27, సెప్టెంబర్ 2023, బుధవారం

రాజమండ్రి - కొవ్వూరు రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి పై రిపేర్

  - రాజమండ్రి - కొవ్వూరు రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి పై రిపేర్ నిమిత్తం నేటి నుండి నెల రోజులు రాకపోకలు నిషేధం.

దీనితో కొన్ని బస్సు లు గామన్ వంతెన మీదుగా, కొన్ని ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా మళ్ళిస్తున్నారు.కొవ్వూరు, ఏలూరు, జంగారెడ్డిగూడెం డిపో ల పల్లె వెలుగు బస్సు లు గామన్ వంతెన పై నుంచి RTC కాంప్లెక్స్ కు వచ్చి వెళ్తాయి. తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు డిపో ల పల్లె వెలుగు బస్సు లు ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా రైల్వేస్టేషన్ మీదుగా కాంప్లెక్స్ కు వచ్చి వెళ్తాయి. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, బ్యారేజ్ రోడ్, గామన్ వంతెన పై వెళ్లొచ్చు అని అధికారులు తెలియ చేస్తున్నారు.

కామెంట్‌లు లేవు: