31, ఆగస్టు 2025, ఆదివారం

సోమవారం 25 ఆగస్టు 2025🕉️*

 🔯🌹🌷🪔🛕🪔🌷🌹🔯

*🕉️సోమవారం 25 ఆగస్టు 2025🕉️*

                        4️⃣2️⃣

                    *ప్రతిరోజూ*

*మహాకవి బమ్మెర పోతనామాత్య*


         *శ్రీమద్భాగవత కథలు*```


(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా)```


*వేదాలు వేయి సార్లు చదివినా లభ్యం కాని ముక్తి, భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది..!*``


*జంబూద్వీపంలో భారతవర్షం కర్మభూమి*             

```

వర్షాలన్నింటిలోను భారత వర్షమే కర్మక్షేత్రం. ఏ వర్షంలో ఎవరు ఎలాంటి సుఖదుఃఖాలను అనుభవించినా దానికి కారణాలైన పుణ్యకర్మలనీ, పాప కర్మలనీ ఆచరించే స్థలం భారత వర్షం. మిగతా ఎనిమిది వర్షాలు పుణ్యకర్మలను అనుభవించే స్థానాలు, పుణ్యకర్మలను అనుభవించే స్థానానికి స్వర్గం అని పేరు. ఆ కర్మలో కొంతమేరకు కర్మఫలాన్ని అనుభవించి, మిగులు ఉండగా జీవులు భూమిని చేరుతూ ఉంటారు. అలా చేరి, మిగిలి ఉన్న పుణ్యఫలాలను అనుభవిస్తారు. వాటిని భౌమ స్వర్గాలని అంటారు. అలాంటి భౌమ స్వర్గాలు ఎనిమిది వర్షాలు. దానికి మూలమైన పుణ్యాన్ని ఆచరించే స్థానం భారత వర్షం. ఇక శ్రేష్టమైన భారత వర్షం కథ ఏమిటంటే:


స్వాయంభువ మనువుకు ప్రియవ్రతుడు అనే కొడుకు జన్మించాడు. అతడికి అగ్నీధ్రుడు అనే కుమారుడు పుట్టాడు. అతడికి నాభి అనే వాడు పుట్టి బలి చక్రవర్తితో స్నేహం చేశాడు. సమస్త భూమండలాన్ని పాలించాడు నాభి అతడికి ఋషభుడు అనే సద్గుణవంతుడైన కొడుకు పుట్టాడు. అతడి కొడుకుల్లో పెద్దవాడైన భరతుడు ఘోరమైన తపస్సు చేసి, మనస్సును సంసార బంధాల నుండి మళ్లించి చివరకు వాసుదేవుడిని చేరుకున్నాడు. ఆ పుణ్యాత్ముడు ఏలిన భూమండలానికి అతడి పేరుమీద 'భారతవర్షం' అని ఏర్పడి, క్రమేపీ జగత్వసిద్ధం అయింది.


ఇలావృతం మొదలుగా గల తొమ్మిది వర్గాలలోనూ భగవానుడైన నారాయణుడు అవతరించి, నిత్యం లోకాలను అనుగ్రహిస్తూ, లోకులందరికీ జ్ఞానం ఇస్తాడు. ఇలావృత వర్గానికి అధిపతి త్రిపురాలను హరించిన రుద్రుడు. భద్రాశ్వ వర్షానికి అధిపతి భద్రశ్రవుడు. హరి వర్షానికి అధిపతి నరసింహస్వామి. కేతుమాల వర్షంలో భగవానుడు కామదేవుడు (ఈయన్నే ప్రద్యుమ్నుడు అని అంటారు) అనే పేరుతో లక్ష్మీదేవికి ప్రీతి కలిగిస్తూ ఉంటాడు. ఈ వర్షానికి అధిపతులు ప్రజాపతైన సంవత్సురిడి కుమార్తెలు, కుమారులు. కొడుకులు పగళ్లు, కూతుర్లు రాత్రులు. రమ్యక వర్షానికి అధిదేవత మత్స్యరూపంలో ఉంటాడు. అతడు హరే! ఈ వర్షాధిపతి మనువు. ఇతడు మత్స్యమూర్తిని ఆరాధిస్తుంటాడు. ఇక హిరణ్మయ వర్షం అధినేత కూర్మావతార రూపుడైన పద్మగర్భుడు శ్రీమహావిష్ణువు. పితృదేవతల అధిపతియైన అర్యముడు హిరణ్మయవర్ష పాలకుడు. ఉత్తర కురు భూములకు వరాహదేవుడు అధిపతి. భూదేవి అతడికి పూజ చేస్తుంటుంది. కింపురుష వర్షానికి సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామభద్రుడు అధిపతి. భారత వర్గానికి అధిపతి నారాయణుడు. బదరికాశ్రమంలో నరుడితో కలిసి తపస్సు చేశాడు. భారత వర్షంలో ఎన్నో పుణ్యశైలాలు, గంబీరంగా ప్రవహించే అనేక నదులు ఉన్నాయి. అవి...


పుణ్యశైలాలు: మలయ పర్వతం, మంగళ ప్రస్థం, మైనాకం, ఋషభం, కూతకం, కొల్లకం, సహయం, వేదగిరి, ఋష్యమూకం, శ్రీశైలం, వేంకటాద్రి, మహేంద్రం, వారిధరం, వింధ్యపర్వతం, శుక్తిమత్పర్వతం, ఋక్షగిరి, పారియాత్రం, ద్రోణపర్వతం, చిత్రకూటం, రైవతకం, కుకుభం, నీలగిరి, గోకాముఖం, ఇంద్రకీలం, రామగిరి మొదలైనవి.


 *పవిత్ర నదులు:* పైన చెప్పిన పర్వతాలకు పుత్రికలైన పుణ్యనదులు: చంద్రపట, తామ్రపర్ణి, కృతమాల, వైహాయాసి, కావేరి, వేణి, పయస్విని, పయోద, శర్కరావర్త, తుంగభద్ర, కృష్ణవేణి, భీమరథి, గోదావరి, నిర్వింధ్య, పయోష్ఠి, తాపి, రెవ, సురస, చర్మణవతి, వేదస్మృతి, ఋషికుల్వ, త్రిసోమ, కౌశికి, మందాకిని, యమునా, సరస్వతి, దృషద్వతి, గోమతి, సరయువు, భోగవతి, సుషోమ, శతద్రువు, చంద్రభాగ, మరుద్వరుథ, వితస్త, అసిక్ని, విశ్వ అనే మహానదులు. నర్మదానది, సింధువు, శోణ అనే నదాలు భారత వర్షంలో ప్రవహిస్తున్న మహా ప్రవాహాలు. వీటిల్లో పవిత్రంగా స్నానాలు చేస్తే మానవులు ముక్తిని పొందుతారు.


భారత వర్షం ఎంతో ఉత్తమమైనదని మహాపురుషులు స్తుతిస్తారు. భారత వర్షంలో జన్మించిన వారి భాగ్యాన్ని వర్ణించి చెప్పడం సాధ్యం కాదు. భారత వర్షంలో శ్రీహరి ఎన్నో అవతారాలను ఎత్తి, జీవులకు తత్త్వం ఉపదేశించాడు. అందువల్ల భారత వర్షంలోని జనులకు సాధ్యం కానిదేదీ లేదు. నారాయణుడిని స్మరించడం వల్ల సకల పాపాలు నశిస్తాయి. భారత వర్షంలో ఒక్క క్షణకాలం మనఃపూర్వకంగా సర్వ సంగ పరిత్యాగం చేస్తే, అతడు పురుష శ్రేష్ఠుడు అవుతాడు. ఒక్కమాటలో చెప్పాలంటే, భారత వర్షం మోక్షాన్ని పొందడానికి అనువైన కర్మ భూమి, యజ్ఞాభూమి.


జంబూ ద్వీపానికి చుట్టూ లక్ష యోజనాల మేర ఉప్పు సముద్రం చుట్టి ఉన్నది. ప్లక్ష ద్వీపానికి చుట్టూ చెరకు రసం నిండిన సముద్రం ఉన్నది. అది రెండు లక్షల యోజనాల మేర చుట్టి ఉన్నది. ద్వీప మధ్య భాగంలో పక్షం అనే జువ్వి చెట్టు ఉన్నది కాబట్టి ఈ ద్వీపానికి ప్లక్ష ద్వీపం అన్న పేరు వచ్చింది. అగ్నిదేవుడు దీనికి అధిపతి. (ప్రియవ్రతుడి కొడుకు ఇధ్మజిహ్వుడు దీని పాలకుడు). ఈ ప్లక్ష ద్వీపాన్ని ఏడు వర్షాలుగా విభజించడం జరిగింది. అవి శివ, యశస్య, సుభద్ర, శాంత, క్షేమ, అమృత, అభయ అనేవి.


ఈ సప్త వర్షాలకు సప్త కుల పర్వతాలున్నాయి. వాటి పేర్లు: మణికూటం, వజ్రకూటం, ఇంద్రసేనం, జ్యోతిష్మంతం, ధూమ్రవర్ణం, హిరణ్యగ్రీవం, మేఘమాలం. ఈ వర్షాలకు సప్త మహానదులున్నాయి. అవి: అరుణ, నృష్ణ, అంగిరసి, సావిత్రి, సుప్రభాత, ఋతంబర, సత్యంభర అనేవి. ప్లక్ష ద్వీపానికి ముందు, జంబూద్వీపానికి మధ్య లవణ సముద్రం ఉన్నట్లే, ప్లక్ష శాల్మలీ ద్వీపాలకు మధ్యలో ఇక్షురస జలంతో నిండిన ఇక్షురస సముద్రం ఉన్నది. ఇది రెండు లక్షల యోజనాల విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఇక్షురస సముద్రానికి రెట్టింపు వైశాల్యం కలిగినది శాల్మలీ ద్వీపం.


                  *(సశేషం)*

*🙏కృష్ణం వందే జగత్ గురుమ్!🙏*


        *రచన: శ్రీ వనం*

  *జ్వాలా నరసింహారావు*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*                           

            🌷🙏🌷``


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

రాధాదేవి

 *రాధాదేవి.....* ( రాధాష్టమి సందర్భంగా]


*బృందావనంలో 'భక్తి' విశ్వరూపాన్ని చూడవచ్చు. బృందావనవాసులు కృష్ణుణ్ని తమ ఇంటిలో సభ్యుడిగా భావిస్తారు. బృందావనంలో శ్రీకృష్ణుడి విగ్రహం ప్రతి గృహంలో పూజా మందిరంలో గాక, నట్టింట్లో ఉంటుంది. బృందావనం రాధాకృష్ణుల విహారభూమి.*


*ఈ 'రాధ' ఎవరు?- ఈ ప్రశ్నకు భాగవతంలో సమాధానం కనిపించదు. ప్రజభాగవతం రాధ కథను రసరమ్యంగా రమణీయంగా అభివర్ణిస్తుంది. 'బృందావనంలో ఇప్పటికీ రాధాదేవి నామం అన్ని సందర్భాల్లో అందరి నోటా వినిపిస్తుంది. బండి తోలేవాళ్లు సైతం అడ్డువచ్చే జనాన్ని పక్కకు తొలగమని చెప్పడానికి 'రాధే రాధే' అంటారు. తమ ఇంటిలో దేవుడున్నాడనిగాక, దేవుడి ఇంటిలో తామున్నామని భావించుకుంటారు. భక్తిరసం ప్రతి ఇంటా పొంగుతుంది.*


*లాక్షణికులు రసాలు తొమ్మిది అని పేర్కొన్నారు. వాటిలో భక్తిని రసంగా ఎవరూ చెప్పలేదు. భాగవతం విన్నవారు భక్తిరసాన్ని ఆస్వాదిస్తారు. పోతనామాత్యుడి భాగవతం* *చదివినవారెవరైనా భక్తిని రసంగా అంగీకరిస్తారు.*


*రాధాకృష్ణుల విహారభూమి బృందావనం 'ధామం' దేవతల నివాస భూమిని ధామం అంటారు. బృందావనంలో మనం సంచరించేటప్పుడు మారుమూల ప్రదేశాల్లో సైతం రాధాకృష్ణ కీర్తనం వినిపిస్తుంది. శ్రీకృష్ణుడు పూర్ణావతారమని చెబుతూ, ఆ స్వామి లీలావతారమని, ఆయనను సంకీర్తనం చేయడం ద్వారా మనకు విజయం కలుగుతుందని చైతన్య మహా ప్రభువు పలికాడు. అటువంటి కృష్ణుని చేరే మార్గం ఏది ? కృష్ణుడే స్వయంగా ఆ మార్గాన్ని చెబుతాడు- 'రాధను ధ్యానం చేయకుండా ఎవరూ నా కృపను పొందడం జరగదు... ఇది ముమ్మాటికీ నిజం'!*


*రావల్ గ్రామం బృందావన సమీపంలో ఉంది. కీర్తిదేవి వృషభానులకు రాధాదేవి కుమార్తె భాద్రపద శుద్ధ అష్టమినాడు ఈ బాలిక పుట్టినప్పుడు ఆ దివ్య బాలికను చూసి నారదుడు స్పృహ తప్పి పడిపోయాడు. స్పృహలోకి వచ్చిన తరవాత తాను చూస్తున్నది "గోలోక నాయిక" అని గుర్తించాడు. నారదుడు రాధను స్తుతించి, ఆమె తల్లిదండ్రులను దీవించాడు. పుట్టినప్పుడు రాధకు చూపు లేదు. ఆ బిడ్డను చూడాలని బంధుమిత్రులు ప్రతిదినం వెళ్తూ ఉండేవారు. బాలకృష్ణను చంకనవేసుకొని యశోదమ్మ కూడా వెళ్లింది. యశోదమ్మ చిన్ని కన్నయ్య అమ్మ చంకలో ఉండే రాధను చూశాడు. రాధ కన్నులు తెరిచింది. ఆ గోలోక దేవత భూమిపైకి వచ్చిన తరవాత మొదటగా కృష్ణుణ్ని చూడాలనే కోరిక తీరింది.*


*రాధాదేవి పెరిగి పెద్దదై మెరుపు తీగలాగా మెరిసిపోతున్నది. కృష్ణుడు పెరిగి పెద్దవాడై జగన్మోహనుడయ్యాడు. సూర్యదేవాలయంలో ఇరువురూ కలుసుకున్నారు. రాధాకృష్ణుల ప్రేమకు రాధాకృష్ణుల ప్రేమే సాటి.*


*రాధాదేవి తులసికి పంచామృతాలతో అభిషేకించి, ప్రదక్షిణ చేసింది. తులసీదేవిని మంత్రంతో జపించేది. తులసి మాత సంతోషించి రాధాదేవికి ప్రత్యక్షమైంది. 'రాధా! నువ్వు మానవజాతిలో జన్మించిన గోలోకేశ్వరివి. నీ ప్రియుడైన కృష్ణుడితో నీకు కల్యాణం తప్పక జరుగుతుంది. బ్రహ్మదేవుడి పౌరోహిత్యంలో నీకు పెండ్లి జరుగుతుంది!' అని తులసీదేవి రాధా దేవిని దీవించింది. ఆమె చెప్పినట్లుగా బ్రహ్మ దేవుడు వచ్చి వారికి వివాహం జరిపాడు.*


*తాము గోలోక నాయికా నాయకులు అన్న సంగతిని రాధాకృష్ణులు స్మరించుకున్నారు. వారి బృందం గోవులూ గోపాలురుగా జన్మలెత్తారు. రాధాకృష్ణులు విహరించే ఆ నేల పవిత్రత సంతరించుకుంది. దివ్యానంద రసానంద ప్రదాయిని రాధాదేవిని 'రసేశ్వరి'గా భావిస్తారు.*


*┈┉━❀꧁మాత్రేనమః꧂❀━┉┈*

        *ఆధ్యాత్మిక అన్వేషకులు*

🌺📿🌺 🙏🕉️🙏 🌺📿🌺

వామ‌న జ‌యంతి*

 *వామ‌న జ‌యంతి*

*2025 సెప్టెంబ‌ర్ 4 వ తేదీ,*


 భాద్రపద మాసంలోని శుక్ల పక్ష ద్వాదశి నాడు వామ‌న జ‌యంతి జరుపుకుంటారు.

 విష్ణువు ఐదవ అవతారం వామనుడి అవ‌తారం.

 ద‌శావ‌తారాల‌లో పూర్తి మానవుడిగా అవ‌త‌రించిన తొలి అవ‌తారం వామ‌నావ‌తారం.


 వామ‌న అవ‌తార స‌మ‌యాన్ని పోత‌న గారు ఇలా వ‌ర్ణిస్తున్నారు...


రవి మధ్యాహ్నమునం జరింప, గ్రహతారాచంద్రభద్రస్థితిన్

శ్రవణద్వాదశినాఁడు, శ్రోణ నభిజిత్సంజ్ఞాత లగ్నంబునన్

భువనాధీశుఁడు పుట్టె, వామనగతిం బుణ్యవ్రతోపేతకున్

దివిజాధీశ్వరు మాతకుం బరమపాతివ్రత్య విఖ్యాతకున్.


పుట్టిన వెంట‌నే, త‌న అవ‌తార కార్యాన్ని నెర‌వేర్చ‌డానికి, వ‌టువు రూపంలో బ‌లి చ‌క్ర‌వ‌ర్తి య‌జ్ఞం చేస్తున్న చోటుకి వెళ్లాడు వామ‌నుడు.


వామ‌నుడిని చూసి అక్క‌డి వారు,


శంభుండో ,హరియో పయోజభవుఁడో చండాంశుఁడో వహ్నియో

దంభాకారత వచ్చెఁ గాక ధరణిన్ ధాత్రీసురుం డెవ్వడీ

శుంభద్యోతనుఁ డీ మనోజ్ఞ తనుఁ" డంచున్ విస్మయభ్రాంతులై

సంభాషించిరి బ్రహ్మచారిఁ గని తత్సభ్యుల్ రహస్యంబుగన్.


అని ఆశ్చ‌ర్యంతో చూస్తున్నారు.


బ‌లి చ‌క్ర‌వ‌ర్తి ఉన్న చోటుకు చేరుకుని అత‌డిని ఇలా, ఆశీర్వ‌దించాడు వామ‌నుడు.


"స్వస్తి జగత్త్రయీ భువన శాసన కర్తకు, హాసమాత్ర వి

ధ్వస్త నిలింపభర్తకు, నుదారపదవ్యవహర్తకున్, మునీం

ద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు, నిర్జరీగళ

న్యస్త సువర్ణసూత్ర పరిహర్తకు, దానవలోక భర్తకున్."

అన్నాడు.

అఖండ తేజోమూర్తి అయిన వామ‌నుడిని చూసి బ‌లి చక్ర‌వ‌ర్తి ఆశ్చ‌ర్యంతో అత‌ని పుట్టుపూర్వోత్త‌రాలు అడుగుతున్నాడు.

ఎవ‌రివాడ‌వు, ఎక్క‌డుంటావు, నీ నివాసం ఏమిటి అంటున్నాడు.....

*వడుగా ఎవ్వరివాడవు?*..


వడుగా! యెవ్వరివాఁడ? వెవ్వఁడవు? సంవాసస్థలంబెయ్య? ది

య్యెడకున్ నీ వరుదెంచుటన్ సఫలమయ్యెన్ వంశమున్ జన్మముం;

గడు ధన్యాత్ముఁడనైతి; నీ మఖము యోగ్యంబయ్యె; నా కోరికల్

గడతేఱెన్; సుహుతంబులయ్యె శిఖులుం; గల్యాణ మిక్కాలమున్.


నీ రాక‌తో నా వంశం పావ‌న‌మైంది, ఏం కావాలో కోరుకో అంటూ వామ‌నుడిని, బ‌లి చ‌క్ర‌వ‌ర్తి అడిగాడు.


వరచేలంబులొ, మాడలో, ఫలములో, వన్యంబులో గోవులో

హరులో రత్నములో రథంబులొ విమృష్టాన్నంబులో కన్యలో

కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో

ధరణీ ఖండమొ కాక యే మడిగెదో ధాత్రీసురేంద్రోత్తమా!

 

ముందుగా తాను స‌ర్వాంత‌ర్యామిన‌ని, అన్నింటా తాన ఉంటాన‌ని, త‌న‌కు ఒక‌చోటంటూ లేద‌ని అంటాడు వామ‌నుడు,


"ఇది నాకు నెలవని యేరీతిఁ బలుకుదు?-

  నొక చో టనక యెందు నుండ నేర్తు;

నెవ్వనివాఁడ నం చేమని నుడువుదు?-

  నా యంతవాఁడనై నడవనేర్తు;

నీ నడవడి యని యెట్లు వక్కాణింతుఁ?-

  బూని ముప్పోకల బోవ నేర్తు;

నదినేర్తు నిదినేర్తు నని యేలఁ జెప్పంగ?-

  నేరుపు లన్నియు నేన నేర్తు;


 అంతే కాదు,, నేనంద‌రి వాడ‌నే..ఒంటి వాడ‌ను ,

 చుట్టం ఎవ‌రూ లేరు అంటాడు.


నొరులుఁ గారు నాకు నొరులకు నే నౌదు

నొంటివాఁడఁ జుట్ట మొకఁడు లేఁడు

సిరియుఁ దొల్లి గలదు చెప్పెద నా టెంకి

సుజనులందుఁ దఱచు చొచ్చియుందు.


అని అంటూ త‌న‌కు మూడ‌డుగులు ఇస్తే సంతృప్తి చెందుతానంటాడు వామ‌నుడు.


ఒంటివాఁడ నాకు నొకటి రెం డడుగుల

మేర యిమ్ము సొమ్ము మేర యొల్ల;

గోర్కిఁదీర బ్రహ్మకూకటి ముట్టెద

దానకుతుకసాంద్ర! దానవేంద్ర! "


అడ‌గ‌డానికి నీకు తెలియ‌క‌పోయినా, నా అంత‌టి చ‌క్ర‌వ‌ర్తిని ఇచ్చేట‌పుడు ఘ‌నంగా ఉండాలి క‌దా ఘ‌న‌మైన‌ది కోరుకో అంటాడు బ‌లి. 

దానికి వామ‌నుడు. 


తృప్తి ఎక్క‌డికి? నాకు మిద్దెలు, మేడ‌లు, ఏనుగులు ఇవ‌న్నీ ఎందుకు ? నాకు మూడ‌డ‌గులు చాలు అంటాడు. మూడ‌డ‌గులే త‌న పాలిట బ్ర‌హ్మాండం అని ప‌లుకుతాడు వామ‌నుడు. నువ్వు రాజువు అయినంత మాత్రాన నా ఆశ‌కు హ‌ద్దులుండాలి క‌దా. నాబోటి వ‌టువుకు మిద్దెలు ,మేడ‌లు, ఏనుగులు, ర‌త్నాల రాశులు ఏం చేసుకోన‌య్యా అంటాడు., తృప్తి ఉండాలి దేనికైనా అంటాడు.


గొడుగో, జన్నిదమో, కమండలువొ, నాకున్ ముంజియో, దండమో,

వడుఁ గే నెక్కడ భూము లెక్కడ? కరుల్, వామాక్షు, లశ్వంబు లె

క్కడ? నిత్యోచిత కర్మ మెక్కడ? మదాకాంక్షామితంబైన మూఁ

డడుగుల్ మేరయ త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్.


వెంట‌నే దాన‌వ గురువు శుక్రాచార్యుల వారు, వ‌చ్చిన వ‌టువు విష్ణుమూర్తి అని గ్ర‌హించి, దానం ఇవ్వ‌వ‌ద్ద‌ని, బ‌లికి సూచిస్తాడు. దానం ఇస్తే దాన‌వ వంశ క్ష‌యం అవుతుంద‌ని హెచ్చ‌రిస్తాడు. ప్రాణ ర‌క్ష‌ణ సంద‌ర్భంలో ఆడిన మాట త‌ప్పినా దోషం అంట‌ద‌న్నాడు.


*వారిజాక్షులందు...*

వారిజాక్షులందు వైవాహికము లందుఁ

బ్రాణవిత్తమానభంగమందుఁ

జకిత గోకులాగ్ర జన్మరక్షణ మందు

బొంకవచ్చు నఘము పొందఁ దధిప

అని చెప్పి,బ‌లికి న‌చ్చ‌చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించాడు.

ఎన్ని చెప్పినా,

బ‌లి తాను ఇచ్చిన మాట త‌ప్ప‌న‌న్నాడు.

ఎంత సంపాదించినా చివ‌రికి మిగిలేదేమిట‌న్నాడు.

ఎంద‌రో రాజులు ఈ భూమండ‌లాన్ని ప‌రిపాలించారు, వారంతా ఏం మూట‌క‌ట్టుకు పోయారన్నాడు.

*కారే రాజులు...*


కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?

వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే? భూమిపైఁ

బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై

యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యిక్కాలమున్? భార్గవా!


కాబ‌ట్టి మాట‌త‌ప్పి అప‌కీర్తి పొంద‌లేన‌న్నాడు.


సాక్షాత్తు విష్ణుమూర్తి చెయ్యి కింద దాన స్వీక‌ర్త‌గా ఉండ‌గా, తన చేయి దాత గాపైన ఉండ‌డం క‌న్న ఇంకేం కావాల‌న్నాడు బ‌లి చ‌క్ర‌వ‌ర్తి.


*ఆదిన్ శ్రీసతి కొప్పుపై...*


ఆదిన్ శ్రీసతి కొప్పుపైఁ, దనువుపై, నంసోత్తరీయంబుపై,

బాదాబ్జంబులపైఁ, గపోలతటిపైఁ, బాలిండ్లపై నూత్నమ

ర్యాదం జెందు కరంబు గ్రిం దగుట మీఁదై నా కరంబుంట మేల్

గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే?


త‌న మాట‌కు తిరుగులేదంటూ , వామ‌నుడి కాళ్లు క‌డిగి,

 దానం ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యాడు బ‌లి చ‌క్ర‌వ‌ర్తి.


విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణు స్వరూపాయ వే

దప్రామాణ్యవిదే త్రిపాద ధరణిం దాస్యామి!" యంచుం గ్రియా

క్షిప్రుండై దనుజేశ్వరుండు వడుగుం జే సాఁచి పూజించి "బ్ర

హ్మప్రీత"మ్మని ధారపోసె భువనం బాశ్చర్యముం బొందగన్..


అంతే, దానం ఇచ్చిన వెంట‌నే వామ‌నుడు త్రివిక్ర‌ముడైనాడు....


*ఇంతింతై వటుడింతై*

ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై

నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై

నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై

నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.


రవిబింబం బుపమింపఁ బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై

శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై

ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర

ప్రవరంబై పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్


అలా.....వామ‌నుడు బ్ర‌హ్మాండాన్ని ఆక్ర‌మించేసరికి, బ‌లి నిర్ఘాంత‌పోయాడు.


“దానవ! త్రిపదభూతల మిత్తు నంటివి-

  ధరణిఁ జంద్రార్కు లెందాఁక నుందు

రంత భూమియు నొక్క యడుగయ్యె నాకును-

  స్వర్లోకమును నొక్క చరణమయ్యె;

నీ సొమ్ము సకలంబు నేఁడు రెండడుగులు-

  గడమ పాదమునకుఁ గలదె భూమి?

యిచ్చెద నన్నర్థ మీని దురాత్ముండు-

  నిరయంబు బొందుట నిజముగాదె?


రెండు, అడుగులు. ఒక‌టి భూమిపైన‌, రెండోది ఆకాశానికి స‌రిపోయింది, మ‌రి మూడో అడుగు మాటేమిటని అడిగాడు విష్ణుమూర్తి .

త‌న శిర‌స్సుమీద పెట్ట‌మ‌న్నాడు బ‌లి. బ‌లి ప‌రిస్థితిని గ‌మ‌నించి బ‌లి తాత ప్ర‌హ్లాదుడు దిగివ‌చ్చి , బ‌లి గ‌ర్వం తొల‌గింద‌ని, ఇక అత‌నిని అనుగ్ర‌హించ‌మ‌ని విష్ణుమూర్తిని వేడుకుంటాడు.


భూతలోకేశ్వర! భూతభావన! దేవ-

  దేవ! జగన్నాథ! దేవవంద్య!

తన సొమ్ము సకలంబుఁ దప్పక నీ కిచ్చె-

  దండయోగ్యుఁడు గాడు దానపరుఁడుఁ;

గరుణింప నర్హుండు గమలలోచన! నీకు-

  విడిపింపు మీతని వెఱపు దీర;

తోయపూరము చల్లి దూర్వాంకురంబులఁ-

  జేరి నీ పదము లర్చించునట్టి...


ప్ర‌హ్లాదుడు త‌దిత‌రుల కోరిక మేర‌కు బ‌లి ని అనుగ్ర‌హించి అత‌నికి ప‌ర‌మ‌పథం క‌ల్పించాడు విష్ణుమూర్తి.


పోత‌న క‌లంలో వామ‌నావ‌తార ఘ‌ట్టం మ‌నోహ‌రంగా రూపుదిద్దుకుంది. 

వామ‌న జ‌యంతి సంద‌ర్భంగా పోత‌నామాత్యుడికి మ‌రొక్క‌మారు ప్ర‌ణామాలు తెలియ‌జేసుకుందాం. 

వామ‌నావ‌తార ఘ‌ట్టం ప‌ర‌మ పావ‌న ఘ‌ట్టం

*స్వ‌స్తి*

విజయం అంటే ఏమిటి*?..... 🌹🌹🌹🌹🌹🌹🌹

 *💚*...........💚* *విజయం అంటే ఏమిటి*?.....

🌹🌹🌹🌹🌹🌹🌹

మన దేశం నుండీ ఒక ప్రొఫెసర్ అమెరికా వెళ్లారు. అక్కడ ఒక కాలేజీ లో విద్యార్థులతో మాట్లాడుతూ '' విజయం అంటే ఏమిటి? '' అని అడిగితే ఒక యువతి '' విజయం అంటే దండిగా డబ్బు సంపాదించడం , '' అనింది. 

అపుడు ఆ ప్రొఫెసర్ '' అయితే ఇరవైఏళ్ళక్రితం ప్రపంచంలో అత్యంత ధనవుంతుడు ఎవరో చెప్పండి? '' అంటే ఎవరూ చెప్పలేదు. [ఎందుకటే ప్రతి ఏడాదికీ అది మారిపోతూవుంటుంది కాబట్టి] బ్ర్తతకడానికి కొంత డబ్బు కావాలి కానీ , డబ్బే బ్రతుకు కాదు. అంటే విజయమంటే డబ్బు సంపాదన కాదు అన్నమాట.   

మరో యువకుడు లేచి '' విజయం అంటే బలం / శక్తి '' అన్నాడు. అలా అయితే అలెగ్జాండర్ , నెపోలియన్ ,ముస్సొలిని ,హిట్లర్ , స్టాలిన్ , బిన్ లాదెన్ ... వీళ్ళంతా బలవంతులు , ప్రపంచాన్ని గెలవాలని అనుకొన్నవారే కదా , వీళ్ళు జీవితం లో సంతోషంగా వుండగలిగారా ? వీళ్ళ జీవితాలు ఎలా గడిచి , ముగిశాయో చరిత్ర చెపుతున్నది కదా ! తన బలంతో , తన ముష్టిఘాతాలతో మహా బలవంతులను మట్టికరిపించిన మహమ్మద్ అలీ అనే ప్రపంచ చాంపియన్ బాక్సర్ , తరువాత కొన్నేళ్ళకు పార్కిన్ సన్ వ్యాధి వల్ల కాఫీకప్పును కూడా పట్టుకోలేక పోయాడు. అయితే విజయమంటే బలం / శక్తి సంపాదన కాదు అన్నమాట. 

మరో యువతి '' విజయమంటే ప్రఖ్యాతి , అందం ,'' అనింది. అయితే కేట్ మోస్ , జీన్ ష్రింప్టన్ , సోఫియాలారెన్ , మార్లిన్ మన్రో ...లాంటి అతిలోక సౌందర్యవతుల జీవితాలు ఎంత బాధాకరంగా వుండేవో చాలామందికి తెలియదు. భారత్ విషయానికొస్తే , పర్విన్ బాబీ అనే ఒక హిందీ హీరోయిన్ వుండేది. ఆమె ఎంత అందగత్తే అంటే , అమితాబ్ బచ్చన్ తో సహా , ఆమెను పెళ్ళి చేసుకోవాలి అని అనుకొనని హిందీ సినిమా హీరో నే లేడు. డానీ, కబీర్ బేడీ , మహేష్ భట్ లతో ఆమె ప్రేమ , పెళ్ళి నడిచి అవన్నీ విఫమయ్యాయి. ధర్మేంద్ర , రాజేష్ ఖన్నా , అమితాబ్ బచ్చన్ .. ఇలా అందరూ ఆమె వెంట పడ్డవారే. కొద్దిరోజులకు ఆమెకు జీవితం అంటే శూన్యం అని తెలిసిపోయి , నమ్మిన వాళ్ళు మోసం చేస్తే , తాగుడుకు బానిస అయ్యి , ఒక దశలో కాలికి కురుపు లేచి , అది ఒళ్ళంతా ప్రాకి , ఏ శరీరం కోసం అయితే అంతమంది మగ వాళ్ళు పిచ్చిక్కెపోయారో , అదే శరీరమే కంపు వాసన కొడుతూవుంటే , ఆమెకు ఏదో వింతవ్యాధి వచ్చిందని , జనం ఆమెను తాళ్ళతో కట్టి , ముంబాయి వీధుల్లో లాగుకొంటూ తీసుకెళ్ళి ఆమె ఇంట్లో పడేస్తే ఆఖరుకు పక్కింటి వాళ్ళు ఆమె ఇంట్లోనుండి భరించలేనంత కంపు వస్తోందని కంప్లైంట్ చేస్తే , కార్పొరేషన్ వాళ్ళు వచ్చి 3 రోజులక్రితమే చనిపోయిన ఆమెను చూసి తీసుకెళ్ళి పూడ్చేసారు. అయితే అందం , ప్రఖ్యాతి అనేవి విజయం కావన్నమాట .   


మరోసారి మరొకరు '' విజయమంటే అధికారం '' అని అన్నారు. అయితే '' కాగితం మీద ఈ దేశాన్ని పాలించిన ప్రధానమంత్రుల పేర్లు అన్నీ వ్రాయండి '' అని అంటే వున్న 50 మందిలో 39 మంది అందరు ప్రధానుల పేర్లూ వ్రాయలేకపోయారు. అనంతపురంలో ఒకప్పుడు రాష్ట్రపతి గా వెలిగిన సంజీవరెడ్డి గారి ఇంటిదగ్గర ఇపుడు పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి , పందులు దొర్లుతున్నాయి. విజయం అంటే అధికారం కాదు అన్న మాట. 


చివరగా ఆదే ప్రొఫెసర్ భారత్ లో మరో యూనివర్సిటీ లో యువతీ యువకులను ఇదే ప్రశ్న వేసారు - '' విజయం అంటే ఏమిటి ? '' అందరూ మౌనంగా వుంటే అపుడు ఆయన అన్నారు , '' మీ అవ్వ తాతల పేర్లు మీకు తెలుసా ? '' అందరూ '' తెలుసు '' అన్నారు. '' వాళ్ళ అవ్వ , తాతల పేర్లు తెలుసా ? ''అని అడిగితే అయిదారుమంది ''తెలుసు '' అన్నారు. '' వాళ్ళ అవ్వ తాతల పేర్లు తెలుసా ? '' '' తెలియదు '' అన్నారు. 

అపుడు ప్రొఫెసర్ గారు '' శ్రీరాముడు , శ్రీకృష్ణుడు , బుద్ధుడు , ఆదిశంకరుడు , క్రీస్తు , మహమ్మద్ ప్రవక్త తెలుసా ? '' అందరూ '' ఓ , తెలుసు '' అని ముక్తకంఠం తో బదులిచ్చారు. '' మీకు మీ స్వంత అవ్వ తాతలు గుర్తుకులేరు కానీ మీరు ఎన్నడూ చూడని వీళ్లంతా ఎలా గుర్తుకున్నారు ? '' 

అని అడిగినపుడు పద్మిని అనే ఒక యువతి , ప్రొఫెసర్ గారు అంతదాకా చేసిన గొప్ప ఉపన్యాసానికి చాలా ఎమోషనల్ అయ్యి కళ్లలో నీరు తిరుగుతుండగా ఇలా అనింది : '' సార్ , మీ ప్రశ్నకు నేను జవాబు చెపుతాను. మాకు మా పూర్వీకుల పేర్లు తెలియకపోవడం , రాముడు , కృష్ణుడు , బుద్ధుడి పేర్లు ఇంకా గుర్తువుండటానికి కారణం ఇదే : '

 తమ కోసం , తమ కుటుంబం కోసం మాత్రమే జీవించేవారిని ఈ లోకం మరచిపోతుంది , *ఇతరులకోసం జీవించేవారిని ఈ లోకం ఎప్పటికీ గుర్తుకుపెట్టుకొనేవుంటుంది. ఇదే విజయం అంటే* ! '' 


'' నా గురించి నేను దు:ఖించకపోవడమే నా ఆనందానికి కారణం '' అని 2600 ఏళ్ళ క్రితం బుద్ధుడు చెప్పిన మాట , '' *ఇతరులకోసం జీవించేవారే నిజంగా జీవించినట్టు , అలా చేయని ఇతరులు జీవించివున్నా మరణించినట్టే లెక్క '' [ *Only they live who live for others , the others are more dead than alive] అని వివేకానంద 1896 లో అన్న మాట ఇదే.                

🌺🌺🌺🌺🌺సర్వే జనాః సుఖినోభవంతు..

తెలుగంటే

 తెలుగంటే...వేమన

తెలుగంటే...నన్నయ

తెలుగంటే...తిక్కన

తెలుగంటే...ఎఱ్ఱాప్రగడ

తెలుగంటే...పోతన

తెలుగంటే...అల్లసాని పెద్దన

తెలుగంటే...ఆర్యభట్టు

తెలుగంటే...త్యాగయ్య

తెలుగంటే...కేతన

తెలుగంటే...అన్నమాచార్య

తెలుగంటే...త్యాగరాజు

తెలుగంటే...తెనాలి రామకృష్ణ

తెలుగంటే...పొట్టి శ్రీరాములు

తెలుగంటే...అల్లూరి సీతారామరాజు

తెలుగంటే...కందుకూరి వీరేశలింగం

తెలుగంటే... గిడుగు రామ్మూర్తి

తెలుగంటే...గురజాడ

తెలుగంటే...శ్రీ శ్రీ

తెలుగంటే...క్షేత్రయ్య

తెలుగంటే...శ్రీనాధ

తెలుగంటే...మొల్ల

తెలుగంటే...కంచర్ల గోపన్న

తెలుగంటే....కాళోజి

తెలుగంటే...కృష్ణమాచార్య

తెలుగంటే...సిద్ధేంద్ర

తెలుగంటే...గౌతమీ పుత్ర శాతకర్ణి

తెలుగంటే...రాణీ రుద్రమదేవి

తెలుగంటే...రాజరాజ నరేంద్రుడు

తెలుగంటే...రామలింగ నాయుడు

తెలుగంటే...తిమ్మనాయుడు

తెలుగంటే...రామదాసు

తెలుగంటే...ఆచార్య నాగార్జున

తెలుగంటే...పోతులూరి వీరబ్రహ్మం

తెలుగంటే...జిడ్డు కృష్ణమూర్తి

తెలుగంటే...వుప్పలూరి గోపాల కృష్ణమూర్తి

తెలుగంటే...సింగేరి శంకరాచార్య

తెలుగంటే...వీర పాండ్య కట్టబొమ్మన

తెలుగంటే...విశ్వేశ్వరయ్య

తెలుగంటే...బాబూ రాజేంద్రప్రసాద్

తెలుగంటే...చిన్నయ్య సూరి

తెలుగంటే...సర్వేపల్లి రాధాకృష్ణన్

తెలుగంటే...పీవీ నరసింహారావు

తెలుగంటే...రాజన్న

తెలుగంటే...సుశీల

తెలుగంటే...ఘంటసాల

తెలుగంటే...రామారావు

తెలుగంటే...అక్కినేని

తెలుగంటే...సూర్యకాంతం

తెలుగంటే...ఎస్.వీ.రంగారావు

తెలుగంటే...అయ్యలరాజు రామభద్రుడు

తెలుగంటే...సరోజిని నాయుడు

తెలుగంటే...పింగళి వెంకయ్య

తెలుగంటే...పైడి మర్రి వెంకట సుబ్బారావు

తెలుగంటే....టంగుటూరి ప్రకాశం

తెలుగంటే...చిలకమర్తి లక్ష్మీనరసింహం

తెలుగంటే...భాస్కరుడు

తెలుగంటే...దేవులపల్లి

తెలుగంటే...ధూర్జటి

తెలుగంటే...తిరుపతి శాస్త్రి

తెలుగంటే...గుఱ్ఱం జాషువ

తెలుగంటే...కోరాడ మహాదేవశాస్ట్రీ

తెలుగంటే...కోరాడ రామకృష్ణయ్య

తెలుగంటే...కోరాడ రామచంద్రకవి

తెలుగంటే...కొనకళ్ల వెంకటరత్నం

తెలుగంటే...మల్లన్న

తెలుగంటే...నండూరి

తెలుగంటే...పానుగంటి

తెలుగంటే...రామానుజం

తెలుగంటే...రావి శాస్త్రి

తెలుగంటే...రవి వర్మ

తెలుగంటే...రంగనాధుడు

తెలుగంటే...కృష్ణదేవరాయలు

తెలుగంటే...తిరుపతి వెంకటకవులు

తెలుగంటే...విశ్వనాథ

తెలుగంటే...నన్నే చోడుడు

తెలుగంటే...ఆరుద్ర

తెలుగంటే...ఎంకి

తెలుగంటే...ఆదిభట్ల

తెలుగంటే...గాజుల సత్యనారాయణ

తెలుగంటే...మల్లాది సుబ్బమ్మ

తెలుగంటే...వెంపటి చిన సత్యం

తెలుగంటే...ఉషశ్రీ

తెలుగంటే...బాపు

తెలుగంటే...రమణ

తెలుగంటే...జంధ్యాల

తెలుగంటే...ముళ్ళపూడి

తెలుగంటే...మంగళంపల్లి బాలమురళీకృష్ణ

తెలుగంటే...అక్కిరాజు ఉమాకాంతం

తెలుగంటే...తిలక్

తెలుగంటే...అడివి బాపిరాజు

తెలుగంటే...జక్కన

తెలుగంటే...అచ్చమాంబ

తెలుగంటే...దాశరథి

తెలుగంటే...మల్లినాథ సూరి

తెలుగంటే...భవభూతి

తెలుగంటే...ప్రోలయ నాయకుడు

తెలుగంటే...రాళ్ళపల్లి 

తెలుగంటే...కట్టమంచి

తెలుగంటే....భద్రాద్రి రామన్న

తెలుగంటే...తిరుపతి ఎంకన్న

తెలుగంటే...గోంగూర

తెలుగంటే...గుత్తోంకాయ్

తెలుగంటే...కొత్తావకాయ్

తెలుగంటే...ఉలవచారు

తెలుగంటే....పెరుగన్నం

తెలుగంటే...ముద్దపప్పు

తెలుగంటే...పండుమిరప

తెలుగంటే...తాంబూలం

తెలుగంటే...పులిహోర

తెలుగంటే....సకినాలు

తెలుగంటే....మిర్చి బజ్జి

తెలుగంటే...బందరు లడ్డు

తెలుగంటే....కాకినాడ ఖాజా

తెలుగంటే.....జీడిపాకం

తెలుగంటే...మామిడి తాండ్ర

తెలుగంటే...రాగి ముద్ద

తెలుగంటే...జొన్న రొట్టె

తెలుగంటే...అంబలి

తెలుగంటే...సంక్రాంతి

తెలుగంటే...గోదారి

తెలుగంటే...గొబ్బిళ్ళు

తెలుగంటే...గోరింట

తెలుగంటే...మాగాణి

తెలుగంటే...సాంబ్రాణి

తెలుగంటే...ఆడపిల్ల ఓణి

తెలుగంటే...చీరకట్టు

తెలుగంటే...ఓంకారం

తెలుగంటే...యమకారం

తెలుగంటే....మమకారం

తెలుగంటే...సంస్కారం

తెలుగంటే...కొంచెం ఎటకారం

తెలుగంటే...పట్టింపు

తెలుగంటే...తెగింపు

తెలుగంటే....లాలింపు

తెలుగంటే...ముక్కుపుడక 

తెలుగంటే...పంచెకట్టు

తెలుగంటే...ఇంటిముందు ముగ్గు

తెలుగంటే...నుదుటిమీద బొట్టు

తెలుగంటే...ఆంధ్ర, రాయలసీమ,తెలంగాణ

తెలుగంటే...తల్లిపాలభాష

తెలుగంటే...ప్రేమా, జాలీ, అభిమానం

తెలుగంటే... మన సంస్కృతి, సంప్రదాయం

తెలుగంటే... మన ఆత్మగౌరవం

తెలుగంటే...నీవు నేను మనం

తేనెలూరు తెలుగంటే ఆంధ్ర కోనసీమ పంట

తెలుగు నేలంటే రాయలేలిన సీమ రాయలసీమ

తెలుంగు ఆణమంటే తెలంగాణ

జై తెలుగు తల్లీ 🙏


తెలుగు భాషా పితామహుడు *గిడుగు రామ్మూర్తి పంతులు* గారికి అంజలి ఘటిస్తూ..🙏🙏🙏

తెలుగు భాషా ప్రేమికులందరికీ....

*తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు*

వాట్సాప్ లో వచ్చిన సమాచారం .నేను వ్రాసింది కాదు

Panchaag



 

30, ఆగస్టు 2025, శనివారం

శ్రీ రామేశ్వర ఆలయం

 🕉 మన గుడి : నెం 1218


⚜  ఒడిస్సా : భువనేశ్వర్


⚜  శ్రీ రామేశ్వర ఆలయం



💠 ఒరిస్సాలోని ప్రశాంతమైన మరియు సాంస్కృతిక వాతావరణంలో ఉన్న రామేశ్వర్ డ్యూలా, దాని ప్రసిద్ధ సమకాలీన లింగరాజ ఆలయం కంటే తక్కువగా తెలిసినా భువనేశ్వర్‌లోని ఒక గొప్ప ఆలయంగా మిగిలిపోయింది .

 ఇది అద్భుతమైన కళింగ నిర్మాణ శైలిని సూచిస్తుంది మరియు చరిత్ర ప్రియులను మరియు భక్తులను ఆకర్షించే ప్రసిద్ధ శివుని ఆలయాలలో ఒకటి.



💠 రామేశ్వర్ ఆలయం భువనేశ్వర్‌లోని ఒక పురాతన ఆలయం. దీనిని లింగరాజ ఆలయంలోని మౌసి మా అని పిలుస్తారు. ఇది లింగరాజ ఆలయం నుండి 2 కి.మీ దూరంలో ఉంది. 


💠 రావణుడిపై విజయం తర్వాత రాముడు లంక నుండి తిరిగి వస్తున్నప్పుడు సీత శివుడిని పూజించమని కోరినట్లు పురాణాలు చెబుతున్నాయి. 

కాబట్టి రామచంద్రుడు ఆ ప్రయోజనం కోసం ఒక లింగాన్ని నిర్మించాడు. 


💠 సాంప్రదాయకంగా చైత్రంలో రామనవమికి ఒక రోజు ముందు వచ్చే అశోకాష్టమి సమయంలో లింగరాజ స్వామి రకుణ రథం అని పిలువబడే పెద్ద రథం ద్వారా ఈ ఆలయానికి వచ్చి నాలుగు రోజులు ఉంటాడు. చారిత్రాత్మకంగా ఈ ఆలయం 9వ శతాబ్దం నాటిది.


💠 భువనేశ్వర్‌లోని దాదాపు అన్ని పాత దేవాలయాలు శివుడికి అంకితం చేయబడ్డాయి. గర్భగుడి లోపల దుర్గాదేవి ప్రతిమ ఉంది.


💠 ఆలయం ముందు, రోడ్డుకు ఎదురుగా రాముడు, లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నుడి ముగ్గురు సోదరులకు అంకితం చేయబడిన మూడు ఆలయాలు ఉన్నాయి. ఈ మూడు ఆలయాలు భువనేశ్వర్‌లో నిర్మించిన పురాతన ఆలయాలు. 



💠 ఈ ఆలయాన్ని 'మౌసి మా' ఆలయం అని కూడా పిలుస్తారు.  రుకున రథ జాత్ర అనేది ప్రతి సంవత్సరం మార్చి/ఏప్రిల్ నెలలో (చైత్ర మాసంలో 8వ రోజు) ఈ ఆలయంలో నిర్వహించబడే ఒక ప్రధాన పండుగ, ఇక్కడ లింగరాజు (చంద్రశేఖర్ కాంస్య విగ్రహం ద్వారా ప్రాతినిధ్యం వహిస్తాడు), రుక్మిణి మరియు బసుదేవులతో కలిసి లింగరాజ ఆలయం నుండి రామేశ్వర్ ఆలయానికి అత్యంత రంగురంగుల ఊరేగింపులో తీసుకువెళతారు.


💠 ఈ పండుగను అశోకాష్టమి అని కూడా పిలుస్తారు మరియు దేవతలు రామేశ్వర్ ఆలయంలో నాలుగు రోజులు ఉండి, ఐదవ రోజు వారి స్వస్థలమైన లింగరాజ ఆలయానికి తిరిగి వస్తారు. 

రథం దాని ప్రయాణంలో మలుపు తీసుకోదు కాబట్టి ఈ పండుగను అనలూత రథ జాత్ర అని పిలుస్తారు 


💠 లింగరాజు ఏకామ్ర క్షేత్రంలో కొద్దిసేపు ఉండటానికి తన వనవాస కాలంలో రాముడిని స్వాగతించాడని పురాణం చెబుతుంది. 

రాముడు నివసించిన ప్రదేశం మౌసిమా ఆలయం లేదా రామేశ్వర్. 


💠 తన కొద్దిసేపు బస సమయంలో లింగరాజ స్వామి రాముడిని పలకరించడానికి దేవి పార్వతితో పాటు రామేశ్వర ఆలయానికి వెళ్లాడు.  

ఆ సందర్భాన్ని గుర్తుచేసుకునేందుకు అశోకాష్టమి రథజాత్ర జరుపుకుంటారు.


💠 రామేశ్వర్ ఆలయం యొక్క అత్యంత అద్భుతమైన లక్షణాలలో ఒకటి దాని సంక్లిష్టమైన శిల్పాలు. ఆలయ గోడలు రామాయణం మరియు మహాభారతం సహా హిందూ పురాణాల దృశ్యాలను వర్ణించే వివరణాత్మక శిల్పాలతో అలంకరించబడ్డాయి. 

ఈ చెక్కడాలు అలంకారంగా ఉండటమే కాకుండా భారతదేశ గొప్ప పౌరాణిక వారసత్వాన్ని వివరించే కథన సాధనంగా కూడా పనిచేస్తాయి.


💠 ఆలయ ప్రవేశ ద్వారం చుట్టూ రెండు భారీ రాతి సింహాలు ఉన్నాయి, ఇది కళింగ దేవాలయాలలో ఒక సాధారణ లక్షణం, ఇది రక్షణ మరియు బలాన్ని సూచిస్తుంది. 


💠 గర్భగుడి లోపల, ప్రధాన దేవత శివుడిని లింగం రూపంలో పూజిస్తారు. ఈ లింగం క్లోరైట్‌తో తయారు చేయబడిన వృత్తాకార యోనిపిట్టలో పవిత్రం చేయబడింది, ఇది ఆలయ నిర్మాణ ప్రాముఖ్యతను పెంచే ప్రత్యేక లక్షణం.

గర్భగుడిలో దుర్గాదేవి చిత్రం కూడా ఉంది, ఇది ఆలయ ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంచుతుంది.



💠 ప్రసిద్ధ లింగరాజ ఆలయం నుండి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామేశ్వరాన్ని తరచుగా మౌసిమా  ఆలయం అని పిలుస్తారు, ఇది పెద్ద లింగరాజ మందిరంతో దాని సంబంధాన్ని సూచిస్తుంది.


రచన

©️ Santosh Kumar

నెమలీకలు - జైనులు

 నెమలీకలు - జైనులు


ఢిల్లీకి చెందిన ఆర్.కె. రంగన్ పరమాచార్య స్వామికి పెద్ద భక్తుడు. దర్శనానికి వచ్చిన ప్రతిసారీ, నెమలీకలతో చేసిన విసనకర్రను తెచ్చి స్వామికి సమర్పించేవాడు. మహాస్వామివారు అప్పుడప్పుడు దోమలను ఈగలను తోలడానికి ఉపయోగించేవారు. రంగన్ ఒకసారి ఒక డజను నెమలీక విసనకర్రలను తీసుకుని వచ్చాడు. స్వామివారు వాటిని తీసుకొని మేనాలో పెట్టుకున్నారు. శిష్యులు ఈ విషయం చూసి ఆశ్చర్యపోయారు. తమకోసం వస్తువులను అలా దాచుకోవడం మహాస్వామివారు ఎప్పుడూ చెయ్యరు. 


ఒకరోజు ఉదయం మహాస్వామి వారు మేనాలో కూర్చుని జపం చేసుకుంటుండగా, పెద్ద ఈగల గుంపొకటి అటుగా వచ్చింది. స్వామివారు నెమలీకల విసనకర్రను వాడుతున్నారు వాటిని పారదోలడానికి. అప్పుడు కొంతమంది జైన సాధువులు వచ్చారు. వారి సంప్రదాయం ప్రకారం నోటి చుట్టూ తెల్లని గుడ్డ చుట్టుకొని ఉన్నారు. చాలా విషయాలపై స్వామివారు మాట్లాడుకున్నారు. 


సంస్కృత పదకోశమైన అమరకోశం రాసినవారు జైన రాజైన అమరసింహుడు. జైనులకు సంబంధించిన చాలా పుస్తకాలు సంస్కృతంలోనే ఉన్నాయి. వీటన్నిటిని విని ఆ సాధువులు చాలా సంతోషించారు. 


“మీరు ఉదయం నిద్ర లేవగానే ‘విప్రక్షయం’ ప్రార్థన చేస్తారా?” అని అడిగాఅరు మహాస్వామివారు. 


“లేదు. మా గురువుగారు ఇక దానితో పనిలేదని చెప్పారు” అని వారు బదులిచ్చారు. 


అక్కడ ఉన్న శిష్యులకి పరమాచార్య స్వామివారు అడిగిన ప్రశ్న కాని, ఆ సాధువులు చెప్పిన సమాధానం కాని ఏమీ అర్థం కాలేదు. 


మహాస్వామివారే దాని గురించి ఇలా చెప్పసాగారు. “వైదిక క్రతువులు, అగ్ని సంస్కారాలు చాలా బాగా జరుగుతున్న కాలంలో, శాస్త్రం చెప్పిన విధంగా వైదిక యజ్ఞాలలో జంతు బలులు జరిగేవి. అహింసా సూత్రం మూల సూత్రంగా గల జైన మతం ఉధృతిలోకి వచ్చాక రోజూ ఉదయం ‘విప్రక్షయం’ లేదా ‘బ్రాహ్మణులు క్షయించుగాక’ అని పఠించేవారు వైదిక మతం సమసిపోవాలని”


బహుశా స్వామివారి ఆంతర్యం గ్రహించారేమో ఆ జైన సాధువులు, “అవును, అవును. ఇప్పుడు దాదాపు బ్రాహ్మణులందరూ అగ్నికార్యం వదిలేశారు. కాబట్టి యాగాలలో జంతుబలులు జరగటం లేదు. కనుక మా గురువులు ‘విప్రక్షయం’ పఠించవలసిన అవసరం లేదని సెలవిచ్చారు” అని చెప్పారు. 


మహాస్వామివారు వారందరికి ఒక్కొక్క నెమలీక బహుమానంగా ఇచ్చారు. నెమలిని హింసించకుండా అవి వదిలిపెట్టినప్పుడు కిందపడినవి కావున వారు సంతోషంతో వాటిని స్వీకరించారు. బహుశా ఈ జైన సన్యాసులు వస్తారనే వారికి వీటీని బహుమానంగా ఇవ్వొచ్చనే మహాస్వామివారు ఆ నెమలీకలను మేనాలో దాచుకున్నారేమో. ఏమో! నెమలిపై ఎక్కి విహరించే ఆ స్మామినాథునికే తెలుసు


--- మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

దైవకార్యమే

 *ప్రతి పని దైవకార్యమే*

ప్రాచీన గ్రంథాలన్నీ పనిని దైవస్వరూపంగా చూడమన్నాయి. పని దైవారాధనతో సమానమని ఉపదేశించాయి. నిష్కామ భావనతో, భక్తిశ్రద్ధలతో చేసే కార్యాలన్నీ మంచి పనులేనని భగవద్గీత బోధించింది. మన సంకల్పాలన్నీ కల్యాణదాయకంగా ఉండాలని యజుర్వేదం ఆకాంక్షించింది.


మంచి పనిని వాయిదా వేయకూడదు, చెడు పనిని తలపెట్టనేకూడదని రామాయణం వివరించింది. అందుకే ఒక పని చేసేముందు వేయిసార్లు ఆలోచించాలి. పని మొదలు పెట్టాక వేయి అడ్డంకులు వచ్చినా దాన్ని నెరవేర్చాలి. శ్రద్ధాసక్తులతో కర్తవ్యాన్ని నిర్వర్తించడమే నిజమైన ఈశ్వరారాధన అంటారు స్వామి వివేకానంద. అందుకే ప్రతి వృత్తీ పవిత్రమైందిగా భావించాలి. లోకహితం కోసం చేసే పనులకు దైవమే మనిషి రూపంలో వచ్చి సహాయం చేస్తాడని పెద్దలు చెబుతారు. కానీ చేసే పని ఎంత చిన్నదైనా అది సమాజానికి మేలు చేసేటట్లుగా ఉండాలి. చేస్తున్న పనిపట్ల అవగాహన, ఆలోచన లక్ష్యసిద్ధికి దారితీస్తాయి. నిజానికి ఎవరికైనా మనసుకు నచ్చిన పని మీదే ఆసక్తి, మమకారం ఉంటాయి. అవే మనిషికి ప్రోత్సాహాన్నిస్తాయి. అసలు ఇష్టపడి పని చేయాలే కాని ఏదీ కష్టంగా అనిపించదు. ఇష్టం లేకుండా చేసే ఏ పనైనా మనసుకు తృప్తినివ్వదు. ‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అన్నాడు వేమన. ఏ విజయానికైనా మూలం సాధన. నిరంతర సాధన వల్లే మనం కోరుకున్న పనులు పూర్తి చేయగలుగుతాం.

మనిషి ఒంటరిగా జీవించలేడు. నిత్యం పదిమందితో కలసి మెలసి ఉండక తప్పదు. అందుకే ఎవరైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు అనుభవజ్ఞులను సంప్రదించి మంచీ, చెడులను విచారించాలి. అప్పుడే పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. మనిషి గొప్పతనం అతడు చేసే పనిని బట్టి ఉంటుంది. ఎంత ఉన్నతుడైనా పని చేయకపోతే అతడికి విలువ ఉండదని భారతం చెబుతోంది. అందుకే ఒక పనిని సంకల్పించినప్పుడు దాన్ని పూర్తి చేసేవరకు విశ్రమించకూడదు. ఎవరు విమర్శించినా, ఎన్ని రకాల అవాంతరాలు ఎదురైనా.. సమయస్ఫూర్తితో వాటిని అధిగమించి శ్రద్ధతో పనిని పూర్తి చేయాలి. అప్పుడు అది తప్పక విజయవంతమవుతుంది. ఈ సృష్టిలో ప్రతి జీవి ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది. అలాగే మనిషి కూడా నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండాలి. అప్పుడే తగిన వ్యాయామం లభించి ఆరోగ్యవంతుడిగా ఉంటాడు. అంకితభావంతో పనిచేసిన మనిషిలో అనవసరపు ఆలోచనలు ప్రవేశించవు. పనిలో ఆనందాన్ని ఆస్వాదించే అతడు కష్టసుఖాలకు అతీతంగా వ్యవహరిస్తాడు. 


చిత్తశుద్ధితో చేసే మంచి పనులకు దైవానుగ్రహం తప్పక ఉంటుంది. మంచి పనులంటే దానధర్మాలు, పరోపకారం. అనాథలకు, అభాగ్యులకు దానధర్మాలు చేస్తూ, వారి ఉన్నతికి కృషి చేసిన వ్యక్తి చిరస్మరణీయుడవుతాడు. పరోపకారం వల్ల మానసిక ఆనందంతో పాటు మనిషి జీవితం కూడా ధన్యమవుతుంది. 

~విశ్వనాథ రమ

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: పదకొండవ అధ్యాయం

విశ్వరూపసందర్శనయోగం:అర్జున ఉవాచ


అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః

సర్వే సహైవావనిపాలసంఘైః 

భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ

సహాస్మదీయైరపి యోధముఖ్యైః (26)


వక్త్రాణి తే త్వరమాణా విశంతి

దంష్ట్రాకరాలాని భయానకాని 

కేచిద్విలగ్నా దశనాంతరేషు

సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః (27)


ఎంతోమంది రాజులతోపాటు ఈ ధృతరాష్ట్రుడి పుత్రులు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అలాగే మనపక్షానికి చెందిన ప్రముఖయోధులూ వాడికోరలతో భయంకరాలైన నీ నోళ్ళలోకి వడివడిగా ప్రవేశిస్తున్నారు. వాళ్ళలో కొంతమంది నీ పళ్ళసందులో ఇరుక్కుపోయి పొడి అయిపోతున్న తలలతో కనిపిస్తున్నారు.

నిను నర్థింతును సత్యధర్మముల మన్నింపంగ న్యాయమ్ము గా

 నిను నర్థింతును సత్యధర్మముల మన్నింపంగ న్యాయమ్ము గా 


నినునెల్లప్పుడు సంచరింపగను సన్మార్గంబులన్ జూపుమా 


యనుమానించుట యేల నన్ను శివ న్యాయంబౌన లోకంబునన్ 


మనగానిమ్మిక నీదె భారమిక సాంబా ! అర్ధనారీశ్వరా !

అమర చైతన్యం"*

 *"అమర చైతన్యం"* 

*( శ్రీ రమణ మహర్షి బోధనలు )*



🕉🌞🌎🌙🌟🚩


*ప్రశ్న: నేను ఆత్మనే అయితే నాకెందుకు తెలియడం లేదు.*


*జవాబు: నీ ప్రస్తుత జ్ఞానము అహానికి సంబంధించినది. సాపేక్షికమైనది. సాపేక్షజ్ఞానానికి ద్రష్ట, దృశ్యము ఉండాలి. కాని ఆత్మజ్ఞానమునకు ద్రష్ట, దృశ్యము అవసరం లేదు. ఎందుకంటే అవి పూర్ణము. జ్ఞాపకం చేసుకోవడం కూడా సాపేక్షికమైనది. జ్ఞాపకం చేసుకునే వ్యక్తి, జ్ఞాపకం చేయబడే వస్తువు ఉండాలి. రెండవ వస్తువే లేనపుడు ఎవరు ఎవరిని గుర్తు చేసుకోవాలి. జ్ఞానానికి అజ్ఞానానికి అతీతమైనది ఆత్మ.*




*ప్రశ్న: నేను ఎంతవరకు ఆత్మ విచారం చేయాలి.*


*జవాబు: నీ చివరి సందేహం కూడా (తప్పు అభిప్రాయము) పొయ్యేంత వరకు చేయాలి. ఆత్మ సాక్షాత్కారం అయ్యేంత వరకు చెయ్యాలి.*


*సముద్రగర్భంలోనే ముత్యాలున్నాయి. వాటిని వెలికి తీయాలంటే సముద్రపు లోతుల్లోకి వెళ్ళాలి...... అలాగే ఆత్మకూడా నీలోపలికి, ఇంకాలోలోపలికి వెళితేనే, బాగా లోపలికి మునిగితేనే అనుభవానికి వస్తుంది.*

https://chat.whatsapp.com/I9GuM11QcSYCmHyQXHO5cQ?mode=ac_t

🕉🌞🌎🌙🌟🚩

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝 *కర్మణా జాయతే భక్తిః,*

         *భక్త్యా జ్ఞానం ప్రజాయతే l*

         *జ్ఞానాత్ ప్రజాయతే ముక్తిః*

         *ఇతి శాస్త్రార్థ సంగ్రహః ll*

            

తా𝕝𝕝 *చిత్తశుద్ధితో చేసే సత్కర్మలవలన భక్తి కలుగుతుంది, నిష్కామభక్తి వలన జ్ఞానము కలుగుతుంది. ఆధ్యాత్మికజ్ఞానం వలన మోక్షము సిద్ధిస్తుంది. ఇది శాస్త్ర నిర్ణయము.*


 ✍️🌸🌹💐🙏

రాశి ఫలితాలు

 29-08-2025 శుక్రవారం రాశి ఫలితాలు


మేషం

సన్నిహితుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహ పరుస్తుంది. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగమున చికాకులు తప్పవు.

---------------------------------------

వృషభం

ఆకస్మిక ధన లాభసూచనలున్నవి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. సోదరులతో స్థిరస్థి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి పొందుతారు.

---------------------------------------

మిధునం

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. అవసరానికి ఇతరులకు ధన సహాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

కర్కాటకం

ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. కీలక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇబ్బందికి గురి అవుతారు. దూరప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు.

---------------------------------------

సింహం

ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది ఋణగ్రస్థుల నుండి రావలసిన సొమ్ము సకాలంలో చేతికందు. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు .ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

---------------------------------------

కన్య

సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు సానుకూలమవుతాయి.

---------------------------------------

తుల

చిన్న నాటి మిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంబించి లాభాలు అందుకుంటారు. 

---------------------------------------

వృశ్చికం

గృహ నిర్మాణ పనులు మందగిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఇంటాబయటా పరిస్థితుల్లు చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారమున నూతన సమస్యలు కలుగుతాయి. ఉద్యోగ వాతావరణం కొంత ఇబ్బంది కలిగిస్తుంది.

---------------------------------------

ధనస్సు

చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు పెరిగి నూతన రుణాలు చేస్తారు. బందు మిత్రులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యం తప్పదు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

---------------------------------------

మకరం

నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్న నాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------

కుంభం

వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. దీర్ఘకాలిక ఋణ భారం పెరుగుతుంది. ఇంటా బయటా ఊహించని సమస్యలు కలుగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు. సంతాన అనారోగ్యం విషయంలో జాగ్రతః వ్యవహరించాలి. సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.

---------------------------------------

మీనం

ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి. ఆప్తులతో శుభాకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. విద్యార్థులు పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు స్వల్ప లాభలు అందుకుంటారు. దైవ చింతన పెరుగుతుంది.

---------------------------------------

నిజం

 *శ్రీ కాళహస్తి శ్రీ దక్షిణా మూర్తి అద్భుత అభిషేక దర్శనం*🙏☝️


🌹🙏🌴🪔🪔🪔🪔🌴🙏🌹


                   *నిజం*


*ఎలుక రాతిది అయితే పూజిస్తాం, మూషిక రాజా అంటూ కీర్తిస్తాం, అదే ఎలుక ప్రాణాలతో మన ఇంట్లో తిరుగుతూ ఉంటే తరిమేస్తాం.*


*పాము రాతిది అయితే నాగరాజా అంటూ పూజలు చేస్తాం, పాలు పోస్తాం.. అదే పాము ప్రాణాలతో ఉంటే కొట్టి చంపేస్తాం .*

*తల్లిదండ్రులు ఫోటోల్లో ఉంటే దండవేసి దండం పెడతాం, ప్రాణాలతో ఉంటే వృద్ధాశ్రమంలో ఒదిలేస్తం .. బ్రతికున్నప్పుడు పట్టేడన్నం పెట్టడానికి ఒంతులు వేసుకుంటాము, చనిపోయాక పంచభక్ష్య పరమన్నాలు ఫోటోల ముందు పెట్టి తిను, తిను అంటూ ఏడుస్తాం.. కాదు, కాదు నటిస్తాం..*


*తోడబుట్టినోడు చనిపోతే ఈ రోజు దినం ఖర్చు నాది అని ఒకరు, పాడే ఖర్చు నాది అని ఇంకొకడు పోటీపడతారు.. అదే తోడబుట్టినోడు హాస్పిటల్ లో ఉన్నప్పుడు ఈ రోజు హాస్పిటల్ బిల్లు నాది, నేను భరిస్తా అని ఒక్కడూ అనడు..*

*చనిపోయిన వాడికి ( శవానికి ) భుజాన్ని అందించడానికి పోటీ పడతాం, బ్రతికి ఉన్న వాడికి చేయూతను మాత్రం ఇవ్వం .*

*రాయిలో దైవత్వం వుందని తెలుసుకున్నాం . కానీ మనిషి లో మానవత్వాన్ని గుర్తించలేక పోతున్నాం . జీవం లేనివాటిపై భక్తి ఎందుకు..? ప్రాణంతో ఉంటే ద్వేషం ఎందుకు..? నాకైతే అర్ధం కావడం లేదు..*

*సాటివాడిపై ప్రేమని పంచలేని నువ్వు దేవుడిని ఏం పూజిస్తావ్ నేస్తమా... దేవుడు ఆలయంలోనే ఉంటాడనుకునేవాడు మూర్ఖుడు.. వాడు ఏనాటికీ దైవాన్ని చూడలేడు, ఆయన కృపకి పాత్రులు కాలేడు...*


🌹🙏🌴🪔🪔🪔🪔🌴🙏🌹


*ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం, ఆ పరమాత్ముడికి నైవేద్యం నివేదించడం కన్నా ఎన్నో రెట్లు గొప్పదని గ్రహించితే మంచిది*


🌹🙏🌴🪔🪔🪔🪔🌴🙏🌹

28, ఆగస్టు 2025, గురువారం

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: పదకొండవ అధ్యాయం

విశ్వరూపసందర్శనయోగం:అర్జున ఉవాచ


నభఃస్పృశం దీప్తమనేకవర్ణం

వ్యాప్తాననం దీప్తవిశాలనేత్రమ్ 

దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా

ధృతిం న విందామి శమం చ విష్ణో (24)


దంష్ట్రాకరాలాని చ తే ముఖాని

దృష్ట్వైవ కాలానలసన్నిభాని 

దిశో న జానే న లభే చ శర్మ

ప్రసీద దేవేశ జగన్నివాస (25)


ఆకాశాన్ని అంటుతూ, అనేకరంగులతో ప్రకాశిస్తూ, నోళ్ళు విప్పి, ఉజ్జ్వల విశాల నేత్రాలతో వున్న నిన్ను చూసి ఎంతో భయపడిపోయిన నేను ధైర్యం, శాంతి పొందలేకపోతున్నాను. కోరలతో భయంకరంగా ప్రళయకాలంలోని అగ్నిలాగ కానవస్తున్న నీ ముఖాలు నాకు దిక్కుతోచకుండా చేశాయి. దేవేశా.. జగన్నివాసా.. దిగులు పడివున్న నన్ను అనుగ్రహించు.

చింత చిగురు...*

 ;

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀```ఆరోగ్య చింతలను తీర్చే…```



                *చింత చిగురు...*

                   ➖➖➖✍️

తింటే మీకే తెలుస్తుంది...,



```

సీజన్‌లో దొరికే చింత చిగురును ఆహారంలో తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. 


ఈ కాలంలో విరివిగా లభ్యమయ్యే చింతచిగురుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. 



*చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. 

*దీంతో ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్‌గా పని చేస్తుంది. 

*ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో చింతచిగురు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. 

*ఈ చిగురును ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతునొప్పి, మంట, వాపు తగ్గుతాయి. 

*యాంటీ ఇన్‌ఫ్లేమటరీ గుణాలు చింత చిగురులో ఉండటమే ఇందుకు కారణం. 


*కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురుతో చేసిన వంటలు తినిపిస్తే ఫలితం ఉంటుంది. 

*జీర్ణాశయ సంబంధ సమస్యలను తొలగించడంలో చింత చిగురు బాగా ఉపయోగపడుతుంది. ఈ చిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. 

*ఇవి శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను పటిష్ఠపరుస్తాయి. 


*తరచూ చింత చిగురును తింటే ఎముకలు ధృడత్వాన్ని సంతరించుకుంటాయి. 

*థైరాయిడ్‌తో బాధపడేవారు చింత చిగురును తమ ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 

*గుండె జబ్బులను చింత చిగురు దరిచేరనీయదు. 

*శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి అవసరమైన పోషకాలను అందించడమే గాక, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. 

*చింత చిగురును పేస్ట్‌లా చేసి కీళ్ళపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

జగన్నాథ స్వామి ఆలయం

 🕉 మన గుడి : నెం 1217


⚜  ఒడిస్సా : పూరీ 


⚜  శ్రీ క్షేత్రం - జగన్నాథ స్వామి ఆలయం



💠 మన భారతదేశంలో ఎన్నో ప్రాముఖ్యం , విశిష్టత , అద్భుతం కలిగిన దేవాలయాలు ఎన్నో వున్నాయి. అలాంటి దేవాలయాలు జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా దర్శించాలని అంటుంటారు. అలాంటి మహా అద్భుత ఆలయాలలో ఎంతో ప్రసిద్ధిచెందిన పూరీ జగన్నాథ ఆలయం.



💠 జగన్నాథ ఆలయాన్ని శ్రీకృష్ణుడు తన సోదరుడు మరియు సోదరితో జగన్నాథుడిగా ప్రధాన దైవంగా నిర్మించినప్పుడు, పూరీని ఒకప్పుడు పురుషోత్తమ పురి , పురుషోత్తమ క్షేత్ర , పురుషోత్తమ ధర్మ , నీలాచల , నీలాద్రి , శ్రీక్షేత్ర , శంఖక్షేత్ర వంటి అనేక పేర్లతో పిలేచేవారు.



🔆 స్థలపురాణo 


💠 కృష్ణుడి అవతారం అయిన జగన్నాథుడు.. ఒకనాడు ఒక అత్తిచెట్టు కింద ఇంద్రనీలం రూపంలో మెరుస్తూ ధర్మరాజుకు కనిపించాడు.

అది చూసిన అతను... ఒక విలువైన రాయి అని భావించి.. నేలమాళిగలో ఎవరికంటా పడకుండా నిక్షిప్తం చేశాడు.


💠 ఈ విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్నుడు అనే రాజు దానిని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే ఆశతో వెదకడం మొదలుపెడతాడు.

అయితే అది ఎక్కడుందో కనిపెట్టలేక భూమంతా తవ్వి వెదికాడు. 

అయినా అధి లభించకపోవడంతో నిరాశతో నీరసించిపోతాడు.

అక్కడే కొద్దిసేపటివరకు సేద తీర్చుకోవాలని నిద్రపోతాడు.


💠 ఇంద్రద్యుమ్నుడు నిద్రిస్తున్న సమయంలో అతని కలలోకి విష్ణువు కనిపించి నదీ తీరానికి ఒక కొయ్య కొట్టుకు వస్తుందనీ దాన్ని విగ్రహాలుగా మలచమనీ ఆజ్ఞాపించాడట. 

కానీ అలా నదీతీరంలో 

లభ్యమైన దారువును విగ్రహాలుగా మలిచేందుకు ఎవరూ ముందుకు రాలేదట. 


💠 అప్పుడు దేవశిల్పి విశ్వకర్మ రాజువద్దకు మారువేషంలో వచ్చి ఆ కొయ్యను తాను విగ్రహాలుగా మలచగలనన్నాడట. 

కానీ తాను తలుపులు మూసుకుని ఈ పని చేస్తాననీ తన పనికి మధ్యలో ఆటంకం కలిగించకూడదనీ షరతు పెడతాడు. 


💠 కానీ పదిహేను రోజుల తర్వాత... ఉత్సుకతను ఆపుకోలేని రాజు తలుపులు “తెరిపించాడట. అప్పటికి విగ్రహాల నిర్మాణం పూర్తికాలేదు. 

అందువల్లే కృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలకు చేతులు వుండవు.


💠 దాంతో వాటిని అలాగే ప్రతిష్ఠించారనీ ఇప్పటికీ జగన్నాధుడు అదే రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడనీ స్థలపురాణం


💠 విమల ఆలయం (బిమల ఆలయం) శక్తిపీఠాలలో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది . 

ఇది ఆలయ సముదాయంలోని రోహిణి కుండ్ సమీపంలో ఉంది . జగన్నాథుడికి సమర్పించిన ఆహారాన్ని విమల దేవతకు సమర్పించే వరకు దానిని మహాప్రసాదంగా పరిగణించరు.


🔆 రథయాత్ర


💠 ద్వాపరయుగంలో కంసుడిని వధించడానికి బలరామకృష్ణులు బయలుదేరిన ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ యాత్ర జరుపుతారని ఒక కథనం. 

ద్వారకకు వెళ్లాలన్న సుభద్రాదేవి కోరిక తీర్చే ముచ్చటే ఈ రథయాత్ర అని మరికొందరు చెబుతారు. 


💠 ఇక గుండీచాదేవి మందిరం విషయానికొస్తే... 

పూరీ జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన ఇంద్రద్యుమ్న మహారాజు భార్య గుండీచా. ఆవిడ జగన్నాథ బలభద్రుల కోసం ప్రధానాలయానికి 3 కి.మీ. దూరంలో ఒక మందిరం నిర్మించింది. అదే గుండీచా ఆలయం. 


💠 రథయాత్రలో భాగంగా అక్కడికి తీసుకువెళ్లిన మూడు విగ్రహాలనూ ఈ గుడిలోని రత్నసింహాసనంపై కూర్చుండబెట్టి గుండీచాదేవి పేరిట ఆతిధ్యం ఇస్తారు. ఒకరకంగా చెప్పాలంటే గుండీచా మందిరం జగన్నాధుడి అతిథిగృహం అన్నమాట!


💠 ప్రపంచంలో ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూలవిరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి. ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్లా చూసేదే. ఈ సంప్రదాయాలన్నింటికీ మినహాయింపు పూరీ జగన్నాథాలయం. 


💠 సుభద్రా బలభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు. 

అందుకే జగన్నాథుడి రతయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు.


💠 జగన్నాథుని కన్నుల పండువగా రథయాత్రను నిర్వహిస్తారు.

ఈ యాత్రను ఆషాడశుక్ల విదియనాడు ప్రారంభం అవుతుంది. అంటే జూన్ లేదా జూలై నెలల్లో జరుగుతుంది.


💠 శ్రీ జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. 

బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. 

సుభద్ర రథాన్ని దర్పదళన అంటారు.


💠 ఇక్కడ భగవంతుడికి 56 రకాల ప్రసాదాలు కట్టెల పొయ్యి మీద వండి భగవంతుడికి ప్రతినిత్యం నివేదిస్తారు. 

ఆ ప్రసాదాలన్నీ నిలువునా పేర్చిన 6 కుండలలో వండుతారు, కట్టెల పొయ్యికి దగ్గరగా ఉండే కుండలో ఎంత నాణ్యతతో ప్రసాదం తయారు అవుతుందో చివరి కుండలో కూడా అంతే నాణ్యతతో ప్రసాదం తయారవడం ఇక్కడి భగవంతుడి లీలగా పరిగణిస్తారు.


💠 అలా నివేదించబడిన ప్రసాదాలను ఆనంద్ బజార్ అని ప్రదేశంలో భక్తుల కోసం సరసమైన ధరలకు విక్రయిస్తారు. 

అలా భగవంతుడికి నివేదించి భక్తులకు వితరణ చేసే ప్రసాదాన్ని " అబడా" అంటారు.

పూరీ క్షేత్రంలో భగవంతుడి దర్శనానికి ఎంత ప్రాముఖ్యత ఉందో దానికి సరి సమానంగా ఈ ప్రసాదం స్వీకారానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది.



💠 ఇది ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ నుండి 60 కిమీ దూరంలో ఉంది. 



రచన

©️ Santosh kumar

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*శాంతి పర్వము ప్రథమాశ్వాసము*


*482 వ రోజు*


*సృంజయుడి వృత్తాంత*


తరువాత కథను నారదుడు చెప్పసాగాడు " ధర్మరాజా ! అలా నేను పర్వతుడితో కొంతకాలం సృంజయుడి ఇంట్లో ఉండి కొన్నిసంవత్సరాల అనంతరం తిరిగి స్వర్గలోకం పోవానని అనుకున్నాము. వెళ్ళే సమయాన మా పట్ల గౌరవాభిమానాలు చూపించిన సృంజయుడికి ఏదైనా మేలు చేయాలన్న తలంపుతో నేను అతడికి దేవతలకన్నా ఉన్నతుడైన కుమారుడు కలగాలని వరం ఇచ్చాను. పర్వతుడు సృంజయుడికి కలుగబోయే కుమారుడి వలన ఇంద్రుడికి ఏదైనా కీడు కలుగకలదన్న తలంపుతో " సృంజయా ! ఆ కుమారుడు అర్ధాయుష్కుడు కాగలడు " అన్నాడు. అమాటలకు నాకు కోపంవచ్చి " సృంజయా ! ఆ కుమారుడిని నీకు చేతనైనంత కాపాడుకో. నీ శక్తికి మించి నీకుమారుడికి మరణం సంభవించిన వెంటనే నన్ను తలచిన నేను వచ్చి అతడికి ప్రాణదానం చేస్తాను. అలాగే నేను నీకు ఇంకొక వరం ఇస్తున్నాను. నీ కుమారుడి శరీరంలోని విసర్జితాలు అన్నీ స్వర్ణ మయం ఔతాయి. అందు వలన అతడు సువర్ణష్టీవి అని పిలువబడతాడు " అని అన్నాను. నా మాటలకు సృంజయుడు ఆనందపడ్డాడు. తరువాత మేము వెళ్ళి పోయాము. నా వరంవలన సృంజయుడికి ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడి మలమూత్రములు, శ్వేదం మిగిలిన విసర్జితాలన్నీ బంగారంగా మారసాగాయి. సృంజయుడి ఇల్లంతా బంగారంతో నిండిపోయింది. ఈ విషయాన్ని పసికట్టిన కొందరు దొంగలు సువర్ణష్టీవివిని అపహరించి తీసుకు వెళ్ళి అతడి నోట్లో గుడ్డలుకుక్కి సమీపంలోని అడవిలోకి తీసుకు వెళ్ళారు. అతడి శరీరమంతా శోధించి ఎక్కడా సువర్ణం లభ్యంకాక వారు సువర్ణష్టీవిని చంపి అక్కడే పారవేసి వెళ్ళారు. సృంజయుడు తన కుమారుడు కనిపించక అంతటా వెతికి చివరకు నారదుడిని తలచుకున్నాడు. నేను అతడి వద్దకు వెళ్ళి జరిగిన విషయం తెలుసుకుని సువర్ణష్టీవి మరణ వృత్తాంతం చెప్పాను. సృంజయుడు సువర్ణష్టీవి మరణానికి ఎంతో దుఃఖించాడు. నేను " సృంజయా ! నీ కుమారుడు యమలోకంలో ఉన్నాడు. నీ కుమారుడిని నేను తీసుకు వస్తాను " అని చెప్పి సువర్ణష్టీవిని పునరుజ్జీవితుడిని చేసాను. సృంజయుడు చాలా సంతోషించాడు. నాను సృంజయుడితో " సృంజయా ! ఇంద్రుడు నీ కుమారుడిని చంపడానికి ఎదురు చూస్తున్నాడు. జాగ్రత్తగా ఉండు " అని చెప్పి వెళ్ళాను. దేవేంద్రుడికి సువర్ణష్టీవి వలన తనకు ఆపద కలుగకలదన్న భయం పట్టుకుంది. ఒకరోజు సృంజయుడు తన భార్యాబిడ్డలతో గంగా నదీతీరాన విహరిస్తున్న సమయంలో ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని వ్యాఘ్ర రూపంలో అతడి మీద ప్రయోగించాడు. వజ్రాయుధం తగిన సమయం చూసి వ్యాఘ్రరూపం ధరించి సువర్ణష్టీవిని చీల్చిచంపి మాయం అయింది. సువర్ణష్టీవి మరణానికి దుఃఖిస్తూ సృంజయుడు నన్ను తలచుకున్నాడు. నేను వెళ్ళి సువర్ణష్టీవిని సజీవుడిని చేసి తిరిగి వెళ్ళిపోయాను. సువర్ణష్టీవి దీర్ఘాయుష్కుడై వేలాది సంవత్సరములు రాజ్యపాలన చేసాడు.ధర్మరాజా ! నీవు కూడా నీ పట్టు వదిలి రాజ్యభారం వహించు.

*వ్యాసుడి హితవు*


నారదుడి మాటలు విన్న తరువాత కూడా ధర్మరాజు మౌనం వీడలేదు. అది చూసి వ్యాసుడు " ధర్మజా ! క్షత్రియులకు రాజ్యపాలన కంటే వేరే ధర్మంకలదా ! అందువలన వేదవిహితమైన విప్రకర్మలు ఆచరించబడతాయి. విప్రకర్మలు ఆచరించని ఎడల సమాజముకు నష్టం వాటిల్లగలదు. వేదవిహిత విప్రకర్మలు ఆచరించని ఎడల రాజుకు పాపంసంక్రమించి ఉత్తమలోక ప్రాప్తికి ఆటంకంకలుగుతుంది. కనుక ప్రజాపాలనయే నీధర్మం " అన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

పాదములతో తాకరాదు.*

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝      *పాదాభ్యాం న స్పృశేత్*

          *అగ్నిం గురు బ్రాహ్మణమేవ చ|*

          *నైవ గాం న కుమారీం చ*

         *న వృద్ధం న శిశుం తథా||*


తా𝕝𝕝  *అగ్నిని, గురువును, బ్రాహ్మణుని, ఆవును, కన్యను,వృద్ధుని, శిశువును పాదములతో తాకరాదు.*


✍️🌸🌹💐🙏

గురువారం🪷* *🌹28 ఆగస్టు 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       *🪷గురువారం🪷* 

  *🌹28 ఆగస్టు 2025🌹* 

     *దృగ్గణిత పంచాంగం* 

                  

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్షఋతౌః* 

*భాద్రపద మాసం - శుక్లపక్షం*


*తిథి  : పంచమి* సా 05.56 వరకు ఉపరి *షష్ఠి*

*వారం    : గురువారం* ( బృహస్పతివాసరే )

*నక్షత్రం   : చిత్త* ఉ 08.43 వరకు ఉపరి *స్వాతి*


           *ఈనాటి పర్వం*

      *ఋషి పంచమి వ్రతం*


*యోగం : శుక్ల* మ 01.18 వరకు ఉపరి *బ్రహ్మ*

*కరణం  : బాలువ* సా 05.56 *కౌలువ పూర్తిగా రాత్రంతా*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 11.00 - 12.00 సా 05.00 - 06.00*

అమృత కాలం  : *రా 01.46 - 03.34*

అభిజిత్ కాలం  : *ప 11.43 - 12.33*

*వర్జ్యం      : మ 03.00 - 04.48*

*దుర్ముహూర్తం  : ఉ 10.03 - 10.53 మ 03.03 - 03.53*

*రాహు కాలం   : మ 01.42 - 03.16*

గుళికకాళం       : *ఉ 09.01 - 10.35*

యమగండం     : *ఉ 05.54 - 07.27*

సూర్యరాశి : *సింహం*              

చంద్రరాశి : *తుల*

సూర్యోదయం :*ఉ 06.02* 

సూర్యాస్తమయం :*సా 06.33*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.54 - 08.24*

సంగవ కాలం         :     *08.24 - 10.53*

మధ్యాహ్న కాలం    :     *10.53 - 01.23*

అపరాహ్న కాలం    : *మ 01.23 - 03.53*


*ఆబ్ధికం తిధి         : భాద్రపద శుద్ధ పంచమి*

సాయంకాలం        :*సా 03.53 - 06.23*

ప్రదోష కాలం         :  *సా 06.23 - 08.41*

రాత్రి కాలం           :*రా 08.41 - 11.46*

నిశీధి కాలం          :*రా 11.46 - 12.32*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.22 - 05.08*

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*శ్రీదత్త నవరత్నమాలికా స్తోత్రం*


*ఏకవస్తుపరిబోధయితారం*

 *దత్తదేవమనిశం కలయామి*


         *జై దత్తాత్రేయ నమః*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


           🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

శ్రీమద్భాగవత కథలు*```

 🔯🌹🌷🪔🛕🪔🌷🌹🔯

*🪷బుధవారం 27 ఆగస్టు 2025🪷*

                    4️⃣4️⃣

                *ప్రతిరోజూ*

*మహాకవి బమ్మెర పోతనామాత్య*


         *శ్రీమద్భాగవత కథలు*```


(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా)```


*వేదాలు వేయి సార్లు చదివినా లభ్యం కాని ముక్తి, భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది..!*``


      *ఖగోళ విషయ విస్తారం*               

```

బ్రహ్మాండమధ్యంలో ఉన్న సూర్యుడు ముల్లోకాలను తన తేజస్సుతో నింపితపింపచేస్తూ, కాంతిమంతం చేస్తున్నాడు. సూర్యుడికి ఏడాది సాగే నడకలో ఉత్తరాయణం, దక్షిణాయనం, విషువం అనే మూడు గమనాలున్నాయి. ఉత్తరాయణంలో మీదికి వెళ్తాడు. దక్షిణాయనంలో కిందకు వెళ్తాడు. ఉత్తరాయణంలో మెల్లగా నడుస్తాడు కాబట్టి పగళ్లు ఎక్కువ, రాత్రుళ్లు తక్కువ. దక్షిణాయనంలో వేగంగా నడుస్తాడు కాబట్టి పగళ్లు తక్కువ, రాత్రుళ్లు ఎక్కువ. విషువంలో సమానం. రాత్రింబగళ్లు ఎక్కువ - తక్కువలు ఉండవు. సూర్యుడు మేషరాశిలోను, తులారాశిలోను ప్రవేశించినప్పుడు పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. మేషంలోకి వచ్చినప్పటి మర్నాటి నుండి రోజు-రోజుకు పగలెక్కువ, రాత్రి తక్కువ అవుతుంటుంది. సూర్యుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య రాశుల్లో ప్రవేశించేటప్పుడు నెలకు ఒక్కొక్క ఘడియ పగటిపూట పెరుగుదల, రాత్రిపూట తరుగుదల ఉంటాయి. అలాగే, సూర్యుడు వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం రాశుల్లోకి ప్రవేశించినప్పుడు నెలకు ఒక్కొక్క ఘడియ పగటిపూటలో తరుగుదల, రాత్రిపూటలో పెరుగుదల ఉంటాయి.


ఇలా దినాలు, ఉత్తరాయణం, దక్షిణాయనం, పెరగడం, తరగడం ఏర్పడుతున్నాయి. సూర్యుడు తన రథం మీద మానసోత్తర పర్వతం చుట్టూ తిరగడానికి ఒక పగలు, ఒక రాత్రి పూర్తవుతాయి. ఆ పర్వతం చుట్టు కొలత తొమ్మిది కోట్ల ఏభై ఒక్క లక్షల యోజనాలు. మానసోత్తర పర్వతానికి తూర్పు దిక్కున ఇంద్రుడి పట్టణం ఉన్నది. దాని పేరు దేవధాని. దక్షిణ దిక్కున యముడి పట్టణం ఉన్నది. దాని పేరు సంయమని. పడమటి వైపు వరుణుడి పట్టణం నిమ్లోచని ఉన్నది. ఉత్తరం వైపున చంద్రుడి పట్టణం విభావరి ఉన్నది. జ్యోతిశ్చక్రం భ్రమించడం వల్ల భూమిలో సూర్యుడు కనిపించడం ఉదయం, ఆకాశంలో కనిపించడం మధ్యాహ్నం, భూమిలోకి చొచ్చినట్లు కనిపించడం అస్తమయం, దూరంగా ఉండడం రాత్రి. ఈ ఉదయాస్తమయాదులు జీవుల ప్రవృత్తి, నివృత్తులకు హేతువులై ఉంటాయి.


సూర్యుడు ఇంద్రపురం నుండి యమపురానికి వెళ్లేటప్పుడు పదిహేను గడియలలో రెండు కోట్ల ముప్పై ఏడు లక్షల డెబ్బె అయుదు వేల (2,37,75,000) యోజనాల దూరం దాటి వెళ్తాడు. యమపురి నుండి వరుణపురి, అట్నుంచి సోమపురి ఇలా పోతుంటాడు. ఇలా చంద్రగ్రహనక్షత్రాదులతో కూడి తిరుగుతూ వున్న సూర్యుడి రథచక్రానికి పన్నెండు అంచులు, ఆరు కమ్ములు, మూడు నాభులు ఉంటాయి. ఆ చక్రానికి సంవత్సరం అని పేరు. సూర్యుడి రథానికి ఒకటే చక్రం. ఈ ఏకచక్ర రథం ఒక్క ముహూర్త కాలంలో ముప్పై నాలుగు లక్షల ఎనిమిది వేల యోజనాల మేర సంచరిస్తుంది.


సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు మేరు శిఖరం మొదలు మానసోత్తర పర్వతం వరకు వ్యాపించి ఉంటుంది. దీని పొడవు ఒక కోటి ఏబై ఏడు లక్షల ఏభై వెల యోజనాలు. ఈ ఇరుసుకు గానుగ చక్రంలాగా, చక్రం అమర్చబడి, మానసోత్తర పర్వతం మీద సూర్యరథం తిరుగుతుంటుంది. ఇరుసు ఒకటి ఉత్తర ధ్రువం వైపు. ఇంకొకటి దక్షిణ ధ్రువం కింది దాకా ఉంటుంది. ఈ ఇరుసులు రెండింటి మీద ఈ చక్రం ధ్రువాలలో బిగించబడి ఉంటుంది. భూ పరిభ్రమణం వల్ల ఉత్తర-దక్షిణ ధ్రువాలలో గాలి సుడిగుండాలు ఏర్పడుతాయి. అవే తాళ్లుగా ఆ తాళ్లతో ఇరుసులు ద్రువాలకు బిగించబడి ఉంటాయి. అ రథంలో సారథి కూర్చోడానికి అనువైన చోటు ముప్పెఆరు లక్షల యోజనాల పొడవు, తొమ్మిది లక్షల యోజనాల వెడల్పు కలిగినది. ఆ రథానికి కాడి కూడా ముప్పైఆరు లక్షల యోజనాల విస్తృతి కలిగి ఉంటుంది.


సూర్య రథానికి గాయత్రి మొదలైన ఏడు ఛందస్సులు (గాయత్రి, ఉష్ఠిక్, త్రిష్ణువ్, అనుష్టుప్, జగతి, పంక్తి, బృహతి) గుర్రాలై ఉంటాయి. సూర్యుడికి ముందు అరుణుడు రథసారథిగా ఉంటాడు. వాలఖిల్యుడు మొదలైన 60 వేలమంది ఋషిశ్రేష్ఠులు సూర్యుడి ముందర సౌరసూక్తాన్ని స్తుతిస్తూ ఉంటారు. ఈ ఋషులు బొటన వేలు పైభాగం ఎంత ఉంటుందో అంతే శరీరం కలవారై ఉంటారు. ఇంకా ఎందరో మునులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, నాగులు, అప్సరసలు, పతంగులు మొదలైన వారంతా నెలనెలా వరుస క్రమంలో సూర్యుడిని సేవిస్తూ ఉంటారు. ఇంతమంది ఇలా సేవిస్తూ ఉంటే, సూర్యుడు తొంభై కోట్ల ఏభై ఒక్క లక్షల యోజనాల పరిమాణం ఉన్న భూమండలాన్ని అంతటినీ ఒక్క పగలు, రాత్రిలో సంచరించి వస్తూ ఉంటాడు. అంటే ఒక్క క్షణానికి రెండువేల యోజనాలు సంచరిస్తాడు.


మేరువుకు, ధ్రువానికి సూర్యుడు ప్రదక్షిణ చేయడం, రాశి చక్రం మీద సంచరించడం ఎలా కుదురుతుందన్న సందేహం కలగవచ్చు. అంటే, ఉత్తర ధ్రువం ఉండేది ఉత్తర దిశలో కదా. రాశి చక్రం ఉండేది భూమధ్య రేఖ మీద కదా, అలాంటప్పుడు, ఉత్తర ధ్రువానికి ప్రదక్షిణం, రాశి చక్రం మీద సంచరించడం ఏక కాలంలో ఎలా అన్నది అసలు సందేహం. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒక్కటి ఉంది. అదే, సకలం భగవత్సృష్టి విలాసం అనే విషయం. ఇలాంటి సందేహాలను పూర్తిగా తీర్చగలగడం ఒక్క సర్వేశ్వరుడికే చేతనవుతుంది.


నక్షత్రాలతో, రాశులతో కూడిన కాలచక్రం ధ్రువానికి మేరువుకు ప్రదక్షిణం చేసేటప్పుడు, ఆ కాలచక్రం వెంట సంచరించే సూర్యాది గ్రహాలకు నక్షత్రాలతోను, రాశులతోను, ఉనికి ఉండడంతో చక్రగతి వల్ల, వాటంతట వాటికి ఉన్న గతుల వల్ల, రెండు గతులు ఉంటూ ఉంటాయి. ఆదిపురుషుడైన భగవానుడే, ఆ నారాయణుడే, లోకాలకు యోగ క్షేమాలను కూర్చడానికై సూర్యుడి రూపంలో మనకు దర్శనం ఇస్తున్నాడు. సూర్యుడు మూడు వేదాల స్వరూపం. నారాయణుడే సూర్యుడిగా ప్రకాశిస్తున్నాడు. ఆ పరమపురుషుడే తనను పన్నెండు విధాలుగా విభజించుకుని వసంతం మొదలైన ఆరు ఋతువులను ఆయా కాలాలలో జరిగే విశేషాల్ని బట్టి ఏర్పాటు చేశాడు. ఆ పరమ పురుషుడు జ్యోతిశ్చక్రం లోపల ప్రవర్తిస్తూ తనదైన తేజస్సుతో సకల జ్యోతిర్గణాలను దీపింప చేస్తున్నాడు. మేషాది పన్నెండు రాశులలోను ఒక్కో మాసం వంతున ఒక సంవత్సరం సంచరిస్తాడు. ఆయన గమనంలోని విశేషమైన కాలాన్ని అయనాలుగా, ఋతువులుగా, మాసాలుగా, పక్షాలుగా, తిథులుగా వ్యవహరిస్తారు. రాశులలో ఆరవ అంశం ఆయన సంచరించినప్పుడు దానిని ఋతువు (అంటే సంవత్సరంలో ఆరవ వంతు, రెండు మాసాల కాలం) అని అంటారు. కాలచక్రంలో సూర్యుడు సగభాగం, అంటే, ఆరు రాశులలో సంచరించే కాలాన్ని అయనం అంటారు.


                 *(సశేషం)*

*🙏కృష్ణం వందే జగత్ గురుమ్!🙏*


        *రచన: శ్రీ వనం* 

  *జ్వాలా నరసింహారావు*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

            🌷🙏🌷``


 *🚩జై శ్రీ కృష్ణ!   జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - వర్ష ఋతువు - భాద్రపద మాసం - శుక్ల పక్షం -‌ పంచమి -చిత్ర -‌‌ ‌గురు వాసరే* (28.08.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

27, ఆగస్టు 2025, బుధవారం

పద్యములు

 . *పద్యములు*


ఉ౹౹ తుండము నేక దంతమును దోరపు బొజ్జయు వామహస్తమున్

       మెండుగ మ్రోయుగజ్జలును మెల్లని చూపులు మందహాసమున్ 

       కొండొక గుజ్జురూపమున గోరిన విద్యలకెల్ల నొజ్జయై 

       యుండెడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్


ఉ౹౹ తొలుత నవిఘ్నమస్తనుచు, ధూర్జటినందన నీకు మ్రొక్కెదన్

ఫలితము సేయుమయ్య, నిను ప్రార్థనచేసెద నేకదంత మా

వలపలి చేత గంటమున వాక్కుననెప్పుడుఁ బాయకుండు మీ

          తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోకనాయకా.


కం౹౹ తలచితి నే గణనాథుని తలచితి నే విఘ్నపతినిఁ దలచిన పనిగా

        తలచితి నే హేరంబుని తలచితి నా విఘ్నములు తొలగుట కొఱకున్.


కం౹౹ అటుకులు కొబ్బరిపలుకులు చిటిబెల్లము నానుఁబ్రాలు చెరకురసంబున్

       నిటలాక్షు నగ్రసుతునకు బటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్.


కం౹౹ గారెలుబూరెలు పూర్ణపు

బూరెలు నుండ్రాళ్ళు లడ్డు పులిహోరయుమే... 

       పూరీలు పాయసము లిం

పారగ నర్పించి కొల్తు నంచితభక్తిన్.


卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐


. *వినాయక పంచరత్నములు*


సామజానన నీ మహాత్మ్యము - సన్నుతింపగ విందురా

వేమరుం గొనియాడు వారల - వింతగా మది నెంతురా

ప్రేమమీరగ సాధుదేవర -వేల్పు నీవని గందురా

కామితార్థ ఫలప్రదాయక - కంచుతేరు వినాయకా.


నీ మహాత్మ్యము లెల్ల ధరలో-నిత్యమై వెలుగొందురా

ఓ మహాత్మక భావపోషక - ఒప్పు మూషిక వాహన

వామయంచక పుత్రతామర - వాసవాది సురార్చిత

కామితార్థ ఫలప్రదాయక - కంచుతేరు వినాయకా.


తూర్యభేరులు మ్రోగ భక్తిని తొల్త నిత్తును పువ్వులన్

ఆర్యులందరు దెత్తు‌రప్పుడు - అంబుజానన వారలన్

కోటిసూర్యులకాంతివెల్గుచు-కోరు కోర్కెల దీర్చుదేవర

కార్యసిద్ధి పలప్రదాయక - కంచుతేరు వినాయకా.


ఝాముఝామున నాను బియ్యము - చాల కొబ్బరికాయలన్

కోమలాంగులు దెత్తురప్పుడు - కోటిమోదక పూర్ణముల్ 

నా మనోహరమైన చక్కెర - నీకు నేనెటులిత్తురా

కామితార్థ పలప్రదాయక - కంచుతేరు వినాయకా.


రాజపూజిత రాజశేఖర - రాజరాజ మనోహరా

భూమిపాలక భోగిభూషణ - భూరికీర్తిదనాయకా 

నా మనోహర కామ్యదాయక నాథనాథ వినాయకా

కామితార్థ పలప్రదాయక - కంచుతేరు వినాయకా.


卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐

*శ్రీ మహా గణేశ పంచ రత్నం* 


ముదా కరాత్త మోదకం సదా విముక్తి సాధకం ।

కళాధరావతంసకం విలాసిలోక రక్షకం ।

అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం ।

నతాశుభాశు నాశకం నమామి తం వినాయకం ॥ 1 ॥


నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం ।

నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ఢరం ।

సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం ।

మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం ॥ 2 ॥


సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరం ।

దరేతరోదరం వరం వరేభ వక్త్రమక్షరం ।

కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం ।

మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం ॥ 3 ॥


అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం ।

పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణం ।

ప్రపంచ నాశ భీషణం ధనంజయాది భూషణం ।

కపోల దానవారణం భజే పురాణ వారణం ॥ 4 ॥


నితాంత కాంతి దంత కాంతి మంత కాంతి కాత్మజం ।

అచింత్య రూపమంత హీన మంతరాయ కృంతనం ।

హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం ।

తమేకదంతమేవ తం విచింతయామి సంతతం ॥ 5 ॥


మహాగణేశ పంచరత్నమాదరేణ యోఽన్వహం ।

ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం ।

అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం ।

సమాహితాయు రష్టభూతి మభ్యుపైతి సోఽచిరాత్ ॥

卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐



. *విఘ్నేశ్వరుని మంగళహారతులు*


శ్రీ శంభుతనయునకు సిద్ధి గణనాథునకు వాసిగల దేవతావంద్యునకును

ఆసరస విద్యలకు ఆదిగురువైనట్టి భూసురోత్తమ లోకపూజ్యునకును

౹౹జయమంగళం నిత్యశుభమంగళం౹౹


నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వార చెంగల్వ ఉత్తరేణు ౹

వేఱువేఱుగ దెచ్చి వేడ్కతో పూజింతు పర్వమున దేవ గణపతికి నిపుడు ౹౹జయమంగళం౹౹


సురుచిరముగ భాద్రపద శుద్ధ చవితియందు పొసగ సజ్జనులచే పూజగొల్తు ౹

శశిచూడరాకున్న జేకొంటి నొక వ్రతము ౹ పర్వమున దేవగణపతికి నిపుడు ౹౹జయమంగళం౹౹


పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్ష పండ్లు

తేనెతో మాగిన తియ్య మామిడి పండ్లు మాకు బుద్ధి నిచ్చు గణపతికి నిపుడు ౹౹జయమంగళం౹౹


ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండుపంపు ౹

కమ్మని నెయ్యియు కడుముద్ద పప్పును బొజ్జ విరుగగ తినుచు పొరలుకొనుచు ౹౹జయమంగళం౹౹


వెండి పళ్ళెరములో వేయివేల ముత్యాలు కొండలుగ నీలములు కలియబోసి ౹

మెండుగను హారములు మెడనిండ వేసుకొని దండిగా నీకిత్తు ధవళారతి ౹౹జయమంగళం౹౹


పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరిని ౹

ఎప్పుడూ నినుగొల్తు ఏకచిత్తంబున పర్వమున దేవగణపతికి నిపుడు. ౹౹జయమంగళం౹౹                  


ఏకదంతంబును ఎల్ల గజవదనంబు జాగయిన తొండంబు వలపుకడుపు ౹

జోకయిన మూషికము సొరిది నెక్కాడుచును భవ్యుడగు దేవగణపతికి నిపుడు ౹౹జయమంగళం౹౹ 


మంగళము మంగళము మార్తాండతేజునకు మంగళము సర్వఙ్ఞ వందితునకు

మంగళము ముల్లోక మహిత సంచారునకు మంగళము దేవగణపతికి నిపుడు ౹౹జయమంగళం౹౹ 


బంగారు చెంబుతో గంగోదకము తెచ్చి సంగతిగ శివునకు జలకమార్చి ౹

మల్లెపువ్వులు దెచ్చి మురహరుని పూజింతు రంగైన నా ప్రాణలింగమునకు ౹౹జయమంగళం౹౹ 


పట్టుచీరలు మంచి పాడిపంటలు గల్గి గట్టిగా కనకములు కరులు హరులు ౹

యిష్టసంపదలిచ్చి యేలిన స్వామికి పట్టభద్రుని దేవగణపతికి నిపుడు ౹౹జయమంగళం౹౹


ముక్కంటి తనయుడని ముదముతో నేనును చక్కనైన వస్తు సమితి గూర్చి

నిక్కముగ మనమును నీయందె నేనిల్పి ఎక్కుడ(వ)గు పూజ లాలింపజేతు ౹౹జయమంగళం౹౹


మల్లెలా మొల్లలా మంచి సంపెంగలా చల్లనైన గంధసారములను ౹

ఉల్లమలరగ మంచి ఉత్తమపు పూజలు కొల్లలుగ నేజేతు కోరి విఘ్నేశ ౹౹జయమంగళం౹౹ 


దేవాదిదేవునకు దేవతారాధ్యునకు దేవేంద్రవంద్యునకు దేవునకును ౹

దేవతలు మిముగొల్చి తెలిసి పూజింతురు భవ్యుడగు దేవగణపతికి నిపుడు ౹౹జయమంగళం౹౹


చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను ౹

పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనెపుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను ౹౹జయమంగళం౹౹


మారేడు మామిడి మాదీఫలంబులు ఖర్జూర పనసలును కదళికములు ౹

నేరెడు నెలవంక(ది) టెంకాయ తేనెయు బాగుగా(చాలగా) నిచ్చెదరు చనువుతోను ౹౹జయమంగళం౹౹


ఓ బొజ్జ గణపతి ఓర్పుతో రక్షించి కాచి మమ్మేలు మీ కరుణతోను ౹

మాపాలగలవని మహిమీద నెల్లపుడు కొనియాడుచుందుము కోర్కెలీడేర(కోర్కెదీర) ౹౹జయమంగళం౹౹



. *౹౹జయమంగళం నిత్య శుభమంగళం౹౹*


卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐

శ్రీ గణపతి తత్వం అంతరార్థం*

 🙏🙏🙏#శ్రీ గణపతి తత్వం అంతరార్థం*


*‘తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని దలచిన పనిగా దలచితినే హేరంభుని దలచిన నా విఘ్నములును తొలగుట కొరకున్

’ ప్రాచీన కాలం నుండీ నేటి వరకు ప్రతి పనికీ వినాయకుడి ననుసరించి ‘ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం గణపతి పూజాం కరిష్యే’ అని చెపుతూ విఘ్నాలను తొలగించమని కార్యసిద్ధి కోసం ‘ఆదౌ పూజ్యో గణాధిపః’ గణపతిని మొదటగా ఆరాధించడం జరుగుతుంది.*

వినాయకుడు రెండు రూపాలలో ఉంటాడు. విఘ్నాలు కలుగజేసేవాడు, విఘ్నాలను తొలగించేవాడు. ఏదైనా పనిమీద వెళ్ళునపుడు దాని ఫలితం మనకు మంచిది కాకపోతే మనకు విఘ్నాలు కలుగజేస్తాడు. సత్ఫలితం అయితే విఘ్నాలు తొలగిస్తాడు. ఇది మనం గుర్తుంచుకోవాలి.


*వినాయకుడు ఆది అంతం లేని ఆనందమయ తత్త్వమూర్తి. అకుంఠిత దీక్షతో భక్తిప్రపత్తులతో కొలవాలేగాని, కోరిన కోరికలను సకల సౌభాగ్యాలను ప్రసాదించే సిద్ధి దేవత.

గణపతి శబ్ద బ్రహ్మ స్వరూపం.

ఓంకార ప్రణవ నాద స్వరూపుడు మహా గణపతి. నామ మంత్రాలకు ముందు ‘ఓం’కారము ఎలా ఉంటుందో అలాగే అన్ని శుభ కార్యాలకి ముందు గణపతి పూజ తప్పక ఉంటుంది.*


*గణపతి పుట్టుక: జ్యోతిషశాస్త్ర అన్వయం ‘గ’ అంటే బుద్ధి, ‘ణ’ అంటే జ్ఞానం. గణాధిపతి అయిన విఘ్నేశ్వరుడు బుద్ధిని ప్రసాదిస్తే, సిద్ధి ప్రాప్తిస్తుంది. భాద్రపద శుక్ల చవితినాడు వినాయకుడు ఆవిర్భవించాడు. భద్రమైన పదం భాద్రపదం. శ్రేయస్కరమైన స్థానం. ఏమిటది? జీవిత గమ్యమైన మోక్షం. శుక్లమైన తేజోరూపం. చతుర్థి అనగా చవితి. జాగ్రత్, స్వప్న, సుషుప్తులనే మూడవస్థలనూ దాటిన తరువాతది నాల్గవది - తురీయావస్థ.నిర్వికల్ప సమాధి.


 ఆయన నక్షత్రం హస్త. హస్తా నక్షత్రం కన్యారాశిలో ఉంటుంది. రాశ్యాధిపతి బుధుడు. విజ్ఞానప్రదాత. మేషరాశి మొదటి రాశి. మేషరాశి నుంచి ఆరవ రాశి - కన్యారాశి. ఈ షష్టమ (ఆరవ) భావం, శతృ ఋణ రణ రోగములను తెలియజేస్తుంది.* 


*మనిషి ఆధ్యాత్మిక ప్రగతికి, లౌకిక ప్రగతికి ఏర్పడే విఘ్నాలను విశదపరుస్తుందీ భావం. ఆ షష్ట్భావంతో (హస్తా నక్షత్రం,కన్యారాశి) చంద్రుడుండగా ఆవిర్భవించిన విఘ్నేశ్వరుడు, చవితి నాడు పుట్టిన వినాయకుడు ఈ నాలుగు రకములయిన విఘ్నాలను తొలగిస్తానని అభయమిస్తున్నాడు.*


*కన్యారాశికి సప్తమ రాశి మీనరాశి. మీనరాశి కాలరాశి చక్రంలో పన్నెండవ రాశి. అంటే వ్యయ రాశి. మేష రాశికి వ్యయ రాశి పనె్నండవ భావం వ్యయాన్ని, బంధనాన్ని, అజ్ఞాత శత్రువుల్ని తెలియజేస్తుంది. ఇక్కడ శత్రువులంటే అంతశ్శత్రువులు.* *అరిషడ్వర్గములు - కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు (ఆరు). ఇవి మానవుని ప్రగతికి విఘ్నాలు కలిగించేవి. హస్తా నక్షత్రం, కన్యారాశిలో ఉన్న చంద్రుడు సప్తమ దృష్టితో నేరుగా మీనరాశిని వీక్షిస్తున్నాడు. కనుక వాటిని తొలగించి జీవితాన్ని సుఖమయం సుసంపన్నం చేసి,లౌకిక, అలౌకిక, ఆధ్యాత్మిక ఆనందాన్నిచ్చి, మోక్షగతిని ప్రసాదించేవాడు వినాయకుడని జ్యోతిష శాస్త్ర అన్వయం


.పత్రిపూజ, ఉండ్రాళ్ల నివేదనలోని ఆంతర్యం వినాయకుని నక్షత్రం ‘హస్త’ అని చెప్పుకున్నాం గదా.* *హస్తా నక్షత్రానికి అధిపతి చంద్రుడు. నవగ్రహములకు నవధాన్యములు, నవరత్నములు చెప్పబడ్డాయి. చంద్రుని తెల్లనివాడు - వినాయకుడు శుక్లాంబరధరుడు.*


*నవధాన్యాలలో చంద్రునికి బియ్యం. అందుకే బియ్యాన్ని భిన్నం చేసి, చంద్ర నక్షత్రమైన హస్తా నక్షత్రంలో ఆవిర్భవించిన వినాయకునికి, ఉండ్రాళ్లు నివేదన చేయటంలోగల ఆంతర్యమిదే. వినాయకునిది కన్యారాశి అని చెప్పుకున్నాం గదా. కన్యారాశికి అధిపతి బుధుడు కదా. బుధునికి నవరత్నములలో ‘పచ్చ’ రాయి- ఎమరాల్డ్ గ్రీన్ అనగా ఆకుపచ్చ రంగు. అందుకే వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుని, ఆకుపచ్చ రంగులో ఉన్న పత్రితో పూజ చేస్తారు. సంతుష్టు డవుతాడు స్వామి.*


*గరికపూజ ప్రీతిపాత్రం ఎందుకు?వినాయకునికి గరిక పూజ అంటే ప్రీతి అంటారు. వినాయక చవితినాడే గాక, ప్రతిరోజూ విఘ్నేశ్వరాలయాలలో, గరికతో స్వామిని అర్చిస్తారు.పూజాద్రవ్యములలో గరికను కూడా జత చేసి సమర్పిస్తారు భక్తులు. దీనికి జానపదులు చెప్పుకునే కథ ఒకటి ఉంది. పార్వతీ పరమేశ్వరులు పాచికలాడుతున్నారు.న్యాయ నిర్ణేతగా నందీశ్వరుణ్ణి ఎంపిక చేశారు. ఈశ్వరుడే గెలిచాడని నంది తీర్పు చెప్పాడు.అయితే ఆ తరువాత అమ్మతో నిజం చెప్పాడు. ‘ఈశ్వరుడు నాకు ప్రభువు. ఆయనే నా ప్రాణం. అందుకే ఆయన గెలిచినట్లు చెప్పాను. అయినా ఆయన అర్ధనారీశ్వరుడు గదమ్మా మీరిద్దరూ ఒకటే’ అన్నాడు.*


 *‘నందీ! నీవు నయం కాని వ్యాధితో బాధపడతావు’ అని శపించి, నంది దీనావస్థను చూచి జాలి చెంది, ‘నందీ! నా కుమారుడైన గణనాథుని పుట్టిన రోజున నీకు ఇష్టమైన పదార్థాన్ని అర్పితం చెయ్యి. అతను అనుగ్రహంతో నీకు శాపవిమోచనం కలుగుతుంది’ అని సెలవిచ్చింది, పార్వతీదేవి. నంది తన కిష్టమైన గరికను గణపతికి అర్పించాడు. అతనికి శాపవిముక్తి లభించింది. ఇది వినాయక పూజలో గరిక ప్రాధాన్యత.*


*‘సహస్ర పరమా దేవీ శతమూలా శతాంకురా సర్వగం హరతుమే పాపం దూర్వా దుస్వప్న నాశినీ’ సకల కల్మషములను తొలగించే సర్వశ్రేష్ఠమైన ఓషధి. లెక్కకు మించిన కణుపులు, చిగుళ్లు కలగి దుష్ట తలంపుల ప్రభావమును తొలగించు శక్తిగల పరమాత్మ స్వరూపమైన దూర్వాయుగ్మము. మనలోని మాలిన్యాన్ని తొలగిస్తుంది, అని ‘దూర్వాసూక్తము’ పేర్కొన్నది.*


 *దూర్వాయుగ్మం అంటే గరిక. అందుకే గణపతిని గరికతో అర్చిస్తే సర్వశుభాలను ప్రసాదిస్తాడు. మనోమాలిన్యాలను తొలగిస్తాడు.‘గజ’ శబ్దార్థము వశ - శివ, హింస - సింహ, పశ్యకః - కశ్యపః అని వర్ణ వ్యత్యాసముతో మార్పు కలుగుతుంది.ఇదొక వ్యాకరణ శాస్త్ర ప్రక్రియ. ఆ విధంగా, జగ - గజ అని మారుతుంది. కనుక గజాననుడంటే ‘జగణాననుడు’ అని అర్థం. జగత్తే ముఖంగా గలవాడు. గ: లయము, జ- జన్మ. కనుక గజమనగా సృష్టి స్థితి లయములు గల జగత్తు అని అర్థము. ‘గ’ అంటే జ్ఞానము ‘జ’ అంటే పుట్టినది. గజమంటే జ్ఞానము వలన పుట్టిన మోక్షమని అర్థము.*


 *‘జ్ఞానదేవత కైవల్యము’ కనుక గజముఖము, గజాననుని ముఖ దర్శనము శుభప్రదము, జ్ఞానప్రదము, మోక్షప్రదము. సృష్టికి ముందు ‘ఓం’ అని ధ్వని వినవచ్చింది. అది గజాకారముగా పరిణమించింది. కనుక గజమనగా ఓంకార ధ్వని. ఓంకారము గజ నాదము అనగా హస్తినాదము.‘అశ్వపూర్వాం రథమధ్వాం హస్తినాద ప్రబోధినీమ్’ ఇంద్రియములనే గుర్రములచే పూన్చబడిన దేహము అనే రథము మధ్యలోనున్న చైతన్యమూర్తి. చిచ్ఛక్తి - పరదేవత నిరంతరము హస్తినాదముచే అనగా గజ నాదముచే -ఓంకార నాదముచే మేలుకొలువబడుచున్నది. ఇది ‘గజ’ శబ్దానికి శ్రీసూక్త మంత్రానికి సమన్వయం. అదే వినాయక చవితికి స్ఫూర్తి.‘ఆననము’ అనగా ప్రాణనము అనగా జీవకము అని అర్థము.* 


*గజమంటే జగత్తు కనుక, జగత్తుకే ప్రాణము గజాననుడు. గజాననుడనగా సృష్టి, స్థితి, లయ కారకుడని అర్థం. అందుకే మొదటిగా గజాననుని పూజ విధింపబడింది. సకల ప్రపంచమునకు ప్రాణదేవత - గజాననుడు. ప్రాణనాథుడే గణనాథుడు, నిఖిల ప్రాణి గణనాథుడు - గుణగణములు కలవాడు - గుణగణ నాథుడు.గణపతి - లలితా పరమేశ్వరి ‘శాంతిః స్వస్తిమతీ కాంతిః నందినీ విఘ్ననాశినీ’ అన్నది లలితా సహస్ర నామం. లలితాదేవి విఘ్నములను, అవిద్యను నశింపజేస్తుంది. కనుక ‘విఘ్ననాశినీ’ అని పేరు గల్గింది. మరి గణపతి కదా విఘ్నములను లేకుండా చేసేవాడు? దీనినిబట్టి, లలితాదేవి గణపతి స్వరూపిణి, గణపతి లలితా స్వరూపుడు అని తెలుస్తుంది. లలితా గణపతులకు అభేదం. విష్ణు సహస్ర నామములలో గణపతి: ఏకదంతుడు ఏకదం - అంతా ఒక్కటే. రెండవది లేదు అని ఏకత్వ బుద్ధిని అనుగ్రహించు ఆ ఏకదంతుని ఉపాసించాలి ‘అనేకదం’ - ఉపాసకులకు భక్తులకు అనేకములనిచ్చు,తం- గణేశుని, అనేక దంతం- ప్రళయ కాలంలో అనేకములను హరించు గణపతిని ఉపాసించాలి అని అర్థములున్నాయి. ‘ఏకః నైకః నవః కః కిం’ విష్ణు సహస్ర నామముల భావమే ఏకదః అనేకదః’ అని చెప్పారు.*


*గజాననుని రూపం: ఆధ్యాత్మికత మోక్ష సిద్ధికి వక్రమైన ఆటంకములను అరిషడ్వర్గములను (కామక్రోధములు) నశింపజేసి,చిత్తైకాగ్రత నొసగి, స్వస్వరూప సంధానతతో జీవబ్రహ్మైక్య స్థితిని అనుగ్రహించేవాడు వక్రతుండుడు.*


 *మూలాధార క్షేత్ర స్థితుడు. మూలాధారి. లంబోదరం - బ్రహ్మాండానికి సంకేతం. విఘ్నేశ్వరుని చేతిలోని పాశ అంకుశాలు - రాగద్వేషాలను నియంత్రించే సాధనాలు. గణపతికి ప్రియమైన భక్ష్యం - మోదకం. ఆనందాన్నిచ్చేది. మొదకం ఆయన కృపాకటాక్షములలో ఆనందం లభిస్తుంది. నాగయజ్ఞోపవీతం - కుండలినీ శక్తికి సంకేతం. మానవుడు క్రోధాన్ని విడిచి, అనురాగాన్ని అభివృద్ధి చేసికొని శాంతి సహజీవనంతో, సంపూర్ణ శరణాగతితో భగవంతుని యందు ప్రేమభావనా భక్తిని పెంపొందించుకొని, జీవితాన్ని చరితార్థత నొందించుకోవాలని సూచించే ఆయుధదారుడు విఘ్నేశ్వరుడు.*


*‘యుక్తాహార విహారస్య’ అన్నారు గీతాచార్యుడు. ఆహార నిద్రాదులు అన్నమయ కోశమునకు సంబంధించినవి. తమోగుణానికి నిదర్శనము. ‘బ్రతుకుట ఆహారం కోసమే’ అనుకునే తిండిపోతులు తమోగుణాన్ని చంపుకోలేరు.* *అటువంటి వారి గూర్చి ఇతరులు జాలి పడటం, మనసులోనైనా పరిహసించటం సహజం. యోగి అయిన వాడు యుక్తాహార విహారాదులతో, తమోగుణాన్ని జయించి సత్వ గుణ సంపన్నుడై, త్రిగుణాతీతుడై, కుండలినీ యోగసిద్ధుడై ఆనందమయ స్థితిని పొంది చరితార్థుడు కావాలని తన శరీరాకృతి, నాగయజ్ఞోపవీతంతో తెలియజేసి, హెచ్చరించేవాడు - బొజ్జ గణపయ్య.*


*మూషిక వాహనం: అంతరార్థం మూషికం (ఎలుక) వాసనామయ జంతువు.తినుబండారాల వాసననుబట్టి అది ఆ ప్రదేశానికి చేరుకుంటుంది. బోనులో చిక్కుకుంటుంది. ఆ విధంగానే మనిషి జన్మాంతర వాసనల వల్ల ఈ ప్రాకృతిక జీవితంలో చిక్కుకొని చెడు మార్గాలు పడతాడు. మూషిక వాహనుడుగా వాసనలను అనగా కోరికలను అణగద్రొక్కేవాడు - వినాయకుడు.అంతేకాదు అహంకారానికి చిహ్నం - ఎలుక (మూషికం) అహంకారం బుద్ధిమంతుల్ని పతనం చెందిస్తుంది.*


*బుద్ధిపతి అయిన మహాగణపతి దీనిని మలిచి జయించి సద్వినియగం చేస్తాడు. మూషిక వాహనుడైన గణపతి సమృద్ధినిస్తాడు.వినాయక చవితి పండుగనాడు ఉదయానే్న మంగళ స్నానములు (తలంటు) ఆచరించి, మట్టి విఘ్నేశ్వరుని పత్రి పుష్పములతో పూజించి, తమ పాఠ్యపుస్తకాలన్నిటినీ వినాయకుని ముందు పెట్టి, శ్రద్ధ్భాక్తులతో అర్చించి, సద్బుద్ధి, విజ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థన చేస్తారు విద్యార్థులు. లక్ష్మీదేవి మూలాధార నిలయం. గణపతి కూడా మూలాధార నిలయుడు. తొలుతగా లక్ష్మీ పత్రార్చన సర్వకార్య సిద్ధిప్రదము. సకల ఐశ్వర్యప్రదం. కనుకనే తన సంగీత రూపకమునకు ఆదిలో శ్రీగణపతిని ‘శ్రీ గణపతిని సేవింపరారే శ్రీత మానవులారా’ అని ప్రార్థనా రూపమైన మంగళమును పలికాడు నాద ముని శ్రీ త్యాగరాజస్వామి.*


*ముత్తుస్వామి దీక్షితులు


 మహా గణపతి కీర్తనలు వినాయక చవితి రోజున ముఖ్యంగా ముత్తుస్వామి దీక్షితుల వారి ముఖ్యమైన కీర్తన, విశేష ప్రాచుర్యం పొందినది, హంసధ్వని రాగ కీర్తన ‘వాతాపి గణపతిం భజేహం వారణాస్యం వరప్రదం. వీతరాగిణం, వినుత యోగినం విశ్వకారణం విఘ్నవారణం...’ తప్పక జ్ఞప్తి చేసికొని పాడుకోవాలి. కనీసం చదువుకోవాలి.*


 *గణపతి పూజలో ఇది ఒక భాగం అవ్వాలి. ఆ మహనీయుడు కీర్తనలు అందించాడు. మహాగణపతిం మనసా స్మరామి, వశిష్ఠ వాసుదేవాం నందిత’ నాటరాగ కీర్తన, గజాననము తం గణేశ్వరం భజాను సతతం సురేశ్వరం ఇత్యాదులు వినాయక చవితికి స్ఫూర్తినిచ్చే ఆణిముత్యాలు.*


*‘శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజము...’ శుక్లమైన అంబరం అంటే పరిశుద్ధ జ్ఞానం. అది అంబరం లాగా సర్వవ్యాపకం. దానినే ఒక వస్త్రంలాగా ధరించాడాయన. దాన్ని మనకు ప్రసాదించాలంటే శశివర్ణుడౌతాడు. శశి అంటే చంద్రుడు.*


*చంద్రుడంటే మనస్సు. మనోభూమికకు దిగి వచ్చి బోధిస్తాడు మనకు ఆచార్యుడు. బోధించే స్థోమత ఎలా వచ్చిందాయనకు. చతుర్భుజం. ధర్మ, జ్ఞాన, వైరాగ్వైశ్వర్యాలనే సిద్ధి చతుష్టయ ముందాయనకు. వాటిని నిత్యమూ అనుభవించే మహనీయుడు కనుకనే ప్రసన్న వదనం. తనకు ప్రసన్నమైన శివశక్తి సామరస్య రూపమైన ఏ జ్ఞానముందో, దాన్ని మనకు ‘వదనం’ అంటే బోధించగలడు. ఆ బోధనందుకుంటే అదే మనకు సర్వవిఘ్నోపశాంతయే. సకల విఘ్నాలను సాధన మార్గంలో కలగకుండా తొలగజేస్తుంది.*


*అహంకారమును దరికి రానీయక, భూతదయ గాలికి, స్వార్థరహితంగా త్యాగబుద్ధితో, అమృతమైన మనస్సుతో సర్వమానవ సౌభ్రాతతతో విశ్వమానవ కళ్యాణాన్ని వీక్షించే వారి విఘ్నాలను నేను తొలగిస్తానని చెప్తున్నాడు మహాగణపతి.*


*గణపతి సాక్షాత్‌ పరబ్రహ్మ స్వరూపం.*


*గణం అంటే సమూహం. గణాలతో నిండి వున్న ఈ సమస్త విశ్వానికి అధిపతి గణపతి. అలాగే, అహంకారానికి ప్రతీక అయిన ‘ఎలుక‘ను శాసించి వాహనంగా చేసుకున్న గణపతిని, మహా గణపతి, హరిద్రా గణపతి, స్వర్ణ గణపతి, ఉచ్చిష్ట గణపతి, సంతాన గణపతి, నవనీత గణపతి అని 6 రూపాల్లో పూజిస్తారు.*


 *‘గణపతి అథర్వ శీర్షం ’ ఆయన్ని పరబ్రహ్మగా చెపుతుంది. ‘నమస్తే గణపతయే... నీ ముందు అహంకార రహితమైన నా మనస్సును సమర్పిస్తున్నాను. హే గణపతీ! ఏదైతే సనాతనమో, ఏదైతే ఆది అంత్యాలు లేనిదో, అనిర్వచనీయమో, భావానికీ శబ్దానికీ అతీతమైందో ‘అది‘ నీవే అయి ఉన్నావు. అన్నింటికీ కర్తవు, ధరించే వానివి, లయం చేసుకునే వానివి నీవే. నీవే బ్రహ్మమూ, సత్యానివీ. నీకు నమస్కరిస్తున్నాను. సకల వాక్సంబంధిత శక్తివి, జ్ఞానమూర్తివి, ఆనంద మయునివి నీవే. పరబ్రహ్మం, శాశ్వతమైన వానివి నీవే. ప్రత్యక్ష పరబ్రహ్మవూ నీవే. నీవే జ్ఞానానివి, నీవే విజ్ఞానానివి’ అంటున్నది ‘గణపతి అథర్వ శీర్షోపనిషత్తు’.*


*మంత్రశాస్త్రంలో వినాయకుణ్ణి మూలాధారచక్ర అధిష్ఠాన దేవత అని అంటారు. మూలాధారంలో సుషుమ్న నాడి మూడుచుట్టలు చుట్టుకొని పైన పడగ కప్పుకొని ఉన్న పాములాగ ఉంటుంది. యోగాభ్యాసంతో సుషుమ్న నాడిని మేలు కొల్పగలిగితే, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, ఆజ్ఞాచక్రం, సహస్రారం అనే షట్‌ చక్రాల ద్వారా ఆత్మను బ్రహ్మరంధ్రం చేర్చి బ్రహ్మ కపాల విస్ఫోటనంతో ప్రకృతిని దాటి పరమాత్మను చేరే యోగ ప్రక్రియ జరుగుతుంది.*


*సుషుమ్న నాడి పక్కన ఇడ, పింగళ అని రెండు నాడులు అనుసరించుకుంటూ ఉంటాయి. నిరంతరం సుషుమ్న వీటితో కలిసే పయనిస్తుంది. ఇడ అంటే జ్ఞానము, పింగళ అంటే కార్యసిద్ధి అలాగే ఇడ అంటే సిద్ధి, పింగళ అంటే బుద్ధి. మూలాధారం గణపతి, గణపతికి సిద్ధి, బుద్ధి భార్యలనడంలోని అంతరార్థం ఇదే.* 


*అనగా గణపతి అంటే అష్టచక్ర గణములకు అధిపతి. గణపతి అంటే పదకొండు ఇంద్రియ గణములకు అధిపతి. పంచ తన్మాత్రలు, పంచ భూతాలు, పంచ విషయాలు, అహంకారం, మహాతత్త్వం, ప్రకృతి అనే 18గణములకు అధిపతి గణపతి.*


 *మన శరీరంలో ఉండే హస్తములు,పాదములు, జాను, జంఘ, ఊరు, కటి, ఉదర, హృదయ, కంఠ, ఆశ్య, ఫాల, శిర అను ద్వాదశ అయవయ గణములకు అధిపతి మన గణనాథుడు.*


 *అందుకే విఘ్నేశ్వరుడు విఘ్నాలను తొలగించడమే కాక విఘ్నాలకు కారణమైన వాటిని పోగొడతాడు. కార్యసిద్ధి కలిగించి తద్వారా సంతోషాన్ని కలిగించే పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. పాపాలు తొలిగితే మంచి బుద్ధి కలుగుతుంది. మంచి బుద్ధి అనగా శాశ్వతమైనదాన్ని పొందాలనుకోవడం. అనగా పరమాత్మను కోరుకోవడం. సంసారం, సిరిసంపదలు, భోగభాగ్యాలు ఇవన్నీ అశాశ్వతం.*కావున గణపతి శాశ్వతమైన వాటి గురించి జ్ఞానాన్ని, అశ్వాశ్వతమైన వాటి మీద వైరాగ్యాన్ని కలిగించి భక్తిని కలిగిస్తాడు. భక్తి, జ్ఞానము, వైరాగ్యము అనగా సుషుమ్న, ఇడ, పింగళ. అంటే సుషుమ్న నాడి గణపతి ఇడ నాడి సిద్ధి, పింగళ నాడి బుద్ధి. ఇది గణపతి తత్త్వం     

 సమర్పణ  

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

Panchaag


 

అదే ధర్మం.

 🕉️🕉️ *హరిః ఓమ్, Odde Sivakesavam. హరిః ఓమ్. [Courtesy: Prahlad Marupaka] హరిః ఓమ్*.🕉️🕉️🕉️


❤️🙏🌹 *చివరకు మిగిలేది ఏది❓* 🌹❤️ ⬇️ :

💐💐💐💐💐💐

 🕳️ *ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి ఆత్మ బయటకు* *వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టెతో దేవుడు తన దగ్గరకు వచ్చాడు. చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ ఇలా 👇సాగింది.* 


♦️ *దేవుడు: మానవా..నీ శరీరం పడిపోయింది. ఇక ఈ జన్మ ముగిసింది. నాతో పద.* 


🕳️ *మనిషి: అయ్యో ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ!* 


♦️ *దేవుడు: తప్పదు నాయనా! నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది. నడు.* 


🕳️ *మనిషి: నాకోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి. ఏం తెచ్చారో చూస్తాను* 


♦️ *దేవుడు: నీకు చెందినవి ఉన్నాయి.* 


🕳️ *మనిషి: నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా?* 


♦️ *దేవుడు: అవెప్పటికీ నీవి కావు. అవన్నీ భూమివే. అక్కడే ఉంటాయి* 


🕳️ *మనిషి: పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాన్లో?* 


♦️ *దేవుడు: కాదు. జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి. కాలగర్భంలోకి వెళ్లిపోతాయి* 


🕳️ *మనిషి: అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి* !


♦️ *దేవుడు: అవి పరిస్థితులవి నీవి కావు* 


🕳️ *మనిషి: నా స్నేహితులున్నారా అందులో?* 


♦️ *దేవుడు: వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే* 


🕳️ *మనిషి: హూం..నా భార్య, బిడ్డలునా?* 


♦️ *దేవుడు: వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు* 


🕳️ *మనిషి: అయితే నీవద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి* !


♦️ *దేవుడు: తప్పు. నీ శరీరం థూళికి చెందినది. మట్టిలో పడుతుంది.* 


🕳️ *మనిషి: స్వామీ అయితే నా ఆత్మా?* 


♦️ *దేవుడు: ఆత్మ నీదెలా అవుతుంది. అది నాది.* 


🕳️ *మనిషి: ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు. కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఆపెట్టె ఖాళీగా ఉంది.* 


 🕉️*మనిషి కాలం చెస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థం అయింది. బతికున్నంత కాలం* *నా వాళ్లు, అవన్నీ నావే, ఇవన్నీ నాకే అని ఆశతో, ఆరాటంతో పరుగులు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఖిఃతుడయ్యాడు* .


🕳️ *మనిషి: స్వామీ చివరగా అడుగుతు న్నాను. నాది అనేది ఏమైనా ఉందా అసలు?* 


♦️ *దేవుడు: ఉంది. నీవు జీవించినంత కాలం ప్రతి క్షణం నీదే.* 

 ✅*ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి, చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి* .

 ✅*అందుకే ప్రతిక్షణం మంచిని *పంచాలి, పెంచాలి, ✅భగవన్మామం స్మరించాలి.* 

 ✅*పశ్చాత్తాపులను క్షమించాలి.* 

✅ *తోటివారి నుంచి మనకి సంక్రమించే చెడును విసర్జించాలి, ✅మానవసేవ- మాధవసేవలను గుర్తించి జీవించాలి.*🙏🌹🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ సర్వం శ్రీమన్నారాయణ అర్పణమస్తు 🍎🍎


[8/27, 15:12] sivakesavamo: హరిః ఓమ్, Odde Sivakesavam. హరిః ఓమ్. 


♦️ఒరులేయవి యొన రించిన -నరవర! యప్రియము, దన మనంబున కగు, దా నొరులకు, నవి సేయ కునికి ,పరాయణము - పరమ ధర్మపథముల కెల్లన్. 


🌹భావము : "ఇతరులు ఏ పని చేస్తే మనకు బాధ కలుగు తుందో, ఆ పని ఇతరుల విషయం లో,మనంచేయగూడదు". 

               అదే ధర్మం.


🌹ఈ పై ధర్మం పాటిస్తే: నరుడు -నారాయణు డు, మానవుడు - మాధవుడు, జీవుడు - శివుడు - ఔతాడు.


🕉️ 

కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు వినాయక స్వామిపై వ్రాసిన ఈ పద్యాలు

 కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు వినాయక స్వామిపై వ్రాసిన ఈ పద్యాలు పిల్లలకు తప్పనిసరిగా నేర్పించాల్సిన పద్యాలలోనివి.




 


ఎలుకగుర్రము మీద నీరేడు భువనాలు

పరువెత్తి వచ్చిన పందెకాడు

ముల్లోకముల నేలు ముక్కంటి యింటిలో

పెత్తన మ్మొనరించు పెద్దకొడుకు

“నల్లమామా” యంచు నారాయణుని పరి

యాచకాలాడు మేనల్లుకుర్ర

వడకు గుబ్బలి రాచవారిబిడ్డ భవాని

నూరేండ్లు నోచిన నోముపంట


అమరులం దగ్రతాంబూల మందు మేటి

ఆరుమోముల జగజెట్టి అన్నగారు

విఘ్నదేవుడు వాహ్యాళి వెడలివచ్చె

ఆంధ్రవిద్యార్థి! లెమ్ము జోహారు లిడగ!!


తిలకమ్ముగా దిద్ది తీర్చిన పూప జా

బిలి రేక లేత వెన్నెలలు గాయ

చిరుబొజ్జ జీరాడు చికిలి కుచ్చెల చెంగు

మురిపెంపు పాదాల ముద్దుగొనగ

జలతారు పూలకుచ్చుల వల్లెవాటుతో

త్రాచు జందెములు దోబూచులాడ

కొలుచు ముప్పదిమూడు కోట్ల దేవతలపై

చల్లని చూపులు వెల్లివిరియ


గౌరికొమరుడు కొలువు సింగారమయ్యె

జాగుచేసినచో లేచి సాగునేమో

తమ్ముడా! రమ్ము స్వామి పాదములు బట్ట

చెల్లెలా! తెమ్ము పువ్వుల పళ్ళెరమ్ము


కొలుచు వారలకు ముంగొంగు బంగారమ్ము

పిలుచువారల కెల్ల ప్రియసఖుండు

సేవించువారికి చేతి చింతామణి

భావించు వారికి పట్టుగొమ్మ

“దాసోహ” మనువారి దగ్గర చుట్టమ్ము

దోసి లొగ్గినవారి తోడునీడ

ఆశ్రయించిన వారి కానంద మందార

మర్థించు వారల కమృతలహరి


జాలిపేగులవాడు – లోకాల కాది

దేవుడే మన పార్వతీదేవి కొడుకు!

చిట్టెలుకనెక్కి; నేడు విచ్చేసినాడు

అక్కరో! అర్ఘ్యపాత్ర మిట్లందుకొనవె.


లడ్డు జిలేబి హల్వాలె యక్కరలేదు

బియ్యపుండ్రాళ్ళకే చెయ్యి చాచు

వలిపంపు పట్టు దువ్వలువలె పనిలేదు

పసుపు గోచీకె సంబ్రాలుపడును

ముడుపు మూటల పెట్టుబడి పట్టుదల లేదు

పొట్టిగుంజిళ్ళకే పొంగిపోవు

కల్కి తురాయికై తగాదా లేదు

గరిక పూజకె తలకాయ నొగ్గు


పంచకళ్యాణికై యల్కపాన్పు లేదు

ఎలుకతత్తడికె బుజా లెగురవైచు

పంచభక్ష్య ఫలహార కించ లేదు

పచ్చి వడపప్పె తిను వట్టి పిచ్చితండ్రి.


కుడుము లర్పించు పిల్లభక్తులకు నెల్ల

యిడుమలం దించి కలుము లందించు చేయి;

పార్వతీబాయి ముద్దులబ్బాయి చేయి

తెలుగు బిడ్డల భాగ్యాలు దిద్దుగాక!

వినాయకాయ 🐘 సందేశం*

 *వినాయకాయ 🐘 సందేశం*


వినాయకుడినే విఘ్నరాజు , విఘ్నహంత్రి, విఘ్నపతి అని కూడా పిలుస్తారు. మనకే విఘ్నాలు ఎందుకు వస్తాయి? ఈ విషయాలలో ఎన్నింటినో వినాయకుడు , తన శరీర రూపం ద్వారానే మానవజాతి కి సమాధానం చెప్పారు.


*🐘చెవులు* - ఇతరులు తన గురించి ఏమి మాట్లాడుకుంటున్నారో , ఇతరుల గురుంచి అనవసరమైన విషయాలు వినాలనే అభిలాష కలిగి చెవులు అప్పగించి వినేవాళ్ళకు విఘ్నాలు తప్పవు అని చెప్పడానికే పెద్ద చెవులు వినాయకుడివి.


*🐁🐀ఎలుక వాహనం - 🐘ఏనుగు శరీరం* :- ఎలుక అంత చిన్న విషయాన్ని , ఏనుగంత పెద్దది చేసి ఆలోచించడం వల్ల విఘ్నాలు తప్పవు అని ఇక్కడ సందేశం. ఇతరుల విషయాలలో లేదా తన సొంత విషయాలలో ఉండవలసిన దానికన్నా అధికంగా పరిగణించడం వలన విఘ్నాలు తప్పవు. పెద్దలు దీనినే గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తేవడం అని సామెత పెద్దలు చెప్పారు.


*🐘వినాయకుని అవస్థ - 🌙🌚చంద్ర పరిహాసం* :- చంద్రుడుని వేదాంగం అయిన జ్యోతిష్య శాస్త్రంలో మనస్సుకి/మానసిక స్థితికి కారకుడిగా వర్ణించారు. ఇక్కడ నడవలేక నడుస్తున్న స్థూలకాయుడైన వినాయకుడు అంటే స్థూలంగా అందరికి కనబడే , అర్థమైయ్యే శరీర అవస్థలు మరియూ ఆర్ధిక వ్యవస్థలు అని అర్ధం. ఎవరైతే ఇతరుల శరీర సౌందర్యాన్ని , అనారోగ్యాలని , ఆర్ధిక పరిస్థుతులని విమర్శిస్తారో వారికి విఘ్నాలు తప్పవు అని చెప్పడమే ఇందులోని సూక్ష్మం.


*🐘గణపతికే ప్రథమ పూజ?*

నీలోని ఇంద్రియములనే గుంపునే గణములు అంటారు. వీటికి పతి(నాయకుడు) మనస్సు/బుద్ధి/ఆత్మ . గణపతి అంటే నీలోని ఇంద్రియములనే గుంపుకి నాయకుడి నీ మనస్సు/బుద్ధి/ ఆత్మ అని అర్ధం. గణపతికే ప్రథమ పూజ అని అనడంలో అర్ధం ఏమిటంటే ఇతరులను నీవు విమర్శించే ముందు నిన్ను నీవు (నీ మనస్సుని) ఆత్మపరిశీలన చేసుకోవడమే.


ఇలా చెప్పుకుంటూ పోతే మనకు కలిగే విఘ్నాలకు మనమే కారణమని మనకు తెలియచెప్పడమే మన వినాయక వ్రత కల్పం యొక్క ఉద్దేశ్యం. 


🐘గణపతి అంటే మనము ఈ విషయలోలురు కాకుండా చేయగల బుద్ధిశక్తి అన్నమాట. ఆ గణపతి మీ అందరికీ చక్కటి బుద్ధిని ప్రసాదించాలని తద్వారా మీరు తలపెట్టిన పనులలో విజయాలు చేకూరాలని, మీరు, మీ కుటుంబ సభ్యులందరూ సుఖసంతోషాలని పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.... ఈ పండుగ ద్వారా 🕉️హిందు, ☪️ముస్లిం, ✝️క్రిస్టియన్, ☸️జైన, 🪯సిక్కు, ☮️✡️🔯🕎☯️☦️🛐 తదితర మతసామరస్యం భారతదేశంలో వెల్లివిరియాలని ఆ భగవంతున్ని సదా ప్రార్థిస్తూ... మీకు, మీ కుటుంబ సభ్యులకు

*వినాయక 🐘 చవితి శుభాకాంక్షలు*


*శిరిపురపు శ్రీధర్ శర్మ* 

 🔥రాష్ట్ర అధ్యక్షులు🔥 

*బ్రాహ్మణ చైతన్య వేదిక*

గణపతులు108 రూపాలలో

 *108 రూపాలలో మహా గణపతులు*



1. ఏకాక్షర గణపతి

ప్రాతర్భజామ్య్భయదం ఖలు భక్త శోక

దావానలం గణ్విభుం వరకుంజరాస్యమ్

అజ్ఞాన కానన వినాశన హవ్యవాహం

ఉత్సాహ వర్ధనమహం సుతమీశ్వరస్య


2. మహా గణపతి

భిభ్రాణోబ్జక బీజాపూరక కదా దంతేక్షు బాణైస్సమం

భిభ్రాణో మణికుంభశాలి కణిశం పాశంచ వక్ర్తాంచితం

గౌరంగ్యారుచి రారవిందయుతయా దేవ్యాసనాధాంతిక:

శోణాంగ శ్శుభమాతనోతుభవతాం నిత్యం గణేశో మహాన్


3. బాల గణపతి

కరస్ధ కదళీచూత పనసేక్షు కపిత్ధకం

బాలసూర్యప్రభందేవం వందే బాలగణాధిపం


4. తరుణ గణపతి

పాశాంకుశాపూస కపిత్ధ జంబూ

ఫలం తిలాం చేక్షు మపిసవ హసై:

ధత్తే సదాయ స్తరుణారుణాంభ:

పాయాత్సయుష్మాన్ తరుణో గణేశ:


5. విఘ్నరాజ గణపతి

విఘ్నరాజావతారశ్చ శేషవాహన ఉచ్చతే 

మమతాసుర సంహర్తా విష్ణు బ్రహ్మేతివాచక:


6. సిద్ది గణపతి

ఏకదంతం చతుర్హస్తం పాశాంకుశ ధారిణమ్

అభయంచవరదం హసైర్ద దానమూషకధ్వజమ్


7. బుద్ధి గణపతి

త్రయీమయాఖిలం బుద్ధిధాత్రే

బుద్ధి ప్రదీపాయ సురాధిపాయ |

నిత్యాయ సత్యాయచ నిత్యబుద్ధే

నిత్యం నిరీహాయ నమోస్తు నిత్యమ్ ||


8. లక్ష్మీ గణపతి

బిభ్రాణశ్శుక బీజపూర కమలం మాణిక్య కుంభాంకుశాన్

పాశం కల్పలతాంచ బాణకలికా ప్రోత్సస్సరో నిస్సర:

శ్యామో రక్త సరోరుహేణ సహితో దేవీ చ యస్యాంతికే

గౌరాంగో వరదాన హస్తకమలో లక్ష్మీగణేశో మహాన్


9. సంతాన లక్ష్మీ గణపతి

శరణం భవదేవేశ సంతతిం సుదృఢాంకురు |

భవిష్యంతియే పుత్రామత్కులే గణనాయక: ||


10. దుర్గా గణపతి

తప్తకాంచన సంకాశం శ్చాష్ట్ట్ట మహత్తను: |

దీప్తాంకుశం శరం చాక్షం దంతం దక్షే వహన్కరై: ||


11. సర్వశక్తి గణపతి

ఆలింగ్య దేవీం హరితాం నిషణ్ణాం

పరస్పరాశ్లిష్టకటీ నివేశం

సంధ్యారుణం పాశసృణీం వహస్తం 

భయాపహం శక్తి గణేశ మీఢే


12. విరివిరి గణపతి

సుసిద్ధాదం భక్తిజనస్యదేవ సకామిదా మామిహ సౌఖ్యదంతం |

అకా మికాగాం భవబంధహరం గజాననం భక్తియుతం భజామ ||


13. క్షిప్ర గణపతి

దంతం కల్పలతా పాశ రత్నకుంభోప శోభితం

బంధూక కమనీయాంగం ధ్యాయేత్ క్షిప్ర వినాయకం


14. హేరంబ గణపతి

అభయ వరద హస్త: పాశదంతాక్షమాల:

పరశుమధ త్రిశీర్షం ముద్గరం మోదకం చ

విదధతు నరసింహ: పంచమాతంగ వక్త్ర:

కనక రుచిర వర్ణ: పాతు హేరమ్బ నామా


15. నిధి గణపతి

విచిత్ర రత్నై: ఖచితం సువర్ణ సమ్బూతకంగుహ్యమయా ప్రదత్తమం |

తధాంగులీష్పంగులికం గణేశ చిత్తేన సంశోభయ తత్పరేశ


16. వక్రతుండ గణపతి

స్వర్ణవర్ణ చతుర్బాహుం | పాశాంకుశధరం విభుం |

ఆమ్రపాత్ర స్వదంతంచ | శక్తియుతం విచింతయేత్


17. నవనీత గణపతి

దానాయ నానావిధ రూపకాంస్తే గృహాణ దత్తాన్మనసామయావై|

పదార్ధ భూతాన్ స్థిర జంగమాంశ్చ హేరమ్నమాం తారయ మోహభావాత్ ||


18. ఉచ్ఛిష్గ్ట గణపతి

లీలాబ్జం దాడిమం వీణాశాలి గుంజాక్ష సూత్రకం

దధ దుచ్ఛిష్ట నామాయం గణేశ: పాతు మేచక:


19. హరిద్రా గణపతి

హరిద్రాభం చతుర్బాహుం హరిద్రా వదనం ప్రభుమ్

పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవచ

భక్తాభయ ప్రదాతాం వందే విఘ్న వినాశనమ్


20. మోదక గణపతి

నాదబిందు కళాత్మకం వరనారదాది సుపూజితం |

మోదక ఫలదాయకం ప్రమోదవదన వినాయకం ||


21.మేధా గణపతి

సకలభాగ్య వశంకరం వర సాధు సజ్జన సంహితం 

అఖిలదేవ ప్రదాయకం మమ ఆత్మరక్ష వినాయకం


22.మోహన గణపతి

రక్ష రక్ష గణాధ్యక్ష రక్షత్రైలోక్య రక్షక 

భక్తానాం అభయంకర్తా త్రాతాభవ భవార్ణవాన్


23.త్రైలోక్య మోహన గణపతి

గదా బీజాపూరే ధను: శూలచక్రే సరోజతృలే

పాశాధాన్య ప్రదంతారి కరై: సందధానం

స్వశుండాగ్ర రాజం | మణి కుంభ

మంగాధి రూఢం స పత్న్యా ||


24. వీర గణపతి

భేతాళ శక్తి శరకార్ముక ఖేటఖడ్గ

ఖట్వాంగ ముద్గర గధాంకుశ ముద్వహస్తం

వీరం గణేశ మరుణం సతతం స్మరామి


25. ద్విజ గణపతి

యం పుస్తకాక్ష గుణ దండకమండలు

శ్రీవిద్యోతమాన కరభూషణమిందు వర్ణం

స్తంబేర మానన చతుష్టయ శోభమానం

త్వాం య: స్మరే ద్ద్విజ గణాధిపతే సధన్య: ||


26. ఋణవిమోచన గణపతి

సృష్ట్యా బ్రహ్మణా సమ్యక్ పూజిత: ఫలసిద్ధయే

సదైవ పార్వతీపుత్ర: ఋణనాశం కరోతుమే


27. సంకష్టహర గణపతి

ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం

భక్తావాసం స్మరేన్నిత్యంమాయుష్కారమార్ధ సిద్ధయే


28. గురు గణపతి 

ప్రవరం సర్వదేవానాం సిద్ధినాం యోగినాం గురుం |

సర్వస్వరూపం సర్వేశం జ్ఞానరాశి స్వరూపిణమ్ ||

అవ్యక్తమక్షరం నిత్యంసత్యమాత్మ స్వరూపిణం |

వాయుతుల్యంచ నిర్లిప్తం చాక్షతం సర్వసాక్షిణం ||


29. స్వర్ణ గణపతి 

వందే వందారుమందార, మిందు భూషణ నందనం |

అమందానంద సందోహ, బంధురం సింధురాననమ్ ||


30. అర్క గణపతి 

మూషారూఢం లంబసూత్రం సర్పయజ్ఞోపవీతినల|

విషాణం పాష కమలం మోదకంచ కరైధృతం ||


31. కుక్షి గణపతి 

సరోజన్మన భూషాణాం భరణోజ్వలహస్త తన్వ్యా సమా

లింగితాంగాం | కరీంద్రాననాం చంద్ర చూడం త్రినేత్రం రక్తకాంతిం భజేత్తం ||


32. పుష్టి గణపతి 

ఏకదంతం మహాకాయం లంబోదరం గజాననం |

విఘ్ననాశకరం దేవం హేరంబం ప్రణమామ్యహం ||


33. వామన గణపతి 

లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోపశోభితం |

అర్ధచంద్రధరం దేవం విఘ్నప్యూహం వినాశనం ||


34. యోగ గణపతి 

యోగరూఢో యోగ పట్టాభిరామో

బాలార్కభశ్చేంద్ర నీలాంశుకాఢ్య:

పాశాక్ష్వక్షాన్ యోగదండం దధానో

పాయాన్నిత్యం యోగ విఘ్నేశ్వరో న:


35. నృత్య గణపతి 

పాశాంకుశాపూప కుఠార దన్త చంచత్కరం వచరుతరాంగుళీయం

పీతప్

రభం కల్పతరో రధస్ధం భజామి నృత్తైక పదం గణేశం


https://chat.whatsapp.com/DeLzrnizFTsI0UEat5HQjM?mode=ac_t


36. దూర్వా గణపతి 

దూర్వాంకురాన్వై మనసా ప్రదత్తాం స్త్రిపంచపత్రైర్యుతకాంశ్చ స్నిగ్ధాన్ |

గృహాణ విఘ్నేశ్వర సంఖ్యయా త్వం హీనాంశ్చ సర్వోపరి వక్రతుండ ||


37. అభీష్టవరద గణపతి

నమస్తే వేద విదుషే నమస్తే వేద కారిణే |

కమన్యం శరణం యామ: కోను న: స్వాద్భయాపహ: ||


38. లంబోదర గణపతి 

లంబోదరావతారో వైక్రోధాసుర నిబర్హణ:

శక్తిబ్రహ్మ ఖగ: సద్యత్ తస్యధారక ఉచ్యతౌ ||


39.విద్యా గణపతి 

భక్త ప్రియాయ దేవాయ నమో జ్ణాన స్వరూపిణే |

నమో విశ్వస్యకర్త్రేతే నమస్తత్పాలకాయచ ||


40. సరస్వతీ గణపతి 

వాగీశాద్యా స్సుమనస: సర్వార్ధానాముపక్రమే

యంనత్వాకృత కృత్వాస్స్యు: తం నమామి గజాననమ్ ||


41. సంపత్ గణపతి 

పక్వచూత ఫలపుష్ప మంజరీచేక్షుదండ తిలమోదకైస్సహ

ఉద్వహన్ పరశుమస్తుతే నమ: శ్రీ సమృద్ధియత హేమపింగళ:


42. సూర్య గణపతి 

హిరణ్యగర్భం జగదీశితారరమృషిం పురాణం మండలస్థం |

గజాననం యం ప్రవిశన్తిసంతస్తత్కాలయోగైస్త మహం ప్రపద్యే ||


43. విజయ గణపతి 

శంఖేక్షు చాప కుసుమేఘ కుఠారదంత

పాశాంకుశై: కళమమంజరికా సనైధై:

పాణిస్థితై: పరిసమావృత భూషణ శ్రీ:


44. పంచముఖ గణపతి 

గణేశాయ ధామ్నే పరేశాయ తుభ్యం సదానంద రూపాయ సర్వార్తిగాయ|

అపారస్వరూపాయ దేవాధిదేవ నమస్తే ప్రభో భక్త సంరక్షకాయ ||


45. నీలకంఠ గణపతి 

వినాయకం నాయకమౌక్తికం త్రయీ హారావళే రావళితం భుజంగమై: |

పినాకిజం నాకిజనేడ్య మంహసాం నివారణం వారణ్వక్త్ర మాశ్రయే ||


46. గాయత్రి గణపతి 

యజ్ఞోపవీతం త్రిగుణస్వరూపం సౌవర్ణమేవం హ్యహినాధ భూతం |

భావేనదత్తం గణనాథతత్వం గృహాణ భక్తోద్దృతి కారణాయ ||


47. చింతామణి గణపతి 

కల్పద్రుమాధ: స్థితకామధేయం |

చింతామణిం దక్షిణపాణి శుండమ్ |

బిభ్రాణ మత్యద్భుత చిత్రరూపం |

య: పూజయేత్తస్య సమస్త సిద్ధి: ||


48. ఏకదంత గణపతి 

అగజానన పద్మార్కమ్ గజానన మహర్నిశం

అనేక దం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే


49. వికట గణపతి 

వికటోనామ విఖ్యాత: కామాసుర విదాహక: |

మయూర వాహనశ్చాయం సౌరబ్రహ్మధర: స్మ్రత: ||


50. వరద గణపతి 

వరదాభయ హస్తాయ నమ: పరశుధారిణే |

నమస్తే సృణిహస్తాయ నాభివిశేషాయతే నమ: ||


51. వశ్య గణపతి 

విఘ్నేశ వీర్యాణి విచిత్రకాణి వన్దే జనైర్మాగధకై: స్మృతాని |

శ్రుత్వాసమత్తిష్ఠ గజానన త్వం బ్రహ్మేజగన్మంగళకం కురుష్వ ||


52. కుల గణపతి 

శుండావిభూషార్థమనన్తఖేలిన్ సువర్ణజం కంచుకమాగృహేంణ |

రత్నైశ్చయుక్తం మనసామయాయ ద్ధతం ప్రభోతత్సఫలం కురుష్వ ||


53. కుబేర గణపతి 

రత్నై: సువర్ణేన కృతాని గృహాణచత్వారి మయాప్రకల్ప్య |

సమ్భూషయ త్వం కటకాని నాథ చతుర్భుజేషు వ్యాజ విఘ్నహారిన్ |


54. రత్నగర్భ గణపతి 

హేరంబతే రత్నసువర్ణయుక్తే సునూపుర మంజీరకే తథైవ|

సు కింకిణీ నాద యుతే సుబుద్ధ్యా సుపాదయో: శోభమయే ప్రదత్తే ||


55. కుమార గణపతి 

మాత్రే పిత్రేచ సర్వేషాం హేరంబాయ నమో నమ:

అనాదయేచ విఘ్నేశ విఘ్నకర్తే నమోనమ:


56. సర్వసిద్ధి గణపతి 

పరంధామ పరంబ్రహ్మ పరేశం పరమేశ్వరం |

విఘ్నవిఘ్నకరం శాంతం పుష్టం కాంతమనంతకం |

సురాసురేంద్ర్యై: సిద్ధేంద్ర్యై: స్తుతం స్తౌమి పరాత్పరం |

సురపద్మచినేశంచ గణేశం మంగళాయనం ||


57. భక్త గణపతి 

నారికేళామ్ర కదళీ గుడ పాయస ధారిణం

శరచ్ఛశాంక సదృశం భజే భక్తగణాధిపమ్


58. విఘ్న గణపతి 

పాశాంకుశం ధరన్నామ ఫలాశీ చాఖవాహన:

విఘ్నం నిహస్తు న: సర్వ రక్తవర్ణో వినాయక:


59. ఊర్ధ్వ గణపతి 

కల్హారిశాలి కణిశేక్షుక చాపబాణ,

దంత ప్రరోహ కబర: కనకోజ్జ్వలాంగ:,

ఆలింగనోద్యత కర: తటిదాభకట్యా

దేయాత్స శతృభయ మూర్థ్వ గణేశ్వరస్తే


60. వర గణపతి 

నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన

ఈప్సితం మేం వరం దేహి పరత్రా చ పరాంగతిమ్


61. త్ర్యక్ష్యర గణపతి 

సర్వవిఘ్నహరం దేవం, సర్వవిఘ్నవివర్జితం

సర్వసిద్ధి ప్రదాతారం, వందేహం గణనాయకమ్


62. క్షిప్రప్రసాద గణపతి 

యక్షకిన్నర గంధర్వ సిద్ధవిద్యా ధరైస్సదా

స్తూయమానం మహాబాహుం వందే హం గణనాయకమ్


63. సృష్టి గణపతి 

ప్రాతర్నమామి చతురానన వన్ద్యమానం

ఇచ్ఛానుకూలమఖిలం చ వరం దదానమ్

తం తుందిలం ద్విరసనాధిప యజ్ఞసూత్రం

పుత్రం విలాస చతురం శివయో: శివాయ


64. ఉద్దండ గణపతి 

ప్రాత:స్మరామి గణనాథమనాథ బంధుం

సిందూరపూర పరిశోభితగండయుగ్మం

ఉద్ధండవిఘ్న పరిఖండన చండదండం

అఖండలాది సురనాయక బృందవంద్యమ్


65. డుండి గణపతి 

అక్షమాలాం కుఠారంచ రత్నపాత్ర స్వదంతకమ్

ధతైకరైర్విఘ్నరాజో డుంఢినామా మదేస్తున:


66.ద్విముఖ గణపతి 

స్వదంత పాశాంకుశ రత్నపాత్రం కరైర్దదానో హరినీలగాత్ర:

రత్నాంశుకో రత్న కిరీటమాలీ భూత్యై సదామే ద్విముఖో గణేశ:


67. త్రిముఖ గణపతి 

శ్రీమత్తీక్షణ శిఖాం కుశాక్ష వరదాన్ దక్షే దదానం కరై:

పాశాంచామృత పూర్ణకుంభమయం వామే దదానోముదా

పీఠే స్వర్ణమయారవింద విలసత్సత్కర్ణికాభాసురే

స్వాసీనస్త్రిముఖ: పరశురుచిరో నాగనన: పాతున:


68. సింహ గణపతి 

వీణాం కల్పలతా మరించ వరదం దక్షేవిధత్తేకరై:

వేణే తామరసం చ రత్న కలశం సన్మంజరీం చా భయం

శుండాదండలసన్ మృగేంద్ర వందన: శంఖేందు గౌర: శుభో

దీప్యద్రత్న నిభాంకుశో గణపతి: పాయా దపాయాత్సన:


69. గజానన గణపతి 

సదా సుఖానందమయం జలేచ సముద్రేన ఇక్షురసే నివాసం|

ద్వంద్వ స్థయానేనచ నాళరూపం గజాన


నం భక్తియుతం భజామ||


70. మహోదర గణపతి 

మహోదర ఇతిఖ్యాతో జ్ఞానబ్రహ్మ ప్రకాశక:

మోహాసుర నిహంతావై ఆఖువాహన ఏవచ ||


71. భువన గణపతి 

విశ్వమూలాయ భవ్యాయ విశ్వసృష్టికరాయతే |

నమో నమస్తే సత్యాయ సత్య పూర్ణాయ శుండినే ||


72. ధూమ్రవర్ణ గణపతి 

ధూమ్రవర్ణావతారశ్చాభి మానాసుర నాశక:

ఆఖువాహన ఏవాసౌ శివాత్మేతి స ఉచ్యతౌ


73. శ్వేతార్క గణపతి 

ఓం నమో గణపతయే శ్వేతార్క గణపతయే

శ్వేతార్కమూలనివాసాయ

వాసుదేవ ప్రియాయ, దక్ష ప్రజాపతి రక్షకాయ

సూర్యవరదాయ కుమారగురవే


74. ఆధార గణపతి 

నాదం బాలసహస్ర భాను సదృశం నాగేంద్ర

వక్త్రాన్వితం | హస్తాభ్యాం చషకం పవిత్ర కలశం

హస్యంచ వృత్తాండవం | నానా చిత్రవిచిత్రయన్

పరగురుం ఆధార విద్యా స్థితిం | ఓంకార

ప్రణవాకృతిం గణపతిం నిత్యం భజేహం ప్రభో ||


75. భూతరోగ నివారణ గణపతి 

ఏకదంతం చతుర్హస్తం బిభ్రాణ పాశమంకుశం |

అభయం వరదం సాస్మృర్భధానం మూషిక ధ్వజం |


76. ప్రసన్న విఘ్నహర గణపతి 

ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం |

పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ||


77. ద్వాదశభుజవీర గణపతి 

సురేంద్రనేన్యం హ్యసురై: సుసేవ్యం సమానభావన విరాజయంతం|

అనంతబాహుం మూషక ధ్వజం తం గజాననం భక్తియుతం భజామ: ||


78. వశీకర గణపతి 

బీజాపూరగదేక్షుకార్ములసచ్చక్రోబ్జ పాశోత్పల|

వ్రీహ్యగ్రస్వ విషాణ రత్న కలశప్రోద్యత్కరాంభోరుహ: ||

ధ్యేయోవల్లభయా సపద్మకరయాశ్లిష్టోజ్వల- ద్భూషయ

విశ్వోత్పత్తి విపత్తి సంస్తుతికరో విఘ్నో విశిష్టార్ధద: ||


79. అఘౌర గణపతి 

గజవదనమంచింత్యం తీక్ష్ణదంష్టృం త్రినేత్రం

బృహదుదరమశేషం భూతరాజం పురాణం

అమరవరసుపూజ్యం రక్తవర్ణం సురేశం |

పశుపతి సుతమీశం విఘ్నరాజం నమామి ||


80. విషహర గణపతి 

నాగాననే నాగకృతోత్తరీయే క్రీడారతే, దేవకుమార సంఘై: |

త్వయిక్షణం కాలగతిం విహాయతౌ ప్రాపతు కన్దుకతామినేన్దూ ||


81. భర్గ గణపతి 

బాలార్కకోటి ద్యుతి మప్రమేయం

బాలేందు రేఖా కలితోత్తమాజ్ఞమ్ |

భ్రమద్ద్విరేపావృత గణ్డభాగం భజే భవానీతనయం గణేశమ్ ||


82. సర్వ సమ్మోహన గణపతి 

స్వాంకస్థితాయానిజవల్లభయాముఖామ్భుజాలోకేన లోలనేత్రం |

స్మేరాననాస్యం మదవైభవేన రుద్ధం భజే విశ్వవిమోహనంతం ||


83. ఐశ్వర్య గణపతి 

సహస్ర శీర్షం మనసా మయా త్వం దత్తం కిరీటంతు సువర్ణజంవై |

అనేకరత్నై: ఖచితం గృహాణ బ్రహ్మేశతే మస్తక శోభనాయ ||


84. మాయావల్లభ గణపతి 

సంసారార్ణవ పారేచ మాయాపోతే సుదుర్లభే |

కర్ణధార స్వరూపంచ భక్తానుగ్రహకారకం |

వరం వరేణ్యం వరదం వరదానామపి ఈశ్వరం |

సిద్ధం సిద్ధి స్వరూపంచ సిద్ధిదం సిద్ధి సాధనమ్ ||


85. సౌభాగ్య గణపతి 

తతో హరిద్రామచిరంగులాలం సిన్ధూరకం తేపరికల్పయామి |

సువాసితం వస్తు సువాస భూతై: గృహాణ బ్రహ్మేశ్వర శోభనార్థమ్ ||


86. గౌరి గణపతి 

విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ |

లంబోదరాయ సకలాయ జగద్ధితాయ |

నాగాసనాయ కృతియజ్ఞ విభూషితాయ |

గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే ||


87. ప్రళయంకర్త గణపతి 

అకాలమేవ ప్రళయ: కథం లబ్ధో జనైరయం |

హా ! గజానన దేవేశ: హాహా విఘ్న హరావ్యయ ||


88. స్కంద గణపతి 

కుమార భుక్తౌ పునరాత్మహేతో: పయోధరే పర్వతరాజ పుత్ర్యా|

ప్రక్షాళయంతం కరశీ కరేణ మౌగ్ధ్యేనతం నాగముఖం భజామి ||


89. మృత్యుంజయ గణపతి 

సరాగలోకదుర్లభం విరాగిలోక పూజితం

సురాసురైర్నమస్కృతం జరాప మృత్యునాశకం ||


90. అశ్వ గణపతి 

రాజోపచారాన్వి విధాన్గృహాణ హస్త్యశ్వఛత్రాధికమాద రాద్వై |

చిత్తేన దత్తాన్గణనాధడుణ్డే హ్యపార సంఖ్యాన్ స్థిరజంగమాంస్తే ||


91. ఓంకార గణపతి 

వందే గణేశం భుజగేంద్ర భూషణం సమస్త భక్తాళికృతాతితోషణం

విశ్వం భరా సంస్థితలోక రక్షణం మదీయ పాపౌఘతమస్సు పూషణమ్ ||


92. బ్రహ్మవిద్యా గణపతి 

బ్రహ్మేభ్యో బ్రహ్మదాత్రేచ గజానన నమోస్తుతే |

ఆదిపూజ్యాయ జ్యేష్ఠాయ జ్యేష్ఠరాజాయతే నమ: ||


93. శివ అవతార గణపతి 

విఘ్నానాం పతయే తుభ్యం నమో విఘ్న నివారణ |

సర్వాంతర్యామిణే తుభ్యాం నమస్సర్వప్రియంకర ||


94. ఆపద గణపతి 

ఓమ్ నమో విఘ్నరాజాయ సర్వసౌఖ్య ప్రదాయినే |

దుష్టారిష్ట వినాశాయ పరాయ పరమాత్మనే ||


95. జ్ఞాన గణపతి 

గుణాతీతమౌనం చిదానంద రూపం |

చిదాభాసకం సర్వగం జ్ఞాన గమ్యం |

ముని శ్రేష్ఠమాకాశ రూపం పరేశం |

పరబ్రహ్మ రూపం గణేశం భజేమ ||


96. సౌమ్య గణపతి 

నమస్తే గణనాధాయ గణానాం పతయే నమ: |

భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యో సుఖదాయక ||


97. మహాసిద్ధి గణపతి 

గజవక్త్రం సురశ్రేష్ఠ కర్ణచామర భూషితం |

పాశాంకుశ ధరం దేవం వందే హం గణనాయకం ||


98. గణపతి 

సిందూరాస్త్రినేత్ర: పృథుతర జదరో హస్త పద్మం

దదానం | దంతం పాశాంకుశేష్ట్వానురుతర

విలసద్విజ పూరాభిరామం | బాలేందు ఖ్యాతిమౌళి

కరిపతి వదాన దాన పూర్ణార్థ గంధో | భోగేంద్రై

భూషితాంగోర్జేత్ గణపతిం రక్తస్త్రాంగరాగ: ||


99. కార్యసిద్ధి గణపతి 

యతోబుద్ధి రజ్ఞాననాశో ముముక్షో: |

యత స్సంపదోభక్త సంతోషదాస్సు: |

యతో విఘ్ననాశయత: కార్యసిద్ధి: |

సదాతం గణేశం నమామో భజామ: ||


100. భద్ర గణపతి 

అనామయాయ సర్వాయ సర్వపూజ్యాయతే నమ:

సుగుణాయ నమస్తుభ్యం బ్రహ్మణే నిర్గుణాయచ ||


101. సులభ గణపతి 

వందే గజేంద్రవదనం – వామాంకారూఢ వల్లభాశ్లిష్టం

కుంకుమపరాగశోణం – క్వులయినీ జారకోరకా పీడమ్ ||


102. నింబ గణపతి


విఘ్నహర్తే స్వభక్తానాం లంబోదర నమోస్తుతే |

త్వాదేయ భక్తియోగేన యోగీశాం శాంతిమాగతా: ||


103. శుక్ల గణపతి 

అంతరాయ తిమిరోపశాంతయే

శాంతపావనమచింత్య వైభవం |

తంనరం వపుషికుంజరం ముఖే

మన్మహే కిమపి తుందిలంమహ: ||


104. విష్ణు గణపతి

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే


105. ముక్తి గణపతి

పాశాంకుశౌ భగ్నరథం త్వభీష్టం కరైర్దధానం కరరన్ద్రముక్తై: |

ముక్తాఫలాభై: పృథుశీకరౌఘై: సిఙ్చన్తమఙ్గం శివయోర్భజామి ||


106. సుముఖ గణపతి

ఏకదంతాయ శుద్ధాయ సుముఖాయ నమోనమ: |

ప్రసన్న జనపాలాయ ప్రణతార్తివినాశినే ||


107. సర్వ గణపతి

చతు: పదార్థా వివిధ ప్రకాశాస్త్త వివ హస్తా: సచతుర్భుజం |

అనాథనాథాంచ మహోదరంచ గజాననం భక్తియుతం భజామ:


108. సిద్ధిబుద్ధి గణపతి

సత్పద్మరాగ మణివర్ణ శరీరకాంతి:

శ్రీ సిద్ధిబుద్ధి పరిచర్చిత కుంకుమశ్రీ:

వక్షస్థలే వలయితాతి మనోజ్ఞ శుణ్డో

విఘ్నం మామపహర సిద్ధి వినాయకత్వమ్ ||