25, అక్టోబర్ 2020, ఆదివారం

రాజగురువు

 " ఈ విషయాలపై మీకు అవగాహన ఉందా!      ,"రాజగురువు-- రాజు -- రాజ నీతి సూత్రాలు"   సమర్పణ: "మజుందార్, బెంగళూర్".         1)" రాజ గురువు" గారిని ఎట్టి పరిస్థితులలో రాజు, రాజ గృహమునకు పిలిపించి కూడదు,  తానే స్వయముగా గురువు ఆశ్రమానికి వెళ్లి, తన సమస్యలకు తగు పరిష్కారం మార్గములను తెలుపమని.       అభ్యర్థిం చాలి.             2)" రాజు అస్వస్థత కు లో నయినా తప్పని సరి అయితే తప్పా,  దేశం క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు, అత్యవసర పరిస్థితులలో, గురువును రాజు తన గృహమునకు పిలిపించవచ్చు.          3)"రాజు గురువు కొరకు, ముందుగా గా ద్వారము వద్ద వేచి ఉండి, రాకను తెలుసుకుని ద్వారం వద్దకు వచ్చి, స్వయముగా తను దగ్గర ఉండి వెంట తీసుకొని పోయి ఆసనము మీద కూర్చుండబెట్టి, వినమ్రత శ్రీలి గా ఉండాలని, ఆ తర్వాతనే మాట్లాడాలని, శాస్త్రం చెబుతున్నది.            4)"గురువు అనుమతి లేనిదే ఆసనమున కూర్చుండ రాదు.         5)" ప్రజాసంక్షేమ ము విషయాలలో గురువు ఆజ్ఞ మేరకు, దేశ పాలన విషయాలలో తగు సలహాలు, సూచనలు, ఇచ్చిన తీసుకొని అమలు చేయ వలెను.  6)" రాజగురువు విద్య" కనిపించని నేత్రము లాంటిది.  దానికి మించిన నేత్రం లేదు.       7)"యజ్ఞ ,యాగాలు, హోమాలు, చేయవలసి ఉన్నా, గురువును రాజా గృహమునకు పిలిపించి, తగు గౌరవం ఇచ్చి, ఆహ్వానము పలికి వారి సలహాలు కర్తవ్యము, కోరవచ్చు.    8)" రాజ గురువులు రాజు కు విజయం కలుగుతుందనే నమ్మకం, అవగాహన, కలిగి ఉండాలి, మరియు "దండ నీతి" శాస్త్రము తెలిసి ఉండాలి.          9)"పురోహితుడు గాని, మంత్రి కానీ ఎంతటి తప్పు చేసినను, "మరణశిక్ష" వేయరాదు.    10)" గురువు" శాసనాన్ని రాజు అనుసరించాలి, కానీ ఆయనను శాసించ కూడదు, గురువాజ్ఞ ను శిరసావహించి తీరాలి.      11)" జ్ఞానదీపాన్ని" వెలిగించే వాడు "గురువు" అని గుర్తించుకోవాలి.    12)"గురువు కోరిన ఏదైనా ఇమ్మని శాస్త్ర వచనము. (ఏకలవ్యుడు, అర్జునుడు, కృష్ణుడు మనకు ఉదాహరణలు) 10 వేల,యజ్ఞానికి చెందిన ఫలము పోతుంది., తిరస్కరించిన,.  13) "గురువు ఎదుట కాళ్లు చాపి కూర్చున్నా, నిందించుట చేసిన, కూర్చోబెట్టకుండా మాట్లాడిన, సాగనంపు సమయములో కొంతదూరము అనుసరించుట తప్పక చేయవలెను.   14) "జగద్గురువులు, పీఠాధిపతులను నిందించుట చేసిన వారి వంశ నాశనం, ఆమె కోరి తెచ్చుకున్నట్లు, గా భావించవలెను.           మరికొన్ని గ్రంథములను, "నీతి సూత్రములను," పరిశీలించి,సమీక్ష జరుపుకోవచ్చు ను,.      1)"జైనుల పవిత్ర గ్రంధము లో "నంది సూత్రములను" వాడెను.     2)" కౌటిల్యుడు,(విష్ణు గుప్తుడు) 4 వ శతాబ్దం లో 2300 సంవత్సరముల పూర్వము సంస్కృత భాషలో "రాజ నీతి సూత్రాలు "వ్రాసెను.     3)" మహాభారతము న శాంతి పర్వము లో"రాజ నీతి సూత్రాలు" రాయ బడెను.            4)"కామాంధుడు"- నీతి సారము గ్రంథము రాశాను.        5)"సోమ సేనుడు"  -- "నీతి వాక్యం అమృతము"  లో తెలిపెను.               6)"వైశం పాయను డు"--- "నీతి ప్రకాశము" లో రాశాను.     7)"శుక్రుడు మహర్షి --  "శుక్ర నీతి" లో వివరించెను.               , నేటి కాలంలో కూడా కొందరు వ్యక్తులు, వివేక శూన్యంగా ఉన్న వారు  యతీశ్వరులను కించపరచు ట, అవహేళన చేయుట, నింద చేయుట, చేయుచున్నారు.   ఏమాత్రము  పరిజ్ఞానము లేని, వారు ఎదుటి వారి గురించి తెలియకుండా, ఆలోచించకుండా, ఆవేశంతో, విచక్షణా జ్ఞానము కోల్పోయి, ప్రవర్తించుట ఇటీవల ఎక్కువ అయినది,  వారు చేసిన కొద్దో గొప్పో పుణ్యము కూడా "హరించి పోవును".   బ్రాహ్మణుని, గోవును, హింసించ నాకూడా! పాపములు మూటకట్టుకుని, మరుజన్మలో , మీరు, మీ వంశము, ఇబ్బంది పాలు, అవుతుందని సదరు శాస్త్రముల సారము, మహాభారతములో కూడా అనేక ఘంఠము  లను పరిశీలించడం మరచిపోకండి.  ఇంకనూ సమాచారము ఇచ్చువారు, సెల్ ఫోన్:87925-86125 కు ఇవ్వవలసినదిగా ప్రార్థన!

కామెంట్‌లు లేవు: