7, అక్టోబర్ 2020, బుధవారం

జ్ఞాపక శక్తిని ప్రసాదించు శ్రీ శారదా స్తోత్రం.



చదువులో పిల్లలకు జ్ఞాపక శక్తి ని పెంచాలంటే శ్రీ శారదాదేవి స్తోత్రం తెల్లవారు జామున 5 గంటల సమయంలో శుచిగా స్నానం చేసి భక్తి శ్రద్ధలతో జపించవలెను.శారదాదేవి స్తోత్ర మంత్ర పఠనం మీలో జ్ఞాపకశక్తిని,మనోధైర్యాన్ని పెంచేందుకు తోడ్పడుతుంది.


శారదా దేవి స్తోత్ర మంత్రాలలో ఉండే అక్షరాలు కలిగించే ప్రతి ధ్వని మానవుల మానసిక స్థితిపై ప్రభావాన్ని చూపుతాయి.మంత్రోచ్ఛారణ ద్వారా వచ్చే ధ్వని మన హృదయాన్ని ప్రభావితం చేస్తుంది.


శారదా స్తోత్ర మంత్రాలను చదవడం వల్ల మనలోనున్న చైతన్యం అత్యున్నత స్థాయికి చేరుకుంటుంది. జీవితంలోని లక్ష్యాలను చేరుకోవడానికి ఇవి ఉత్ప్రేరకాలుగా ఉపయోగపడతాయి.


*నమస్తే శారదే దేవి కాశ్మీరపురవాసిని | 

త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే * 


*యా శ్రద్ధా ధారణా మేధా వగ్దేవీ విధివల్లభా | 

భక్తజిహ్వాగ్రసదనా శమాదిగుణదాయినీ* || 

నమామి యామినీం నాథలేఖాలంకృత కుంతలామ్ | 

భవానీం భవసంతాపనిర్వాపణసుధానదీమ్ || 


భద్రకాళ్యై నమో నిత్యం సరస్వత్యై నమో నమః | 

వేద,వేదాంగవేదాంతవిద్యాస్థానేభ్య ఏవ చ || 


బ్రహ్మస్వరూపా పరమా జ్యోతిరూపా సనాతనీ | 

సర్వవిద్యాధిదేవీ యాతస్యై వాణ్యై నమో నమః || 


యయా వినా జగత్సర్వం శశ్వజ్జీవన్మృతం భవేత్ | 

జ్ఞానాధిదేవీ యా తస్యై సరస్వత్యై నమో నమః || 


యయా వినా జగత్సర్వం మూకమున్మత్తవత్సదా 

యా దేవీ వాగధిష్ఠాత్రీ తస్యై వాణ్యై నమో నమః || 💐🕉️💐🌸🕉️🌸🕉️🌺🕉️🌺🕉️🌹

కామెంట్‌లు లేవు: