9, డిసెంబర్ 2020, బుధవారం

ఆచార్య సద్భావన*

 *ఆచార్య సద్భావన*


మనం అంతర్ముఖులమయ్యేకొలదీ బాహ్య సంఘటనల ప్రభావం మన ఎడల అంతకంతకూ తగ్గుతూ వస్తుంది.


బాహ్యంలో జీవించే వ్యక్తి అన్ని విషయాలను గమనిస్తాడు. అన్ని విషయాలు అతని గమనింపుకు వస్తాయి. అతడు గోరంత దాన్ని కొండంతగా చూస్తాడు.


ఒక వ్యక్తి చూపులుగాని, చర్యలుగాని దుష్ఠభావాంతో ఉన్నట్టుగా అతడు ఊహించుకుంటాడు.


దుష్టత్వాన్ని భూతద్దంలో చూస్తే అది చివరకు మనకు భరించలేని భారమయ్యేంతగా తయారయి ఆఖరికి మనం అరణ్యానికి పోయినా శాంతిని దక్కనివ్వదు.


అందు వలన ఈ చింతనను జయించాలి. అంతర్కుఖుడై జీవించే వ్యక్తి ప్రపంచంతో సంబంధాన్ని కలిగి ఉండడు.


అంతరంగంతో సంబంధం ఏర్పరచుకోవటం తెలిసినవాడు కోల్పోయేదీ ఏదీ ఉండదు.


*శుభంభూయాత్*

కామెంట్‌లు లేవు: