శ్రీమద్భగవద్గీత: తొమ్మిదవఅధ్యాయం
అక్షరపరబ్రహ్మయోగం:శ్రీ భగవానువాచ:
అశ్రద్దధానాః పురుషా ధర్మస్యాస్య పరంతప
అప్రాప్య మాం నివర్తంతే మృత్యుసంసారవర్త్మని (3)
మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా
మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః (4)
అర్జునా.. ఈ ధర్మంపట్ల శ్రద్ధలేని పురుషులు నన్ను పొందకుండా మరణరూపమైన సంసారపథంలో పరిభ్రమిస్తారు. ఇంద్రియాలకు కనుపించని నా రూపం ఈ విశ్వమంతా వ్యాపించి వున్నది. సకలజీవులూ నాలో వున్నాయి; నేను మాత్రం వాటిలో లేను.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి