🙏🚩🙏🚩🙏
(రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ వేదవ్యాస మహర్షికి జై)
తేదీ 10-07-25 గురువారం వ్యాస పూర్ణిమ దీనినే గురు పూర్ణిమ అంటారు.
సృష్టికి ఆధారమైన వేదాలను నాలుగు భాగాలుగా సులభతరం చేసి అందించినందుకు వీరు వేద వ్యాసుడు అని పిలువబడుతారు.
(🌝వ్యాస మహర్షి🌝)
శ్రీ మహాభారతం,భాగవతం, అష్టాదశ (18) పురాణాలను రచించారు.
ముఖ్యంగా హిందువులు అందరూ గ్రహించవలసిన విషయం ఏమిటంటే వ్యాస మహర్షి సప్త(7) చిరంజీవులలో ఒకరు, వీరి అవతారానికి మరణం లేదు.
ఇప్పటికీ ఎప్పటికీ ఈ సృష్టిలో జీవించి ఉండే శ్రీ వ్యాస మహర్షిని గురు పూర్ణిమ రోజున అందరూ స్మరించాలి,పూజించాలి, వీరినే ఆరాధించాలి, అంతేకాని మన ధర్మానికి సంబంధం లేని అన్యమతస్థులను గురువులుగా భావించకూడదు.
ఈ సత్యాన్ని ప్రతీ ఒక్కరూ మీ పిల్లలకు తెలియజేయండి.
గురు పరంపరలో మూలగురువైన శ్రీ వేదవ్యాస మహర్షికి గురుపూర్ణిమ రోజున జై అని చెప్పించండి.
ఆ చిరంజీవికి అదే మనమిచ్చే గురు కానుక.
మీ గురువులను గురు సమానమైన వారిని కూడా వ్యాస పౌర్ణమి రోజున పూజించవచ్చు.
🙏అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ వేదవ్యాస మహర్షికి జై
🙏🚩🙏🚩🙏
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి