3, డిసెంబర్ 2023, ఆదివారం

 *జైశ్రీరామ్*


                               25-5-2020

                               అభ్యాసం-18


                            *సుభాషితం*


"యత్ర నార్యస్తు పూజ్యంతే

  రమంతే తత్ర దేవతాః |

  యత్రైతాస్తు నపూజ్యంతే

  సర్వాస్తత్రా ఫలాక్రియః"||

                            (మనువు)


                             *భావం* 


ఎక్కడ స్త్రీలు పూజింప బడతారో అక్కడ దేవతలు నివసిస్తారు.

ఎక్కడ స్త్రీలు పూజింపబడరో అక్కడ చేసిన కార్యాలన్నీ,పుణ్యకార్యాలతో సహా నిష్ఫలమౌతాయి.


                     *అమృతవచనం* 


 *శ్రీమాత* ఇలా అన్నారు:

ప్రపంచపు మేలుకోరి *భారతదేశాన్ని* రక్ఛించుకోవాలి.ఎందుకంటే ప్రపంచానికి శాంతిని,ఒక నూతన వ్యవస్థను ఒక్క భారతదేశం మాత్రమే అందించ గలుగుతుంది.భారతదేశ భవిష్యత్తు చాలా స్పష్టంగా ఉంది.భారతదేశం జగద్గురువు.ప్రపంచ భవిష్యత్ వ్యవస్థ కూడా భారతదేశం మీదనే ఆధారపడి ఉంది.ఆథ్యాత్మిక జ్ఞానాన్ని ప్రపంచంలో నిలబెట్టే ప్రయత్నం కేవలం భారతదేశమే చేస్తున్నది.


                       శ్రీవేంకటేశ్వర్లు వబిలిశెట్టి


.

కామెంట్‌లు లేవు: