12, జూన్ 2021, శనివారం

మంత్రం అందరికి

 *మంత్రం అందరికి ఎందుకు సిద్దించడం లేదు ?*


మంత్ర సాధనా నియమాలలో కొన్నైనా ఈ నేపథ్యంలో చెప్పుకుందాం.


ఒక మంత్రం కానీ, పూజ కానీ పరిహారంగా చేయమని చెప్పినప్పుడు దానికి లక్షల్లో జపం చేయమని ఎవ్వరూ చెప్పరు....ఎందుకంటే అవి పరిహారం కోసం ఇవ్వబడ్డాయి. సమస్యని తొలగించి, ఉపశమనం కలిగించే మంత్రాలు అవి. 


ఇన్ని వారాలు, లేదా ఇన్ని రోజులు, ఇన్నిసార్లు చేయాలి అనే నియమమే ఉంటుంది.....{సందర్భాన్ని బట్టి మారుతుంది}


సిద్ది పొందడానికి చేసే ఉపాసనలు మటుకే, దశమభాగం విధులు చేయాలి. గనుక దాన్ని లక్షల్లో జపం చేయవలసి ఉంటుంది..


ఏదైనా సమస్య పరిష్కారం కావాలి అని ఆ మంత్రం జపం చేస్తే పని అయిపోతుంది అని ఎప్పుడెప్పుడు జపం పూర్తి అయిపోతుందో దానిపైనే దృష్టి పెట్టి ఉంటారు , కానీ భక్తి శ్రద్ద అనేది ఉండదు. ఏ మంత్రాన్ని అయితే జపం చేస్తున్నామో ఆ మంత్రాదిష్ఠాన దేవత పైన భక్తి ఉండాలి, 


ఆ దేవతా స్త్రోత్రం చేయాలి. త్రికరణ శుద్ధితో జపం చేయాలి. 


జప సంఖ్య కన్నా కాస్త ఎక్కువ సార్లు చేయాలి. 


జపం చేసే వాళ్ళు మాసిన వస్త్రాలు ధరించకూడదు. నిన్న కాసేపు వేసుకున్నదే కదా అని మరుసటి రోజు ధరించ కూడదు.... మెడలో ధరించిన మాలని జపానికి వాడకూడదు.


శ్వాసలో దుర్వాసన రాకూడదు, పొద్దు వచ్చాక స్నానం చేయాకుడదు.....


అనగా ఋషి స్నానమే చేయాలి. మీరు జపం ఆలస్యంగా మొదలు పెట్టిన స్నానం మటుకు సూర్యోదయం కి ముందే చేయాలి. 


ఇది చాలా మందికి తెలియక 7,8,9 అలా ప్రొద్దెక్కిన తర్వాత స్నానం చేయడం వల్ల జప ఫలితము కూడా దక్కదు.. ఇది నిజం. స్నానానికి

 అంత  ముఖ్యమైన పాత్ర ఉందా! అనుకోకండి. 


మీరు ఒక నెల రోజులు పాటు వరుసగా , వేకువ ఝామునే, 4- 00 గంటలకే  స్నానం ముగించండి. (ఈ సమయంలో చేసే స్నానమే ఋషి స్నానం).


మీరు చేసే పూజ కానీ జపం కానీ ఎంత త్వరగా ప్రభావం చూపిస్తుందో చూడండి......సూర్యుడికి  అర్ఘ్య ప్రదానం చేస్తే రోజు మీకు అన్నివిధాల శుభం కలుగుతుంది. 


కొన్ని మంత్ర జపాలకు మటుకే ఆహార నియమం పాటించాలి, కానీ అన్ని పరిహారాలకు ఆహార నియమం అవసరం లేదు. మంత్ర సాధన ఉన్నంత కాలం....శాకాహారం తినడమే ఉత్తమం.


ఏ మంత్ర జపం, ఏ పరిహారం చేసే వాళ్ళు అయినా వారి కుల దేవతని మంగళవారం విశేషం గా ఆరాధించాలి. 


బియ్యం పిండితో దీపం పెట్టి స్త్రోత్రం చేసి దేనికోసం పరిహార జపం చేస్తున్నారో అది ఫలించే లాగా అనుగ్రహించమని సంకల్పం చేయాలి. అప్పుడు ఆటంకాలు రాకుండా కులదేవత కూడా అనుగ్రహిస్తుంది..


వివాహం ,ఉద్యోగం, వృత్తి వ్యాపారాలు, ఆస్తి తగాదాలు, శత్రు బాధలకై ముఖ్యంగా పరిహారం చేసుకుంటూ ఉంటారు. 


ఎంత కోపం ఉన్నా జపం చేసే సమయంలో కోపంతో జపం చేయాకుడదు.. మీకు ద్రోహం చేసి వారు అయితే ఖచ్చితంగా వారికి ఎలాగో శిక్ష పడుతుంది. కానీ ఉపాసించే మంత్రం జపం చేస్తూ మనసులో శతృభావంతో చేయాకుడదు. అది మీకు కూడా మంచిది కాదు , ఎవరు తప్పు చేశారో ఖచ్చితంగా తెలియనప్పుడు *ఆముకం* దగ్గర శత్రువు అనిపెట్టాలి. కానీ ఎవరి పేరు చదవకూడదు .


దేవీ ఉపాసన మంత్రాలు స్ట్రోత్రాలు చదివే వారు ముందు గా గణేషుడి కి నమస్కారం చేసి దక్షణామూర్తి ని స్త్రోత్రం చేసే దేవీ ఉపాసన మొదలు పెడితే పూజ ఫలిస్తుంది..


 అలాగే దశమహావిద్యల లోని దేవతలను పూజిస్తూ ఆరాధిస్తూ, ఆ మంత్రం జపం చేసే వాళ్ళు, బైరవుడి ని ఆరాధించి ఆ మంత్రం జపించి తర్వాత ఆ దేవత ఆరాధన మొదలు పెట్టాలి.... అప్పుడే ఆ సాధన ఫలిస్తుంది. లేకుంటే ఎంత చేసినా ఫలితం త్వరగా రాదు.


రాహుకాలంలో భోజనం చేసిన, స్నానం చేసిన, మైధునం జరిగిన మీరు చేసుకున్న జప ఫలితం, పూజ ఫలితం అంతా రాహువుకి పోతుంది.. ఆ సమయం దాటాక భోజనం చేయాలి. 


లేదా ముందుగా చేయాలి.. అటువంటి పగటి సమయంలో గర్భం నిలిస్తే తల్లితండ్రులను హింసించే పిల్లలు పుడతారు. 


లేదా పిల్లల వల్ల ఏదో విధంగా బాధ పడుతూనే ఉంటారు..ఇది కొత్త దంపతులు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలి. 


పొద్దు వాలే సమయం అంటే సూర్యుడు అస్తమించే సమయంలో కూడా ఇవే నియమాలు పాటించాలి. 


అయితే సూర్యుడు అస్తమించే సమయంలో స్నానం చేసిన పర్వాలేదు కానీ భోజనం నిద్ర చేయాకుడదు.


మంత్ర జపం చేస్తున్నవారు ఎవరితో గొడవ పడకూడదు, దూషించ కూడదు, అమాయకులను బాధ పెట్టకూడదు ఎవ్వరిని కాలితో తన్న కూడదు...


కాకికి , కుక్కకి తరచుగా అన్నం పెట్టడం వల్ల మీ దోషాలు చాలా వరకు తగ్గుతుంది.... జప సంఖ్య పూర్తి అయ్యాక వదిలేయ కూడదు. కొద్దిగా అయినా రోజు కాసేపు జపం చేస్తూ ఉండాలి.....


లేదా ఇంట్లో శుభకార్యం జరగాలి అని కోరుకొని సుందరకాండ పారాయణం, లలితా సహస్రనామం  పారాయణ చేయండి మీకు మీ కుటుంబానికి మంచి కలుగుతుంది.

కామెంట్‌లు లేవు: