9, డిసెంబర్ 2020, బుధవారం

ఆచార్య సద్భోదన

 *ఆచార్య సద్భోదన*


అంతర్గతమైన జీవనశక్తి అమితమైన దర్శనాన్ని ఆవిష్కరిస్తుంది.


మనలను రక్షించేవాడు మన అంతరంగంలోనే దాగి ఉన్నాడు.


సర్వవ్యాపకుడు బాహ్య ప్రపంచంలో మార్గదర్శనం చేస్తుంటే అంతరంగ రక్షకుడు దానిని గుర్తిస్తూ ఉంటాడు.


ఆ కృపాశీలుని వాక్కులు నిశ్శబ్ధ గీతంగా మన అంతరంగంలో ప్రతిధ్వనిస్తాయి.


ఈ నిశ్శబ్ధ సంగీతాన్ని వినగలిగితే మనం ధన్య జీవులమవుతాం.


జీవితం పరిపూర్ణంగా వికసించేందుకు అనువైన స్థితిగతులు ఏర్పడుతాయి.


అందువల్లనే మౌనాన్ని అభ్యసించడం వలన ఆధ్యాత్మిక పురోభివృద్ధి కలుగుతుంది.


*శుభంభూయాత్*

కామెంట్‌లు లేవు: