17, డిసెంబర్ 2020, గురువారం

గీత. తృతీయా ధ్యా యాఫలము.

 గీత. తృతీయా ధ్యా యాఫలము.

            పూర్వము జనస్తానము అను నగరమున జడుడు అను బ్రాహ్మణుడు వుండెను .అతడు తన జాటికితగిన ఆచారములను పరిత్యజించి విషయా లో లుడై దనాసాపరుడై వ్యాపార నిమిత్తము వుత్తర దిశకు వెళ్లి అచట నుండి తీ రీ గీ  వచ్చు చుండగా

మార్గమ ధ్యమున. వొక. వృక్షము క్రింద చోరులు  అతనిని చంపివైచిరి.

           పాపాత్ముడ గుటచే మరణా నంతరము

అతడు పిశాచ రూపము ను పోం దెను.

  కొంతకాలము. గడచినతరువాత ధర్మాత్ముడయిన

అతని కుమారుడు తండ్రికి ఉత్తర  క్రియలు జరుపుట కోసము కాసినగరము నకు పోవుచు. మార్గమధ్యం లో తన తండ్రి. వదించబడిన వృక్షము క్రింద కూర్చుని

శ్రీ భగవదగీత  లోని మూడవ  అధ్యాయము ను

పారాయణ చేసెను.(తత్రధ్యాయం స గీతీ యా

      స్తృతీ యం సంజజా ప హా.)

            వెంటనే ఆకాశమున తనతండ్రి భయంకరమైన ప్రే తదేహము  ను. వీడి దివ్య విమానారూ డు డై యుండుట చూచి--''   తండ్రీ! ప్రేతత్వము పోయి నీకు దేవత్వము  లభించుట

కు కారణమేమి "  అని అతనిని అడుగగా

         "నాయనా! నీచే  ఫటించబడిన భగ వత్ గీత

తృతీయా థ్యా యమును వినుట వలన నాకు యిటువంటి దివ్యస్తితి చేకూరినది..

               యిక నీవు కాశీకి వెళ్ళవలసిన అవసరము

లేదు.యింటికి వెళ్లి యిదే ఉపాయము చే అనగా

గీత మూడవ అధ్యాయాన్ని  పారాయణము చేయుచూ  తద్వారా. లభించిన పుణ్యము దారబోసి

మన వంశజులంద రినీ  నరకలోకము నుండి ఉద్ధరింపుము"  అని పలికెను.   కుమారుడు అట్లే చేసెను.


అప్పుడు విష్ణుభవానుడు. యమ ధర్మరాజు వద్దకు

దేవదూతలు ను బంపి నరకలోకవాసులను  యముని కూడా వైకుంఠము నకు పిలిపించు కొనెను. అప్పుడు యమధర్మరాజు. విష్ణువును  స్త్రోత్రము. చేసి  అతని

ఆజ్ఞను పొంది. నిజలోకము నకు వెల్లేను


       యీ ప్రకారము గ  భగవద్గీత  తృతీయాధ్యాయమును పారాయణము చేయటము వల్ల మనుజుడు. పాపరహిత దివ్యాన్ని బొందు చున్నాడు

         


         యిది గీత తృతీయాధ్యాయ ఫలము.

పాప రాహిత్యం., ప్రేత త్వ విముక్తి.

(శ్రీ శుక బ్రహ్మా శ్రమము నుం�

కామెంట్‌లు లేవు: