6, మార్చి 2025, గురువారం

వృషాధిపశతకంలోనిది

 

       ఈపద్యం  పాల్కురికి సోమన రచయించిన వృషాధిపశతకంలోనిది

      "

"బలుపొడతోలు  సీరయును బాపసరుల్ గరుపారుకన్ను వె

      న్నెలతల  చేదుకుత్తుకయు  నిండినవేలుపుటేరు పల్గుపూ

      సలుగలరేని లెంకనని  జానుతెనుంగున విన్నవించెదన్

      వలపు మదిందలిర్ప బసవా   బసవా  వృషాధిపా!!"

     మచ్చలుగల గజచర్మమే వస్ర్తం. పాములేహారాలు .  వంకరటింకరకళ్ళు . వెన్నెలనిండినతల. నెలవంకధారణ.

      కంఠంలోవిషం.  తలపైనగంగ. పుర్రెలహారం .,ఇదీ ఆయవ వ్యవహారం.

 

పరమశివా! 

ఇట్టినీకుసేవకుడనని ప్రేమతోపలుమార్లు  జానుతెనుగులో విన్నవిస్తాను

       బసవా బసవా అంటూస్మరిస్తాను

           అంటూకవివృషాధిపశతకం రచించాడు. ఇందులో మనం గమనింపతగినది  "జానుతెనుగు'-   అంటేనాటి వ్యవహారంలోఉన్న

           తెలుగన్నమాట',


పైపద్యస్వరూపమంతాజానుతెనుగే!!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷💐💐🌷🌷🌷

కామెంట్‌లు లేవు: