11, ఆగస్టు 2023, శుక్రవారం

ఉత్తమ ధర్మాచరణం

 🎻🌹🙏 ఉత్తమ ధర్మాచరణం..!!

           

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌸ధర్మం నాలుగు విధాలుగా తెలుపబడినది. 

సామాన్య ధర్మం, 

క్షేమ ధర్మం, 

విశేష ధర్మం, 

విశేషేతర ధర్మం 

అనేవి.


🌿తల్లితండ్రులను భార్యా పిల్లలను  ఆదరంగా చూసి  పోషించడం, 

ఓర్పు, సహనాలతో జీవించడం సామాన్య ధర్మం.శీరాముని ఆదర్శ జీవితం సామాన్య ధర్మంలోనే చేరుతుంది.  


🌸శ్రీ రామునికోసమే జీవించిన లక్ష్మణుడు  14 సంవత్సరాలు నిద్రాహారాలు  మాని శ్రీ రామునికి రక్షకునిగా వుండడం విశేష ధర్మం అంటారు. విశేష ధర్మంలో సామాన్యధర్మం కూడా లీనమై వుంటుంది.


🌿శ్రీ రాముని వెతుకుతూ వనములకు వెళ్ళి , రాముని పాదుకలు శిరము పై దాల్చుకుని వచ్చి శ్రీ రాముడే రాజ్యం పాలిస్తున్నట్టు  చిత్రకూటంలో రాజ్యాన్ని పరిపాలించడం  విశేష ధర్మం గా చెప్ప బడుతున్నది.


🌸ఆ విధంగానే  కర్ణుని కన్న తల్లి కుంతి , తన బిడ్డను పెంచే భాధ్యతైన సామాన్య ధర్మాన్ని వదలి , నదిలో వదలి పెట్టడం అధర్మం. కాని బిడ్డను  పెంచి  పెద్ద చేసిన రధసారధి భార్య  చేసినది విశేష ధర్మం.


🌿రావణుడు చేసిన తప్పులు అతనికి ఎత్తి చూపినా, వినిపించుకోని

అన్నగారికి  సహాయంగా వున్న కుంభకర్ణునిది సామాన్య ధర్మం లో చేరుతుంది. 


🌸కాని ,అన్నగారైన రావణుని తప్పులు ఎత్తి చూపిన విభీషణుడు , రాజ్యము నుండి రావణునిచే వెళ్ళ గొట్టబడి  , శ్రీ రాముని శరణుకోరడం విశేష ధర్మం.

ఆశ్రమంలోకి పరిగెత్తుకు వచ్చిన గోవుని  చూశాడుఋషి.  


🌿గోవు వెనకాల గోవుని చంపడానికి  వచ్చిన వారు, ఋషిని గోవు రావడం చూశావా అడుగగా , కళ్ళు చూసినవి.. నోరు చెప్పదునోరు చెప్పేది కళ్ళు చూడవు ..అని బదులిచ్చిన ఋషిని, 

'అడవిలో వున్న పిచ్చి వాడని ' ఎగతాళి చేసివెళ్ళి పోయారు. 


🌸సామాన్య ధర్మం అబధ్ధం 

చెప్పకూడదు..సత్యం చెప్పాలి.   కాని గోవుని  రక్షించడానికి  ఋషి చేసినది విశేష ధర్మం.బాలుడైన కృష్ణుని అల్లరి భరించలేని యశోద ,  కృష్ణుని పట్టుకుందుకి వచ్చినది. 


🌿ధధి భాండుడు అనేవాని  ఇంటిలో  ని పెద్ద బానలో దాగాడు బాలకృష్ణుడు.ధధి భాండా! కృష్ణుని చూశావా?  అని యశోద అడిగినదానికి, నేను కృష్ణుని చూసే చాలా రోజులైనదని అబధ్ధం చెప్పి యశోద నుపంపివేసిన   ధధి భాండుడుచేసినది విశేష ధ‌ర్మంగా

పెద్దలు  కీర్తిస్తారు.


🌸తండ్రి మాట వేద వాక్కుఅని సామాన్య ధర్మం తెలుపుతుంది. కాని ప్రహ్లాదుడు తన తండ్రి చెప్పినట్లు ,ఓం హిరణ్యాయ నమః అని అనకుండా ,  ఓం నమో నారాయణాయ నమః

అని జపించడం విశేష ధర్మం. 


🌿భక్తదాసులకు చేసే సేవ 

విశేషతర  ధర్మం గా తెలుప బడుతున్నది.శీరాముని కై జీవించిన భరతుని చరణాలు నమ్మినవాడు శతృఘ్నుడు.శబరి తన గురువుగారైనా మతంగముని ఉపదేశానుసారం జీవితాంతం శ్రీరామ మంత్రాన్నే జపిస్తూ వచ్చింది. 


🌸శ్రీ రాముడు శబరికి దర్శనమిచ్చాడు.శ్రీ రాముని దర్శనంకాగానేఆచార్యుడు చెప్పినట్టు

శబరికి ముక్తి లభించింది. శబరి గురుభక్తి ముక్తిని లభింప చేసింది. 


🌿ఆళ్వారులు  శతృఘ్నుడు,

శబరి, వీరంతా  దేవునిపట్ల గల భక్తి కంటే కూడా తమ ఆచార్యులయందు

కలిగిన భక్తిని  'విశేషేతర ధర్మం' గా  చెప్పారు. అన్ని ధర్మాలలోను ఉన్నతమైన  ధర్మం విశేషేతర ధర్మం...🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

కామెంట్‌లు లేవు: