుగం .*


*యుగాల సృష్టిలో 4వది 'కలి'. ద్వాపర యుగం లో అన్నా చెల్లెళ్లకు పుట్టిన వాడే ఈ కలిపురుషుడు ఇతని కాలాన్నే కలియుగం అంటాము.*


*ఈ యుగం మిగతా యుగాలకంటే చాలా భిన్నం గా ఉంటుంది.* 


*ఈ యుగం అయిపోయాక సృష్టి అంతమై పోయి, తిరిగి యుగాలు ప్రారంభ మవుతాయి .*


*కలి ప్రభావం ?*


**************


*కలియుగంలో కలి* 

*పురుషుని ప్రభావం చాల దారుణంగా ఉంటుంది.*


*కలియుగంలో కలిపురుషుని ప్రభావం వల్ల దేవతలకు హవిస్సులందవు.* 


*వేదము అవమానింప బడుతుంది.* 


*పితృదేవతలకు శ్రాద్ధం పెట్టరు.* 


*ధర్మాత్ములు, భూమాత, గోమాతలు అవ మానింప బడతారు.* 


*అసత్యం, బంగారం, డబ్బు చాల ముఖ్యమనుకోవడం.* 


*కష్టపడిన వారికి ఫలితం తక్కువ.* 


*కష్టపడని వారికి ఫలితం ఎక్కువ.*


*శాస్త్రీయత పేరుతో దైవభక్తి ఉండదు.* 


*మనుషులలో నీతి నిజాయితీలు ఉండదు.* 


*దాన-ధర్మాలు ఉండవు.* 


*తల్లిదండ్రులు, అత్తమామలు, అక్కాచెల్లెళ్లు, అనే అనుబంధాలు తగ్గిపోతూ వుంటాయి.* 


*చివరికి కలి వైపరీత్యం వల్ల యుగాంతంలో కరువులు, వరదలు, యుద్దాలు, ఆకలి చావులు వచ్చి, యుగం అంతమై పోతుంది.* 


*కలి పురుషుడు వీరిలో ఎక్కువగా ప్రవేశిస్తాడు.*


*1. జూదం ఆడే వారిలోకి*


*2. మద్యం సేవించే వారి లోకి*


*3. వ్యభిచారం చేసే వారి లోకి*


*4. జీవహింస చేసే వారిలోకి*


*ఇంకా*


*5. జూదంలో నుంచి అసత్యం లోకి,*


*6. మద్యం ద్వారా మదం, అహంకారాల లోకి*


*7. వ్యభిచారం నుంచి కామవాంఛకు,*


*8. హింస లోంచి కోపం లోకి ఎగ బాకుతాడు కలి.* 


************************

*కలి పురుషుడు ఈ యుగం లోకి ఎలా వచ్చాడు?*


***********************

*1. పరీక్షిత్తు మహారాజు - ఎద్దు (ధర్మ దేవత):*


****************************************


*పరీక్షిత్ మహారాజు కలిని అంత మొందించ బోవడం:-*


***************************


*ధర్మ బద్ధంగా పరిపాలిస్తున్న పరీక్షిత్తు మహారాజుకు (చక్రవర్తి) దేశం లో ఒక రోజు ఒక గోమాత ఏడుపు వినిపించింది.*


*తనదేశంలో బాధతో ఉండేవారు అనేది ఉండదు . మహారాజు గారు ఆ గోమాత దగ్గరకి వెళ్ళాడు .*


*ఆ గోమాత.. ఒక ఎద్దుకు మూడు కాళ్ళు విరిగిపోయి ఒక కాలే మిగిలి ఉన్న విషయము చెప్పింది*


*ఆ ఆవు ఎద్దుని ఊరడిస్తూ ఉంది .(ఆ గోమాత మన భూమి ఎద్దు ధర్మ దేవత) ఏమైందని రాజు అడుగగా ఎద్దు కలి ఈ యుగం లోకి ప్రవేశించాడని, అతను తన కాళ్ళను నిర్దాక్షిణ్యంగా విరిచేడని చెప్పింది.*


*అప్పుడు పరీక్షిత్ మహారాజు ఎద్దుతో, ఎవరికీ అవసరం లేని గడ్డి తిని, మనుషులు తాగలేని నీటిని తాగే నిన్ను ఎవరు హింసించారు.*


*ఎవరికీ అపకారం చేయని నీ కాళ్లు ఎవరు విరగ్గొట్టారు అని అంటాడు.*


*ఎద్దు కాలు విరగొట్టిన వారు ఎవరైనా సరే అతని భుజాలు విరగ్గొడతాను అంటాడు పరీక్షిత్ మహారాజు.*


*కామక్రోధావేశుడై, రాజులా కనిపించే కఠినాత్ముడు, కర్ర పట్టుకుని మేము ఏడుస్తూ ఉన్నా కనికరం లేకుండా కొడుతున్నాడు..*


*నా కాళ్లు అతడే విరగ్గొట్టాడు. అని జవాబిచ్చింది ఎద్దు. అతను కలిపురుషుడని పరీక్షిత్ రాజుకు తెలిసింది.*



*దాంతో పరీక్షిత్ మహారాజు కలికి శిక్ష విధిస్తాడు. అప్పుడు కలి.. నన్ను ఎందుకిలా చిత్ర హింసలకు గురి చేస్తున్నావు? అని ప్రశ్నిస్తాడు. ఇది కలియుగం కాబట్టి నేను ఖచ్చితంగా భూమిపైకి రావాల్సిందే అంటాడు.*


*ఇది వదిలి నేనెక్కడుండాలి?*


*నేను ఎక్కడ ఉంటె నువ్వు అక్కడికి వచ్చి చంపుతానంటే ఎలా?* 



*నేను ఎక్కడుండాలో చెప్తే అక్కడ మాత్రమే ఉంటా నన్నాడు కలి.*


*జూదశాల, మద్యపానం, వ్యభిచారం, జీవహింస జరిగే చోటు అనే నాలుగు స్థానాలను ఇస్తా నన్నాడు పరీక్షిత్తు.*


*తన పాలనలో ఉన్న ప్రజలు ఈ నాలుగు చోట్లకి వెళ్లరనే గట్టి నమ్మకంతో అలా అనుగ్ర హించా డాయన.*


*పరీక్షిత్ మహారాజు నాలుగు స్థానాలను మాత్రమే ఇచ్చినప్పటికీ జూదశాల నుంచి అసత్యం, మద్యపానం నుంచి మదం, అహంకారం, వ్యభిచారం నుంచి కామము, హింస నుంచి కోపం, క్రౌర్యం..* 


*ఇలా మరో నాలుగు స్థానాలను కూడా ఆక్రమించాడు కలి.*



*ఇవి కాకుండా మరో స్థానం ఇవ్వమని వేడుకున్నాడు కలి. సరేనని బంగారం ఉన్న చోటు కూడా నీదే నన్నాడు.* 


*అయితే బంగారం నుంచి మాత్సర్యం పుడుతుంది. కాబట్టి ఆ స్థానాన్ని కూడా తనది చేసుకున్నాడు కలి పురుషుడు.*



*మొత్తానికి తొమ్మిది స్థానాల్లో కలి ఉంటాడు అని మనం చెప్పవచ్చు.* 


*2. కలి ప్రభావంతో పరిక్షిత్తు మహారాజు పరిస్థితి:*


******************************************


*పరీక్షిత్ మహారాజు దరిదాపులకు కూడా రాలేని కలి, బంగారం స్థానాన్ని పొందగానే చెలరేగిపోయాడు. పరీక్షిత్ మహారాజు ఒంటినిండా బంగారం ఉండడంతో ఆయనలోకే ప్రవేశించ గలిగాడు.* 



*ఆ ప్రభావంతో క్రూర,మృగాల బాధ తప్పించ డానికి మాత్రమే వేటాడే రాజు, హింసాత్మకుడై వెంటనే వేటకు వెళ్లాలని పించింది.*



*జీవహింస కూడా ఉండడంతో కలి ప్రభావం మరింత పెరిగింది.* 



*అప్పుడే దాహంతో శమీక మహర్షి ఆశ్రమానికి వెళ్లడం, తపస్సులో నిమగ్నమై ఉన్న ఆయన మెడలో క్రోధంతో చనిపోయిన పామును వేసి ఎగతాళి చేయడం జరుగుతుంది.* 


*శమీక మహర్షి కుమారుడైన శృంగి చేతిలో తక్షకుడి ద్వారా మరణిస్తావన్న శాపానికి కూడా గురవుతాడు.* 


*ఇంటికి వెళ్లి కిరీటం, ఆభరణాలు తీసి పక్కన పెట్టగానే కలి ప్రభావం నశించి పశ్చాత్తాపం కలుగుతుంది.*


*అలా కలిని నియంత్రించ గలిగిన పరీక్షిత్తు కూడా తానే అతడి ప్రభావానికి లోనై చివరికి మరణాన్ని కొనితెచ్చు కుంటాడు.*



*3. కలి ప్రభావం - నల దమయంతుల కథ:* 


*************************************


*నల-దమయంతుల - స్వయం వరం:-* 


***********************

*దమయంతి స్వయంవరం ముగిసి, నలమహారాజును ఆమె వరించిన తరువాత అదే స్వయంవరానికి వచ్చిన అష్ట దిక్పాలకులు తిరిగి వెళ్లే టప్పుడు కలి పురుషుడు ఎదురవుతాడు.* 


*దమయంతిని వివాహ మాడడానికి వెళ్తున్నా నంటాడు. ఇంకెక్కడి వివాహం?.. స్వయంవరం ముగిసింది..*


*ఆమె నలుని వరించిందని చెబుతారు దిక్పాలకులు.* 


*ఇది తెలిసి కలిపురుషుడు నలమహారాజుపై క్రోధంతో వాళ్లెలా సుఖంగా ఉంటారో చూస్తానని ప్రతిన బూనుతాడు. కాని ధర్మబద్ధుడై, నిరంతరం దైవచింతన కలిగి, అరిషడ్వర్గాలను అదుపులో ఉంచుకునే నలమహారాజు దగ్గరికి కలి పురుషుడు వెళ్లలేకపోతాడు.*



*కాని ఒకరోజు దురదృష్టవశాత్తు మూత్ర విసర్జన అనంతరం కాళ్లు సరిగా కడుక్కోక హడావుడిగా వెళ్లిన నలుడిలోకి ప్రవేశించ గలుగుతాడు కలి.*


*ఇక అంతటి నలమహారాజు కూడా ధర్మం తప్పుతాడు.*


*మనసుపై నియంత్రణ కోల్పోతాడు. దాయాదులతో జూదమాడి రాజ్యం, సర్వ సంపదలు అన్నీ కోల్పోతాడు.* 


*భార్య దమయంతి ఎంత చెప్పినా వినిపించుకోడు. వెంటనే ఆమె సారథిని పిల్చి, పిల్లలిద్దరినీ పుట్టింటికి పంపించి వేస్తుంది.* 


*రాజ్యం దాయాదులకు అప్పగించి, నలదమయంతు లిద్దరూ అరణ్యాలకు బయల్దేరుతారు.*


*ఆకలి దప్పులతో బాధపడుతుంటారు. ఓరోజు పక్షులు తను కట్టుకున్న పంచెను కూడా లాక్కెళ్లి పోతాయి.*


*తను లేకుంటే భార్య సుఖపడుతుందని భావించిన నలుడు ఆమెను అక్కడే వదిలి వెళ్లిపోతాడు.*


*ఒకసారి*

*నల మహారాజా!*


*రక్షించు! అనే అరుపులు వినిపిస్తాయి. అరణ్యం కాలిపోతుంటే మంటల మధ్యలో కర్కోటకుడనే మహాసర్పం అరుస్తూ కనిపిస్తుంది. దాన్ని కాపాడి నదిలో వేయబోతుంటే కాటేస్తుంది. దాంతో అందమైన నల మహారాజు మరుగుజ్జు అయిన కురూపిగా మారిపోతాడు.* 


*నీకు సాయం చేసిన నన్నే కాటేశావెందుకంటాడు నలుడు. నీ అసలు రూపం నీ ప్రతిష్ఠను దెబ్బతీస్తుంది. నీకు మాత్రమే తెలిసిన అశ్వహృదయం విద్యతో రుతుపర్ణ మహారాజును ఆశ్రయించు.*


*నీకు అవసరం అయినప్పుడు నన్ను తల్చుకుంటే ఓ దివ్య వస్త్రం వస్తుంది. దాని సహాయంతో నీ స్వస్వరూపాన్ని పొందగలవని చెబుతాడు కర్కోటకుడు.* 


*************************


*నలుడు బాహుకుడనే పేరుతో రుతుపర్ణ మహారాజు దగ్గర వంటవాడిగా చేరుతాడు. అశ్వ హృదయ విద్య ద్వారా మొండి గుర్రాలను లొంగదీసుకోగలుగుతాడు.* 


*ఒక్క రాత్రిలోనే ఒక ఊరి నుంచి వేరే ఊరికి వెళ్లగలడు.*


*అరణ్యంలో ఉన్న దమయంతి భర్త కోసం వెదుకుతూ ఇద్దరు బ్రాహ్మణుల సాయంతో సుబాహుపురం చేరుతుంది. అక్కడ రాజమాత చూసి, తన దగ్గర పెట్టుకుంటుంది.*


*నల దమయంతుల జాడ తెలుసు కోవడానికి దమయంతి తండ్రి వేగులను పంపుతాడు. అలా సుబాహుపురం చేరిన వేగు ద్వారా రాజమాతకు ఆమె దమయంతి అని తెలుస్తుంది. తన పెద్దమ్మ దగ్గరే చేరానని అర్థమైన దమయంతి తన తండ్రి దగ్గరకు వెళ్లిపోతుంది.*


*ఆమె కొంతమంది బ్రాహ్మణులను పిల్చి అన్ని రాజ్యాలకు పంపిస్తుంది.*


*అర్ధరాత్రి సమయంలో అరణ్యంలో పతివ్రత అయిన తన అమాయకపు భార్యను వదిలి వెళ్లడం ధర్మమేనా? అలాంటి పురుషుడున్నాడా? అనే ప్రశ్న అన్ని సభల్లోనూ అడగమంటుంది.* 



*అలా రుతుపర్ణుడి రాజ్యానికి చేరిన బ్రాహ్మణుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పతివ్రత అయిన భార్య తన భర్త పరిస్థితి తెలుసుకోకుండా నిందించవచ్చా? అని అడుగుతాడు బాహుకుడి రూపంలో ఉన్న నలుడు.* 


*ఇది తెలిసిన దమయంతి ఆయనే నలమహారాజని నమ్ముతుంది. అందుకే దమయంతి ద్వితీయ స్వయం వర ఆహ్వాన మంటూ రుతుపర్ణుడికి మాత్రమే పంపించ మని తండ్రిని కోరుతుంది.*



*రుతుపర్ణుడు బాహుకుడిని వెంటబెట్టుకుని స్వయంవరానికి వెళ్తాడు.* 


*దారిలో నీకు అశ్వహృదయం విద్య తెలిస్తే నాక్కూడా మరో విద్య తెలుసునని, దాని ద్వారా చెట్టుకు ఎన్ని కొమ్మలు రెమ్మలు ఉన్నాయో సరిగ్గా లెక్క చెప్పవచ్చు నంటాడు రుతుపర్ణుడు. ఆ విద్యను నలుడికి ఉపదేశిస్తాడు.* 



*దాని మహిమ వల్ల కలిపురుషుడు, చెడులక్షణాలూ ఉండజాలవు. కాబట్టి నలుడి నుంచి కలి పురుషుడు బయటకు వస్తాడు. తనను సంహరించ ప్రయత్నించిన నలుడిని క్షమించమని నలుడి కాళ్లపై పడతాడు.*


*కర్కోటకుడు కాటు వేసినప్పటి నుండే నేను మంటలతో చచ్చిపోతున్నాను. నేనింక నీ జోలికి ఎప్పుడూ రాను. ఆ తాండ్ర చెట్టు దగ్గరే పడిఉంటానని వేడుకుంటాడు.*


*అప్పుడు మహారాజు స్వయంవరం చేరుకుంటాడు. హడావుడేమీ లేకపోవడంతో ఆశ్చర్యానికి లోనవుతారు.* 


*అప్పుడు దమయంతి సభలోకి వచ్చి అదే ప్రశ్న మళ్లీ వేస్తుంది.* 


*అది ధర్మం కాదు గానీ కలి ప్రభావం వల్ల అలా చేశానని చెబుతాడు నలుడు.* 


*ద్వితీయ స్వయంవరం కూడా నిన్ను చేరడానికేనని చెబుతుంది దమయంతి.*


*నలుడు కర్కోటకుడిని తలచుకుంటాడు. దివ్యవస్త్రం వస్తుంది.* 


*అది ధరించగానే విషప్రభావం నశించి, కురూపి రూపం పోయి, నలమహారాజులా మారిపోతాడు.*


*అప్పుడు కలి వచ్చి, రాబోయే కాలంలో నీ చరిత్రను పద్యరూపంలోనో, గద్యరూపంలోనో, మరే రూపేణా విన్నా, పాడినా, తలచినా వారి జోలికి వెళ్లనని వరమిస్తాడు*


*కలి నుండి మనం ఎలా తప్పించు కోగలం*


*****************************


_*ఈ కాలం పేరే కలి కాలం కలి ఎలాగైనా వెంటాడి తీరుతాడు. ఈ యుగం లో ధర్మం అడుగంటి ఉంటుంది. కావున ఎవరికైనా చిన్న సాయం చేసినా, కలి నుండి మనం కొంత తప్పించు కుంటాం .*_


_*మనస్ఫూర్తిగా రోజు ఒక్క సారైనా దైవ స్మరణ చేసిన చాలు కలి నుండి మనం కొంత తప్పించు కుంటాం .*_


_*దాన ధర్మం లు చేయడం,*_ 


_*పెద్దల శ్రాద్ధ కర్మలు మర్చి పోకుండా చేయడం, నోరు లేని జీవాలను ఆదరించడం,*_


_*కాశీకి వెళ్లినట్టు మనసులో తలచుకొన్న చాలు. కలి నుండి మనం కొంత తప్పించు కుంటాం.*_


_*దైవ సంబంధమైన చర్చల్లో భజనలలో, పాల్గొన్నాచాలు. కలి పురుషునికి దూరంగా ఉండవచ్చు.*_


_*ప్రతి ఒక్కరు నిత్యం ఒక్కసారైనా క్రింది పద్యాన్ని స్మరిస్తే కలి భయం ఉండదు.*_


_*"కర్కోటకస్య నాగస్య దమయంత్యాః నలస్యచ!*_


_*ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలి నాశనం!*_


_*దమయంతి నలాభ్యాంచ ప్రణమామి పునః పునః*_🙏

కామెంట్‌లు లేవు: