*'భాగవతం వింటే బాగవుతాం'*
శ్రీ పోతన భాగవత మధురిమలు
(7-320-క.)
రత్నములను మత్కాంతా
రత్నంబుల బుచ్చికొన్న రక్కసు నురమున్
యత్నమున వ్రచ్చి వైచితి;
పత్నులు రత్నములుఁ గలిగి బ్రతికితి మీశా!
*భావము:-* ఓ దేవా! ఈశ్వరా! హిరణ్యకశిపుడు మా శిరోరత్నాలను, స్త్రీరత్నాలను లాక్కున్నాడు. ఆ రాక్షసుడి వక్షస్థలం వ్రక్కలుచేసి. ఓడించి, సంహరించావు. మా మణులూ, రమణులూ తిరిగి లభించేలా చేసి మమ్ము కాపాడావు.
శ్రీ ఆధ్యాత్మిక రామాయణ కీర్తనతో....... *శ్రీ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం*.... శుభోదయం.
*శ్రీ కృష్ణం వందే జగద్గురుం*
ధర్మో రక్షతి రక్షితః
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి