25, అక్టోబర్ 2020, ఆదివారం

రామాయణమ్ .168

 రామాయణమ్ .168

...

సీతమ్మ ఇంకా హెచ్చరిస్తున్నది రావణాసురుడిని.

.

అధముడా ! 

ధర్మమునందే స్థిరమైన రాముని పత్నిని 

నీవిక తాకనుకూడా తాకలేవు!

.

ఓరీ రాక్షసాధమా ఈ శరీరాన్ని బంధిస్తే బంధించావు ,చంపివేయదలచుకుంటే చంపివేయి 

నా శరీరాన్నికానీ ప్రాణాన్ని కానీ రక్షించుకోవాలన్న కోరిక, ఆసక్తి నాకు ఏమాత్రమూ లేదు .

.

భూలోకములో అపకీర్తి కలిగేపని మాత్రము చేయనుగాక చేయను.

.

సీతామాత చాలా కోపంగా పరుషంగా మాట్లాడి కాసేపు ఊరకున్నది.

.

ఆవిడను భయపెట్టి అయినా సరే లొంగదీసుకోవాలనుకున్నాడు రావణుడు ,ఆవిడతో ఇలా అన్నాడు.

.

ఓ సీతా ! విను ,నీకు పన్నెండు మాసాలు మాత్రమే గడువిస్తున్నాను ఈ లోపు నా దారికి వచ్చి 

నా దరిచేరినావా సరే! 

లేని పక్షమున ఉదయపు అల్పాహారములో నీ మాంసము వండించుకొని తినగలను.

.

అని తీవ్రముగా బెదిరించి ,అక్కడ ఉన్న రాక్షస స్త్రీల తో ఏ విధముగానైనా సరే దీని గర్వాన్నిపోగొట్టండి ,సామ,దాన,దండోపాయాలు ప్రయోగించండి ,అని పలికాడు .

.

వాడు అలా అనటమే ఆలస్యం భయంకరాకారముగల స్త్రీలు సీతను చుట్టుముట్టి నిలిచారు.

.

సీతను అశోకవనమునకు తరలించి రహస్యప్రదేశములో ఉంచమని ఆజ్ఞ ఇచ్చాడు రావణుడు.

.

జనకునికొమరిత,

దశరధుని కోడలు ,

రామపత్ని ,

అతిలోకవీరుడైన లక్ష్మణుని వొదినగారు అలా నిస్సహాయంగా సుఖమును కోల్పోయి దుఃఖిస్తూ స్పృహకోల్పోయి అశోకవనమందు పడియున్నది.

.

అక్కడ రాముడు .....

.

NB.

.ప్రాణముపోతే పోయింది వెధవప్రాణము ,

కానీ విలువలు ఎంత గొప్పవి ! 

ఇదీ సీతమ్మ అంటే!

ఇదీ భారతీయ సంస్కృతి!

.

Height of a Woman' imagination in this country is SITHA AND SAVITHRI ..

.అని అంటారు స్వామి వివేకానంద !

.

వ్యక్తి సౌఖ్యమా? సమాజ హితమా? ఏది ముందు?

.

అంటే సమాజ హితానికే ప్రాముఖ్యత భారతీయ ధర్మశాస్త్రాలలో !

No room for INDIVIDUAL COMFORT .

SOCIETY IS ABOVE INDIVIDUAL.

.

ఇదీ భారతీయమ్!

.

రామాయణమ్ 169

...

మారీచుడిని సంహరించి వడివడిగా అడుగులు వేస్తూ గుండెల్లో ఏదో గుబులురేగుతుండగా పరుగెడుతూ వస్తన్నాడు రామచంద్రుడు. ఇంతలో ఎడమవైపునుండి భయంకరముగా నక్క ఊళవేసింది ! ఆ శబ్దము కర్ణకఠోరంగా ఉండి మనసులో శంకలు రేపింది !

.

సీత క్షేమమేనా? 

.

ఆ ఆలోచన వచ్చినదే తడవు ఆయన నడకలో వేగం హెచ్చింది ! లోలోపల తర్కించుకుటున్నాడు ! ఆ మారీచుడు అలా అరచినందువలన సీత భయపడి తప్పకుండా లక్ష్మణుని నా వద్దకు పంపుతుంది .

ఒంటరి దానిని సీతను రాక్షసులు భక్షించి ఉండలేదు కదా !

.

 మరల సీతను చూడగలనా ?.

.

ఈ ఆలోచన ఆయన మనస్సులో అంతులేని ఆందోళనకు కారణమయ్యింది .ఇంతలో మృగపక్షిసంఘాలన్నీ దీనంగా తనవైపే చూస్తూ కనపడ్డాయి !

.

సీత క్షేమమేనా?

.

అల్లంత దూరంలో తమ్ముడు లక్ష్మణుడు తనకెదురుగా వస్తూ కనపడ్డాడు.

.

సీత క్షేమమేనా ? ప్రశ్నించసాగింది రామయ్య మనస్సు!

.

లక్ష్మణుడు తనను సమీపించగనే ఆయన కుడిచేయి తనచేతిలోకి తీసుకొని,సీతను విడిచి వచ్చినావు నీవు ,ఎంత చెడ్డ పని చేసినావని పలికి ,అంతా సవ్యముగానే ఉంటుందికదా ? అని అనుమానం వ్యక్తంచేశాడు.

.

లేదు ,నాకు అశుభశకునాలు కనపడుతున్నాయి సీతక్షేమముగా ఉండి ఉండదు ,నశించిపోయి ఉంటుంది, నాకేమీ సందేహములేదు !

.

రాక్షసులు పన్నిన పన్నాగమిది .

.

సీత మరణించిఅయినా ఉండవలే

అపహరింపబడిఅయినా ఉండవలె!

కామెంట్‌లు లేవు: