28, జులై 2020, మంగళవారం

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - నాలుగవ అధ్యాయము*

*గజగ్రాహముల పూర్యజన్మ వృత్తాంతములు - వాటి ఉద్ధారము*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*4.14 (పదునాలుగవ శ్లోకము)*

*ఏతన్మహారాజ తవేరితో మయా కృష్ణానుభావో గజరాజమోక్షణమ్|*

*స్వర్గ్యం యశస్యం కలికల్మషాపహం దుఃస్వప్ననాశం కురువర్య శృణ్వతామ్॥6438॥*

కురువంశ శిరోమణివైన పరీక్షిన్మహారాజా! నేను నీకు శ్రీకృష్ణభగవానుని మహిమను, గజేంద్రమోక్షమును గూర్చిన వృత్తాంతమును వినిపించితిని. ఈ కథను విన్నవారికి కలిదోషములు, దుస్వప్నములు తొలగిపోవును.  అంతేగాదు, వారికి యశస్సు, అభ్యుదయము, స్వర్గము మొదలుకొని ఊర్ధ్వలోకములు ప్రాప్తించును.

*4.15 (పదునైదవ శ్లోకము)*

*యథానుకీర్తయంత్యేతచ్ఛ్రేయస్కామా ద్విజాతయః|*

*శుచయః ప్రాతరుత్థాయ దుఃస్వప్నాద్యుపశాంతయే॥6439॥*

తమ శ్రేయస్సును కోరుకొను ద్విజులు దుస్స్వప్నము మొదలగునవి తొలగి పోవుటకై, ప్రాతః కాలముననే లేచి పవిత్రులై ఈ స్తోత్రములకు ప్రసన్నుడై సర్వవ్యాపకుడు, సర్వభూతస్వరూపుడు ఐన శ్రీహరి అతనితో ఇట్లు పలికెను.

*4.16 (పదహారవ శ్లోకము)*

*ఇదమాహ హరిః ప్రీతో గజేంద్రం కురుసత్తమ|*

*శృణ్వతాం సర్వభూతానాం సర్వభూతమయో విభుః॥6440॥*

కురుశ్రేష్ఠా! గజేంద్రుని స్తోత్రములకు ప్రసన్నుడై సర్వవ్యాపకుడు, సర్వభూతస్వరూపుడు ఐన శ్రీహరి అతనతో ఇట్లు పలికెను.

*శ్రీభగవానువాచ*

*7.17  (పదిహేడవ శ్లోకము)*

*యే మాం త్వాం చ సరశ్చేదం గిరికందరకాననమ్|*

*వేత్రకీచకవేణూనాం గుల్మాని సురపాదపాన్॥6441॥*

*శ్రీభగవానుడు నుడివెను*- ప్రాతఃకాలమున లేచి, ఏకాగ్రచిత్తముతో నన్ను, నిన్ను,ఈ సరోవరమును, ఈ పర్వతగుహలను, వనములను, వేము, వెదుళ్ళ పొదలను, దివ్య వృక్షములను, ఈ గిరి శిఖరములను, నాయొక్క శివబ్రహ్మలయొక్క నివాస స్థానములను, నాకు ప్రియధామమైన క్షీరసాగరమును, తేజోమయమైన శ్వేతద్వీపమును, శ్రీవత్స చిహ్నమును, కౌస్తుభమణిని, వనమాలను, నా కౌముదీగదను, సుదర్శన చక్రమును, పాంచజన్య శంఖమును, పక్షిరాజైన గరుడుని, నా సూక్ష్మాంశయైన ఆదిశేషుని, నిత్యము నన్ను ఆశ్రయించుకొని యుండెడి లక్ష్మీదేవిని, బ్రహ్మదేవుని, నారదమహర్షిని, పరమశివుని, అట్లే భాగవతోత్తముడైన ప్రహ్లాదుని, మత్స్య, కూర్మ, వరాహాది అవతారాలలో నేను చేసిన పవిత్ర లీలలను, సూర్యుని, చంద్రుని, అగ్నిని, ఓంకారమును, సత్యవచనములను, మూలప్రకృతిని, గోవులను, బ్రాహ్మణులను, శాశ్వతమైన సనాతన ధర్మములను, సోమునకు, కశ్యపునకు, (ధర్మునకు) భార్యలైన దక్షుని పుత్రికలను, అలకనందను, గంగా, యమునా, సరస్వతీ నదులును, ఐరావతమును, భక్తశిరోమణియైన ధ్రువుని, సప్తర్షులను, నలుడు, యుధిష్ఠిరుడు జనకుడు మొదలగు మహాపురుషులను భక్తి శ్రద్ధలతో స్మరించెడివారు సకల పాపములనుండి విముక్తులయ్యెదరు. ఏలయన, ఇవి అన్నియును నా రూపములే.

*4.14 (పదునాలుగవ శ్లోకము)*

*ఏతన్మహారాజ తవేరితో మయా కృష్ణానుభావో గజరాజమోక్షణమ్|*

*స్వర్గ్యం యశస్యం కలికల్మషాపహం దుఃస్వప్ననాశం కురువర్య శృణ్వతామ్॥6438॥*

కురువంశ శిరోమణివైన పరీక్షిన్మహారాజా! నేను నీకు శ్రీకృష్ణభగవానుని మహిమను, గజేంద్రమోక్షమును గూర్చిన వృత్తాంతమును వినిపించితిని. ఈ కథను విన్నవారికి కలిదోషములు, దుస్వప్నములు తొలగిపోవును.  అంతేగాదు, వారికి యశస్సు, అభ్యుదయము, స్వర్గము మొదలుకొని ఊర్ధ్వలోకములు ప్రాప్తించును.

*4.15 (పదునైదవ శ్లోకము)*

*యథానుకీర్తయంత్యేతచ్ఛ్రేయస్కామా ద్విజాతయః|*

*శుచయః ప్రాతరుత్థాయ దుఃస్వప్నాద్యుపశాంతయే॥6439॥*

తమ శ్రేయస్సును కోరుకొను ద్విజులు దుస్స్వప్నము మొదలగునవి తొలగి పోవుటకై, ప్రాతః కాలముననే లేచి పవిత్రులై ఈ స్తోత్రములకు ప్రసన్నుడై సర్వవ్యాపకుడు, సర్వభూతస్వరూపుడు ఐన శ్రీహరి అతనితో ఇట్లు పలికెను.

*4.16 (పదహారవ శ్లోకము)*

*ఇదమాహ హరిః ప్రీతో గజేంద్రం కురుసత్తమ|*

*శృణ్వతాం సర్వభూతానాం సర్వభూతమయో విభుః॥6440॥*

కురుశ్రేష్ఠా! గజేంద్రుని స్తోత్రములకు ప్రసన్నుడై సర్వవ్యాపకుడు, సర్వభూతస్వరూపుడు ఐన శ్రీహరి అతనితో ఇట్లు పలికెను.

*శ్రీభగవానువాచ*

*7.17  (పదిహేడవ శ్లోకము)*

*యే మాం త్వాం చ సరశ్చేదం గిరికందరకాననమ్|*

*వేత్రకీచకవేణూనాం గుల్మాని సురపాదపాన్॥6441॥*


*4.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*శృంగాణీమాని ధిష్ణ్యాని బ్రహ్మణో మే శివస్య చ|*

*క్షీరోదం మే ప్రియం ధామ శ్వేతద్వీపం చ భాస్వరమ్॥6442॥*

*4.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*శ్రీవత్సం కౌస్తుభం మాలాం గదాం కౌమోదకీం మమ|*

*సుదర్శనం పాంచజన్యం సుపర్ణం పతగేశ్వరమ్॥6443॥*

*4.20 (ఇరువదియవ శ్లోకము)*

*శేషం చ మత్కలాం సూక్ష్మాం శ్రియం దేవీం మదాశ్రయామ్|*

*బ్రహ్మాణం నారదమృషిం భవం ప్రహ్లాదమేవ చ॥6444॥*

*4.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*మత్స్యకూర్మవరాహాద్యైరవతారైః కృతాని మే|*

*కర్మాణ్యనంతపుణ్యాని సూర్యం సోమం హుతాశనమ్॥6445॥*

*4.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*ప్రణవం సత్యమవ్యక్తం గోవిప్రాన్ ధర్మమవ్యయమ్|*

*దాక్షాయణీర్ధర్మపత్నీః సోమకశ్యపయోరపి॥6446॥*

*4.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*గంగాం సరస్వతీం నందాం కాలిందీం సితవారణమ్|*

*ధ్రువం బ్రహ్మఋషీన్ సప్త పుణ్యశ్లోకాంశ్చ మానవాన్॥6447॥*

*4.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*ఉత్థాయాపరరాత్రాంతే ప్రయతాః సుసమాహితాః|*

*స్మరంతి మమ రూపాణి ముచ్యంతే హ్యేనసోఽఖిలాత్॥6448॥*

*శ్రీభగవానుడు నుడివెను*- ప్రాతఃకాలమున లేచి, ఏకాగ్రచిత్తముతో నన్ను, నిన్ను, ఈ సరోవరమును, ఈ పర్వతగుహలను, వనములను, వేము, వెదుళ్ళ పొదలను, దివ్య వృక్షములను, ఈ గిరి శిఖరములను, నాయొక్క శివబ్రహ్మలయొక్క నివాస స్థానములను, నాకు ప్రియధామమైన క్షీరసాగరమును, తేజోమయమైన శ్వేతద్వీపమును, శ్రీవత్స చిహ్నమును, కౌస్తుభమణిని, వనమాలను, నా కౌముదీగదను, సుదర్శన చక్రమును, పాంచజన్య శంఖమును, పక్షిరాజైన గరుడుని, నా సూక్ష్మాంశయైన ఆదిశేషుని, నిత్యము నన్ను ఆశ్రయించుకొని యుండెడి లక్ష్మీదేవిని, బ్రహ్మదేవుని, నారదమహర్షిని, పరమశివుని, అట్లే భాగవతోత్తముడైన ప్రహ్లాదుని, మత్స్య, కూర్మ, వరాహాది అవతారాలలో నేను చేసిన పవిత్ర లీలలను, సూర్యుని, చంద్రుని, అగ్నిని, ఓంకారమును, సత్యవచనములను, మూలప్రకృతిని, గోవులను, బ్రాహ్మణులను, శాశ్వతమైన సనాతన ధర్మములను, సోమునకు, కశ్యపునకు, (ధర్మునకు) భార్యలైన దక్షుని పుత్రికలను, అలకనందను, గంగా, యమునా, సరస్వతీ నదులును, ఐరావతమును, భక్తశిరోమణియైన ధ్రువుని, సప్తర్షులను, నలుడు, యుధిష్ఠిరుడు జనకుడు మొదలగు మహాపురుషులను భక్తి శ్రద్ధలతో స్మరించెడివారు సకల పాపములనుండి విముక్తులయ్యెదరు. ఏలయన, ఇవి అన్నియును నా రూపములే.

*4.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*యే మాం స్తువంత్యనేనాంగ ప్రతిబుధ్య నిశాత్యయే|*

*తేషాం ప్రాణాత్యయే చాహం దదామి విమలాం మతిమ్॥6449॥*

గజేంద్రా! బ్రాహ్మముహూర్తమున మేల్కొని, నీవు చేసిన నా ఈ ప్రస్తుతితో నన్ను స్తుతించిన వారికి మరణ సమయమున నిర్మల బుద్ధిని అనుగ్రహించెను.

*శ్రీశుక ఉవాచ*

*4.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*ఇత్యాదిశ్య హృషీకేశః ప్రధ్మాయ జలజోత్తమమ్|*

*హర్షయన్ విబుధానీకమారురోహ ఖగాధిపమ్॥6449॥*

*శ్రీశుకుడు వచించెను* మహారాజా! శ్రీమహావిష్ణువు ఇట్లు పలుకగా దేవతలు పరమానందభరితులైరి. పిమ్మట ఆ ప్రభువు తన శంఖమును పూరించి, పక్షిరాజగు గరుడునిపై ఆసీనుడయ్యెను.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే చతుర్థోఽధ్యాయః (4)*

ఇది భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధమునందు నాలువ అధ్యాయము (4)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319

కామెంట్‌లు లేవు: